ఈ20 పెట్రోల్తో బండి ఇంజిన్ ఖరాబైతే ఇన్సూరెన్స్ వస్తుందా రాదా?
ఆటోమొబైల్స్
- 3 month, 3 days ago
భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి, ముడిచమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకాన్ని బాగా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ20 (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్) ఇంధనం అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఎథనాల్ పెట్రోల్ వాడటం వల్ల ముఖ్యంగా పాత కార్లు, బైకులు, స్కూటర్ల మైలేజ్ తగ్గిపోతోందని, ఇంజిన్లు కూడా త్వరగా పాడవుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎథనాల్ పెట్రోల్ వాడి ఇంజిన్ పాడైతే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ ఇవ్వవనే ప్రచారం సాగడంతో కస్టమర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.