వేసవిలో కూల్‌ డ్రింక్స్ తాగుతున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే...!!

ఎండలో తిరిగిన తర్వాత ఐస్ చల్లటి నీరు తాగడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి. సురక్షితమైన చల్లదనం చిట్కాలు మరియు జాగ్రత్తలు తెలుసుకోండి.

ఒక్క రోజు 101 కార్లు డెలివరీ చేసి టాటా డీలర్ రికార్డ్

Tata Sierra : భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పాత జ్ఞాపకాలను సరికొత్త హంగులతో వెండితెరపైకి తెచ్చినట్లుగా, టాటా సియెర్రా (Tata Sierra) ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చి కస్టమర్లను మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా గుజరాత్‌లో జరిగిన ఒక సంఘటన టాటా సియెర్రాకు ఉన్న క్రేజ్‌ను అద్దం పడుతోంది. అహ్మదాబాద్‌లోని ఒక టాటా డీలర్ కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 101 సియెర్రా ఎస్‌యూవీలను కస్టమర్లకు డెలివరీ చేసి రికార్డు సృష్టించారు. ఈ భారీ డెలివరీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను టాటా మోటార్స్ స్వయంగా తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న టాటా డీలర్‌షిప్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన ఎస్‌యూవీ కోసం నెలల తరబడి వేచి చూసిన కస్టమర్లకు ఒకేసారి సర్ ప్రైజ్ ఇవ్వాలని డీలర్ నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక వేడుకను ఏర్పాటు చేసి, ఏకకాలంలో 101 టాటా సియెర్రా కార్లను డెలివరీ చేశారు. వరుసగా నిలబెట్టిన తెల్లటి, బూడిద రంగు సియెర్రాల మధ్య కస్టమర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కార్ల తాళాలను అందుకున్నారు. ఈ దృశ్యం అద్భుతంగా ఉండటంతో టాటా మోటార్స్ కూడా దీనిని గర్వంగా సోషల్ మీడియాలో పంచుకుంది. కేవలం అహ్మదాబాద్‌లోనే కాకుండా, గత వారం మధ్యప్రదేశ్ డీలర్ కూడా ఇలాగే వందకు పైగా కార్లను డెలివరీ చేయడం విశేషం. గత ఏడాది నవంబర్‌లో లాంచ్ అయిన టాటా సియెర్రాకు బుకింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 2026 నుంచి డెలివరీలను ప్రారంభించిన టాటా మోటార్స్, కేవలం మూడు నెలల వ్యవధిలోనే సుమారు 14,000 యూనిట్లను కస్టమర్ల చేతిలో పెట్టింది. పాతసియెర్రా మోడల్‌కు ఉన్న సెంటిమెంట్‌కు తోడు, ఆధునిక టెక్నాలజీని జోడించడంతో యువత కూడా ఈ కారు వైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ కారణంగా ఈ ఎస్‌యూవీకి వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగింది. అయినా సరే, కస్టమర్లు దీని కోసమే వేచి చూడటం విశేషం.

యువత ఫేవరెట్ బైక్ మళ్లీ హిట్.. FZ సేల్స్ రికార్డ్ లెవెల్‌కు!

భారతీయ యువతలో స్టైలిష్ లుక్, మస్క్యులర్ డిజైన్, స్మూత్ రైడింగ్ అనుభవంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బైక్‌లలో యమహా ఎఫ్‌జెడ్ (Yamaha FZ) ఒకటి. నగర రోడ్లపై యువత ఎక్కువగా ఎంచుకునే ఈ బైక్, ఇటీవలి కాలంలో మళ్లీ తన సేల్స్ గ్రాఫ్‌ను గట్టిగా పెంచుకుంటూ మార్కెట్లో తన స్థానం బలపరుస్తోంది. దానికి తాజా ఉదాహరణగా 2026 ఫిబ్రవరి అమ్మకాల గణాంకాలు నిలిచాయి. ఈ ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా మొత్తం 16,852 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, యమహా FZ పై వినియోగదారుల నమ్మకం మళ్లీ పెరుగుతోందనే సంకేతం. ముఖ్యంగా గత ఏడాది ఇదే కాలాన్ని తీసుకుంటే, పరిస్థితి ఎంత మారిందో స్పష్టంగా తెలుస్తుంది.

ఆటోమొబైల్ చరిత్రలో మారుతి సరికొత్త రికార్డు

భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం కార్ల అమ్మకాల్లోనే కాకుండా, వాటిని కస్టమర్ల వద్దకు చేరవేసే లాజిస్టిక్స్ విధానంలో కూడా ఈ సంస్థ విప్లవాత్మక మార్పులు చేస్తోంది. హర్యానాలోని మారుతీ సుజుకీకి చెందిన మానేసర్ ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్ కార్యకలాపాలు ప్రారంభించిన కేవలం 9 నెలల వ్యవధిలోనే ఒక లక్ష వాహనాలను రైళ్ల ద్వారా డిస్పాచ్ చేసి అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇది కేవలం వ్యాపార పరంగానే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో కూడా పెద్ద విజయం అని చెప్పాలి.
Advertisement

దేశాన్ని కైవసం చేసుకున్న బైక్.. స్ప్లెండర్ అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి

భారతీయుల దైనందిన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయిన బైక్‌లలో ఒకటి హీరో స్పెండ్లర్ (Hero Splendor). సాధారణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన ఈ బైక్, జాతీయ బైక్ అన్న పేరు తెచ్చుకోవడం యాదృచ్ఛికం కాదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్, సింపుల్ మెయింటెనెన్స్, నమ్మకమైన పనితీరు ఈ మూడు లక్షణాలు స్ప్లెండర్‌ను కోట్లాది భారతీయుల మొదటి ఎంపికగా నిలబెట్టాయి. ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా 2026 ఫిబ్రవరిలో ఈ బైక్ నమోదు చేసిన అమ్మకాలు చూస్తే, స్ప్లెండర్ ప్రభావం ఎంత గొప్పదో స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా 3,21,952 యూనిట్లు అమ్ముడవడం చిన్న విషయం కాదు. అంటే ప్రతి రోజు సగటున 10,700కు పైగా బైక్‌లు రోడ్డెక్కుతున్నాయంటే, ఇది ఒక రికార్డ్ స్థాయి డిమాండ్‌గా చెప్పాలి.

విజయ్ వైపే యూత్, డీఎంకే కు షాక్.. తేల్చేసిన సర్వే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు CNN-News18-Outtrakr సర్వే వయస్సు మరియు లింగ ఆధారిత ఓటింగ్ సరళులు మరియు గణనీయమైన యువత ప్రభావంతో DMK కూటమి స్వల్ప ఆధిక్యాన్ని చూపుతోంది.

లక్షన్నర కార్ల తయారీ లక్ష్యంగా వియత్నం కంపెనీ

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం విన్‌ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్‌లోకి అత్యంత వ్యూహాత్మకంగా అడుగుపెడుతోంది. కేవలం కార్లను అమ్మి వెళ్ళిపోవడానికి కాకుండా, ఇక్కడ ఒక భారీ సామ్రాజ్యాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది. ఇటీవల డ్రైవ్‌స్పార్క్ రివ్యూస్ ఎడిటర్ ప్రోమీత్ ఘోష్ వియత్నాంలోని విన్‌ఫాస్ట్ ప్రధాన తయారీ కేంద్రమైన హై ఫాంగ్‎ను సందర్శించారు. అక్కడ ఆయన చూసిన రోబోటిక్ టెక్నాలజీ, అత్యాధునిక తయారీ విధానం విన్‌ఫాస్ట్ అంతర్జాతీయ స్థాయిని చాటి చెబుతున్నాయి. సుమారు 1,200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్‌ను కేవలం 21 నెలల్లోనే నిర్మించారంటే, ఆ సంస్థ వేగం, పట్టుదల ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఒక లీటరు పెట్రోల్‌తో సూపర్ మైలేజ్

భారతీయ SUV మార్కెట్లో ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రెనాల్ట్ డస్టర్ (Renault Duster), కొంతకాలం విరామం తర్వాత మళ్లీ కొత్త అవతారంలో ఎంట్రీ ఇచ్చింది. ఈసారి మరింత ఆధునిక డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు, మెరుగైన మైలేజీతో SUV ప్రియుల మనసు గెలుచుకునేలా తిరిగి వచ్చింది. ప్రారంభ ధరను రూ. 10.49 లక్షలుగా నిర్ణయించిన కంపెనీ, ప్రత్యేకంగా ఆర్-పాస్ ద్వారా బుక్ చేసుకునే వారికి రూ. 10.29 లక్షలకే అందిస్తామని ప్రకటించడం మరింత ఆకర్షణగా మారింది. కొత్త డస్టర్‌లో డీజిల్ ఇంజిన్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పి, పూర్తిగా పెట్రోల్ ఇంజిన్‌లపై దృష్టి పెట్టింది Renault. ప్రస్తుతం ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఒకటి 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్.

టాటా సియెర్రా మైలేజ్ గుట్టు రట్టు

టాటా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభించిన టాటా సియెర్రా(Tata Sierra) ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. 2025 నవంబర్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ ఎస్‌యూవీ మైలేజీకి సంబంధించి ఇప్పటివరకు కంపెనీ అధికారికంగా ఎలాంటి గణాంకాలు వెల్లడించలేదు. అయితే, తాజాగా ఒక ఆర్‌టీఐ (RTI) ద్వారా ఏఆర్‌ఏఐ (ARAI) సర్టిఫైడ్ మైలేజ్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ వివరాల ప్రకారం పెట్రోల్ వేరియంట్ కంటే డీజిల్ వేరియంట్ మైలేజీ పరంగా అదరగొడుతోందని తెలుస్తోంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రం ఆశించిన స్థాయిలో మైలేజీ ఇవ్వడం లేదన్న చర్చ నడుస్తోంది.

మెల్లగా వచ్చి ఇప్పుడు టాప్‌లోకి దూసుకొస్తున్న చేతక్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ (Bajaj Chetak) తన ప్రత్యేక గుర్తింపుతో ముందుకు దూసుకుపోతోంది. క్లాసిక్ డిజైన్‌ను ఆధునిక టెక్నాలజీతో మేళవించిన ఈ స్కూటర్, వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటూ, మార్కెట్లో స్థిరమైన డిమాండ్‌ను కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 2026 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, చేతక్ పనితీరు ఎంత బలంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఆ నెలలో మొత్తం 28,004 యూనిట్లు అమ్ముడవడం ఒక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో గత సంవత్సరం ఫిబ్రవరి 2025లో 21,240 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే కేవలం ఒక ఏడాదిలోనే 6,764 యూనిట్ల అదనపు అమ్మకాలు నమోదయ్యాయి.

మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్

ఇరాన్ తాజా US శాంతి ప్రతిపాదనను తిరస్కరించింది మరియు పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భద్రతా హామీలు, సముద్ర హక్కులు మరియు ప్రాంతీయ స్థిరత్వాన్ని పేర్కొంటూ శత్రుత్వాలను ముగించడానికి ఐదు షరతులు విధించింది.

ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం!

2026 ఏప్రిల్ 11న బుధుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు, దీనివల్ల నాలుగు రాశులకు ప్రతికూల ఫలితాలు తప్పవు. Mercury Transit 2026 in Pisces to bring challenges for these four zodiac signs.
Advertisement

నేటి రాశి ఫలాలు 26-03-2026

ఈరోజు రాశి ఫలాలు 26-Mar-2026: నేటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగం తెలుసుకోండి. కెరీర్, ఆరోగ్యం మరియు ఆర్థిక అంశాల్లో మార్పులు ఎలా ఉండబోతున్నాయి? Check today's horoscope and remedies for all 12 signs.

ఇరాన్ క్షిపణి దాడిలో బూడిదైన 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'.. వీడియో వైరల్

ఇరాన్ ప్రభుత్వ మీడియా US సైనిక చర్యలను మరియు స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ముప్పుగా చిత్రీకరిస్తూ AI రూపొందించిన వీడియోను విడుదల చేసింది, ఇది ఇరాన్ US ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య సమాచార యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది.

"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ

వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో ప్రధాన మంత్రి మోదీ భారత వృద్ధి మరియు సాంకేతిక నాయకత్వాన్ని వివరించారు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, STEM నైపుణ్యం మరియు ప్రపంచ ప్రభావాన్ని నొక్కి చెప్పారు.

శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం!

2026 శ్రీరామనవమి వేళ గజకేసరి, రాజయోగాల వల్ల ఈ 5 రాశుల వారికి అపారమైన ధన లాభం, అదృష్టం కలుగుతుంది. Check Sri Rama Navami 2026 date and lucky zodiac signs for wealth and success.

భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..

గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య, ప్రాంతీయ స్థిరత్వాన్ని కోరుతూ, ఇరాన్ సంక్షోభంలో భారత్ దళారిగా వ్యవహరించదని ప్రభుత్వం తెలిపింది, దౌత్యపరమైన, సమతూక విధానాన్ని పునరుద్ఘాటించింది.

IPL సీజన్‌కి ముందే షాక్.. హీరో విడా VX2 ప్లస్ KKR ఎడిషన్ టీజర్ రిలీజ్

క్రికెట్ పండుగలా భావించే ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభానికి ముందు నుంచే దేశవ్యాప్తంగా ఉత్సాహం పెరిగిపోతుంది. ఇదే వేళ, అభిమానుల ఆ ఎగ్జైట్‌మెంట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఒక ఆసక్తికరమైన అడుగు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందిన ఈ కంపెనీ, క్రికెట్, ఎలక్ట్రిక్ మొబిలిటీని కలిపి ఒక కొత్త అనుభవాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders) అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేయబోతోంది, అదే హీరో విడా వీఎక్స్‌2 ప్లస్ నైట్ ఎడిషన్ (Hero Vida VX2 Plus Night Edition).

ఫిబ్రవరిలో టాప్ ఎంపీవీలు ఇవే.. ఎర్టిగా టాప్, ఇన్నోవా, కారెన్స్ పోటీ!

కరోనా తరువాత కాలంలో ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులు ఆటోమొబైల్ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే ట్రెండ్ పెరగడంతో, ఎక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్న వాహనాలపై డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీవీ (Multi Purpose Vehicle) సెగ్మెంట్ మళ్లీ బలంగా నిలబడుతూ, కుటుంబ అవసరాలకు సరిపోయే ప్రాక్టికల్ ఆప్షన్‌గా మారింది. ఒకప్పుడు SUVల హవా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు పెద్ద కుటుంబాల కోసం సౌకర్యవంతమైన సీటింగ్, ఎక్కువ లెగ్‌రూమ్, ప్రయాణంలో సౌలభ్యం వంటి అంశాలు ప్రధానంగా మారాయి. ఇవన్నీ కలిపి ఎంపీవీ కార్లను మళ్లీ ముందుకు తీసుకువచ్చాయి. నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఒకే విధంగా ఉపయోగపడే ఈ వాహనాలు ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ ఛాయిస్‌గా మారుతున్నాయి.

ఇష్టమైన వారు దూరమవుతారని తెలిసినా.. ఆ బాధ తప్పదు": త్రిష ఎమోషనల్ వీడియో!

తమిళ సినీ నటి త్రిష తన పెంపుడు కుక్కలు ఇజ్జి మరియు జోరో గురించి పోస్ట్ చేసింది, జోరో మరణించిన తర్వాత దుఃఖాన్ని మరియు సంరక్షణను ప్రతిబింబిస్తుంది మరియు ఇజ్జితో ఆమె కొనసాగుతున్న అనుబంధాన్ని తెలియజేస్తుంది.
Advertisement

కరెంట్ కార్లలో ఇది కింగ్

గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తనదైన ముద్ర వేస్తున్న దక్షిణ కొరియా దిగ్గజం కియా (Kia), మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా సరికొత్త ఎలక్ట్రిక్ కారు కియా EV2 (Kia EV2) ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో యూరప్ మార్కెట్ కోసం దీనిని ప్రదర్శించిన కియా, ఇప్పుడు దీని ధరలు, వేరియంట్లను వెల్లడించింది. విలాసవంతమైన ఇంటీరియర్, అత్యాధునిక ఫీచర్లు, ఏకంగా 453 కిలోమీటర్ల భారీ రేంజ్ ఇవ్వడం ఈ కారు స్పెషాలిటీ. జర్మనీతో సహా పలు యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే దీని బుకింగ్స్ షురూ అయ్యాయి. కియా సంస్థ నుంచి వస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా EV2 రికార్డు సృష్టించబోతోంది.

శాంసంగ్ ఫోన్ కంటే తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్!

భారత టూవీలర్ మార్కెట్‌లో స్టైల్, పనితీరు, ధర అన్నీ కలిపి ఒకే ప్యాకేజ్‌గా అందించే బైక్‌లలో రాయల్ ఎన్‌ఫీల్గ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా యువతలో ఈ బైక్‌కు ఉన్న క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కు చెందిన ఇతర మోడళ్లతో పోలిస్తే, హంటర్ 350 అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉండటం దీనికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఈ అందుబాటు ధరే కాదు, దానికి తోడు నగర వినియోగానికి సరిపోయే లైట్‌వెయిట్ డిజైన్, సులభమైన హ్యాండ్లింగ్, క్లాసిక్ లుక్ కలిసి హంటర్ 350ను విభిన్న వయసు గల వినియోగదారులకు ఆకర్షణీయంగా మార్చాయి. అందుకే ఈ బైక్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా మంచి అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది.

అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు!

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మరియు ఆంక్షల మినహాయింపుల మధ్య భారతదేశం ప్రపంచ సరఫరా అంతరాయాల నుండి రిఫైనరీలను రక్షించడానికి మరియు మూలాలను వైవిధ్యపరచడానికి రష్యన్ ముడి చమురు కొనుగోళ్లను విస్తరించింది.

ఇది స్కూటర్ కాదు మామ అందమైన శిల్పం

ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ స్కూటర్లకు కేరాఫ్ అడ్రస్ అయిన ఇటాలియన్ బ్రాండ్ వెస్పా (Vespa), తన పాపులర్ మోడళ్లయిన ప్రైమావేరా (Primavera), స్ప్రింట్ ఎస్ (Sprint S) శ్రేణిని 2026 సంవత్సరానికి గానూ సరికొత్త హంగులతో అప్‌డేట్ చేసింది. స్టైల్‌కు మారుపేరుగా నిలిచే ఈ స్కూటర్లలో ఈసారి కేవలం రంగులు మార్చడమే కాకుండా, సేఫ్టీ (Safety), సౌకర్యం (Convenience), అధునాతన సాంకేతికత (Technology) కలగలిపి అదిరిపోయే అప్‌గ్రేడ్స్ ఇచ్చింది. ప్రస్తుతం విదేశీ మార్కెట్లలో లాంచ్ అయిన ఈ మోడళ్లు త్వరలోనే భారత రోడ్లపై కూడా మెరిసే అవకాశం ఉంది. పియాజియో (Piaggio) సంస్థ ఆధ్వర్యంలో తయారయ్యే ఈ స్కూటర్ల విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ వేగంగా ఎదుగుతున్న సమయంలో, టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తీసుకొచ్చిన టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు అంటే కొత్త టెక్నాలజీ, అనుమానాలు, పరిమిత వినియోగం అనే భావనలు ఉండేవి. కానీ iQube వచ్చాక ఆ అభిప్రాయాలు చాలా వరకు మారిపోయాయి. ఇది కేవలం ఒక స్కూటర్‌గా కాకుండా, రోజువారీ జీవితంలో భాగమైపోయే సౌకర్యవంతమైన ప్రయాణ సాధనంగా మారింది. 2020 జనవరిలో ప్రారంభమైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, నెమ్మదిగా కానీ స్థిరంగా వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటూ వచ్చింది. మొదట్లో కొన్ని నగరాలకే పరిమితమైన ఈ వాహనం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించి, భారీ స్థాయిలో అమ్మకాల్ని నమోదు చేసింది.