అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు!

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మరియు ఆంక్షల మినహాయింపుల మధ్య భారతదేశం ప్రపంచ సరఫరా అంతరాయాల నుండి రిఫైనరీలను రక్షించడానికి మరియు మూలాలను వైవిధ్యపరచడానికి రష్యన్ ముడి చమురు కొనుగోళ్లను విస్తరించింది.

ఇది స్కూటర్ కాదు మామ అందమైన శిల్పం

ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ స్కూటర్లకు కేరాఫ్ అడ్రస్ అయిన ఇటాలియన్ బ్రాండ్ వెస్పా (Vespa), తన పాపులర్ మోడళ్లయిన ప్రైమావేరా (Primavera), స్ప్రింట్ ఎస్ (Sprint S) శ్రేణిని 2026 సంవత్సరానికి గానూ సరికొత్త హంగులతో అప్‌డేట్ చేసింది. స్టైల్‌కు మారుపేరుగా నిలిచే ఈ స్కూటర్లలో ఈసారి కేవలం రంగులు మార్చడమే కాకుండా, సేఫ్టీ (Safety), సౌకర్యం (Convenience), అధునాతన సాంకేతికత (Technology) కలగలిపి అదిరిపోయే అప్‌గ్రేడ్స్ ఇచ్చింది. ప్రస్తుతం విదేశీ మార్కెట్లలో లాంచ్ అయిన ఈ మోడళ్లు త్వరలోనే భారత రోడ్లపై కూడా మెరిసే అవకాశం ఉంది. పియాజియో (Piaggio) సంస్థ ఆధ్వర్యంలో తయారయ్యే ఈ స్కూటర్ల విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ వేగంగా ఎదుగుతున్న సమయంలో, టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తీసుకొచ్చిన టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు అంటే కొత్త టెక్నాలజీ, అనుమానాలు, పరిమిత వినియోగం అనే భావనలు ఉండేవి. కానీ iQube వచ్చాక ఆ అభిప్రాయాలు చాలా వరకు మారిపోయాయి. ఇది కేవలం ఒక స్కూటర్‌గా కాకుండా, రోజువారీ జీవితంలో భాగమైపోయే సౌకర్యవంతమైన ప్రయాణ సాధనంగా మారింది. 2020 జనవరిలో ప్రారంభమైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, నెమ్మదిగా కానీ స్థిరంగా వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటూ వచ్చింది. మొదట్లో కొన్ని నగరాలకే పరిమితమైన ఈ వాహనం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించి, భారీ స్థాయిలో అమ్మకాల్ని నమోదు చేసింది.

రుణమాఫీ నిధులు విడుదల, వడ్డీ రాయితీపై కీలక ఉత్తర్వులు.

తమిళనాడు ప్రభుత్వం మహిళా స్వయం సహాయక బృందాలకు రుణమాఫీని మంజూరు చేసింది, ఇది రుణభారాన్ని తగ్గించి చిన్న సంస్థలను ప్రోత్సహిస్తుంది, సహకార బ్యాంకుల స్థిరత్వాన్ని కొనసాగించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలు ఉన్నాయి.
Advertisement

డిఫెండర్ లా ఉన్నా దీన్ని కొనేందుకు ఇష్టపడని కస్టమర్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా (Kia) సంస్థకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సెల్టోస్, సోనెట్ వంటి మోడళ్లతో దేశీ మార్కెట్‌ను ఊపేసిన ఈ కొరియన్ కార్ల దిగ్గజానికి ఇప్పుడు ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. ఎంతో ఆశగా, వినూత్నమైన డిజైన్‌తో లాంచ్ చేసిన కియా సైరోస్ (Kia Syros) కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాల విషయంలో ఘోరంగా వెనుకబడిపోతుంది. 2026 ఫిబ్రవరి నెలలో ఈ కారు సేల్స్ గణాంకాలు చూస్తుంటే కంపెనీ మేనేజ్‌మెంట్‌కు చెమటలు పడుతున్నాయి. ఫీచర్లు అదిరిపోయినా, లుక్స్ విషయంలో మాత్రం కస్టమర్లను మెప్పించలేకపోతోందా? అసలు సైరోస్ ఎందుకు ఫెయిల్ అవుతోందో తెలుసుకుందాం.

కొత్తగా వచ్చిన మారుతి కారుకి జనాల నీరాజనం

దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki), ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి తన మొదటి అడుగును ధైర్యంగా వేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ-విటారా (e-vitara)ను మార్కెట్లోకి తీసుకువచ్చి, ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా 2026 ఫిబ్రవరి 17న ఈ వాహనం విడుదలైన వెంటనే, ఇది కేవలం మరో కొత్త కారు కాదని, మారుతి నుంచి వచ్చిన గేమ్ ఛేంజర్ అని చెప్పేలా మారింది. ఈ ఇ-విటారా ప్రత్యేకతలలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని ధర. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్ కింద ప్రారంభ ధరను కేవలం రూ. 10.99 లక్షలుగా నిర్ణయించడం ద్వారా, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.

మాధవీలత దుర్గా స్తుతి..ముస్లింల తీవ్ర ఆగ్రహం..భగవద్గీత శ్లోకంతో ట్రోలర్స్‌ కి మాధవీలత చెక్!


కేంద్రానికి వింత ప్రతిపాదన.. వాహనదారుల్లో కొత్త గుబులు

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఇథనాల్ (Ethanol) ఒక హాట్ టాపిక్‌గా మారింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన E20 ఇంధనం ఇప్పటికే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ ఇంధనం వాడకం వల్ల వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పాత వాహనాల్లో ఇంజిన్ లైఫ్ తగ్గిపోతోందని, మైలేజీ దారుణంగా పడిపోతోందని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య, ఇప్పుడు E30 (30% ఇథనాల్) వైపు అడుగులు వేయాలని ఆల్ ఇండియా డిస్టిల్లర్స్ అసోసియేషన్ (AIDA) కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించడం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అసలు ఈ E30 వెనుక ఉన్న కథాకమీమామిషు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

ఇవి కార్లు కాదు ప్రాణాలు కాపాడే బాడీగార్డులు

ఒకప్పుడు కారు కొనేటప్పుడు కేవలం మైలేజీ, తక్కువ ధర మాత్రమే చూసేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. రోడ్డు ప్రమాదాల భయం పెరగడంతో, ప్రాణాలకు రక్షణ ఇచ్చే సేఫ్టీ ఫీచర్లకు జనం పెద్దపీట వేస్తున్నారు. కారు బాడీ ఎంత బలంగా ఉంటే అంత సురక్షితం అనే నమ్మకం పెరిగింది. అందుకే మన దేశంలో తయారవుతున్న కార్లు కూడా ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా లోహపు కోటల మాదిరిగా వస్తున్నాయి. ముఖ్యంగా 10 లక్షల రూపాయల కంటే తక్కువ బడ్జెట్‌లోనే గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) లేదా బి-ఎన్‌క్యాప్ (BNCAP) నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకున్న టాప్-5 కార్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఆ అదిరిపోయే కార్ల వివరాలు తెలుసుకుందాం.

నేటి రాశి ఫలాలు 25-03-2026

ఈరోజు రాశి ఫలాలు 25 మార్చి 2026: బుధవారం నాడు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం మరియు ప్రేమ విషయాల్లో ఈరోజు మీకు కలిసొస్తుందా? నేటి పంచాంగం మరియు పరిహారాలు ఇక్కడ చూడండి.

అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్

చమురు సౌకర్యాలపై తీవ్ర ప్రతీకార హెచ్చరికలు రావడంతో ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ చెప్పారు, అయితే ఇరాన్ ప్రత్యక్ష చర్చలను ఖండించింది.

ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు..

2025 IQAir WHO నివేదిక PM2.5 స్థాయిలపై 143 దేశాలకు ర్యాంకులు ఇచ్చింది, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ అత్యంత కాలుష్యమైన దేశాలలో ఉన్నాయి మరియు కొనసాగుతున్న ఆరోగ్య మరియు విధాన చిక్కులను హైలైట్ చేస్తుంది.
Advertisement

9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..!

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా 2026-27 బడ్జెట్‌ను పటిష్టమైన పర్యావరణ దృష్టితో ఆవిష్కరించారు, విద్యతో పాటు పచ్చని కార్యక్రమాలకు 21 శాతం నిధులను కేటాయించారు.

మారుతి నుంచి తక్కువ ధరకే 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు!

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉండటం, పర్యావరణంపై అవగాహన పెరగడం, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవి కలిసి ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్‌ను తీసుకువచ్చాయి. ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్ని కూడా ఈ సెగ్మెంట్‌లోకి దూసుకెళ్లాయి. ప్రస్తుతం టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో ముందంజలో నిలుస్తున్నాయి. విభిన్న మోడళ్లతో, విభిన్న ధరల శ్రేణిలో కార్లను అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ కంపెనీలు ఇప్పటికే మంచి అమ్మకాలను నమోదు చేస్తూ, ఈ విభాగంలో తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి.

తాతల కాలం నుంచి ఈ బండి అంటే మనోళ్లకు ఓ అటాచ్‎మెంట్

భారతదేశపు దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించిన సేల్స్ డేటాను విడుదల చేసింది. ఈ గణంకాలు చూస్తుంటే బజాజ్ తన పట్టును మార్కెట్లో ఏమాత్రం కోల్పోలేదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా బజాజ్ పల్సర్ సిరీస్ తన హవాను కొనసాగిస్తూ, మిగిలిన 12 మోడల్స్‌ను వెనక్కి నెట్టి నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. సామాన్యుడి నుంచి స్పోర్ట్స్ బైక్ ప్రియుల వరకు అందరినీ ఆకట్టుకుంటూ బజాజ్ దూసుకుపోతోంది. ఈ సేల్స్ రిపోర్ట్‌లో ఏయే బైక్‌లు ఎలా అమ్ముడయ్యాయి? ఎలక్ట్రిక్ స్కూటర్ల పరిస్థితి ఏంటి? ఏ మోడల్ అట్టడుగున నిలిచింది? వంటి ఆసక్తికరమైన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!


హోండా అమేజ్‌పై భారీ ఆఫర్.. రూ.57,000 వరకు తగ్గింపు!

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా (Honda) భారత మార్కెట్లో పోటీని మరింత కఠినంగా మార్చేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా తన ప్రసిద్ధ కాంపాక్ట్ సెడాన్ అయిన హోండా అమేజ్ (Honda Amaze) అమ్మకాలను పెంచుకోవడానికి ఈసారి ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. మార్చి నెలను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్, కొత్త కారు కొనాలని భావిస్తున్న వినియోగదారులకు మంచి అవకాశంగా మారింది. 4 మీటర్ల లోపు సెడాన్ విభాగంలో మంచి గుర్తింపు పొందిన హోండా అమేజ్ పై మొత్తం రూ.57,000 వరకు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

వేస‌విలో వాకింగ్ ఎవరికి ఏ స‌మ‌యంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

భారతదేశంలో ఉదయం నడకలను పరిమితం చేయాలని మరియు హైడ్రేట్ గా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు, సూర్యోదయంతో వేడి ప్రమాదం పెరుగుతుంది, సీనియర్లలో మరియు బలహీన వర్గాలలో గుండె మరియు ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది.

నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు

పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన భార్య బుష్రా బీబీని నిర్బంధంలో అమానవీయంగా చూస్తున్నారని ఆరోపించారు, న్యాయవ్యవస్థను విమర్శించారు, ఆరోగ్య సమస్యలను పేర్కొన్నారు మరియు జవాబుదారీతనం కోరుతున్నారు.

Smart Nails : మీ డ్రస్సింగ్‌కు తగ్గట్టు సెకన్లలో రంగు మార్చేసే "స్మార్ట్ గోళ్లు"..

మొబైల్ యాప్ ద్వారా సెకన్లలో రంగులు మార్చే స్మార్ట్ గోర్లను అన్వేషించండి, ఇది ఎలక్ట్రోకెమికల్ నానోపాలిమర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. శీఘ్ర రంగు మార్పులు, విస్తృత రంగు ఎంపికలు మరియు ఆచరణాత్మక పరిశీలనలు.
Advertisement

ఈ రెండింటిలో ఏ ఎస్‌యూవీ మీ ఫ్యామిలీకి కరెక్ట్?

భారత ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు ఎస్‌యూవీ (SUV) అంటే కేవలం పెద్ద కార్లు మాత్రమే అనే ముద్ర ఉండేది. కానీ సామాన్యుడికి కూడా ఎస్‌యూవీ అనుభూతిని పరిచయం చేసిన ఘనత రెనాల్ట్ డస్టర్ (Renault Duster)కే దక్కుతుంది. మధ్యలో కొంతకాలం విరామం తీసుకున్న ఈ లెజెండరీ కారు, ఇప్పుడు సరికొత్త హంగులతో, పవర్‌ఫుల్ ఇంజిన్లతో మార్చి 2026లో మళ్లీ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ప్రస్తుతం మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)ను ఢీకొట్టడం డస్టర్‌కు అంత ఈజీ కాదు. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్? ఏ కారు ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధరలో ఏది తక్కువ? వంటి పూర్తి వివరాలు చూద్దాం.

బైక్ ధర రూ.64 వేలు.. గ్రామాల్లో, నగరాల్లో చాలా మంది కొంటున్నారు!

భారతదేశంలో ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ బైక్‌లకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని పెద్ద భాగం ప్రజలు రోజువారీ ప్రయాణాల కోసం ఆధారపడేది ఈ తరహా బైక్‌లపైనే. తక్కువ ధరలో అందుబాటులో ఉండటం, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా లేకపోవడం, ముఖ్యంగా లీటర్‌కు మంచి మైలేజ్ ఇవ్వడం వంటి అంశాలు ఈ బైక్‌లను మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు అత్యంత అనుకూలంగా మారుస్తాయి. నగరాల్లో ట్రాఫిక్ మధ్యన సులభంగా నడపగలగడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులభంగా ఉపయోగించుకోవడం వీటి ప్రధాన బలాలు. అందుకే ఈ సెగ్మెంట్‌లో పోటీ ఎంత ఎక్కువగా ఉన్నా, డిమాండ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు.

10 కార్లలో 7 అక్కడే అమ్ముడవుతున్నాయట

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. అయితే ఒకప్పుడు కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈ క్రేజ్, ఇప్పుడు చిన్న పట్టణాలకు కూడా పాకింది. దీనికి ప్రధాన కారణం MG విండ్సర్ ఈవీ (MG Windsor EV). ఈ ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అక్టోబర్ 2024లో లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ముఖ్యంగా చిన్న పట్టణాల్లోని ప్రజలు ఈ కారుపై చూపిస్తున్న ఆసక్తి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక తాజా నివేదిక ప్రకారం.. ఈ కారు కొంటున్న ప్రతి 10 మందిలో ఏడుగురు చిన్న పట్టణాలకు చెందిన వారే కావడం విశేషం. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు అంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఎంజీ విండ్సర్ ఈవీ ఈ సమీకరణాలను మార్చేసింది. కార్‌ట్రాక్ నివేదిక ప్రకారం, ఈ కారు మొత్తం విక్రయాల్లో 70 శాతం వాటా టైర్-2, టైర్-3 నగరాల నుంచే వస్తోంది. అంటే కేవలం 30 శాతం అమ్మకాలు మాత్రమే మెట్రో నగరాల్లో జరుగుతున్నాయి. అక్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2026 వరకు సుమారు 65,000 యూనిట్ల విండ్సర్ ఈవీలు అమ్ముడయ్యాయి. ఈ ఘనత సాధించడం వెనుక ఎంజీ మోటార్ అనుసరించిన వ్యూహాత్మక ధరలు, ఫీచర్లు ప్రధాన పాత్ర పోషించాయి. ఎంజీ విండ్సర్ ఈవీ విజయంలో దాని BaaS (Battery-as-a-Service) మోడల్ కీలక పాత్ర పోషించింది. ఈ విధానం వల్ల కారు ప్రారంభ ధర కేవలం రూ.9.99 లక్షలకు తగ్గిపోయింది. కస్టమర్లు బ్యాటరీని అద్దెకు తీసుకుని, కిలోమీటరుకు కేవలం రూ.3.5 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. ఇది ఒక పెట్రోల్ కారు మెయింటెనెన్స్ కంటే చాలా తక్కువ. ఒకవేళ బ్యాటరీతో కలిపి కారును పూర్తిగా సొంతం చేసుకోవాలనుకుంటే, దీని ధర రూ.13.50 లక్షల నుంచి రూ.18.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ చిన్న పట్టణాల్లోని వ్యాపారస్తులను, ఫ్యామిలీలను ఎక్కువగా ఆకర్షించింది. విండ్సర్ ఈవీ కేవలం ధరలోనే కాదు, ఫీచర్లలో కూడా రాజీ పడలేదు. దీనిని ఒక క్రాస్ఓవర్ లాగా డిజైన్ చేశారు, దీనివల్ల కారు లోపల చాలా ఎక్కువ స్థలం లభిస్తుంది. ముఖ్యంగా దీని వెనుక సీట్లు 135 డిగ్రీల వరకు వంగి ఉండటం వల్ల (Lounge Style Seats) ప్రయాణికులకు విమానంలోని బిజినెస్ క్లాస్ లాంటి అనుభూతిని కలిగిస్తాయి. కారు డాష్‌బోర్డ్‌పై 15.6 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. లగ్జరీ ఇంటీరియర్, విశాలమైన లెగ్ రూమ్ ఉండటం వల్ల లాంగ్ రైడ్స్ చేసే వారికి ఇది మొదటి ఛాయిస్‌గా మారింది. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఎంజీ దీనిని రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందిస్తోంది:38 kWh బ్యాటరీ: ఇది సింగిల్ ఛార్జ్‌పై 331 కి.మీ రేంజ్ ఇస్తుంది. రోజువారీ ఆఫీస్ పనులకు లేదా సిటీ డ్రైవింగ్‌కు ఇది సరిపోతుంది.52.9 kWh బ్యాటరీ: దూర ప్రయాణాలు చేసే వారి కోసం ఈ వేరియంట్ 449 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది.ఈ కారులో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 136 bhp పవర్, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 45kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తే కేవలం 55 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ పూర్తవుతుంది. విండ్సర్ ఈవీ రాకతో ఎంజీ మోటార్ ఇండియా తన అమ్మకాల్లో భారీ వృద్ధిని చూసింది. అక్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో కంపెనీ మొత్తం మీద ఒక లక్షకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఇందులో విండ్సర్ ఈవీతో పాటు ఎంజీ కామెట్ (Comet), ఎంజీ జెడ్ఎస్ ఈవీ (ZS EV) వంటి మోడల్స్ కూడా ఉన్నాయి. చిన్న పట్టణాల్లో తమ సర్వీస్ సెంటర్లను విస్తరించడం వల్ల ప్రజల్లో ఈ బ్రాండ్‌పై నమ్మకం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఎంజీ అమ్మకాలు 19 శాతం పెరగడం గమనార్హం. టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 వంటి కార్లకు విండ్సర్ ఈవీ ఇప్పుడు గట్టి పోటీనిస్తోంది.

దీని మీద వీధిలో వెళ్తుంటే అమ్మాయిలు అలా చూస్తుండిపోవాల్సిందే

ప్రస్తుతం భారతీయ టూవీలర్ మార్కెట్లో జపనీస్ దిగ్గజం సుజుకి (Suzuki) హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆ కంపెనీ నుంచి వచ్చిన బర్గ్‌మన్ స్ట్రీట్ 125 (Burgman Street 125) స్కూటర్ అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సాధారణంగా 125సీసీ సెగ్మెంట్లో సుజుకి యాక్సెస్ (Access) రాజాలా ఏలుతుంటే, ఇప్పుడు దానికి తోడుగా మాక్సీ స్టైల్ బర్గ్‌మన్ కూడా రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. 2026 ఫిబ్రవరి నెల అమ్మకాల గణాంకాలు చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. గతేడాదితో పోలిస్తే ఏకంగా 112 శాతానికి పైగా వృద్ధిని సాధించి, టాప్ 10 స్కూటర్ల జాబితాలో చోటు దక్కించుకుంది.

యాక్టివా కంటే తక్కువే.. మధ్యతరగతి మనసు గెలిచింది

భారతదేశంలో రోజురోజుకూ స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బైక్‌ల మాదిరిగా తరచుగా గేర్లు మార్చాల్సిన అవసరం లేకపోవడం, ట్రాఫిక్‌లో సులభంగా నడపగలగడం, కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడే విధంగా ఉండటం వంటి కారణాలతో స్కూటర్ల వైపు వినియోగదారులు మరింతగా ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ Suzuki తయారు చేసిన సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) భారత మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రతి నెలా మంచి అమ్మకాలను నమోదు చేస్తూ వస్తున్న ఈ స్కూటర్, 2026 ఫిబ్రవరిలో కూడా తన దూకుడు కొనసాగించింది.