దేశంలోనే చౌక కారును పట్టించుకునే వాళ్లు లేరు

ఒకప్పుడు భారతదేశంలో కారు కొనడానికి వెళ్లే కస్టమర్‌లు కేవలం రెండు విషయాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అవి ధర, మైలేజ్. ఈ రెండూ సరిపోతే, కారు సేల్స్‌పై పెద్దగా ప్రభావం చూపించేవి కాదు. కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. ధర, మైలేజ్‌తో పాటు, సేఫ్టీ, అడ్వాన్సుడ్ ఫీచర్లు, డిజైన్ వంటి అంశాలపై కస్టమర్‌లు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీని కారణంగా తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల అమ్మకాలు పాత రోజుల్లా లేవు. ఈ రకమైన కార్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. దీనికి మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso) చాలా మంచి ఉదాహరణ. ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.3.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ ధర కూడా కేవలం రూ.5.25 లక్షల వరకే ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ధరలు పేర్కొన్నారు. మైలేజ్ విషయానికి వస్తే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 24.12 కిలోమీటర్ల నుంచి 32.73 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది (వేరియంట్‌ను బట్టి ARAI మైలేజ్ మారుతుంది). ధర తక్కువగా ఉన్నా, మైలేజ్ ఎక్కువగా ఉన్నా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అమ్మకాలు చాలా మందకొడిగా ఉన్నాయి. దీనికి కారణాలు చాలా చిన్నవి: కారు సైజ్ చిన్నగా ఉండటం, ఇందులో పెద్దగా అడ్వాన్సుడ్ ఫీచర్లు లేకపోవడం. అయితే, అమ్మకాలు తగ్గడానికి అతిపెద్ద కారణం ఏమిటంటే ఈ కారు సేఫ్టీ లేనిదిగా భారతీయ కస్టమర్‌లు భావించడం. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులలో ఎస్-ప్రెస్సో సరిగా రాణించకపోవడంతో, కస్టమర్ల నమ్మకం తగ్గిపోయింది. ఈ సేఫ్టీ సమస్య కారణంగా, ప్రతి నెలా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అమ్మకాలు చాలా నిదానంగా ఉన్నాయి. రష్‌లేన్ (Rushlane) నివేదిక ప్రకారం.. నవంబర్ 2025లో కేవలం 1,747 మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత సంవత్సరం (నవంబర్ 2024)లో 2,283 కార్లు అమ్ముడయ్యాయి. అంటే, ఏడాదివారీ పోలికలో ఏకంగా 23.48% (536 కార్లు తక్కువగా) పడిపోయింది.

Pahalgam Chargesheet: పహల్గాం ఛార్జిషీట్ రెడీ..! ఎన్ఐఏ తేల్చిందిందే..!

పహల్గామ్ దాడి కేసులో NIA ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, LeT కార్యకర్తలను విస్తృత కాశ్మీర్ ఉగ్రవాద నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తూ స్థానిక మద్దతు మరియు లాజిస్టిక్‌లను వివరిస్తుంది.

ఇండోనేషియాలో ప్రూవ్ అయిన ఎలక్ట్రిక్ SUV ఇప్పుడు భారత్‌కి?

భారత ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న సమయంలో, జపాన్ దిగ్గజం టయోటా (Toyota) కూడా ఈ సెగ్మెంట్‌లో తన అడుగులు బలంగా ముద్రించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు హైబ్రిడ్ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టిన టయోటా, ఇక భారత్‌లో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి విక్రయించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఆటో పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యూహంలో భాగంగా, టయోటా, సుజుకి మధ్య ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్య ఒప్పందం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు కంపెనీలు తమ తమ సాంకేతికతలను పరస్పరం పంచుకుంటూ, వేర్వేరు మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా వాహనాలను అభివృద్ధి చేయనున్నాయి.

ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్‌ని ఎలా గుర్తించాలి-రక్షణ మార్గాలు ఏమిటి?

I4C భారతదేశంలో డిజిటల్ పెట్టుబడి మోసాలు పెరుగుతున్నాయని నివేదించింది. బెంగళూరు, ఢిల్లీ-NCR, హైదరాబాద్ మరియు పూణే నగరాల్లో కేసులు నమోదయ్యాయి; పెట్టుబడిదారులను రక్షించడానికి ధృవీకరణ మరియు నివేదనపై మార్గదర్శకత్వం నొక్కి చెబుతుంది.
Advertisement

ఫంక్షన్ స్టైల్ గుత్తి వంకాయ కుర్మా.. అన్నమైనా, బిర్యానీ అయినా వదిలిపెట్టరు!

ఆంధ్రప్రదేశ్ శాకాహార వంటకాలలో పనీర్ బటర్ మసాలా మరియు గుత్తి వంకాయ కూర్మా పదార్థాలు, తయారీ మరియు ప్రాంతీయ ప్రాముఖ్యతలో ఎలా విభిన్నంగా ఉంటాయో అన్వేషించండి.

అక్రమ లోన్ యాప్‌లు — కేంద్ర హోంశాఖ హెచ్చరిక..!!

భారతదేశం చట్టవిరుద్ధ డిజిటల్ లెండింగ్ యాప్‌లపై MHA మరియు నియంత్రణ సంస్థలతో నియంత్రణలను కఠినతరం చేసింది, మోసపూరిత యాప్‌లను తొలగిస్తుంది మరియు సమన్వయ చర్యల ద్వారా పౌరులను రక్షిస్తుంది.

మారుతికి కొత్త సూపర్ హిట్! మూడు నెలల్లోనే 30,000 సేల్స్ మార్క్

భారతదేశంలో నంబర్-1 కార్ల తయారీ సంస్థగా పేరొందిన మారుతి సుజుకి, హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లకే పరిమితం కాకుండా, ఇప్పుడు SUV విభాగంలో కూడా తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకోవాలనే లక్ష్యంతో దూసుకెళ్తోంది. భారత మార్కెట్లో SUVలకు డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సెగ్మెంట్‌ను నిర్లక్ష్యం చేయకుండా మారుతి సుజుకి వరుసగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూ తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే, మారుతి సుజుకి ఇటీవల విక్టోరిస్ (victoris) అనే సరికొత్త మిడ్-సైజ్ SUVను మార్కెట్లోకి విడుదల చేసింది. లాంచ్ సమయంలోనే ఈ SUVపై వినియోగదారుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, అలాగే మారుతి బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కలిసి విక్టోరిస్‌కు అనూహ్యమైన ప్రారంభాన్ని అందించాయి.

మళ్లీ కొత్తగా పురుడు పోసుకున్న ఎంజీ హెక్టార్

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా(JSW MG Motor India) ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అడుగు ముందుకేస్తూ, ఆల్‌-న్యూ ఎంజీ హెక్టర్(MG Hector)ను విడుదల చేసింది. ఈ కొత్త హెక్టర్, బోల్డ్ డిజైన్, అద్భుతమైన సౌకర్యం, మోడ్రన్ టెక్నాలజీతో వచ్చింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయించారు. ఇది టాప్ మోడల్‌కు రూ.19.49 లక్షల వరకు ఉంటుంది. హెక్టర్ ప్లస్ (Hector Plus) (6, 7-సీటర్ ఆప్షన్లు) ప్రారంభ ధర రూ.17.29 లక్షలు. కొత్త ఫేస్‌లిఫ్ట్ ద్వారా ఎంజీ హెక్టర్‌కు మరింత ఫ్రెష్ లుక్ ఇచ్చారు. కొత్త ఎంజీ హెక్టర్ ఎక్స్‌టీరియర్‌లో చాలా ముఖ్యమైన మార్పులు చేశారు. ముందు భాగంలో ఆకర్షణీయమైన ఆరా హెక్స్ గ్రిల్(Aura Hex Grille)అనే సరికొత్త హనీకాంబ్ డిజైన్ ఇచ్చారు.ఇది కారుకు మరింత దృఢమైన రూపాన్ని ఇస్తుంది. కొత్తగా రూపొందించిన బంపర్‌లు, ఆరా బోల్ట్ అలాయ్ వీల్స్ దీని లుక్‌ను మరింత స్టైలిష్‌గా మార్చాయి.

దేశాన్ని మార్చుతున్న చేతులకు గుర్తింపు: SABERA™ 2025

సబేరా 2025 అవార్డులు భారతదేశంలో సామాజిక ప్రభావాన్ని నడిపిస్తున్న నాయకులు మరియు సంస్థలను గుర్తిస్తుంది, ఇది సామూహిక శ్రేయస్సు, నైతిక నాయకత్వం మరియు కమ్యూనిటీ అభివృద్ధిని హైలైట్ చేస్తుంది.

ఈ కారును పేదోళ్లు ఈజీగా సైతం కొనచ్చు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో కె10 (maruti Suzuki Alto K10) అనేది ఎన్నో ఏళ్లుగా మధ్యతరగతి ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిన్న హ్యాచ్‌బ్యాక్‌గా నిలుస్తోంది. తక్కువ ధర, విశ్వసనీయత, మెరుగైన మైలేజ్ వంటి అంశాలు ఈ కారును తొలిసారి కారు కొనుగోలు చేసే వారికి ఎప్పటికీ మొదటి ఎంపికగా మారుస్తున్నాయి. అందుకే నెలనెలా ఈ కారు అమ్మకాలు స్థిరంగా కొనసాగుతుంటాయి. నవంబర్ నెలలో కూడా ఇదే ధోరణి కొనసాగింది. గత నవంబర్‌లో మారుతి సుజుకి ఆల్టో K10 మొత్తం 10,600 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. గత ఏడాది ఇదే కాలాన్ని పరిశీలిస్తే, 2024 నవంబర్‌లో 7,467 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

జిమ్నీని చూసి కన్నీరుమున్నీరవుతున్న మారుతి

ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీల మార్కెట్‌లో మహీంద్రా థార్ (Mahindra Thar) కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి మారుతి సుజుకి భారీ అంచనాల మధ్య జిమ్నీని (Jimny) రంగంలోకి దించింది. అయితే, జిమ్నీ ధర అధికంగా ఉండటం, థార్‌తో పోలిస్తే మార్కెటింగ్ వ్యూహాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వాహనం మార్కెట్‌లో వెనుకబడింది.
Advertisement

దేశంలో టాప్-3లోకి దూసుకెళ్లిన క్రెటా!

భారతదేశ కార్ల మార్కెట్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. పెరుగుతున్న మధ్యతరగతి వర్గం, మెరుగవుతున్న రహదారి మౌలిక వసతులు, అలాగే కొత్త టెక్నాలజీపై వినియోగదారుల ఆసక్తి వల్ల దేశంలో వాహనాల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచంలోని అనేక ప్రముఖ కార్ బ్రాండ్లు భారత మార్కెట్లో భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు విదేశీ కంపెనీల ఆధిపత్యంలో ఉన్న భారత ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ బ్రాండ్లు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. హ్యుందాయ్, కియా వంటి అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఇదే సమయంలో రాణిస్తున్నాయి.

సియెర్రా ధరలు చూసి గుండెలు బాదుకుంటున్న మారుతి

టాటా మోటార్స్ నుంచి కొత్త తరం సియెర్రా (New Gen Tata Sierra SUV) మార్కెట్‌లోకి ప్రవేశించి కార్ లవర్సును ఆకట్టుకుంటోంది. పాత సియెర్రా పేరుకు తగ్గట్టే, కొత్త మోడల్ డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం, ముఖ్యంగా భద్రత (Safety) విషయంలో అద్భుతాలు సృష్టించింది. నవంబర్ 25న విడుదలైన ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ధరల విషయంలోనూ పోటీదారులకు సవాల్ విసురుతోంది. సియెర్రా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షలుగా ఉంది. టాటా సియెర్రా మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది.. స్మార్ట్ ప్లస్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్. ప్యూర్, ప్యూర్ ప్లస్ ట్రిమ్‌లు రూ. 12.99 లక్షల నుంచి, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్ ట్రిమ్‌లు రూ. 15.29 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. తాజాగా, టాటా అత్యంత ఖరీదైన మరియు ఎక్కువ ఫీచర్లు కలిగిన అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ల ధరలను కూడా ప్రకటించింది.

భారత మార్కెట్లో సిట్రోయెన్ పరిస్థితి ఇదేనా? నవంబర్ గణాంకాలు

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ (Citroën) భారత మార్కెట్లోకి అడుగుపెట్టి కొద్ది కాలమే అయినప్పటికీ, తనదైన గుర్తింపును ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తోంది. యూరోపియన్ డిజైన్, కంఫర్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చే సస్పెన్షన్ సెటప్, అలాగే ప్రాక్టికల్ ఫీచర్లతో కంపెనీ భారత వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తోంది. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా తగినంత షోరూమ్‌లు, సర్వీస్ నెట్‌వర్క్ లేకపోవడం సిట్రోయెన్ ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపధ్యంలో, కంపెనీ తాజాగా నవంబర్ నెలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. నవంబర్ 2025లో సిట్రోయెన్ మొత్తం 1,224 కార్లను మాత్రమే విక్రయించింది. అదే సమయంలో, అక్టోబర్ నెలలో 1,426 యూనిట్లు అమ్ముడవ్వడం గమనార్హం. ఈ రెండు నెలల మధ్య పోలిస్తే నవంబర్ అమ్మకాల్లో కొంత తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది.

రోజూ కొన్ని ఉడికించిన వేరుశెనగలు తినండి చాలు..

గుండె ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ మరియు మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడం వంటి ఉడికించిన వేరుశెనగల ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషించండి. వాటిని సమతుల్య ఆహారంలో ఎలా చేర్చుకోవాలో తెలుసుకోండి.

సౌండ్ లేకుండా సేల్స్ సునామీ

టయోటా, మారుతి సుజుకి సంస్థల భాగస్వామ్యం ఫలితంగా రూపొందించబడిన టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మోడళ్లు భారతదేశంలో అత్యంత పోటీ ఉన్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఒకదానికొకటి పోటీ ఇస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, ఈ రెండు మోడళ్లు ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించడం ద్వారా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నాయి. ప్రారంభంలో మారుతి మోడల్‌కు ఎక్కువ అమ్మకాలు జరిగినా గత కొన్ని నెలలుగా టయోటా హైరైడర్ అమ్మకాలలో ఆధిక్యం కనబరిచింది. అయితే నవంబర్ 2025 నెల అమ్మకాలతో ఈ పోటీలో కథ మారింది. తాజాగా విడుదలైన నవంబర్ 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం మారుతి సుజుకి గ్రాండ్ విటారా మళ్లీ పుంజుకుని, తన ప్రత్యర్థి అయిన టయోటా హైరైడర్‌ను వెనక్కి నెట్టింది. గ్రాండ్ విటారా ఏకంగా 11,339 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే నెల (10,148 యూనిట్లు)తో పోలిస్తే ఏకంగా 12 శాతం అధిక వృద్ధిని సాధించింది.

తిరుగులేని ఏకాదశి: ఈ పూజలు చేస్తే అన్నింట్లోనూ `సఫలం`

పౌష కృష్ణ పక్షంలో సఫల ఏకాదశి ప్రాముఖ్యత, దాని పూజ సమయాలు మరియు విజయం, ఆధ్యాత్మిక విముక్తి పొందడానికి దశల వారీ ఆచారాల గురించి తెలుసుకోండి.

ఫ్లిప్ కార్ట్ మెగా ఆఫర్.. "ఐ ఫోన్ 16 ప్రో" పై రూ.40 వేలు డిస్కౌంట్ !!

Flipkart ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో iPhone 16 Pro తగ్గింపులను కనుగొనండి, బ్యాంక్ కార్డ్ రిబేట్‌లు మరియు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ప్రీమియం ధరను మరింత అందుబాటులోకి తెస్తాయి.

ఉసిరికాయ నిల్వ పచ్చడి.. ఇలా చేసి తింటే వింటర్ లో ఇమ్యూనిటీ బూస్ట్!

తాజా ఉసిరి, సుగంధ ద్రవ్యాలు మరియు 15 నిమిషాల పద్ధతిని ఉపయోగించి శీఘ్ర ఉసిరి ఊరగాయను తెలుసుకోండి. విటమిన్ సి, సులభమైన తయారీ మరియు బిజీ షెడ్యూల్‌ల కోసం నిల్వ చిట్కాలను హైలైట్ చేస్తుంది.
Advertisement

యువతలో సడెన్ డెత్ లు.. కొవిడ్ వ్యాక్సినేషన్ కారణమా..? ఎయిమ్స్ క్లారిటీ..

యువతలో ఆకస్మిక మరణాలకు గుండె సంబంధిత వ్యాధులే ప్రధాన కారణమని ఎయిమ్స్ ఢిల్లీ పోస్ట్‌మార్టం విశ్లేషణలో తేలింది; కోవిడ్-19 టీకాకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవు.

కన్నీళ్లు పెడుతున్న C5 ఎయిర్‌క్రాస్ డీలర్లు

ప్రయాణ సౌలభ్యం విషయంలో ప్రీమియం బ్రాండ్‌లకు సైతం గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం ఉన్న కంపెనీ సిట్రోయెన్ (Citroen). ఆ బ్రాండ్‌లోని మోడల్స్‌లోకెల్లా అద్భుతమైనది C5 ఎయిర్‌క్రాస్ (Aircross). అయితే నవంబర్ నెలలో ఈ మోడల్ అమ్మకాల గణాంకాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోకుండానే సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ వెనుకబడింది.

రేసులో దూసుకుపోతున్న పంచ్

చాలా తక్కువ సమయంలోనే భారతీయ ప్రజల హృదయాలను గెలుచుకున్న టాటా కార్ మోడల్ పంచ్ (Punch). తక్కువ ధర, ఆకర్షణీయమైన డిజైన్, కుటుంబ ప్రయాణాలకు సరిపడా స్థలం, బెస్ట్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న ఈ కారును భారతీయులు కాదనలేకపోతున్నారు అనడానికి దాని అమ్మకాల రిపోర్ట్‌లే సాక్ష్యం. ఈ సంవత్సరం కొన్ని నెలల పాటు టాటా పంచ్ అమ్మకాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ, జీఎస్టీ 2.0 సంస్కరణల తర్వాత టాటా నెక్సాన్ మాదిరిగానే పంచ్ అమ్మకాలు కూడా బాగా మెరుగుపడ్డాయి. 2025 నవంబర్ నెలకు సంబంధించిన పంచ్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, గాడివాడి విడుదల చేసిన నివేదిక ప్రకారం..నవంబర్ 2025లో టాటా పంచ్ అమ్మకాలు ఏకంగా 18,753 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు 2024 నవంబర్‌లో అమ్మకాలు 15,435 యూనిట్లుగా ఉండేవి. అంటే, సంవత్సరంలో 3,318 యూనిట్లు అదనంగా విక్రయించబడ్డాయి. దీంతో వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 21 శాతం పెరిగాయి.

భారత్ కు బిగ్ షాక్..! మరో దేశం 50 శాతం సుంకాల మోత..! కేంద్రం ఫైర్..!

మెక్సికో భారతీయ ఎగుమతులపై సుంకాలను 50 శాతం పెంచింది, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిరక్షించడానికి మరియు ప్రభావిత రంగాలను పరిష్కరించడానికి భారతదేశం తగిన చర్యలు తీసుకోవాలని మరియు చర్చలలో పాల్గొనాలని సూచించింది.

ఆల్ట్రోజ్ కొంటే ఆ డబ్బుతో డీజిల్ కొట్టించుకోవచ్చు

మారుతి సుజుకి బాలెనోకు గట్టి పోటీనిచ్చే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో కారు కొనాలని చూస్తున్న వారికి టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) ఒక అద్భుతమైన ఆప్షన్. 2025 డిసెంబర్ నెలలో టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ అన్ని వేరియంట్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ నెలలో ఆల్ట్రోజ్‌ను కొనుగోలు చేస్తే వినియోగదారులు ఏకంగా రూ.1.85 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని కంపెనీ తెలియజేసింది. ఈ అద్భుతమైన తగ్గింపు ఆఫర్‌లు, ధర, ప్రత్యేకతల గురించి వివరంగా తెలుసుకుందాం. మీ దగ్గరలోని టాటా షోరూమ్‌లో వివరాలు అడగటం మర్చిపోవద్దు. టాటా ఆల్ట్రోజ్ అన్ని వేరియంట్లపై రూ.1,00,000 కన్స్యూమర్ ఆఫర్‌తో పాటు, రూ.50,000 ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బెనిఫిట్ కూడా లభిస్తోంది. దీంతో మొత్తం ఆదా రూ.1.50 లక్షలుగా ఉంది. ఇక ఆల్ట్రోజ్ రేసర్ (Altroz Racer) మోడల్‌పై అయితే, రూ.1,35,000 కన్స్యూమర్ డిస్కౌంట్, రూ.50,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో సహా మొత్తం రూ.1.85 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. వేరియంట్‌లు, డీలర్‌షిప్‌లను బట్టి మారే అవకాశం ఉంది. టాటా ఆల్ట్రోజ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.30 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంది. డిసెంబర్ ఆఫర్లను పరిగణనలోకి తీసుకుంటే బేస్ మోడల్ స్మార్ట్ 1.2L పెట్రోల్ వేరియంట్‌ను రూ.7 లక్షల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ పెట్రోల్ ధర రూ.6.30 లక్షలు, ప్రీమియం డీజిల్ రూ.9.50 లక్షలు, ఆల్ట్రోజ్ రేసర్ రూ.9.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.