కొత్త హ్యుందాయ్ వెర్నా వచ్చేసింది

దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ వెర్నా (Hyundai Verna) భారత మార్కెట్లో ప్రముఖ మిడ్-సైజ్ సెడాన్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. స్టైలిష్ డిజైన్, ఆధునిక టెక్నాలజీ, సౌకర్యవంతమైన క్యాబిన్‌తో ఈ కారు చాలా కాలంగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు కంపెనీ ఈ సెడాన్‌ను 2026 అప్‌డేట్‌తో మరింత ఆకర్షణీయంగా తీసుకొచ్చింది. కొత్త వెర్నా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.98 లక్షల నుంచి రూ. 18.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ఈ తాజా వెర్షన్‌లో బాహ్య రూపం, అంతర్గత డిజైన్, ఫీచర్ల పరంగా అనేక మార్పులు చేసి, కారును మరింత ప్రీమియంగా మార్చారు.

రెండు అదిరిపోయే బైక్స్.. ఏది బెస్ట్?

హోండా షైన్ 125 (Honda Shine 125) లిమిటెడ్ ఎడిషన్ భారత మార్కెట్లో చాలా కాలంగా ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌గా గుర్తింపు పొందింది. మంచి మైలేజ్, సింపుల్ డిజైన్, విశ్వసనీయమైన ఇంజిన్ కారణంగా ఈ బైక్‌కు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు మంచి డిమాండ్ ఉంది. మరోవైపు హీరో గ్లామర్ ఎక్స్ 125 (Hero Glamour X 125) కూడా ఇదే సెగ్మెంట్‌లో బలమైన పోటీని ఇస్తోంది. స్టైలిష్ డిజైన్, మెరుగైన ఫీచర్లు, మంచి పనితీరు వల్ల ఇది యువతలో ఎక్కువగా ఆకర్షణ పొందుతోంది. ఈ రెండు కూడా భారత పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో లభిస్తూ రోజూ ప్రయాణంలో తోడుగా నిలుస్తాయి. ఇప్పుడు ఈ కథణంలో ఈ రెండు బైకుల గురించిన తేడాల గురించి తెలుసుకుందాం.

కార్ల ప్రపంచంలో మహా విప్లవం

సినిమా హాల్‌లో కొత్త సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తామో, కార్ల మార్కెట్‌లో కూడా కొత్త మోడళ్ల కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు జనం. ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇండియాలో ఎస్‌యూవీ (SUV) కార్లకు ఉన్న డిమాండ్ చూసి, ప్రముఖ కంపెనీలు రెనాల్ట్ (Renault), నిస్సాన్ (Nissan) గట్టి ప్లాన్ వేశాయి. టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా, రాబోయే మూడేళ్లలో ఏకంగా 5 కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయబోతున్నాయి. 2028 నాటికి ఈ కార్లన్నీ రోడ్ల మీద రయ్‌రయ్‌మంటూ తిరగనున్నాయి. ఈ లేటెస్ట్ ఎస్‌యూవీల ప్రత్యేకతలు ఏంటి? అవి ఎప్పుడు వస్తాయి? లాంటి వివరాలు తెలుసుకుందాం.

కస్టమర్లు రాక దోమలు కొట్టుకుంటున్న డీలర్లు

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో చిన్న కార్ల విభాగంలో ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించిన హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) ఒకటి. సరసమైన ధర, మంచి మైలేజ్, సులభమైన డ్రైవింగ్ అనుభవం వంటి కారణాల వల్ల ఈ కారు సంవత్సరాలుగా మధ్యతరగతి కుటుంబాలకు నచ్చిన ఎంపికగా నిలిచింది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండటం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల కూడా ఇది చాలా మందికి ప్రాధాన్యమైన కారుగా మారింది. అయితే, ఇటీవల కాలంలో ఈ కారుకు ఉన్న డిమాండ్ మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, 2026 ఫిబ్రవరి నెలలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపించింది. ఆ నెలలో మొత్తం కేవలం 862 యూనిట్లు మాత్రమే వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి.
Advertisement

కార్ల ఉత్పత్తిని సగానికి తగ్గించిన టాటా

మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగాన్ని, ముఖ్యంగా స్వదేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ పై జరిపిన దాడులు, ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమ ఆసియా అట్టుడుకుతోంది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేవలం యుద్ధ భూమికే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చమురు, గ్యాస్ సరఫరాను అస్తవ్యస్తం చేశాయి. దీనివల్ల టాటా మోటార్స్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తిని భారీగా తగ్గించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఈ టాప్ డీజిల్ ఎస్‌యూవీల్లో మీ ఛాయిస్ ఏది?

ప్రస్తుత ఆటోమొబైల్ మార్కెట్ అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నప్పటికీ, డీజిల్ ఇంజిన్ల పట్ల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్‌లు వెళ్లే వారికి, కొండ ప్రాంతాల్లో ప్రయాణించే వారికి డీజిల్ ఇంజిన్ ఇచ్చే పవర్ (టార్క్), మైలేజ్ మరే ఇంజిన్ ఇవ్వలేదు. భవిష్యత్తులో కఠినమైన పర్యావరణ నిబంధనల వల్ల డీజిల్ కార్ల తయారీ తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే మీరు పవర్‌ఫుల్ డీజిల్ కారు కొనాలనుకుంటే, మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

లక్షలు పెట్టి కొన్న కారు త్వరగా పాడవ్వకూడదా?

కొత్త కారు కొనడం ఎంత సంతోషాన్నిస్తుందో, దానిని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలామంది కారు కొన్నాక కేవలం పెట్రోల్ పోయించడం, నడపడం మాత్రమే చేస్తుంటారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే లక్షలు పోసి కొన్న కారు కొద్ది రోజుల్లోనే ముసలిదైపోతుంది. మధ్యలో ఆగిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మీ కారు కండీషన్‌ బాగుండాలంటే ఐదు ముఖ్యమైన విషయాలను మీరు క్రమం తప్పకుండా పాటించాలి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఈ కారును కొనే నాథుడే లేడు

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకికి తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటైన ఫ్రాంక్స్ (Fronx) విషయంలో ఇప్పుడు కొత్త తలపోటు మొదలైంది. ఐదుగురు కూర్చున్నా ఇంకా చోటు ఉంది అనిపించేంత విశాలమైన క్యాబిన్, అదిరిపోయే స్టైలిష్ లుక్‌తో దూసుకుపోతున్న ఈ కారు అమ్మకాలు ఒక్కసారిగా తగ్గడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకప్పుడు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ క్రాస్ఓవర్ ఎస్‌యూవీ, ఇప్పుడు టాప్-10 జాబితాలో చిట్టచివరి స్థానానికి పడిపోవడంతో మారుతి సుజుకి యాజమాన్యం అప్రమత్తమైంది.
Advertisement

ఇన్నోవాను మడతపెట్టిన హైరైడర్

భారతదేశంలో టయోటా అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇన్నోవా. దశాబ్దాలుగా ఇండియన్ రోడ్లపై రారాజులా వెలుగొందుతున్న ఇన్నోవాకు ఇప్పుడు సొంత ఇంటి నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. టయోటా నుంచి వచ్చిన సరికొత్త ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, ఇన్నోవా సింహాసనాన్ని కదిలిస్తోంది. 2026 ఫిబ్రవరి నెల అమ్మకాల గణాంకాలు చూస్తుంటే, టయోటా బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా హైరైడర్ నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. గడచిన నాలుగు నెలల్లో ఇన్నోవాను హైరైడర్ ఓడించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఆటో పండిట్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గత ఫిబ్రవరి నెలలో టయోటా మొత్తం 9,359 హైరైడర్ ఎస్‌యూవీలను విక్రయించింది. 2025 ఫిబ్రవరిలో ఇవి కేవలం 4,314 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఏడాది కాలంలో అమ్మకాలు ఏకంగా 117 శాతం పెరిగాయి. అదే సమయంలో, టయోటాగర్వకారణమైన ఇన్నోవా (హైక్రాస్, క్రిస్టా కలిపి) 8,703 యూనిట్ల విక్రయాలను మాత్రమే నమోదు చేసింది. గతేడాది కంటే ఇన్నోవా అమ్మకాలు కేవలం 3 శాతం మాత్రమే పెరిగాయి. ప్రస్తుతం టయోటా మొత్తం అమ్మకాల్లో 30 శాతం వాటా ఒక్క హైరైడర్‌దే కావడం దీని క్రేజ్‌ను తెలియజేస్తోంది.

8 లక్షల బడ్జెట్‌లో అద్భుతమైన ఎస్‌యూవీలు ఇవే

మధ్యతరగతి భారతీయులకు కారు అనేది ఒక కల. ముఖ్యంగా నేటి కాలంలో సెడాన్ లేదా హ్యాచ్‌బ్యాక్ కంటే ఎస్‌యూవీ (SUV)లకే క్రేజ్ ఎక్కువగా ఉంది. స్టైలిష్ లుక్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, కంఫర్ట్ కారణంగా అందరూ వీటివైపే మొగ్గు చూపుతున్నారు. అయితే, బడ్జెట్ విషయానికి వస్తే 8 లక్షల రూపాయల లోపు మంచి ఫీచర్లు, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే కార్ల కోసం జనం వేచి చూస్తుంటారు. 2026లో మారుతి సుజుకి ఫ్రాంక్స్, టయోటా టైజర్, కియా సోనెట్ వంటి మోడల్స్ ఈ బడ్జెట్‌లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. వీటి విశేషాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కుర్రాళ్లకు పిచ్చెక్కించే టాప్ 5 బడ్జెట్ స్పోర్ట్స్ బైక్స్

తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే లుక్, మెరుపు వేగం, గుండెలు అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్పోర్ట్స్ బైక్ కొనాలని చాలా మంది కలలు కంటారు. ఒకప్పుడు స్పోర్ట్స్ బైక్ అంటే లక్షల్లో పోయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రముఖ దిగ్గజ సంస్థలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా 125cc నుంచి 200cc లోపు బడ్జెట్ ఫ్రెండ్లీ స్పోర్ట్స్ బైక్‌లను మార్కెట్లోకి తెచ్చాయి. కేవలం 89 వేల రూపాయల నుంచే స్టైలిష్ బైక్‌లు లభిస్తున్నాయి. అవేంటో, వాటి ప్రత్యేకతలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

చిన్న ఫ్యామిలీకి చింత లేని కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎక్కువ మంది వినియోగదారులు నమ్మకంగా ఎంచుకునే హ్యాచ్‌బ్యాక్ కార్లలో టాటా టియాగో (Tata Tiago) ఒకటి. సరసమైన ధర, మంచి ఫీచర్లు, విశ్వసనీయమైన పనితీరుతో ఈ కారు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనాలనుకునే వారికి ఇది అందుబాటులో ఉండే మంచి ఎంట్రీ-లెవల్ ఎంపికగా నిలుస్తోంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా ఈ కారుకు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. వాటి ప్రకారం, 2026 ఫిబ్రవరి నెలలో Tata Motors మొత్తం 7,040 టియాగో కార్లను విక్రయించింది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఈ సంఖ్య కొంత పెరుగుదల చూపించడం విశేషం.
Advertisement

రూ.3.70 లక్షలకే కారు.. 34 కి.మీ మైలేజ్

భారత కార్ల మార్కెట్లో సంవత్సరాలుగా మంచి గుర్తింపు పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10) ఒకటి. చిన్న సైజు, తక్కువ ధర, మంచి మైలేజీ వంటి అంశాలతో ఈ కారు సాధారణ వినియోగదారుల మధ్య మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం మార్కెట్లో SUV కార్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ హ్యాచ్‌బ్యాక్ తన ప్రత్యేక స్థానం నిలబెట్టుకుంటూ స్థిరమైన అమ్మకాలను కొనసాగిస్తోంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా ఈ కారుకు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి నెలలో మారుతి సుజుకి మొత్తం 9,787 ఆల్టో K10 కార్లను వినియోగదారులకు డెలివరీ చేసింది.

లక్కీ నంబర్‌తో కొత్త హెల్మెట్

టూవీలర్ భద్రతలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిందే. అయితే హెల్మెట్ కేవలం రక్షణ కోసం మాత్రమే కాకుండా, రైడర్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే స్టైల్ స్టేట్మెంట్‌గా కూడా మారుతోంది. ఈ ఆలోచనతోనే స్టీల్‌బర్డ్ హైటెక్ ఇండియా లిమిటెడ్ (Steelbird Hi-Tech India Limited) వినియోగదారుల కోసం ప్రత్యేకమైన 'న్యూమరాలజీ సిరీస్' హెల్మెట్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సిరీస్‌లో రైడర్లు తమకు అదృష్టంగా భావించే లక్కీ నంబర్ లేదా వ్యక్తిగతంగా ఇష్టమైన ఫేవరెట్ నంబర్‌తో చెక్కబడిన హెల్మెట్‌లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. భద్రతా ప్రమాణాలను పాటిస్తూ రూపొందించిన ఈ హెల్మెట్లు, రైడింగ్ సమయంలో అవసరమైన రక్షణను అందించడమే కాకుండా ప్రత్యేకమైన స్టైల్‌ను కూడా ఇస్తాయి.

భారత్‌లో బెస్ట్ హైబ్రిడ్, CNG బైక్స్–స్కూటర్లు ఇవే

భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. రోడ్లపై చూసినా చాలా మంది ఎలక్ట్రిక్ టూ-వీలర్లను ఉపయోగిస్తున్నారని సులభంగా గమనించవచ్చు. అయితే ఇంకా చాలా మంది సాధారణ పెట్రోల్ స్కూటర్లు లేదా బైక్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని, కొన్ని కంపెనీలు హైబ్రిడ్, CNG టూ-వీలర్లను కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ వాహనాలు సాధారణ పెట్రోల్ టూ-వీలర్లతో పోలిస్తే మెరుగైన మైలేజీని అందిస్తాయి. అంతేకాకుండా ఇంధన ఖర్చు కూడా తగ్గించడంలో సహాయపడతాయి. ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి కొత్త టెక్నాలజీతో వచ్చిన కొన్ని ఆసక్తికరమైన మోడళ్లు ఉన్నాయి. ఈ కథనంలో హైబ్రిడ్, CNG పవర్‌ట్రెయిన్‌లతో వచ్చిన టూ-వీలర్ల గురించి తెలుసుకుందాం.

ప్రతి నెలా వేల మంది ఇదే కారును కొంటున్నారు!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) తయారు చేసిన విక్టోరిస్ (Victoris) క్రమంగా వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదిస్తూ అత్యంత ప్రజాదరణ పొందుతున్న మోడల్‌గా మారుతోంది. ప్రారంభంలోనే ఆకర్షణీయమైన డిజైన్‌, ఆధునిక ఫీచర్లు, విశ్వసనీయ పనితీరు కారణంగా ఈ కారు మార్కెట్‌లో మంచి స్పందన పొందింది. కాలక్రమేణా ఈ SUVపై డిమాండ్ మరింత పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా యువత, కుటుంబ వినియోగదారులు, మొదటిసారి SUV కొనుగోలు చేయాలనుకునే వారు ఈ కారును ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇటీవల విడుదలైన విక్రయ గణాంకాలు కూడా ఈ కారు పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి.
Advertisement

రూ.50 వేలలో EV స్కూటర్లు.. కి.మీకు ఒక్క రూపాయి

బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) పద్ధతి ప్రస్తుతం భారతదేశంలోని ఎలక్ట్రిక్ 2-వీలర్ మార్కెట్‌లో వేగంగా ఆదరణ పొందుతోంది. ఈ విధానంలో వాహనం కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీని పూర్తిగా కొనాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీని సేవగా ఉపయోగిస్తూ అవసరమైనప్పుడు ఛార్జ్ చేసిన బ్యాటరీని తీసుకునే విధంగా ఉంటుంది. దీంతో వాహనం ప్రారంభ ధర తక్కువగా ఉండటంతో పాటు ఛార్జింగ్ కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. ఈ కారణాల వల్ల చాలా ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీలు ఇప్పుడు BaaS మోడల్‌ను స్వీకరిస్తున్నాయి. సులభంగా చెప్పాలంటే, వాహనం బ్యాటరీ ఖాళీ అయితే దానిని తిరిగి ఇచ్చి, పూర్తిగా ఛార్జ్ చేసిన మరో బ్యాటరీని నిర్ణీత రుసుముతో పొందే విధానమే BaaS. ఈ విధానంతో అందుబాటులో ఉన్న కొన్ని టూవీలర్స్‌ను చూద్దాం.

మారుతి ఎర్టిగా పని అయిపోయినట్లేనా ?

భారతదేశంలో పెద్ద ఫ్యామిలీలకు ఎప్పుడూ మొదటి ఛాయిస్ 7-సీటర్ కార్లే. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్, పెట్రోల్ ధరలు మండుతున్న ఈ రోజుల్లో తక్కువ ధరకు వచ్చే ఎంబీవీ (MPV) కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటివరకు మారుతి సుజుకి ఎర్టిగా తిరుగులేని మహారాజుగా వెలుగొందుతోంది. అయితే, ఇప్పుడు ఎర్టిగా సామ్రాజ్యాన్ని గడగడలాడించడానికి టయోటా తన అమ్ములపొది నుంచి ఒక పవర్‌ఫుల్ అస్త్రాన్ని ప్రయోగించింది. అదే టయోటా రూమియన్ (Toyota Rumion). ఈ కారులో తాజాగా అత్యంత తక్కువ ధరకే లభించే E (ఈ) వేరియంట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్లు చూస్తుంటే, ఇకపై మారుతి కార్ల వైపు ఎవరూ చూడరేమో అనిపిస్తోంది.

రూ.5 లక్షల లోపు అదిరిపోయే టాప్ 5 కార్లు

భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక కారు కొనాలనుకున్నప్పుడు మొదట చూసేది రెండు విషయాలు. ఒకటి.. ఆ కారు ధర మన బడ్జెట్‌లో ఉందా? రెండోది.. అది లీటర్ పెట్రోల్‌కు ఎన్ని కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది? ఈ రెండు లెక్కలు సరిగ్గా కుదిరితేనే ఆ కారు ఇంటి ముందుకు వస్తుంది. 2026లో కార్ల ధరలు పెరుగుతున్నా, ఇప్పటికీ రూ.5 లక్షల లోపు బడ్జెట్‌లో అద్భుతమైన మైలేజీనిచ్చే కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం మైలేజీ మాత్రమే కాదు, ఇప్పుడు వస్తున్న బడ్జెట్ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉండటం విశేషం. మధ్యతరగతి ప్రజల కోసం రూపొందించిన టాప్ 5 కార్ల వివరాలు తెలుసుకుందాం.

బ్యాటరీ తీసి ఎక్కడైనా ఛార్జ్ చేసుకునే స్కూటర్ లాంచ్

భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటైన జెలో ఎలక్ట్రిక్ (ZELO Electric) మరో కొత్త ప్రత్యేక ఎడిషన్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో ప్రీమియం ఫీచర్లను అందించడంలో పేరుగాంచిన ఈ కంపెనీ తాజాగా నైట్+ రాణి ఎడిషన్ (Knight+ Rani Edition) అనే లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కేవలం 999 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండేలా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించారు. ప్రత్యేకంగా ఆకట్టుకునే బేబీ పింక్ కలర్ థీమ్‌తో రూపొందించిన ఈ స్కూటర్ స్టైలిష్ లుక్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Advertisement

గరీబోళ్ల బండి.. లీటర్‌తో 90 కి.మీ మైలేజ్

భారతదేశంలో మైలేజ్ ఎక్కువ ఇచ్చే బైక్ గురించి మాట్లాడితే ముందుగా చాలా మందికి గుర్తుకు వచ్చే పేరు బజాజ్ ప్లాటినా (Bajaj Platina). నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కమ్యూటర్ బైక్ ఎంతో ప్రజాదరణ పొందింది. చాలా సంవత్సరాలుగా మార్కెట్లో కొనసాగుతూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే వాహనంగా వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది. రోజువారీ ప్రయాణాల కోసం సరసమైన ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునే వారికి ప్లాటినా మంచి ఎంపికగా నిలుస్తుంది. ఉద్యోగానికి వెళ్లే వారు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల్లో పనులు చూసుకునే వారు ఇలా విభిన్న వర్గాల ప్రజలు ఈ బైక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

మార్కెట్లో టాప్ 5 సూపర్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఇవే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈవీ (EV)ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ బైక్ అనగానే కేవలం స్లోగా వెళ్లే స్కూటర్లే కాదు, ఇప్పుడు రోడ్లపై చిరుతపులిలా దూసుకెళ్లే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఓలా (Ola) నుంచి అల్ట్రావాయిలెట్ (Ultraviolette) వరకు మార్కెట్లో టాప్ స్పీడ్, అదిరిపోయే రేంజ్‌తో దూసుకుపోతున్న 5 బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ల వివరాలు తెలుసుకుందాం.

మారుతి 800తో లంబోర్గిని తయారు చేసిన మెకానిక్

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఆరిఫ్ అనే మెకానిక్ తన ప్రతిభతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. సాధారణంగా అందరికీ తెలిసిన చిన్న హ్యాచ్‌బ్యాక్ అయిన మారుతి 800 (Maruti 800) కారును ప్రపంచప్రసిద్ధ లగ్జరీ స్పోర్ట్స్ కారును పోలి ఉండేలా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా కోట్ల రూపాయల ఖరీదు చేసే సూపర్‌కార్‌లలో ఒకటైన లంబోర్గిని (Lamborghini) మాదిరిగా కనిపించేలా ఈ కారును రూపుదిద్దడంతో, అతని సృజనాత్మకతకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ దేశీ లంబోర్గిని వీడియోలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

మోస్ట్ పాపులర్ కారును అతి తక్కువ ధరకే

భారతదేశంలో సామాన్యుల కారు కలలను నిజం చేసిన మోడళ్లలో మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) ఒకటి. ఒకప్పుడు భారతీయ రోడ్లపై అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి 800 (Maruti 800)కు ప్రత్యామ్నాయంగా ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పుడు, కంపెనీ కూడా ఊహించని స్థాయిలో వినియోగదారుల ఆదరణను సొంతం చేసుకుంది. తక్కువ ధర, తక్కువ నిర్వహణ ఖర్చు, సులభమైన డ్రైవింగ్ అనుభవం కారణంగా ఈ కారు చాలా మంది మధ్యతరగతి కుటుంబాల మొదటి కారుగా మారింది. అందుకే భారతీయులు ప్రేమగా ఈ కారును "లార్డ్ ఆల్టో" అని కూడా పిలుస్తుంటారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 48 లక్షలకుపైగా ఆల్టో కార్లు అమ్ముడయ్యాయని అంచనా. ఈ గణాంకాలే ఈ కారు భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఎంత ప్రత్యేక స్థానం సంపాదించుకుందో చూపిస్తున్నాయి.
Advertisement

మనదేశంలో టాప్..విదేశాల్లో మాత్రం ప్లాప్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీ (SUV) అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు హ్యుందాయ్ క్రెటా. గత కొన్నేళ్లుగా ఈ కారు దేశీయ రహదారులపై రారాజులా ఏలుతోంది. అయితే, తాజాగా వెలువడిన విక్రయాల గణాంకాలు చూస్తుంటే క్రెటాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేంటంటే.. ఈ కారు మన దేశంలో ఎంతలా అమ్ముడవుతుందో, విదేశాల్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోతోంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఇంట్లో ఈ పులి.. బయట మాత్రం పిల్లి అన్నట్లుగా దీని పరిస్థితి తయారైంది. ఫిబ్రవరి 2026లో ఏకంగా 17,938 యూనిట్ల విక్రయాలతో దేశంలో టాప్-10 కార్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన క్రెటా, విదేశీ మార్కెట్లలో మాత్రం కేవలం 608 యూనిట్లకే పరిమితం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.