పాత కార్లను EVగా మార్చుకునే ఛాన్స్.. రూ.50 వేల ప్రోత్సాహకం!
ఆటోమొబైల్స్
- 8 month, 10 days ago
దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా శీతాకాలంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుండటంతో, ప్రజారోగ్యంపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆటోమొబైల్ రంగాన్ని కేంద్రంగా చేసుకుని ఒక కొత్త, వినూత్నమైన చర్యపై దృష్టి పెట్టింది. ప్రభుత్వం చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం, రోడ్లపై ఇప్పటికీ నడుస్తున్న పాత పెట్రోల్, డీజిల్ వాహనాలే వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఈ వాహనాలను పూర్తిగా రద్దు చేయడం వల్ల యజమానులకు ఆర్థిక భారం పడుతుందనే ఆలోచనతో, వాటికి ఒక ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదే పాత వాహనాల ఇంజిన్లను తొలగించి, వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే (రెట్రోఫిట్) విధానం.