హోండా బడ్జెట్ ఈవీ.. ఇండియా కోసం స్పెషల్!

భారతదేశ స్కూటర్ మార్కెట్‌లో ఎవరు రాజు అంటే, చాలా మందికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు హోండా (Honda). ముఖ్యంగా హోండా యాక్టివా స్కూటర్ ఈ విజయానికి ప్రధాన పునాది. గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా యాక్టివా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రతి నెలా లక్షల సంఖ్యలో యాక్టివా స్కూటర్లు విక్రయమవుతుండటమే హోండా బ్రాండ్‌కు ఉన్న నమ్మకానికి, ఆదరణకు నిదర్శనం. ఫ్యామిలీ వినియోగదారుల నుంచి యువత వరకు యాక్టివా ఒక సేఫ్ అండ్ రిలయబుల్ ఎంపికగా మారిపోయింది.

టీవీఎస్ సునామీలో కొట్టుకుపోతున్న రికార్డులు

భారతదేశపు గర్వకారణమైన స్వదేశీ టూ-వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్(TVS Motor Company) రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో కంపెనీ నమోదు చేసిన ఫలితాలు చూస్తుంటే, ఇతర దిగ్గజ సంస్థలకు కూడా చెమటలు పట్టేలా ఉన్నాయి. ఏకంగా 15.44 లక్షల వాహనాలను విక్రయించి, టీవీఎస్ తన చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఆల్ టైమ్ హై అమ్మకాలను నమోదు చేసింది.

125cc స్కూటర్ల రాజు సుజుకి.. డిసెంబర్‌లో అమ్మకాల జోరు

సుజుకి మోటార్‌సైకిల్స్ ఇండియా భారతదేశంలో స్కూటర్ విభాగంలో తనదైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, 2025 డిసెంబర్ నెలలో అద్భుతమైన అమ్మకాల ప్రదర్శనను నమోదు చేసింది. ఈ కంపెనీ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, డిసెంబర్ 2025లో సుజుకి మొత్తం 1,22,366 ద్విచక్ర వాహనాలను తయారు చేసి విక్రయించింది. ఇందులో 97,823 వాహనాలు దేశీయ మార్కెట్‌లో అమ్ముడవగా, మిగిలిన 24,543 వాహనాలు విదేశీ మార్కెట్లకు ఎగుమతి అయ్యాయి. ఈ సంఖ్యలు సుజుకి ఉత్పత్తులు దేశంలోనే కాదు, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఎంతటి డిమాండ్‌ను సంపాదించుకున్నాయో స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ఏడాది అదే నెలతో పోలిస్తే ఈ వృద్ధి మరింత విశేషంగా కనిపిస్తుంది.

కేవలం రూ. 5.99 లక్షలకే లగ్జరీ కారు

మారుతి సుజుకి నుంచి వచ్చిన ఫ్యామిలీ ఫేవరెట్ కార్ బలేనో(Maruti Baleno) మరోసారి తన విశ్వరూపాన్ని చూపించింది. 2025 డిసెంబర్‌లో ఊహించని రీతిలో అమ్మకాల్లో అగ్రస్థానానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం ఒక్క నెలలోనే వేల సంఖ్యలో కార్లు అమ్ముడవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో అలాగే ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
Advertisement

ఈ కారులో వెళితే ప్రాణాలకు ఫుల్ సేఫ్టీ

టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ (Tata Nexon)తో భారతీయ రోడ్లపై తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏలుతోంది. 2025 సంవత్సరం ఆరంభం నుంచి ముగింపు వరకు అమ్మకాల్లో నెంబర్ 1 స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్న నెక్సాన్, డిసెంబర్ 2025లో కూడా తన జోరును కొనసాగించింది. కేవలం గడిచిన ఒక్క నెలలోనే సుమారు 19,400 యూనిట్లు అమ్ముడయ్యాయంటే, ఈ కారుపై జనాలకు ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

తక్కువ ధర..బైక్ లా మైలేజీ ఇచ్చే కారు

మారుతి సుజుకి నుంచి వచ్చిన సరికొత్త ఎస్‌యూవీ విక్టోరిస్(Victoris) ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ క్వాలిటీని కోరుకునే సామాన్యుడికి ఈ కారు ఒక వరంగా మారింది. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే 70,000 కంటే ఎక్కువ బుకింగ్స్ సాధించి, మారుతి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

పెట్రోల్ ఖర్చుకు చెక్..తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు

ప్రస్తుత రోజుల్లో కారు కొనడం అనేది ఒక విలాసం మాత్రమే కాదు, అవసరం కూడా. అయితే సామాన్యుడు కారు కొనేటప్పుడు ప్రధానంగా చూసేది తక్కువ ధర, ఎక్కువ నాణ్యత, భద్రత. ఈ మూడింటి కలయికతో హోండా కార్స్ ఇండియా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. 2030 నాటికి 10 కొత్త కార్లను లాంచ్ చేస్తామని ప్రకటించిన హోండా, అందులో సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయేలా 7 ఎస్‌యూవీలను తీసుకురాబోతోంది. అమ్మకాలు తగ్గుతున్నా.. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే పట్టుదలతో హోండా ఉంది.

మారుతి ఈవీకి విదేశాల్లో పట్టాభిషేకం

మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ-విటారా(e-Vitara)తో భారత ఆటోమొబైల్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే యూరప్ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో సంచలనం సృష్టిస్తున్న ఈ కారు, అతి త్వరలో మన దేశీ రోడ్లపై కూడా సందడి చేయబోతోంది. గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్ నుంచి ఎగుమతి అవుతున్న ఈ కారు, గ్లోబల్ మార్కెట్‌లో మారుతి సత్తాను చాటిచెబుతోంది.
Advertisement

నానో రేటుకే కొత్త టాటా పంచ్

టాటా మోటార్స్ తన సంచలన మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి వదలడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే మార్కెట్లో దుమ్మురేపుతున్న పంచ్‌ను ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, అడ్వాన్సుడ్ ఫీచర్లతో జనవరి 13, 2026న అధికారికంగా విడుదల చేయబోతున్నారు. నానో రేంజ్ ధరకే ఒక గట్టి ఎస్‌యూవీని అందించాలనే లక్ష్యంతో టాటా ఈ కొత్త వెర్షన్‌ను సిద్ధం చేసింది.

ఈ కారుతో ఊర్లోకి వెళ్తే వెంటనే దిష్టి తీసుకోండి

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (maruti suzuki fronx) మొదటి చూపులోనే స్టైలిష్‌గా కనిపించే కారు. డిజైన్ విషయంలో మారుతి నుంచి వచ్చే కార్లు సాధారణంగా ప్రాక్టికల్‌గా ఉంటాయనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఫ్రాంక్స్ ఆ ఇమేజ్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసింది. స్పోర్టీ లుక్స్‌తో పాటు ప్రీమియం టచ్‌ను కలిగి ఉండటం వల్ల ఈ కారు యువతను మొదటినుంచే ఆకర్షించింది. మారుతి బ్రాండ్‌కు భారతదేశంలో ఉన్న విశాలమైన గుర్తింపు, నమ్మకం కూడా ఫ్రాంక్స్ విజయానికి పెద్దగా దోహదపడింది. మారుతి బాలెనో తరువాత, అదే బ్రాండ్ నుంచి వచ్చిన మరో ప్రీమియం కారు ఇంత స్థాయిలో డిమాండ్‌ను సొంతం చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. బాలెనో సాధించిన విజయానికి కొనసాగింపుగా, ఫ్రాంక్స్ కూడా అదే మార్గంలో ముందుకు సాగుతూ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది.

డాక్టర్లు, ఇంజనీర్లు ఎక్కువగా ఈ కారే కొంటారు

2025 సంవత్సరం ముగిసిన నేపథ్యంలో భారతదేశంలోని అన్ని ప్రధాన ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ వార్షిక అమ్మకాల గణాంకాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాయి. ఈ గణాంకాలు దేశీయ ఆటో మార్కెట్‌లోని వినియోగదారుల అభిరుచులు, ట్రెండ్స్, బ్రాండ్‌ల బలం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఒక విషయం తేటతెల్లమైంది. భారతదేశంలో అత్యధిక కార్లను విక్రయించిన సంస్థగా మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని 2025లో కూడా కొనసాగించింది. మారుతి సుజుకి విజయంలో కీలక పాత్ర పోషించిన మోడళ్లలో వ్యాగన్ ఆర్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్లో స్థిరమైన డిమాండ్‌ను కలిగి ఉన్న ఈ హ్యాచ్‌బ్యాక్, 2025 సంవత్సరంలో కూడా అదే స్థాయిలో వినియోగదారుల ఆదరణను పొందింది.

డిసెంబర్‌లో హ్యుందాయ్ ఎంత అమ్మింది? సేల్స్ రిపోర్ట్ ఇదే

దక్షిణ కొరియా వాహన తయారీ దిగ్గజం హ్యుందాయ్ (hyundai), భారత మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్‌ను సమయానికి అర్థం చేసుకుంది. ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లే అమ్మకాలలో ప్రధాన పాత్ర పోషించినా, ఆ యుగం క్రమంగా ముగింపు దశకు చేరుతోందని కంపెనీ స్పష్టంగా గ్రహించింది. వినియోగదారుల అభిరుచులు SUVల వైపు వేగంగా మారుతున్న నేపథ్యంలో, హ్యుందాయ్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుని అత్యంత లాభదాయకమైన SUV సెగ్మెంట్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఈ నిర్ణయమే కంపెనీకి ఆదాయ పరంగా బలాన్నిచ్చిన కీలక అంశంగా మారింది. డిసెంబర్ 2025 అమ్మకాల గణాంకాలు విడుదలైన తర్వాత, హ్యుందాయ్ ఆర్థిక సంవత్సరం ముగింపును ఒక మోస్తరు సంతృప్తికర నోట్‌తో ముగించగలిగినట్టు కనిపిస్తోంది.
Advertisement

25 ఏళ్ల పల్సర్ వేడుక.. రూ.7,000 వరకు లాభాలు ప్రకటించిన బజాజ్

భారతదేశంలో స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను కొత్త దిశలో నడిపించిన బ్రాండ్‌గా బజాజ్ పల్సర్‌ (Bajaj Pulsar)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు దేశీయ మార్కెట్‌లో కమ్యూటర్ బైక్‌లే ప్రధానంగా ఉన్న సమయంలో, పవర్, స్టైల్, పనితీరును కలిపిన స్పోర్టీ మోటార్‌సైకిల్‌ను సామాన్య యువతకు చేరువ చేసిన ఘనత పల్సర్‌కే దక్కుతుంది. ఆకర్షణీయమైన డిజైన్, బలమైన ఇంజిన్, దూకుడు పనితీరు కలయికతో పల్సర్ క్రమంగా యువత కలల బైక్‌గా మారింది. కాలక్రమేణా కస్టమర్ల అభిరుచులు మారుతున్నప్పటికీ, బజాజ్ పల్సర్ కూడా అదే వేగంతో తనను తాను మార్చుకుంటూ వచ్చింది. కొత్త టెక్నాలజీ, మెరుగైన ఇంజిన్ ట్యూనింగ్, ఆధునిక ఫీచర్లు, అగ్రెసివ్ డిజైన్ అప్‌డేట్స్ ఇవన్నీ పల్సర్‌ను మార్కెట్లో ఎప్పటికప్పుడు తాజాగా ఉంచాయి.

రూ.3.49 లక్షలు, 32.73 కి.మీ మైలేజ్.. మహిళలకు చాలా ఇష్టం!

ఇటీవలి కాలం వరకు భారతదేశంలో అత్యంత చౌకైన కారు అన్న బిరుదు మారుతి సుజుకి ఆల్టోకే దక్కేది. ఎన్నో సంవత్సరాల పాటు మిడిల్ క్లాస్ కుటుంబాల తొలి కారు ఆల్టోనే. అయితే కొత్త GST సంస్కరణల తర్వాత పరిస్థితి మారింది. ధరల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో, మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలోని మరో వాహనం ఆ కిరీటాన్ని తనదిగా చేసుకుంది. అది మరెవరో కాదు - మైక్రో-SUV స్టైల్‌లో వచ్చే మారుతి సుజుకి S-ప్రెస్సో. డిజైన్ పరంగా చూసుకుంటే, S-ప్రెస్సో పూర్తిగా నగర వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కారుగా కనిపిస్తుంది. చిన్న సైజ్, స్క్వేర్ డిజైన్, ఎత్తైన బాడీ స్టాన్స్ వల్ల ఇది ట్రాఫిక్‌తో నిండిపోయే నగర రోడ్లపై నడపడం చాలా సులభం.

ఇండియాలోనే అత్యధికంగా అమ్ముడైన రూ.6.26 లక్షల కారు

ప్రస్తుతం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కార్ మార్కెట్‌లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు మిడిల్ క్లాస్ కుటుంబాల మొదటి ఎంపికగా ఉన్న సెడాన్ కార్లు ఇప్పుడు క్రమంగా వెనక్కి నెట్టబడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కస్టమర్ల అభిరుచులు పూర్తిగా SUVల వైపు మళ్లడం. ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, రఫ్ రోడ్లపై మెరుగైన డ్రైవింగ్ అనుభవం, మస్క్యులర్ లుక్, అలాగే పెద్ద కారు అన్న భావన.. ఇవన్నీ SUVలను ప్రజల మనసుకు దగ్గర చేస్తున్నాయి. ఈ మారుతున్న ట్రెండ్‌ను కార్ కంపెనీలు కూడా వేగంగా గుర్తించాయి. అందుకే గత కొన్నేళ్లుగా మార్కెట్లోకి వస్తున్న కొత్త మోడళ్లలో ఎక్కువ శాతం SUVలు లేదా SUV స్టైల్ వాహనాలే. కాంపాక్ట్ SUV, మిడ్-సైజ్ SUV, ఫుల్ సైజ్ SUV అంటూ ప్రతి సెగ్మెంట్‌లో కంపెనీలు పోటీగా మోడళ్లను విడుదల చేస్తున్నాయి.

ఈ కారు కోసం 50 వేల మంది లైన్లో ఉన్నారు

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన పాపులర్ ఎస్‌యూవీ వెన్యూ(Venue)లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. భారత మార్కెట్లో వెన్యూకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ తాజాగా HX5+ అనే కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
Advertisement

మధ్యతరగతి SUV కల నిజమైంది! కొత్త కియా సెల్టోస్ పూర్తి సమాచారం

దక్షిణ కొరియా వాహన దిగ్గజం కియా కొత్త తరం సెల్టోస్‌ను (New Generation Kia Seltos) నూతన సంవత్సర సందర్బంగా భారత మార్కెట్లో పరిచయం చేసింది. ఈ SUV ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల కలను నిజం చేయబోతోంది. ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.10.99 లక్షలుగా ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.19.99 లక్షల వరకు ఉంటుంది. కియా సెల్టోస్ కొత్త డిజైన్, ఫీచర్లు, పర్ఫార్మెన్స్‌తో ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఇప్పటికే కంపెనీ రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ప్రారంభించింది. కియా ప్రణాళిక ప్రకారం, జనవరి రెండో వారంలో తొలి డెలివరీలు వినియోగదారులకు అందజేయబడతాయి. కొత్త సెల్టోస్ ధరల పొరపాటు లేకుండా ఆకర్షణీయంగా, మధ్యతరగతి వాహన ప్రేమికులకు సరైన అవకాశం అని కియా తెలిపింది. కియా కొత్త SUV మార్కెట్‌లోకి దూకుడుగా ప్రవేశించి, పోటీని సవాల్ చేస్తుందని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పేదలు కూడా కొనేంత తక్కువ ధరకే కారు

మారుతి సుజుకి ఇండియా (maruti suzuki india) దేశీయ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ తయారీ సంస్థగా నిలిచింది. సంవత్సరాలు మారుతున్నా, మార్కెట్ పరిస్థితులు ఎలాంటి మార్పులకు లోనవుతున్నా, మారుతి కార్లకు ఉండే డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి నెలా కంపెనీ అమ్మకాలు స్థిరంగా సాగుతుండటం మాత్రమే కాదు, చాలాసార్లు అంచనాలను మించి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కస్టమర్లు మారుతి బ్రాండ్‌పై ఉంచుకున్న నమ్మకమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. డిసెంబర్ 2025లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. మారుతి సుజుకి విక్రయాల్లో అనేక మోడళ్లకు మంచి ఆదరణ ఉన్నప్పటికీ, వాటిలో 'ఈకో' MPVకి ఒక ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఎవరూ ఖండించలేరు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ గల్లా పెట్టె నిండిపోతుంది

చెన్నై అంటే టక్కున గుర్తొచ్చే ఐకానిక్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). గంభీరమైన శబ్దం, క్లాసిక్ లుక్.. ఈ బైక్ అంటే భారతీయులకు ఒక ఎమోషన్. తాజాగా డిసెంబర్ 2025 నెల అమ్మకాల గణాంకాలు విడుదలయ్యాయి. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల్లో కూడా ఈ చెన్నై బైక్ కంపెనీ సంచలన వృద్ధిని నమోదు చేసింది. కేవలం ఒక్క నెలలోనే లక్షకు పైగా బైక్‌లను విక్రయించి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా యువతను ఆకర్షించే 350సీసీ సెగ్మెంట్లో ఎన్‌ఫీల్డ్ దూకుడుకు అడ్డులేకుండా పోతోంది.

ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన రతన్ టాటా కంపెనీ

టాటా మోటార్స్ (tata motors) ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ 2025 డిసెంబర్ నెలలో కూడా తన బలమైన మార్కెట్ స్థితిని స్పష్టంగా చూపించింది. ఈ నెలలో దేశీయంగా టాటా మొత్తం 50,046 ప్యాసింజర్ కార్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది. గత సంవత్సరం డిసెంబర్ 2024లో నమోదైన 44,230 యూనిట్లతో పోలిస్తే ఇది 13.1 శాతం వృద్ధిని సూచిస్తుంది. పెరుగుతున్న పోటీ మధ్య కూడా ఇలాంటి వృద్ధిని నమోదు చేయడం టాటా బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకం ఇంకా బలంగా కొనసాగుతోందని తెలియజేస్తోంది. దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతులను కూడా కలిపితే, డిసెంబర్ 2025లో టాటా మోటార్స్ మొత్తం 50,519 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన 44,289 యూనిట్లతో పోలిస్తే స్పష్టమైన పెరుగుదల.
Advertisement

ఆడి సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

లగ్జరీ కార్ల ప్రపంచంలో జర్మన్ దిగ్గజం ఆడి (Audi) తనదైన శైలిలో దూసుకుపోతోంది. 2025 సంవత్సరం ఆటోమొబైల్ రంగానికి అనేక సవాళ్లు విసిరినప్పటికీ, ఆడి ఇండియా మాత్రం పక్కా ప్లానింగ్‌తో సక్సెస్ కొట్టింది. భారీ ధరలు, మారుతున్న ప్రభుత్వ నిబంధనల మధ్య కూడా ఆడి కార్లకు ఉన్న క్రేజ్ తగ్గలేదని తాజా అమ్మకాల గణాంకాలు చెబుతున్నాయి. 2026 కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో, గతేడాది సాధించిన విజయాలు ఈ బ్రాండ్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

3.88 లక్షల కార్లు ఒక్క ఏడాదిలో..! టయోటా కిర్లోస్కర్ మోటార్ దూకుడు

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) కోసం 2025 సంవత్సరం ఒక బలమైన వృద్ధి సంవత్సరంగా నిలిచింది. కంపెనీ ఈ క్యాలెండర్ సంవత్సరాన్ని మొత్తం 3,88,801 కార్ల అమ్మకాలతో ముగించి, భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన స్థిరమైన పురోగతిని మరోసారి రుజువు చేసింది. గత ఏడాది 2024లో టయోటా 3,26,329 యూనిట్లను విక్రయించగా, 2025లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగి 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది పెరుగుతున్న మార్కెట్ పోటీ మధ్య కూడా టయోటా బ్రాండ్‌పై వినియోగదారులకు ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. డిసెంబర్ 2025 వరకు కొనసాగిన ఈ స్థిరమైన అమ్మకాల వేగం, మారుతున్న కస్టమర్ అంచనాలకు అనుగుణంగా అధిక నాణ్యత, నమ్మకత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వాహనాలను అందించడంపై టయోటా నిరంతరం పెట్టుబడి పెట్టిందని తెలియజేస్తోంది.

ఇది అరాచకం భయ్యా..నెలకు 50 వేల కార్లా ?

భారతదేశపు స్వదేశీ ఎస్‌యూవీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) 2025 ఏడాదిని ఘనమైన విజయంతో ముగించింది. ఒకప్పుడు నెలకు పది, ఇరవై వేల కార్లు అమ్మడమే గగనంగా ఉండే రోజులు పోయి, ఇప్పుడు ఏకంగా నెలకు 50 వేలకు పైగా కార్లను విక్రయిస్తూ మహీంద్రా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

మారుతి సుజుకి రికార్డ్ బ్రేక్! డిసెంబర్‌లో 1.79 లక్షల అమ్మకాలు.. 2025లో కొత్త చరిత్ర

దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకి (maruti suzuki), తాజాగా విడుదల చేసిన అమ్మకాల గణాంకాలు కంపెనీ బలమైన మార్కెట్ స్థితిని మరోసారి స్పష్టంగా చూపిస్తున్నాయి. 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన వివరాలు మాత్రమే కాకుండా, మొత్తం సంవత్సరపు పనితీరును ప్రతిబింబించేలా ఈ సంఖ్యలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే 2025 డిసెంబర్‌లో మారుతి సుజుకి అమ్మకాలలో గణనీయమైన వృద్ధి నమోదైంది. డిసెంబర్ 2024లో కంపెనీ 1,30,117 వాహనాలను విక్రయించగా, 2025 డిసెంబర్‌లో ఈ సంఖ్య 1,78,646 యూనిట్లకు చేరింది. అంటే కేవలం ఒక సంవత్సరంలోనే 48,529 అదనపు వాహనాలను విక్రయించి, 37.30 శాతం వృద్ధిని సాధించింది.
Advertisement

కొత్త ఏడాది కియా బ్లాక్ బస్టర్!

New Kia Seltos 2026 : కొత్త ఏడాది సరికొత్త ఊపుతో మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త కియా సెల్టోస్ (New Kia Seltos) భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. కియా తన కజిన్ బ్రదర్ అయిన హ్యుందాయ్ క్రెటాకు, అలాగే టాటా సియరా వంటి దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించేలా అదిరిపోయే ధరతో ఈ కారును రంగంలోకి దించింది. కేవలం రూ.10.99 లక్షల ప్రారంభ ధరతో మధ్యతరగతి ప్రజల సొంత కారు కలని కియా నిజం చేయబోతోంది.