కరెంటు కార్ల రేసులో టాటా మోటార్స్ సునామీ

భారతదేశంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ (Electric 4-Wheelers) విభాగం ప్రతి సంవత్సరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పర్యావరణ స్పృహ పెరుగుతుండటం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఈ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అయితే కొనుగోలుదారులు అధికమవుతున్నప్పటికీ ఈ రంగంలో చురుకుగా ఉన్న సంస్థల సంఖ్య ఇంకా పరిమితంగానే ఉంది.

ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ! కైగర్ నవంబర్ సేల్స్ రిపోర్ట్

ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ (renault) సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారుగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కూడా ఈ కంపెనీ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను ఏర్పరుచుకుని, వివిధ సెగ్మెంట్లలో కార్లను విజయవంతంగా విక్రయిస్తోంది. ముఖ్యంగా బడ్జెట్‌కు తగ్గ కార్లు, SUV లుక్తో వచ్చే మోడళ్లపై దృష్టి పెట్టిన రెనాల్ట్, భారత వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తన ఉత్పత్తులను నిరంతరం అప్‌డేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఆగస్టులో రెనాల్ట్ కొత్త లుక్‌తో కైగర్ (Kiger) SUVను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన ఈ మోడల్‌కు తాజా డిజైన్ అప్‌డేట్ మరింత ఆకర్షణను జోడించింది. కొత్త రూపంలో వచ్చిన రెనాల్ట్ కైగర్ SUV ప్రస్తుతం మార్కెట్‌లో మంచి ఊపు మీద ఉంది.

లక్షల డిస్కౌంట్లు ఇచ్చినా కొనేనాథుడే లేడు

కరోనా మహమ్మారి తర్వాత భారతీయుల ప్రయాణ ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. కుటుంబం అంతా కలిసి సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు 7-సీటర్, మల్టీ పర్పస్ వాహనాలకు (MPV) డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాలని భావించిన దేశీ దిగ్గజం మారుతి సుజుకి.. తన భాగస్వామ్య సంస్థ టయోటా నుంచి ఇన్నోవా హైక్రాస్‎ను అరువు తెచ్చుకుంది. దాని రూపురేఖలను స్వల్పంగా మార్చి ఇన్విక్టో(Invicto) అనే పేరుతో గతేడాది గ్రాండ్‌గా లాంచ్ చేసింది.

సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ బాగా ఊపందుకుంటోంది. ఒక సినిమా భారీ హిట్‌గా నిలిస్తే, ఆ విజయానికి ప్రధానంగా కారణమైన దర్శకుడికి హీరో లేదా నిర్మాతలు ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ ఇలాంటి సంఘటనలు వరుసగా వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు అదే ట్రెండ్ తెలుగులో కూడా మరోసారి నిజమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓజీ' (OG) సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విడుదలైనప్పటి నుంచే భారీ అంచనాల మధ్య థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాన్ని సాధించింది. యాక్షన్, స్టైల్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు తోడు, సుజీత్ తీసిన మేకింగ్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టింది.
Advertisement

కైలాక్ కొంటే ఫుల్ కిక్కు పక్కా

చెక్ రిపబ్లికన్ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda), భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్న SUV కారు కైలాక్ (Kylaq). మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి పెద్ద బ్రాండ్‌లు ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న కాంపాక్ట్ SUV విభాగంలోకి కైలాక్ ప్రవేశించినప్పటికీ, దానికి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు తక్కువ ధర, బెస్ట్ పర్పామెన్స్, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు కావడం వలన, వాహనం కొనాలనుకునే వినియోగదారులు కైలాక్‌ను ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.

ఎదురు చూపులకు ఫుల్ స్టాప్.. టాటా సియెర్రా బుకింగ్ స్టార్ట్!

టాటా మోటార్స్ (tata motors) అంటేనే భారత ఆటోమొబైల్ పరిశ్రమకు గర్వకారణం. దేశీయంగా తయారై ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థగా టాటా మోటార్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి సంస్థ నుండి వచ్చిన సియెర్రా (Sierra) SUV ఒకప్పుడు భారత మార్కెట్‌లో ఒక ఐకానిక్ మోడల్‌గా నిలిచింది. తొలిసారిగా 1991లో ప్రవేశపెట్టిన టాటా సియెర్రా, అప్పటి సంపన్న వర్గ వినియోగదారుల మనసు దోచుకుంది. ప్రత్యేకమైన డిజైన్, భారీ రోడ్ ప్రెజెన్స్ కారణంగా ఈ SUVకు అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది. అయితే మార్కెట్ పరిస్థితులు, మారుతున్న వినియోగదారుల అభిరుచులు వంటి కొన్ని కారణాల వల్ల 2003లో ఈ మోడల్ ఉత్పత్తి మరియు అమ్మకాలు నిలిచిపోయాయి.

2026లో మారుతి కార్ల జాతర

భారతదేశంలో కార్ల మార్కెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు మారుతి సుజుకి. 2026 సంవత్సరం మారుతికి అత్యంత కీలకమైనది కానుంది. ఈ ఏడాది కేవలం విక్టోరిస్ అనే ఒకే ఒక్క మోడల్‌ను తెచ్చిన మారుతి, 2026లో మాత్రం ఏకంగా నాలుగు కొత్త కార్లను మార్కెట్లోకి వదలబోతోంది. ఇందులో విశేషం ఏంటంటే.. మారుతి తన పంథాను మార్చుకుని పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తోంది. రాబోయే ఈ నాలుగు మోడళ్లలో రెండు ఎలక్ట్రిక్ కార్లు (EVలు), ఒక ఫ్లెక్స్-ఫ్యూయెల్ మోడల్ ఉండటం గమనార్హం.

రూ.4.25లక్షల తగ్గించిన కొనే వాళ్లే లేరు

నేటి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు (SUV) పెరిగిన డిమాండ్ కారణంగా మహీంద్రా (Mahindra) కంపెనీ థార్ (Thar), స్కార్పియో (Scorpio), XUV700 వంటి మోడల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే మల్టీ పర్పస్ వెహికల్ (MPV) విభాగంలో ఉన్న మహీంద్రా మరాజో (Mahindra Marazzo) మాత్రం చాలా పరిమిత అమ్మకాలతో నడుస్తోంది. దీని తక్కువ విక్రయాల కారణంగా ఈ కారు మార్కెట్ నుంచి నిలిపివేయబడుతుందనే బలమైన ఊహాగానాలు గతంలో వినిపించాయి. వాస్తవానికి ఒకసారి కంపెనీ వెబ్‌సైట్ నుంచి దీన్ని డీలిస్ట్ చేసి డిమాండ్‌ను బట్టి మళ్లీ తీసుకువచ్చింది.
Advertisement

పండుగ సీజన్ తర్వాత ఎఫెక్ట్? టైజర్ అమ్మకాలు పడిపోయాయి

టయోటా (Toyota) కంపెనీ పోర్ట్‌ఫోలియోలో మంచి గుర్తింపు సంపాదించుకున్న కార్లలో టైజర్ (Toyota Taisor) ఒకటి. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్, బడ్జెట్ సెగ్మెంట్‌లో సరైన ఫీచర్లతో ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి స్థిరమైన డిమాండ్‌ను పొందుతోంది. అయితే తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, నవంబర్ నెలలో టయోటా టైజర్ అమ్మకాల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. అక్టోబర్‌కు ముందు నెల అయిన సెప్టెంబర్‌లో టయోటా టైజర్ 4,561 యూనిట్లను విక్రయించగా, నవంబర్ నెలకు వచ్చేసరికి ఈ సంఖ్య 3,177 యూనిట్లకు తగ్గింది. అంటే కేవలం ఒక నెల వ్యవధిలోనే అమ్మకాలు దాదాపు 30 శాతం వరకు పడిపోయాయి. ఇది ఈ సెగ్మెంట్‌లో పోటీ తీవ్రతను, అలాగే వినియోగదారుల అభిరుచుల్లో వస్తున్న మార్పులను స్పష్టంగా సూచిస్తోంది.

మహీంద్రా EVకు బ్రేక్ పడిందా? XUV400 నవంబర్ సేల్స్ రిపోర్ట్

మహీంద్రా (Mahindra) ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఒకప్పుడు బలమైన గుర్తింపును సంపాదించుకున్న మోడళ్లలో XUV400 ఎలక్ట్రిక్ SUV కీలకమైనది. భారత EV మార్కెట్లో ప్రారంభ దశలోనే మంచి స్పందన పొందిన ఈ మోడల్, మధ్యతరగతి కుటుంబాలు, ఎలక్ట్రిక్ SUV వైపు అడుగులు వేయాలనుకున్న కస్టమర్లను ఆకర్షించింది. అయితే తాజాగా వెలువడిన అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ మోడల్ ప్రస్తుతం కొంత మందగమనాన్ని ఎదుర్కొంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. నవంబర్ 2025 నెలలో మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV అమ్మకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఆ నెలలో దేశవ్యాప్తంగా ఈ వాహనం కేవలం 404 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది.

రీ ఎంట్రీ ఇచ్చిన లెజెండరీ బైక్

భారతీయ మార్కెట్‌లోని ఐకానిక్ పెర్ఫార్మెన్స్ బైక్‌లలో బజాజ్ పల్సర్ 220F (Bajaj Pulsar 220F) ఒకటి. ది లెజెండ్, థ్రిల్ మెషిన్ అనే ముద్దుపేర్లతో పిలవబడే ఈ మోటార్‌సైకిల్.. పెర్ఫార్మెన్స్, స్పోర్టీ స్టైలింగ్, రోజువారీ వినియోగానికి సరైన బ్యాలెన్సును అందిస్తుంది. ప్రీమియం సెగ్మెంట్‌లోకి వెళ్లకుండానే మెరుగైన బైక్‌ను కోరుకునే వారికి ఇది మొదటి ఎంపిక.

ఒక్క కారే కంపెనీని నడిపిస్తోంది.. నిస్సాన్ మాగ్నైట్ సేల్స్ ఇవే

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజమైన నిస్సాన్ (nissan) భారతీయ మార్కెట్లో తన స్థానం మరింత బలపర్చుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఒకప్పుడు విస్తృత మోడల్ లైనప్‌తో కనిపించిన నిస్సాన్, ప్రస్తుతం మాత్రం పరిమిత ఉత్పత్తులతోనే మార్కెట్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 2025 నెలకు సంబంధించిన నిస్సాన్ మోటార్ ఇండియా అమ్మకాల గణాంకాలు తాజాగా వెలువడ్డాయి. ఆ గణాంకాల ప్రకారం, నిస్సాన్ నవంబర్ 2025లో భారతదేశంలో మొత్తం 1,908 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మొత్తం అమ్మకాలు కేవలం ఒకే ఒక్క మోడల్ నిస్సాన్ మాగ్నైట్ (Magnite) నుంచే రావడం. ప్రస్తుతం భారత మార్కెట్లో నిస్సాన్ కంపెనీకి ప్రతినిధిగా నిలుస్తున్న ఏకైక కారు ఇదే కావడం విశేషం.
Advertisement

ఇన్నోవా లాంటి కారైనా కొనే దిక్కే లేదు

హ్యుందాయ్, భారతదేశంలో మారుతి సుజుకి తర్వాత అత్యంత విశ్వసనీయమైన వాహన తయారీదారుగా ఉంది. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మోడళ్లను విడుదల చేయడంలో హ్యుందాయ్ ముందుంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన 7-సీటర్ మోడల్ హ్యుందాయ్ అల్కజార్ (Hyundai Alcazar), టయోటా ఇన్నోవా (Toyota Innova) వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వగలదు. ముఖ్యంగా ఫీచర్ల విషయంలో అల్కజార్ ఇన్నోవా కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ అల్కజార్‌కు మార్కెట్‌లో ఆశించినంత స్పందన లభించడం లేదు.

రూ.110 పెట్రోల్‌కు 90 కి.మీ మైలేజ్ బైక్! రూ.65 వేలు చాలు

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100)కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశంలో లభించే అత్యంత సరసమైన ప్యాసింజర్ మోటార్ సైకిళ్లలో ఇది ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాల కోసం బైక్ కొనాలనుకునే వినియోగదారులకు ఇది విశ్వసనీయమైన ఎంపికగా మారింది. అద్భుతమైన ఇంధన సామర్థ్యం ఈ బైక్‌కు ఉన్న ప్రధాన ఆకర్షణ. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగిన ప్లాటినా 100 అనేక మంది మనసు గెలుచుకుంది. ఈ బైక్ మరో ముఖ్యమైన ప్రత్యేకత తక్కువ నిర్వహణ ఖర్చులు. సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ ఖర్చులు కూడా సాధారణంగా అందుబాటులో ఉండటం వల్ల, దీర్ఘకాలంలో యాజమాన్య ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.

ఈ ఇంజిన్‎ను బద్దలు కొట్టడం ఎవరి వల్లా కాదు

మారుతి సుజుకీ (Maruti Suzuki) తర్వాత భారతదేశంలో అత్యంత ఇష్టపడే వాహన తయారీదారులలో టయోటా (Toyota) ఒకటి. నమ్మి కొనుగోలు చేయడానికి ఈ బ్రాండ్‌ను మించినది మరొకటి లేదు. మంచి మెయింటెనెన్స్ చేస్తే లక్షల కిలోమీటర్లు ప్రయాణించగలిగే ఇంజిన్‌లతో, మంచి బిల్డ్ క్వాలిటీతో కూడిన వాహనాలను టయోటా తయారు చేస్తుంది. ఇన్నోవా (Innova), ఫార్చ్యూనర్ (Fortuner) వంటి కార్ల కోసం జనం ఎగబడటానికి ఇదే ప్రధాన కారణం. దేశంలో పెద్దగా ప్రాచుర్యం లేని లైఫ్ స్టైల్ పికప్ ట్రక్ విభాగంలో కూడా ప్రయోగం చేయడానికి టయోటా వెనుకాడలేదు.

జనవరి లాంచ్‌కు ముందే XUV 7XO బుకింగ్‌లు ఓపెన్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటినుంచో భారీ అంచనాలు ఏర్పరుచుకున్న మహీంద్రా కొత్త SUV ఇప్పుడు కస్టమర్లకు ముందుగానే చేరువవుతోంది. మహీంద్రా తన సరికొత్త XUV 7XO SUV బుకింగ్‌లను డిసెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లో సూపర్ హిట్‌గా నిలిచిన Mahindra XUV700కి పునఃరూపకల్పనగా రూపొందించిన ఈ కొత్త SUVపై కస్టమర్లలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ XUV 7XOను కొనుగోలు చేయాలనుకునే వారు మహీంద్రా అధీకృత డీలర్‌షిప్‌లను సందర్శించడం ద్వారా లేదా కంపెనీ ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా సులభంగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం కేవలం రూ. 21,000 డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది.
Advertisement

మినిస్టర్ల కాన్వాయ్‎లో ఈ కారు ఉండాల్సిందే

దేశంలో ఎస్‌యూవీలను తయారు చేయడంలో ముందున్న మహీంద్రా కంపెనీ, త్వరలో తమ రెండు ముఖ్యమైన మోడల్స్ అయిన స్కార్పియో-ఎన్ (Scorpio-N), ఎక్స్‌యూవీ700 (XUV700) (ఇప్పుడు XUV 7XO) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆయా సెగ్మెంట్లలో పోటీ పెరిగిన నేపథ్యంలో, మహీంద్రా ఈ రెండు ఎస్‌యూవీలను కొత్త అప్‌డేట్‌లు, ఆకర్షణీయమైన ఫీచర్‌లతో మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు ఎస్‌యూవీలకు సంబంధించి రోడ్డు టెస్టింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. వాటి స్పై షాట్‌లు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త మోడల్స్‌లో ఏం ఆశించవచ్చో వివరంగా తెలుసుకుందాం.

దేశంలోనే చౌక కారును పట్టించుకునే వాళ్లు లేరు

ఒకప్పుడు భారతదేశంలో కారు కొనడానికి వెళ్లే కస్టమర్‌లు కేవలం రెండు విషయాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అవి ధర, మైలేజ్. ఈ రెండూ సరిపోతే, కారు సేల్స్‌పై పెద్దగా ప్రభావం చూపించేవి కాదు. కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. ధర, మైలేజ్‌తో పాటు, సేఫ్టీ, అడ్వాన్సుడ్ ఫీచర్లు, డిజైన్ వంటి అంశాలపై కస్టమర్‌లు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీని కారణంగా తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల అమ్మకాలు పాత రోజుల్లా లేవు. ఈ రకమైన కార్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. దీనికి మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso) చాలా మంచి ఉదాహరణ. ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.3.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ ధర కూడా కేవలం రూ.5.25 లక్షల వరకే ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ధరలు పేర్కొన్నారు. మైలేజ్ విషయానికి వస్తే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 24.12 కిలోమీటర్ల నుంచి 32.73 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది (వేరియంట్‌ను బట్టి ARAI మైలేజ్ మారుతుంది). ధర తక్కువగా ఉన్నా, మైలేజ్ ఎక్కువగా ఉన్నా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అమ్మకాలు చాలా మందకొడిగా ఉన్నాయి. దీనికి కారణాలు చాలా చిన్నవి: కారు సైజ్ చిన్నగా ఉండటం, ఇందులో పెద్దగా అడ్వాన్సుడ్ ఫీచర్లు లేకపోవడం. అయితే, అమ్మకాలు తగ్గడానికి అతిపెద్ద కారణం ఏమిటంటే ఈ కారు సేఫ్టీ లేనిదిగా భారతీయ కస్టమర్‌లు భావించడం. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులలో ఎస్-ప్రెస్సో సరిగా రాణించకపోవడంతో, కస్టమర్ల నమ్మకం తగ్గిపోయింది. ఈ సేఫ్టీ సమస్య కారణంగా, ప్రతి నెలా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అమ్మకాలు చాలా నిదానంగా ఉన్నాయి. రష్‌లేన్ (Rushlane) నివేదిక ప్రకారం.. నవంబర్ 2025లో కేవలం 1,747 మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత సంవత్సరం (నవంబర్ 2024)లో 2,283 కార్లు అమ్ముడయ్యాయి. అంటే, ఏడాదివారీ పోలికలో ఏకంగా 23.48% (536 కార్లు తక్కువగా) పడిపోయింది.

ఇండోనేషియాలో ప్రూవ్ అయిన ఎలక్ట్రిక్ SUV ఇప్పుడు భారత్‌కి?

భారత ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న సమయంలో, జపాన్ దిగ్గజం టయోటా (Toyota) కూడా ఈ సెగ్మెంట్‌లో తన అడుగులు బలంగా ముద్రించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు హైబ్రిడ్ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టిన టయోటా, ఇక భారత్‌లో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి విక్రయించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఆటో పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యూహంలో భాగంగా, టయోటా, సుజుకి మధ్య ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్య ఒప్పందం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు కంపెనీలు తమ తమ సాంకేతికతలను పరస్పరం పంచుకుంటూ, వేర్వేరు మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా వాహనాలను అభివృద్ధి చేయనున్నాయి.

మారుతికి కొత్త సూపర్ హిట్! మూడు నెలల్లోనే 30,000 సేల్స్ మార్క్

భారతదేశంలో నంబర్-1 కార్ల తయారీ సంస్థగా పేరొందిన మారుతి సుజుకి, హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లకే పరిమితం కాకుండా, ఇప్పుడు SUV విభాగంలో కూడా తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకోవాలనే లక్ష్యంతో దూసుకెళ్తోంది. భారత మార్కెట్లో SUVలకు డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సెగ్మెంట్‌ను నిర్లక్ష్యం చేయకుండా మారుతి సుజుకి వరుసగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూ తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే, మారుతి సుజుకి ఇటీవల విక్టోరిస్ (victoris) అనే సరికొత్త మిడ్-సైజ్ SUVను మార్కెట్లోకి విడుదల చేసింది. లాంచ్ సమయంలోనే ఈ SUVపై వినియోగదారుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, అలాగే మారుతి బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కలిసి విక్టోరిస్‌కు అనూహ్యమైన ప్రారంభాన్ని అందించాయి.
Advertisement

మళ్లీ కొత్తగా పురుడు పోసుకున్న ఎంజీ హెక్టార్

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా(JSW MG Motor India) ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అడుగు ముందుకేస్తూ, ఆల్‌-న్యూ ఎంజీ హెక్టర్(MG Hector)ను విడుదల చేసింది. ఈ కొత్త హెక్టర్, బోల్డ్ డిజైన్, అద్భుతమైన సౌకర్యం, మోడ్రన్ టెక్నాలజీతో వచ్చింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయించారు. ఇది టాప్ మోడల్‌కు రూ.19.49 లక్షల వరకు ఉంటుంది. హెక్టర్ ప్లస్ (Hector Plus) (6, 7-సీటర్ ఆప్షన్లు) ప్రారంభ ధర రూ.17.29 లక్షలు. కొత్త ఫేస్‌లిఫ్ట్ ద్వారా ఎంజీ హెక్టర్‌కు మరింత ఫ్రెష్ లుక్ ఇచ్చారు. కొత్త ఎంజీ హెక్టర్ ఎక్స్‌టీరియర్‌లో చాలా ముఖ్యమైన మార్పులు చేశారు. ముందు భాగంలో ఆకర్షణీయమైన ఆరా హెక్స్ గ్రిల్(Aura Hex Grille)అనే సరికొత్త హనీకాంబ్ డిజైన్ ఇచ్చారు.ఇది కారుకు మరింత దృఢమైన రూపాన్ని ఇస్తుంది. కొత్తగా రూపొందించిన బంపర్‌లు, ఆరా బోల్ట్ అలాయ్ వీల్స్ దీని లుక్‌ను మరింత స్టైలిష్‌గా మార్చాయి.

ఈ కారును పేదోళ్లు ఈజీగా సైతం కొనచ్చు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో కె10 (maruti Suzuki Alto K10) అనేది ఎన్నో ఏళ్లుగా మధ్యతరగతి ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిన్న హ్యాచ్‌బ్యాక్‌గా నిలుస్తోంది. తక్కువ ధర, విశ్వసనీయత, మెరుగైన మైలేజ్ వంటి అంశాలు ఈ కారును తొలిసారి కారు కొనుగోలు చేసే వారికి ఎప్పటికీ మొదటి ఎంపికగా మారుస్తున్నాయి. అందుకే నెలనెలా ఈ కారు అమ్మకాలు స్థిరంగా కొనసాగుతుంటాయి. నవంబర్ నెలలో కూడా ఇదే ధోరణి కొనసాగింది. గత నవంబర్‌లో మారుతి సుజుకి ఆల్టో K10 మొత్తం 10,600 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. గత ఏడాది ఇదే కాలాన్ని పరిశీలిస్తే, 2024 నవంబర్‌లో 7,467 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

జిమ్నీని చూసి కన్నీరుమున్నీరవుతున్న మారుతి

ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీల మార్కెట్‌లో మహీంద్రా థార్ (Mahindra Thar) కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి మారుతి సుజుకి భారీ అంచనాల మధ్య జిమ్నీని (Jimny) రంగంలోకి దించింది. అయితే, జిమ్నీ ధర అధికంగా ఉండటం, థార్‌తో పోలిస్తే మార్కెటింగ్ వ్యూహాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వాహనం మార్కెట్‌లో వెనుకబడింది.

దేశంలో టాప్-3లోకి దూసుకెళ్లిన క్రెటా!

భారతదేశ కార్ల మార్కెట్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. పెరుగుతున్న మధ్యతరగతి వర్గం, మెరుగవుతున్న రహదారి మౌలిక వసతులు, అలాగే కొత్త టెక్నాలజీపై వినియోగదారుల ఆసక్తి వల్ల దేశంలో వాహనాల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచంలోని అనేక ప్రముఖ కార్ బ్రాండ్లు భారత మార్కెట్లో భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు విదేశీ కంపెనీల ఆధిపత్యంలో ఉన్న భారత ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ బ్రాండ్లు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. హ్యుందాయ్, కియా వంటి అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఇదే సమయంలో రాణిస్తున్నాయి.
Advertisement

సియెర్రా ధరలు చూసి గుండెలు బాదుకుంటున్న మారుతి

టాటా మోటార్స్ నుంచి కొత్త తరం సియెర్రా (New Gen Tata Sierra SUV) మార్కెట్‌లోకి ప్రవేశించి కార్ లవర్సును ఆకట్టుకుంటోంది. పాత సియెర్రా పేరుకు తగ్గట్టే, కొత్త మోడల్ డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం, ముఖ్యంగా భద్రత (Safety) విషయంలో అద్భుతాలు సృష్టించింది. నవంబర్ 25న విడుదలైన ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ధరల విషయంలోనూ పోటీదారులకు సవాల్ విసురుతోంది. సియెర్రా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షలుగా ఉంది. టాటా సియెర్రా మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది.. స్మార్ట్ ప్లస్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్. ప్యూర్, ప్యూర్ ప్లస్ ట్రిమ్‌లు రూ. 12.99 లక్షల నుంచి, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్ ట్రిమ్‌లు రూ. 15.29 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. తాజాగా, టాటా అత్యంత ఖరీదైన మరియు ఎక్కువ ఫీచర్లు కలిగిన అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ల ధరలను కూడా ప్రకటించింది.