భారత మార్కెట్లో సిట్రోయెన్ పరిస్థితి ఇదేనా? నవంబర్ గణాంకాలు

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ (Citroën) భారత మార్కెట్లోకి అడుగుపెట్టి కొద్ది కాలమే అయినప్పటికీ, తనదైన గుర్తింపును ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తోంది. యూరోపియన్ డిజైన్, కంఫర్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చే సస్పెన్షన్ సెటప్, అలాగే ప్రాక్టికల్ ఫీచర్లతో కంపెనీ భారత వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తోంది. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా తగినంత షోరూమ్‌లు, సర్వీస్ నెట్‌వర్క్ లేకపోవడం సిట్రోయెన్ ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపధ్యంలో, కంపెనీ తాజాగా నవంబర్ నెలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. నవంబర్ 2025లో సిట్రోయెన్ మొత్తం 1,224 కార్లను మాత్రమే విక్రయించింది. అదే సమయంలో, అక్టోబర్ నెలలో 1,426 యూనిట్లు అమ్ముడవ్వడం గమనార్హం. ఈ రెండు నెలల మధ్య పోలిస్తే నవంబర్ అమ్మకాల్లో కొంత తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది.

సౌండ్ లేకుండా సేల్స్ సునామీ

టయోటా, మారుతి సుజుకి సంస్థల భాగస్వామ్యం ఫలితంగా రూపొందించబడిన టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మోడళ్లు భారతదేశంలో అత్యంత పోటీ ఉన్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఒకదానికొకటి పోటీ ఇస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, ఈ రెండు మోడళ్లు ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించడం ద్వారా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నాయి. ప్రారంభంలో మారుతి మోడల్‌కు ఎక్కువ అమ్మకాలు జరిగినా గత కొన్ని నెలలుగా టయోటా హైరైడర్ అమ్మకాలలో ఆధిక్యం కనబరిచింది. అయితే నవంబర్ 2025 నెల అమ్మకాలతో ఈ పోటీలో కథ మారింది. తాజాగా విడుదలైన నవంబర్ 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం మారుతి సుజుకి గ్రాండ్ విటారా మళ్లీ పుంజుకుని, తన ప్రత్యర్థి అయిన టయోటా హైరైడర్‌ను వెనక్కి నెట్టింది. గ్రాండ్ విటారా ఏకంగా 11,339 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే నెల (10,148 యూనిట్లు)తో పోలిస్తే ఏకంగా 12 శాతం అధిక వృద్ధిని సాధించింది.

కన్నీళ్లు పెడుతున్న C5 ఎయిర్‌క్రాస్ డీలర్లు

ప్రయాణ సౌలభ్యం విషయంలో ప్రీమియం బ్రాండ్‌లకు సైతం గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం ఉన్న కంపెనీ సిట్రోయెన్ (Citroen). ఆ బ్రాండ్‌లోని మోడల్స్‌లోకెల్లా అద్భుతమైనది C5 ఎయిర్‌క్రాస్ (Aircross). అయితే నవంబర్ నెలలో ఈ మోడల్ అమ్మకాల గణాంకాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోకుండానే సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ వెనుకబడింది.

రేసులో దూసుకుపోతున్న పంచ్

చాలా తక్కువ సమయంలోనే భారతీయ ప్రజల హృదయాలను గెలుచుకున్న టాటా కార్ మోడల్ పంచ్ (Punch). తక్కువ ధర, ఆకర్షణీయమైన డిజైన్, కుటుంబ ప్రయాణాలకు సరిపడా స్థలం, బెస్ట్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న ఈ కారును భారతీయులు కాదనలేకపోతున్నారు అనడానికి దాని అమ్మకాల రిపోర్ట్‌లే సాక్ష్యం. ఈ సంవత్సరం కొన్ని నెలల పాటు టాటా పంచ్ అమ్మకాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ, జీఎస్టీ 2.0 సంస్కరణల తర్వాత టాటా నెక్సాన్ మాదిరిగానే పంచ్ అమ్మకాలు కూడా బాగా మెరుగుపడ్డాయి. 2025 నవంబర్ నెలకు సంబంధించిన పంచ్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, గాడివాడి విడుదల చేసిన నివేదిక ప్రకారం..నవంబర్ 2025లో టాటా పంచ్ అమ్మకాలు ఏకంగా 18,753 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు 2024 నవంబర్‌లో అమ్మకాలు 15,435 యూనిట్లుగా ఉండేవి. అంటే, సంవత్సరంలో 3,318 యూనిట్లు అదనంగా విక్రయించబడ్డాయి. దీంతో వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 21 శాతం పెరిగాయి.
Advertisement

ఆల్ట్రోజ్ కొంటే ఆ డబ్బుతో డీజిల్ కొట్టించుకోవచ్చు

మారుతి సుజుకి బాలెనోకు గట్టి పోటీనిచ్చే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో కారు కొనాలని చూస్తున్న వారికి టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) ఒక అద్భుతమైన ఆప్షన్. 2025 డిసెంబర్ నెలలో టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ అన్ని వేరియంట్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ నెలలో ఆల్ట్రోజ్‌ను కొనుగోలు చేస్తే వినియోగదారులు ఏకంగా రూ.1.85 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని కంపెనీ తెలియజేసింది. ఈ అద్భుతమైన తగ్గింపు ఆఫర్‌లు, ధర, ప్రత్యేకతల గురించి వివరంగా తెలుసుకుందాం. మీ దగ్గరలోని టాటా షోరూమ్‌లో వివరాలు అడగటం మర్చిపోవద్దు. టాటా ఆల్ట్రోజ్ అన్ని వేరియంట్లపై రూ.1,00,000 కన్స్యూమర్ ఆఫర్‌తో పాటు, రూ.50,000 ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బెనిఫిట్ కూడా లభిస్తోంది. దీంతో మొత్తం ఆదా రూ.1.50 లక్షలుగా ఉంది. ఇక ఆల్ట్రోజ్ రేసర్ (Altroz Racer) మోడల్‌పై అయితే, రూ.1,35,000 కన్స్యూమర్ డిస్కౌంట్, రూ.50,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో సహా మొత్తం రూ.1.85 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. వేరియంట్‌లు, డీలర్‌షిప్‌లను బట్టి మారే అవకాశం ఉంది. టాటా ఆల్ట్రోజ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.30 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంది. డిసెంబర్ ఆఫర్లను పరిగణనలోకి తీసుకుంటే బేస్ మోడల్ స్మార్ట్ 1.2L పెట్రోల్ వేరియంట్‌ను రూ.7 లక్షల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ పెట్రోల్ ధర రూ.6.30 లక్షలు, ప్రీమియం డీజిల్ రూ.9.50 లక్షలు, ఆల్ట్రోజ్ రేసర్ రూ.9.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.

అప్డేట్ వెర్షన్ కోసం షోరూంల వద్ద జనాలు క్యూ

ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా 2025 నవంబర్ నెలలో దేశీయ, ఎగుమతి మార్కెట్లలో కలిపి మొత్తం 66,840 యూనిట్లను విక్రయించి హ్యుందాయ్ దూసుకుపోయింది. దేశీయంగా 50,340 యూనిట్లు అమ్మి 4.34% వృద్ధిని సాధించింది. ఎప్పటిలాగే క్రెటా (17,344 యూనిట్లు) తన హవా కొనసాగించగా, ఇటీవల పూర్తి అప్‌డేట్‌తో విడుదలైన కొత్త తరం వెన్యూ కూడా భారీ అమ్మకాలతో సత్తా చాటింది. లాంచ్ అయిన నెల రోజుల్లోనే 32,000 బుకింగ్‌లు సాధించిన వెన్యూ డిమాండ్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 2025లో ఏకంగా 11,645 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. గత ఏడాది (నవంబర్ 2024)లో 9,754 యూనిట్లు మాత్రమే విక్రయించింది. అంటే, ఏడాది కాలంలో 1,891 యూనిట్లు అదనంగా విక్రయించగలిగింది. దీంతో వార్షిక వృద్ధి ఏకంగా 19 శాతంగా నమోదైంది.

ఆటో ఖర్చులు ఆదా చేసుకునే ఛాన్స్

భారతదేశంలో స్కూటర్లకు, ప్రజలకు మధ్య ఉన్న అనుబంధం దశాబ్దాల నాటిది.స్కూటర్లు అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, దైనందిన జీవితంలో ఒక సౌకర్యవంతమైన భాగం. కైనటిక్ హోండా (Kinetic Honda)తో మొదలైన ఈ ప్రయాణంలో, హోండా యాక్టివా వంటి మోడల్స్ గేర్‌లెస్ స్కూటర్లను నేటి స్థాయికి తీసుకువచ్చాయి.

విజయభేరి మోగించిన మారుతి విక్టోరిస్

భారతదేశంలోని మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి రెండవసారి విడుదల చేసిన మోడల్ విక్టోరిస్(Victoris). ఈ కొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ మార్కెట్లో విడుదలైన తొలి నెల నుంచే అద్భుతమైన అమ్మకాలతో దూసుకుపోతోంది. లుక్, ఫీచర్లు, ధర విషయంలో వినియోగదారులను ఆకట్టుకున్న విక్టోరిస్‌ను కొనుగోలు చేయడానికి జనం బారులు తీరుతున్నారు.
Advertisement

డిసెంబర్‌లో బైక్ కొనడం మంచిదా?

మీరు సంవత్సరం చివరిలో కొత్త మోటార్‌సైకిల్ లేదా స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు లాభదాయకం కావచ్చు. డిసెంబర్ వచ్చేసరికి, దాదాపు అన్ని టూ-వీలర్ కంపెనీలు తమ బైక్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్‌లను ప్రకటించడం మొదలుపెడతాయి. తమ వద్ద ఉన్న పాత స్టాక్‌ను త్వరగా ఖాళీ చేయడానికి డీలర్లు ఆత్రుతగా ఉంటారు. అందుకే ఈ సమయంలో కొనుగోలుదారులకు భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. అయితే సంవత్సరపు చివరిలో బైక్ కొనడం మంచిదేనా ? దాని లాభాలు, నష్టాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

పిల్లల కోసం అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్

పెట్రోల్‌తో నడిచే వాహనాలతో పాటు, ఎలక్ట్రిక్ టూవీలర్‌లను తయారు చేయడంలో కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా హీరో మోటోకార్ప్ నిరూపించుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం విడా (Vida) అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ కింద విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మార్కెట్‌లో బాగా విజయవంతమయ్యాయి. తాజాగా హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ విభాగం అయిన విడా, పిల్లల కోసం తొలి ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. విడా డర్ట్.ఇ K3 (Vida Dirt.E K3) అనే ఈ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌ను కంపెనీ భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో EICMA మోటోషోలో ప్రదర్శించారు. ఇది డిసెంబర్ 12 నుంచి అధికారికంగా అమ్మకానికి వచ్చింది. మొదటి 300 యూనిట్లకు ఎక్స్‌షోరూమ్ ధర రూ.69,990 గా నిర్ణయించారు. అయితే, ఈ బైక్ పెద్దల కోసం కాదు కేవలం 4 నుంచి 10 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం మాత్రమే రూపొందించారు. డర్ట్.ఇ K3 బైక్ విడా కొత్త ఆఫ్-రోడ్ సబ్-బ్రాండ్ అయిన డర్ట్.ఇ (Dirt.E) కింద మొదటి ఉత్పత్తి. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పిల్లల పెరుగుదలకు అనుగుణంగా మార్చడానికి వీలుగా ఉంటుంది. కంపెనీ మూడు స్థాయిలలో (Small, Medium, High) సర్దుబాటు చేయగల సస్పెన్షన్ సెట్టింగ్‌లను అందించింది.

ఈ కారును రెండు నెలలుగా ఒక్కరు కొనలేదు

ఒకప్పుడు భారతీయ ప్రీమియం సెడాన్ విభాగంలో హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చి, మంచి ప్రజాదరణ పొందిన కారు మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz). ఈ కారు మారుతి హై లెవల్ నెక్సా (Nexa) డీలర్‌షిప్‌ల ద్వారా అమ్ముడవుతుంది.

డిసెంబర్ 15నుంచి మహీంద్రా కొత్త కార్ బుకింగ్స్

భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌లో ఆధిపత్యం కోసం టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ మధ్యకాలంలో టాటా మోటార్స్ తన ఐకానిక్ సియెర్రా (Tata Sierra) ఎస్‌యూవీకి పునర్జన్మ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టాటాకు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్న మహీంద్రా, తమ అత్యంత ప్రజాదరణ పొందిన XUV700 ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కొత్త పేరుతో విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది. XUV300 ని XUV 3XO గా మార్చినట్లుగానే, XUV700 ఫేస్‌లిఫ్ట్‌ను ఇకపై XUV 7XO అనే పేరుతో పిలవనున్నారు.
Advertisement

.33 కి.మీ మైలేజ్ ఇస్తున్నా పట్టించుకోవడమే లేదు

సాధారణంగా ఎంట్రీ-లెవల్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి మారుతీ సుజుకి (Maruti Suzuki) ఎల్లప్పుడూ మొదటి ఆప్షన్‌గా ఉంటుంది. అయితే, ప్రస్తుతం బ్రాండ్‌లోని చిన్న మోడళ్లపై ప్రజల ఆసక్తి తగ్గుతోందా అనే సందేహం కలుగుతోంది. ముఖ్యంగా మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో (S-Presso) నవంబర్ నెల అమ్మకాల గణాంకాలు చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతోంది. ఎస్-ప్రెస్సో ఒక పర్ఫెక్ట్ సిటీ కారు. కాంపాక్ట్ డిజైన్, ఎత్తైన సీటింగ్ పొజిషన్ కారణంగా సిటీ ట్రాఫిక్‌లో దీన్ని నడపడం చాలా సులువు.

.33కిమీ మైలేజ్‎తో మిడిల్ క్లాస్ కారు

భారతదేశంలో ప్రస్తుతం ఎస్‌యూవీ (SUV) కార్లదే ఆధిపత్యం కనిపిస్తుంది. అయినప్పటికీ వాటి మధ్యలో ఒక సెడాన్ మోడల్ అమ్మకాలు ఊహించని విధంగా పెరగడం వాహన మార్కెట్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ కారు మరేదో కాదు, క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న మారుతీ సుజుకి (Maruti Suzuki) మొట్టమొదటి కారు డిజైర్ (Dzire).

కేవలం రూ.5.76లక్షలకే పెద్ద కారు

ప్రస్తుతం ప్రముఖ జపనీస్ వాహన తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) భారతీయ మార్కెట్‌లో కేవలం మాగ్నైట్, ఎక్స్-ట్రైల్ (X-Trail) అనే రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. ఇందులో ఎక్స్-ట్రైల్‌కు నామమాత్రపు అమ్మకాలు మాత్రమే లభిస్తున్నందున, మాగ్నైట్ మాత్రమే నిస్సాన్ ఇండియాకు ప్రధాన ఆధారం. ఈ నేపథ్యంలో నిస్సాన్ తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని నిర్ణయించుకుంది. భారతదేశం కోసం ఒక సరికొత్త కాంపాక్ట్ ఎంపీవీ ని విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీని లాంచ్ తేదీ డిసెంబర్ 18, 2025 గా నిర్ణయించబడింది.

తెలంగాణకు భారీ గుడ్‌న్యూస్

తెలంగాణ రాష్ట్రానికి వియత్నాంకు చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థ విన్‌గ్రూప్ (Vingroup) ఒక భారీ శుభవార్త అందించింది. ఈ సంస్థ తెలంగాణలో ఏకంగా 3 బిలియన్ యుఎస్ డాలర్లు (సుమారు రూ.26,952 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో విన్‌గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక కీలకమైన ఒప్పందం పై సంతకం చేసింది. ఈ భారీ పెట్టుబడి రాష్ట్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధికి, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు పెద్ద బూస్ట్‌గా నిలవనుంది.
Advertisement

KTM కొత్త రాక్షసుడు వచ్చేస్తున్నాడు

ప్రపంచంలో ది బెస్ట్ పర్ఫామెన్స్ బైక్స్ తయారు చేయడంలో కేటీఎం సంస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే ఈ బ్రాండ్ నుంచి వచ్చిన 1390 సూపర్‌ డ్యూక్ R మోడల్ హై పర్ఫార్మెన్స్‌తో రైడర్‌లను ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ పవర్, మెరుగైన ప్రదర్శనను ఇచ్చే ఒక లిమిటెడ్ ఎడిషన్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది.

లక్షల మంది డ్రైవర్ల కడుపు నింపుతున్న కారు

భారతదేశంలో ఎక్కువ మంది కొనుగోలు చేసే మల్టీ పర్పస్ వాహనాల (MPV) జాబితాలో మారుతి సుజుకి ఎర్టిగా మొదటి స్థానంలో ఉంది. ఈ కారుకు ఇంతటి విశ్వసనీయత దక్కడానికి కారణం... ఇది ఇచ్చే సౌకర్యం, సరసమైన ధర, అద్భుతమైన మైలేజీ, ప్రాక్టికాలిటీ. నగరంలో చిన్న ప్రయాణాల నుంచి సుదూర హైవే ప్రయాణాల వరకు ఎర్టిగా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

పాత హార్లే జీన్స్‌తో కొత్త హార్లే

Harley-Davidson X440 T review: Find out how it performs on the road. Read about its design, specifications, driving experience, and more. | హార్లే-డేవిడ్‌సన్ X440 T రివ్యూ: ఇది రహదారిపై ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. దీని డిజైన్, స్పెసిఫికేషన్‌లు, డ్రైవింగ్ అనుభవం మరియు మరిన్నింటి గురించి చదవండి.

మార్కెట్లోకి నయా బాస్ ఎంట్రీ

మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో దుమ్మురేపిన కియా సెల్టోస్ (Kia Seltos) సెకండ్ జనరేషన్ మోడల్ భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ కొత్త మోడల్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు రూ.25,000 టోకెన్ మొత్తంతో నేటి నుంచే బుక్ చేసుకోవచ్చు. మీరు కియా అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్‌లలో ఆన్‌లైన్‌లో ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
Advertisement

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‎లో టాటా సియోరా

టాటా మోటార్స్ ఇటీవల భారతీయ మార్కెట్‌లో విడుదల చేసిన సియెరా ఎస్‌యూవీ ఇప్పటికే పెద్ద సంచలనం సృష్టిస్తోంది. అసలైన సియెరా లక్షణాలను నిలుపుకుంటూ, కొత్త కాలానికి అనుగుణంగా హైటెక్ ఎస్‌యూవీగా వచ్చిన ఈ కారు, తొలి ప్రయాణంలోనే ఒక చారిత్రక ఘనతను సాధించింది.

ఈ ఆఫర్ మళ్లీ జన్మలో రాదు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలకు ప్రాచుర్యం కల్పించడంలో మారుతి సుజుకి, టయోటా భాగస్వామ్యం కీలకంగా నిలిచింది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా వచ్చిన గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మోడల్స్, మార్కెట్‌లో క్రెటా ఆధిపత్యాన్ని సవాలు చేయడంలో విజయవంతమయ్యాయి. ఈ రెండు మోడల్స్ అతి తక్కువ సమయంలోనే 3 లక్షలకు పైగా అమ్మకాలు జరిపి, తమ సత్తాను చాటుకున్నాయి. మొదట్లో గ్రాండ్ విటారా అమ్మకాలు జోరుగా ఉన్నప్పటికీ, ఇటీవల టయోటా హైరైడర్ కొంచెం మెరుగైన అమ్మకాలు సాధిస్తోంది. దీంతో దేశంలోనే అతిపెద్ద తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, తమ అమ్మకాలను పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉన్న స్టాక్‌లను క్లియర్ చేయడానికి, గ్రాండ్ విటారాపై భారీ ఇయర్-ఎండ్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా, గ్రాండ్ విటారా ఎస్‌యూవీని కొనుగోలుదారులు ఏకంగా రూ.2.40 లక్షల వరకు ప్రయోజనాలతో సొంతం చేసుకోవచ్చు. ఇందులో నగదు తగ్గింపులతో పాటు, ఆప్షనల్ ఎక్స్‌టెండెడ్ వారంటీ కవరేజ్ కూడా ఉంటుంది. అయితే మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి, ముఖ్యంగా హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లను బట్టి ఈ తగ్గింపు ఆఫర్‌లో మార్పులు ఉంటాయి. 2022లో విడుదలైన ఈ గ్రాండ్ విటారా, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్‌కు ఉపయోగపడే హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), కారు చుట్టూ చూడటానికి 360 డిగ్రీ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ డాక్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. గ్రాండ్ విటారా రెండు ప్రధాన ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ వేరియంట్ 102 బీహెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. 19.38 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీనికి మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది.

కేవలం రూ.5.79లక్షలకే 33కిమీ మైలేజ్

కొత్త కారు కొనాలనుకునే ప్రతి ఒక్కరూ ఎక్కువ మైలేజ్, తక్కువ ధర, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్న మోడల్ కోసం చూస్తారు. అన్ని అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోవడం కష్టం. కొన్ని కార్లు మంచి మైలేజ్ ఇస్తే ధర ఎక్కువగా ఉంటుంది. కొన్ని మంచి లుక్, పర్ఫార్మెన్స్ ఉన్నా వాటిని భరించడం కష్టంగా ఉంటుంది.

కేవలం 2నిమిషాల్లోనే బ్యాటరీ ఛేంజ్

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం రూ.106 పెట్టి లీటరు పెట్రోల్ కొడితే, పెట్రోల్ స్కూటర్ గరిష్టంగా 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కానీ ఈవీ అయితే, ఫుల్ ఛార్జ్‌పై 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వడంతో పాటు, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసుకునే అలవాటు ఉన్నట్లే, ఈవీని కూడా అలవాటు చేసుకుంటే ఇది చాలా లాభదాయకం.
Advertisement

2026లో మార్కెట్ మొత్తం సెల్టోస్ దే

భారతీయ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన కియా సెల్టోస్ (Kia Seltos), ఇప్పుడు పూర్తిగా కొత్త జనరేషన్ (2026 మోడల్) అవతార్‌లో విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో ఈ కొత్త ఎస్‌యూవీని ఆవిష్కరించారు. ఈ కొత్త మోడల్ చూడటానికి చాలా బాగుండటమే కాకుండా అనేక అప్‎డేటెడ్ లగ్జరీ ఫీచర్లతో నింపేసింది.