గోవా బీచ్ వైబ్స్‌తో Tvs కొత్త బైక్ అడుగుపెట్టింది

టీవీఎస్ మోటార్ (tvs motor) కంపెనీ ప్రతి ఏడాది మోటార్‌సైకిల్ ప్రేమికుల కోసం నిర్వహించే ప్రత్యేక వేడుక 'టీవీఎస్ మోటోసౌల్'. ఈ వేడుక ఇప్పటికే బైక్ కల్చర్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఈసారి ఐదవ వార్షికోత్సవ వేడుకలో టీవీఎస్ అందరి చూపులను తన వైపు తిప్పుకునేలా ఒక ప్రత్యేక మోడల్‌ను ఆవిష్కరించింది, అదే టీవీఎస్ రోనిన్ అగోండా (tvs ronin agonda). ఇది కేవలం ఒక కొత్త ఎడిషన్ కాదు, రోనిన్ బ్రాండ్ కథను మరింత లోతుగా చెబుతూ, డిజైన్‌లో కస్టమ్-కల్చర్ ఆత్మను ప్రతిబింబించేలా రూపొందించిన లిమిటెడ్-ఎడిషన్ వెర్షన్. ముందుగా ధర విషయానికి వస్తే, టీవీఎస్ రోనిన్ అగోండా రూ.1,30,990 (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదలైంది.

సియెర్రా కం బ్యాక్! ఏ వేరియంట్‌ ఎంత? పూర్తి వివరాలు ఇక్కడే

టాటా మోటార్స్ (Tata Motors) ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరిగి తెచ్చిన సియెర్రా (Sierra) ఇప్పుడు భారత మార్కెట్లో కొత్త ఊపును రాబట్టే మోడల్‌గా నిలుస్తోంది. నవంబర్ 26, 2025న అధికారికంగా లాంచ్ చేసిన ఈ కాంపాక్ట్ SUV, కేవలం పేరు మాత్రమే కాదు.. అదే వారసత్వాన్ని కొత్త డిజైన్, ఆధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో మరో దశకు తీసుకెళ్లిన మోడల్‌గా అందరినీ ఆకర్షిస్తోంది. ప్రారంభ ధరను రూ.11.49 లక్షలుగానే నిర్దేశించినప్పటికీ, ఇప్పుడు టాటా సియెర్రా మిగతా వేరియంట్‌ల ధరలను కూడా కంపెనీ వెల్లడించింది. సియెర్రా మొత్తం 7 వేరియంట్‌లలో స్మార్ట్+, ప్యూర్, ప్యూర్+, అడ్వెంచర్, అడ్వెంచర్+, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్+ లలో లభిస్తుంది. ఈ వేరియంట్‌లను చూస్తేనే టాటా ఈ మోడల్‌ను విభిన్న రకాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇన్నోవాను ఎదుర్కొనే మొనగాడు వచ్చేశాడు

భారతీయ కస్టమర్లలో భారీ అంచనాలను పెంచిన మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్ (Mahindra XEV 9S) కారు ఇటీవల అధికారికంగా మార్కెట్‌లో విడుదలైంది. ఇది 7-సీటర్ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (7 Seater Electric SUV) రకానికి చెందినది. ఈ కారులో మూడు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. అవి 59 kWh, 70 kWh, 79 kWh.

మీ దగ్గర KTM ఆ మోడల్ బైక్ ఉందా ?

ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ కేటీఎం (KTM) తన అంతర్జాతీయ వెబ్‌సైట్‌లో విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా, తమ 390 సిరీస్‌లోని పలు మోడళ్లను రీకాల్ (వెనక్కి తీసుకోవడం) చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రీకాల్‌కు ప్రధాన కారణం.. కొన్ని బైక్‌లలో ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోయే (Stalling) సమస్య తలెత్తడం.
Advertisement

బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో కిల్లింగ్ ఫీచర్లు

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మరోసారి సీక్రెట్‎గా టెస్టింగ్ చేస్తుండగా కెమెరా కళ్లకు చిక్కింది. ఈసారి బ్రెజ్జాను మనాలి సమీపంలో మారుతి జిమ్నీతో పాటు పరీక్షించడం జరిగింది. ఈ తాజా టెస్టింగ్ సమయంలో వెల్లడైన కొత్త వివరాలు, రాబోయే 2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్, ఫీచర్ల పరంగా పెద్ద ఎత్తున మార్పులు జరగబోతున్నాయని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఈ భారీ అప్‌డేట్ కారును దాని ప్రత్యర్థులైన టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు మరింత గట్టి పోటీ ఇచ్చేలా చేయనుంది.

ఇది వచ్చిన దగ్గర్నుంచి టాటాకు టెన్షన్ పట్టుకుంది

భారతీయ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన, తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లలో ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV) ఒకటిగా నిలుస్తోంది. దీని సరసమైన ధర కారణంగా, ఇది ప్రతి నెల మంచి అమ్మకాల సంఖ్యను నమోదు చేస్తోంది. అయితే, అక్టోబర్ 2025 నెల సేల్స్ రిపోర్ట్ ప్రకారం, సెప్టెంబర్‌తో పోలిస్తే అమ్మకాలు కొద్దిగా తగ్గాయి.

స్కోడా దెబ్బకు కంపెనీలన్నీ సోడా తాగాల్సిందే

భారతీయ మార్కెట్‌లోని మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో స్కోడా కుషాక్ (Skoda Kushaq) ఒకటి. 2021లో తొలిసారిగా విడుదలైన ఈ కారు ఇప్పుడు కొత్త రూపంలో రాబోతోంది. స్కోడా సంస్థ కుషాక్ కారు ఫేస్‌లిఫ్ట్ (Facelift) మోడల్‌ను భారత రోడ్లపై ఇప్పటికే అనేకసార్లు టెస్టింగ్ చేసింది.

ఈ కార్లు ఎక్కినే పూనకాలు రావాల్సిందే

భారతీయ వాహన మార్కెట్‌లో ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది సబ్-4 మీటర్ ఎస్‌యూవీలే. రాబోయే రెండు సంవత్సరాలలో ఈ సెగ్మెంట్‌లో పదుల సంఖ్యలో కొత్త మోడల్స్ రాబోతున్నాయి. ఇప్పటికే మంచి అమ్మకాలు ఉన్న ఈ విభాగంలో అన్ని ప్రధాన కంపెనీలు (టాటా, హ్యుందాయ్, మారుతి, హోండా, ఫోక్స్‌వ్యాగన్) మరింత స్టైల్, సేఫ్టీ, ఫీచర్లతో కూడిన కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త కార్ల రాకతో 2026-27 కాలంలో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగం మరింత కొత్త శిఖరాలను చేరుకోవడం ఖాయం.
Advertisement

సామాన్యుల కారుపై మారుతి భారీ డిస్కౌంట్

మారుతి సుజుకి ఇగ్నిస్ (maruti suzuki ignis)... చిన్నదైనా చిట్టచివరి వరకు పెద్ద మనసు చూపించే కారు. భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు మంచి గుర్తింపే కాదు, ప్రత్యేకమైన అభిమాన వర్గం కూడా ఏర్పడింది. చిన్న సైజ్, స్టైలిష్ లుక్స్, బలమైన బిల్డ్, విశ్వసనీయమైన ఇంజిన్.. ఇన్ని అంశాలు ఉండటమే కాకుండా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు సైతం సులభంగా కొనగలిగేటట్లు అందుబాటు ధరలో లభించడం ఇగ్నిస్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. నగర రోడ్లలో, ట్రాఫిక్‌లో, చిన్న చిన్న ప్రయాణాల్లో ఇగ్నిస్ ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ, స్మూత్ డ్రైవింగ్ అనుభవం చాలా మందిని ఆకట్టుకుంటుంది. కాబట్టే ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ ప్రతి నెలా ఒక స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతుంది.

బలానికి, అందానికి కొత్త డెఫినిషన్.. ఇదే కొత్త Pulsar N160

బజాజ్ మరోసారి స్పోర్టీ బైక్ ప్రేమికులను ఆకట్టుకునేలా తన 160 సీసీ సెగ్మెంట్‌ను విస్తరించింది. పల్సర్ సిరీస్‌కి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లు తీసుకొస్తున్న ఈ బ్రాండ్, ఇప్పుడు Pulsar N160కి కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే N160 తన పవర్‌, పర్ఫార్మెన్స్‌, రైడింగ్ కంఫర్ట్‌తో యువతలో మంచి క్రేజ్‌ని సంపాదించగా, ఈసారి తీసుకొచ్చిన కొత్త మోడల్ ఆ అట్రాక్షన్‌ను ఇంకా పెంచేసేలా ఉంది. ఈ కొత్త వేరియంట్‌లో ప్రధాన హైలైట్‌గా ఉండేది అప్‌సైడ్-డౌన్ (USD) ఫోర్క్. ముందు భాగంలో తలక్రిందులుగా అమర్చిన ఈ సస్పెన్షన్ సిస్టమ్ బైక్‌కు స్పోర్టీ లుక్‌ని మాత్రమే కాకుండా, స్టీరింగ్‌ స్టాబిలిటీ, హ్యాండ్లింగ్‌, బ్రేకింగ్ పరంగా కూడా మెరుగైన కంట్రోల్‌ను అందిస్తుంది.

మీ బడ్జెట్‌కు బాస్ SUV ఇదే! కొత్త XUV 3XO పర్ఫెక్ట్ ఆప్షన్

మహీంద్రా XUV 3XO పేరు వినగానే యువత నుంచి కుటుంబాల వరకు అందరికీ ఒక స్పెషల్ కనెక్ట్. ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచే కొత్త రూపం, కొత్త రేంజ్, కొత్త టెక్నాలజీతో SUV సెగ్మెంట్‌లో పెద్ద సంచలనంగా మారింది. బయటకు చూస్తేనే అగ్రెసివ్ స్టాన్స్, షార్ప్ లైన్స్, డైనమిక్ డిజైన్‌.. ఇతర కార్లతో పోలిస్తే దీన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. లుక్‌ని చూసిన వెంటనే ఇదే నా కార్ అనిపించేలా ఉంటుంది. అందుకే మీరు కొత్త కారు కొనాలని భావిస్తే... చూడటానికి స్టైలిష్‌గా, నడపడానికి పవర్‌ఫుల్‌గా, లోపల కంఫర్టబుల్‌గా, సేఫ్టీలో నంబర్ వన్‌గా ఉండే కారు కావాలంటే Mahindra XUV 3XO బెస్ట్ ఛాయిస్ అవుతుంది. చిన్న కుటుంబానికి సరిపోయేలా, పెద్ద ప్రయాణాలకు సౌకర్యంగా ఉంటుంది. దీని గురించిన ఇతర వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

టయోటా దెబ్బకు మార్కెట్ దిమ్మతిరిగింది

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో హైబ్రిడ్ కార్ల సెగ్మెంట్ చాలా బలంగా వృద్ధి చెందుతోంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అధిక మైలేజీని అందించే ఈ హైబ్రిడ్ కార్ల అమ్మకాలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. హైబ్రిడ్ కార్లు కొందరికి బడ్జెట్‌ను మించిన ధరలో ఉన్నప్పటికీ మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వంటి టెక్నాలజీలను వాహన తయారీ సంస్థలు అందిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరం (FY2025)లో దేశంలో జరిగిన హైబ్రిడ్ కార్ల అమ్మకాల వివరాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇది ఈ కార్ల పట్ల వినియోగదారులు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో తెలియజేస్తోంది.
Advertisement

మధ్యతరగతి కలల బైక్‌లు ఇవే… తక్కువ ధరలో టాప్ మైలేజ్!

రోజువారీ ప్రయాణాలకు సరిపడే కొత్త మోటార్‌సైకిల్ కోసం చూస్తున్నారా? అయితే భారత మార్కెట్లో 100cc సెగ్మెంట్ ఇప్పటికీ అత్యంత పాపులర్‌గా కొనసాగుతోంది. కారణం చాలా సింపుల్.. సరసమైన ధర, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అలాగే అద్భుతమైన మైలేజీ. ప్రతిరోజూ ఆఫీస్‌కు, స్కూల్ రన్స్‌కు, లేదా చిన్న చిన్న పనులకు వెళ్లేవారికి ఈ బైక్‌లు నిజంగా బెస్ట్ చాయిస్‌గా మారాయి. ఈ కేటగిరీలో ప్రస్తుతం ఎక్కువగా కొనుగోలు అవుతున్న మోడళ్లలో బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్ 100, హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో HF డీలక్స్ అనే నాలుగు బైక్‌లు ముందంజలో ఉన్నాయి. ప్రతీ మోడల్‌కి తనదైన ప్రత్యేకత ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. తక్కువ ధరకే మంచి మైలేజ్, డైలీ యూజ్‌కు సరిపోయే పనితీరు ఇవన్నీ కలిసి వీటికి మాస్ మార్కెట్లో గట్టి క్రేజ్‌ని తీసుకొచ్చాయి. వీటి గురించిన వివరాలు ఈ కింది కథనంలో..

జిప్సీలా మాయం కాకుండా మారుతి మెగా ప్లాన్

2025 సెప్టెంబర్‌లో కొత్త జీఎస్‌టీ 2.0 సంస్కరణలు అమలు చేసిన తర్వాత, మారుతి సుజుకి కార్లు మరింత తక్కువ ధరలలో లభిస్తున్నాయి. దీనికి తోడు పండుగ సీజన్, ఇయర్ ఎండ్ ఆఫర్లలో భాగంగా కంపెనీ తమ కార్లపై భారీ తగ్గింపులను ప్రకటిస్తోంది. ఈ డిసెంబర్ 2025 నెలలో మారుతి సుజుకి తమ ప్రీమియం నెక్సా డీలర్‌షిప్ ద్వారా విక్రయించే ప్రముఖ మోడళ్లలో ముఖ్యంగా మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్ పై ఆకర్షణీయమైన తగ్గింపులు అందిస్తోంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలలో ఒకటైన జిమ్నీపై ఈ డిసెంబర్‌లో ఏకంగా రూ.లక్ష వరకు గరిష్ట ప్రయోజనాలు లభిస్తున్నాయి.

గాలిలో ఎగిరే కైట్‌లా నడుస్తుందట ఈ కొత్త కారు

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ దిగ్గజం నిస్సాన్ (Nissan), దశాబ్దాలుగా గ్లోబల్ మార్కెట్‌లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. నాణ్యత, పనితీరు, భద్రత అనే మూడు మూల సూత్రాలపై నమ్మకంగా ముందుకు సాగుతున్న ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ దేశాల్లో అనేక మోడళ్లను విజయవంతంగా విక్రయిస్తోంది. భారతదేశంలో కూడా నిస్సాన్ బ్రాండ్‌కు గణనీయమైన అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కంపెనీ చేసిన ఓ భారీ ప్రకటన ఆటోమొబైల్ ప్రపంచంలో భారీ చర్చను రేపుతోంది. బ్రెజిల్‌లోని సావో పాలోలో నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మక గ్లోబల్ ఈవెంట్‌లో, నిస్సాన్ తన సరికొత్త SUV కైట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ విభిన్న డిజైన్‌తో, ఆధునిక సాంకేతికతలతో, భవిష్యత్‌ తరానికి అనువైన సౌకర్యాలతో రూపొందించిన SUV, కంపెనీ నెక్స్ట్-జెనరేషన్ వాహనాల దిశగా తీసుకున్న కీలక అడుగుల్లో ఒకటిగా నిలిచింది.

పేదల కొత్త కారు నెరవేర్చేలా మారుతి మెగా ప్లాన్

ఒకప్పుడు భారతీయ మార్కెట్‌లో అత్యంత చౌకగా లభించే, అధిక మైలేజీని అందించే కార్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో వినియోగదారులు ఆ అత్యంత చౌకైన ఎంట్రీ-లెవల్ కార్లపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం భారతీయులు మైలేజీ కంటే కూడా ప్రీమియం ఫీచర్లతో కూడిన ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఒకప్పుడు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లుగా నిలిచిన కొన్ని మోడళ్ల అమ్మకాలు ఇప్పుడు మందగిస్తున్నాయి. వాటిలో మారుతి సుజుకి ఆల్టో K10 ఒకటి. 25 ఏళ్లుగా భారత మార్కెట్‌లో ఉన్న ఆల్టో, ఇప్పటికీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు చేస్తూ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.
Advertisement

క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చూడండి! న్యూ వెన్యూకి బంపర్ రెస్పాన్స్

హ్యూందాయ్ (Hyundai) భారత మార్కెట్‌ను మరింతగా ఆకర్షించేందుకు గత నెలలోనే తన కొత్త తరం వెన్యూ ఎస్‌యూవీ(Venue Suv)ని అధికారికంగా విడుదల చేసింది. విడుదలైన నిమిషం నుంచే ఈ మోడల్‌పై వచ్చిన స్పందన కంపెనీ అంచనాలను మించి వెళ్లింది. ఎందుకంటే హ్యూందాయ్ వెన్యూ దేశీయ మార్కెట్లో ఇప్పటికే బెస్ట్‌సెల్లర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న SUV. ఇప్పుడు దీని కొత్త తరం మోడల్ రావడంతో కస్టమర్లలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త వెన్యూ మార్కెట్లోకి అడుగుపెట్టిన కొన్ని వారాల్లోనే 32,000కు పైగా బుకింగ్‌లు అందుకుంది. ఈ సంఖ్య ఒక్కటే వినియోగదారుల్లో ఈ కారుపై ఉన్న నమ్మకం, ఆసక్తి ఎంత ఎక్కువదో చెప్పడానికి సరిపోతుంది. ముఖ్యంగా, యంగ్ కస్టమర్లు, కుటుంబ కార్ కొనుగోలుదారులు ఈ SUV వైపు పెద్దఎత్తున మొగ్గు చూపుతున్నారు.

డిసెంబర్లో కేక పుట్టించే కిర్రాక్ బైక్స్ రాబోతున్నాయ్

2025 డిసెంబర్ నెల భారతీయ టూ వీలర్ లవర్స్‎కు సంవత్సరాంతపు గొప్ప బహుమతితో రాబోతోంది. కొంతకాలంగా టెస్టింగ్ దశలో కనిపించిన స్పై షాట్‌లు, నిరంతరంగా బయటపడిన అప్‌డేట్‌లు టూ వీలర్ లవర్లలో భారీ ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పుడు ఆ స్కూటర్లు, బైకుల్లో కొన్ని అధికారికంగా మార్కెట్లోకి విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త మోడళ్లు BMW, సుజుకి, బజాజ్, FB మొండియాల్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుండి రాబోతున్నాయి. ఈ మోడళ్లన్నీ అన్ని రకాల రైడర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడ్డాయి.

మార్కెట్లో వీటి ఆధిపత్యం పెరిగింది భయ్యా

భారతదేశంలో హైబ్రిడ్ కార్ల సెగ్మెంట్ అనూహ్యంగా వేగం పుంజుకుంటోంది. ఇంధన ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రోజువారీ ఉపయోగం, సుదూర ప్రయాణాల కోసం వాహనాలు నడపడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఈ కారణంగానే గత కొన్నేళ్లుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీని అందించే స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు సాధారణ వినియోగదారులకు కూడా ప్రియంగా మారాయి.

కొత్త RX 350h ఎక్స్‌క్విజిట్ ఇండియాలో లాంచ్

లగ్జరీ వాహనాలకు పేరుగాంచిన లెక్సస్ (lexus), భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. RX సిరీస్‌లో భాగంగా RX 350h Exquisite అనే కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. తన విలాసవంతమైన డిజైన్, నాణ్యత గల మెటీరియల్స్, అత్యాధునిక టెక్నాలజీతో ఈ కారు ప్రీమియం SUV సెగ్మెంట్‌లో వినియోగదారులకు కొత్త ఎంపికను అందిస్తుంది. లెక్సస్ ఎప్పుడూ తన కార్లలో ఫీచర్ రిచ్ క్వాలిటీ, క్లాసీ ఇంటీరియర్, నిశ్శబ్ద రిఫైన్డ్ డ్రైవ్‌కు ప్రసిద్ధి. అదే ధోరణిని కొనసాగిస్తూ ఈసారి మరింత అందుబాటు ధరలో ఒక లగ్జరీ వెర్షన్‌ను తీసుకువచ్చింది. కొత్త RX 350h Exquisite వేరియంట్‌ను కంపెనీ రూ. 89.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందిస్తోంది.
Advertisement

ఆఫ్రికా కోసం తయారైన హ్యుందాయ్ i10కు సున్నా స్టార్ రేటింగ్!

ఆఫ్రికన్ మార్కెట్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసి అక్కడి ఎగుమతి చేస్తున్న భారతదేశంలో తయారైన హ్యుందాయ్ గ్రాండ్ i10 (Hyundai grand i10) తాజాగా నిర్వహించిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో నిరాశాజనకమైన ఫలితాన్ని నమోదు చేసుకుంది. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను ఆధారంగా చేసుకుని నిర్వహించిన ఈ తాజా పరీక్షల్లో గ్రాండ్ i10కి జీరో-స్టార్ రేటింగ్ లభించింది. సాధారణంగా, హ్యుందాయ్ కార్లు భద్రత పరంగా మంచి పేరును సంపాదించినా, ఈ మోడల్ మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోవడం విశేషంగా మారింది. దేశంలో అమ్మే గ్రాండ్ i10, ఎగుమతి వెర్షన్‌లంటే భద్రత పరంగా పెద్ద తేడా ఉండదనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఆఫ్రికన్ మార్కెట్‌కు బయలుదేరిన మోడల్ టెస్ట్‌లో ఇలా తక్కువ స్కోరు రావడం వినియోగదారుల్లో ఆందోళన కలిగించే అంశం. ఆఫ్రికాలోని చాలా పేద ప్రజలకు ఇది ప్రమాదకరమని GNCAP పరీక్ష తేల్చింది.

ఓలా, ఉబర్‌కు చెక్: డ్రైవర్లకు 100% కమిషన్ క్యాబ్ సర్వీస్

భారతదేశ రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతూ భారత్ టాక్సీ అనే సహకార (Co-operative) ఆధారిత మొబిలిటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రారంభమైంది. ఓలా (Ola), ఉబర్ (Uber), ర్యాపిడో (Rapido) వంటి ప్రైవేట్ యాప్‌లకు ఇది సరికొత్త ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

చిన్న ఉద్యోగాలు చేసేవారికి ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ కారు!

ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య పెరుగుతున్నా, సాధారణ కుటుంబాలకు అందుబాటులో ఉండే చిన్న EVల కొరత ఎలక్ట్రిక్ వాహనాల వేగవంతమైన వృద్ధికి అడ్డంకిగా నిలుస్తోంది. పెద్ద SUVలు, క్రాసోవర్‌లు, ప్రీమియం సెగ్మెంట్ EVలు ఎక్కువగా లభిస్తుండటంతో, బడ్జెట్‌ ఫ్రెండ్లీ చిన్న కార్లను కోరుకునే కొనుగోలుదారులకు ఎంపికలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలోనే దక్షిణ కొరియా దిగ్గజం కియా చిన్న, కానీ శక్తివంతమైన కొత్త ఎలక్ట్రిక్ కారును సిద్ధం చేస్తోంది.. అదే కియా ఈవీ2 (Kia EV2). ఈ ఏడాది జరిగిన ప్రత్యేకమైన కియా EV డే కార్యక్రమంలో కంపెనీ ఈ మోడల్‌ను అధికారికంగా ప్రదర్శించింది. బయటకు చిన్నగా కనిపించినా, డిజైన్ స్టాన్స్ మాత్రం పూర్తిగా futuristic-EV2ను చిన్నతనంతో పాటు ఎలక్ట్రిక్ డ్రైవింగ్‌కు కావాల్సిన ఆధునిక టెక్నాలజీ సూటిగా ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు.

రూ.7.5లక్షలకే 215కిమీ రేంజ్ ఈవీ

వియత్నాంకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) త్వరలోనే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అడుగు పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కంపెనీ, ముఖ్యంగా విఎఫ్‌6 (VF6), విఎఫ్‌7 (VF7) వంటి రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను (EV SUVs) దేశీయ మార్కెట్లలో విజయవంతంగా విక్రయిస్తోంది. ఇప్పుడు భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, 2026 ఫిబ్రవరిలో కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రవేశం భారత ఈవీ మార్కెట్‌లో కొత్త పోటీని సృష్టించనుంది.
Advertisement

జనాలందరూ ఆ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లే కావాలంటున్నారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల చుట్టూ ఏర్పడిన ఉత్సాహం రోజురోజుకూ కొత్త ఎత్తులకు చేరుతోంది. ఇంధన ధరలు పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రోత్సహక చర్యలు, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన.. ఈ మూడు కలిసి భారత ఆటోమొబైల్ మార్కెట్‌ను మెల్లగా కానీ బలంగా ఎలక్ట్రిక్ మోడ్‌కి తిప్పేస్తున్నాయి. దీనివల్ల గత కొన్నేళ్లలో EVల డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు రోడ్లపై ఎక్కడ చూసినా చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి లగ్జరీ SUVల వరకు పలు రకాల ఎలక్ట్రిక్ కార్లు కన్పించడం సాధారణమైపోయింది. కస్టమర్లలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ దృష్టిని వేగంగా ఎలక్ట్రిక్ విభాగంపై కేంద్రీకరిస్తున్నాయి. ఈ పరిస్థితిలో, గత నవంబర్‌లో ఏ కంపెనీలు ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాయో వివరాలను చూద్దాం.