దేశమంతా ఎదురుచూస్తోన్న కారు వచ్చేస్తుంది

కొత్త మారుతి సుజుకి (Maruti Suzuki) ఇ-విటారా (e Vitara) భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ SUVల విభాగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఈ మోడల్‌ను డిసెంబర్ 2న అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం, దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురు చూస్తున్న కొనుగోలుదారుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొంది. మారుతి దీనిని తన అత్యంత కీలక EVగా మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఇప్పటివరకు వచ్చిన లీకులు, టీజర్లు, రిపోర్ట్లు చూసినప్పుడే ప్రజల్లో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ SUV ధరను సాధ్యమైనంత పోటీగా ఉంచే ప్రయత్నం చేస్తోంది మారుతి. ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణంగా ఎక్కువ ఖరీదైనవిగా భావించినప్పటికీ, ఇ-విటారా ధరను సుమారు రూ.17 లక్షల నుంచి రూ.22.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యగా నిర్ణయించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.

ఇది కదా నిజమైన పేదవాడి స్కూటర్

ఒకప్పుడు భారతీయ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన స్కూటర్లలో బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఒకటి. ఇప్పుడు ఈ క్లాసిక్ బ్రాండ్ ఎలక్ట్రిక్ అవతార్‌లో వచ్చి మళ్లీ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ-స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బజాజ్ చేతక్ అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.ముఖ్యంగా గత అక్టోబర్ నెలలో ఈ స్కూటర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. దీనికి కారణం సరసమైన ధర, సాలీడ్ బిల్డ్ క్వాలిటీ అని విశ్లేషకులు చెబుతున్నారు.

7 సీటర్ కార్లు కొనాలనుకుంటున్నారా? దేశంలో టాప్ MPV మోడళ్లు ఇవే!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో MPVలు (మల్టీ-పర్పస్ వెహికల్స్) ఎప్పటి నుంచో ప్రత్యేక గుర్తింపును పొందుతున్నాయి. కుటుంబాల అవసరాలు మారుతున్న కొద్దీ, విశాలత, సౌకర్యం, వినియోగం కలిగిన కార్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. సాధారణ 5-సీటర్ కార్లలో లేని స్పేస్, బెటర్ కమ్ఫర్ట్, ఫ్లెక్సిబుల్ సీటింగ్ ఆప్షన్లు MPVలను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. పెద్ద కుటుంబ ప్రయాణాలు, లాంగ్ డ్రైవ్స్, రోజువారీ వినియోగం ఏ అవసరానికైనా సరిపోయే MPVలను ఇతర విభాగాల కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఈ కార్లకు ఉన్న పెరుగుతున్న ఆసక్తి కారణంగా, MPV సెగ్మెంట్ భారత మార్కెట్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగాలలో ఒకటిగా 2025 నాటికి రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కొన్ని ఎంపీవీ కార్లను కథనంలో చూద్దాం.

ఇలా ఉంటే ఎవరు కొంటారు మస్క్ మామ

ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న అమెరికన్ దిగ్గజం టెస్లా(Tesla) ఎన్నో అడ్డంకులను దాటుకుని ఈ మధ్యే భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. టెస్లా రాకతో భారతీయ కార్ల మార్కెట్‌ పూర్తిగా మారిపోతుందని, పోటీ సంస్థలకు ముచ్చెమటలు పడుతాయని భారీ అంచనాలు నెలకొన్నాయి.
Advertisement

బడ్జెట్ హైబ్రిడ్–ఎలక్ట్రిక్ కార్లతో మారుతి సంచలనం

మారుతి సుజుకి (Maruti Suzuki) ఇప్పటివరకు భారత కుటుంబాలను గమనిస్తూ, ముఖ్యంగా చిన్న ఫ్యామిలీల కోసం 5 సీటర్ల కార్లను విస్తారంగా అందించింది. అయితే ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న మార్పులు కంపెనీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేలా చేశాయి. చిన్న కార్ల అమ్మకాలు క్రమంగా తగ్గిపోవడంతో, కేవలం ఫేస్‌లిఫ్ట్‌లు ఇవ్వడం, రంగులు మార్చడం లేదా చిన్నపాటి డిజైన్ అప్‌డేట్‌లు చేయడం ద్వారా మార్కెట్‌ను ఆకట్టుకోవడం ఇక సాధ్యం కాదని మారుతి ఇప్పుడు స్పష్టంగా గ్రహించింది. ఈ నేపథ్యంలో కంపెనీ పూర్తిగా కొత్త దిశలో అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. పర్యావరణ అనుకూలమైన మరియు వినియోగదారులకు సరసమైన ధరలో అందుబాటులో ఉండే హైబ్రిడ్, జీరో ఎమిషన్ వాహనాల అభివృద్ధిపై మారుతి దృష్టిసారిస్తోంది.

10ఏళ్లలో 2 లక్షల లగ్జరీ బైక్స్

భారతీయ ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company), అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్ బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) భాగస్వామ్యం భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఒక పెద్ద విజయంగా నిలిచింది. 2013లో ప్రారంభమైన ఈ చారిత్రక సహకారం ఇప్పుడు 500 సీసీ కంటే తక్కువ సామర్థ్యం గల విభాగంలో 2,00,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించినట్లు ప్రకటించాయి. ఈ ఘనత ఇండో-జర్మన్ సహకారం ఎంత విజయవంతమైందో తెలియజేస్తుంది. ఈ మైలురాయి వివరాలు, ఈ భాగస్వామ్యం నుంచి వచ్చిన బైకులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలుసుకుందాం.

ఈ టాటా కారుకి దేశంలో భారీ డిమాండ్

టాటా కర్వ్ SUV ప్రస్తుతం భారత మార్కెట్లో మంచి హాలీవుడ్ హీరో అయితే ఎలా ఉంటుందో అలా దూసుకుపోతోంది. ఈ మోడల్‌పై వినియోగదారుల ఆసక్తి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఇటీవల అమలులోకి వచ్చిన GST తగ్గింపు దాని ధరను గణనీయంగా తగ్గించి, వినియోగదారుల దృష్టిని మరింతగా ఆకర్షించింది. ధర తగ్గిన వెంటనే షోరూమ్‌లలో కర్వ్ కోసం చేసిన విచారణలు, బుకింగ్‌లు భారీగా పెరిగిపోయాయి. ఈ డిమాండ్ పెరుగుదల ఒక విధంగా కారుకు పాపులారిటీని చాటుతుంటే, మరోవైపు డెలివరీ వేచి ఉండే కాలాన్ని పెంచే పరిస్థితి కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం కర్వ్ SUV కోసం ఎదురుచూడాల్సిన వెయిటింగ్ పిరియడ్ 8 నుండి 12 వారాలు, అంటే దాదాపు 2 నుండి 3 నెలలు దాకా వెళ్లిపోయింది.

రోడ్డు మీద స్టైలీష్ జర్నీకి ఈ స్కూటర్ బెస్ట్

భారతదేశంలో టూ-వీలర్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ స్కూటర్ విభాగంలో ఎప్పుడూ ఒక పెద్ద హిట్‌కోసం చూస్తోంది. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి వాటికి పోటీ ఇచ్చే ఒక ఫ్యామిలీ స్కూటర్ కోసం హీరో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ కొత్తగా జూమ్ 110, 125, 160 వంటి మోడల్స్‌ను తెచ్చినా, ఆశ్చర్యకరంగా హీరో డెస్టిని 125 అనే ఫ్యామిలీ స్కూటరే ఇప్పుడు హీరోకు ఎక్కువ అమ్మకాలు తెచ్చిపెడుతోంది. తాజాగా అక్టోబర్ 2024 అమ్మకాల్లో ఈ స్కూటర్ ఏకంగా 83.93 శాతం వృద్ధిని నమోదు చేసి, ఎలా దూసుకుపోతుందో తెలుసుకుందాం.
Advertisement

ఎంజీ విండ్సర్ సంచలనం

ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV)తో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలంటే చాలామంది భయపడతారు. ఎక్కడ ఛార్జింగ్ ఆగిపోతుందో, మధ్యలో ఆగిపోతామేమోనని అనుమానం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ భయాలన్నీ పటాపంచలు కానున్నాయి. ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windzor EV) అనే ఎలక్ట్రిక్ కారు లేహ్ (Leh) నుంచి కన్యాకుమారి వరకు ఏకంగా 3757 కిలోమీటర్ల సవాలుతో కూడిన యాత్రను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కేవలం 83 గంటల 43 నిమిషాల్లో ఈ ప్రయాణాన్ని పూర్తి చేసి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ రికార్డు వివరాలు, కారు ఫీచర్లు తెలుసుకుందాం.

భారత్‌లో దుమ్మురేపడానికి డుకాటి సిద్ధం!

ఇటాలియన్ సూపర్‌బైక్‌లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డుకాటి (Ducati), భారత మార్కెట్లో తన ప్రాముఖ్యతను మరింత బలపరుస్తూ మరోసారి అద్భుతమైన ఆఫర్‌ను అందించింది. పెరుగుతున్న ప్రీమియం మోటార్‌సైకిల్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ భారత్‌లో స్ట్రీట్‌ఫైటర్ V2, స్ట్రీట్‌ఫైటర్ V2 S మోడల్‌లను అధికారికంగా విడుదల చేసింది. రూపం, రైడింగ్ పనితీరు, టెక్నాలజీ.. మూడు రంగాల్లోనూ ఈ రెండు బైక్‌లు డుకాటికి ఉన్న పేరుకు తగ్గట్టుగానే ఉంటాయి. డుకాటి ఈ కొత్త బైక్‌లను ప్రత్యేకంగా నగర రైడర్లను కూడా దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసింది. ఫుల్-ఫ్లెజ్డ్ సూపర్‌బైక్ పనితీరు కావాలనుకునే కానీ అదే సమయంలో తేలికపాటి కంట్రోల్, డైలీ రైడింగ్ కామ్ఫర్ట్ కూడా ఉండాలని ఆశించేవారికి స్ట్రీట్‌ఫైటర్ V2 సిరీస్ సరైన ఆప్షన్‌గా నిలుస్తుంది.

దేశంలోనే అత్యంత కాస్ట్లీ నంబర్ ప్లేట్

కారు కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మారింది. కొత్త మోడల్స్ ఎంత ముఖ్యమో, వీఐపీ నంబర్ ప్లేట్‌కు కూడా అంత క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రేజ్ ఎంతలా ఉందంటే ఇటీవల హర్యానాలో జరిగిన ఆన్‌లైన్ వేలంలో ఒక వీఐపీ నంబర్ రికార్డు సృష్టించింది. HR88B8888 అనే నంబర్ ఏకంగా రూ.1.17 కోట్లకు అమ్ముడై, దేశంలోనే అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్‌గా నిలిచింది. అయితే, ఇంత ఖరీదైన నంబర్‌ను కొన్న వ్యక్తి.. ఆ నంబర్‌పై ఎంత టాక్స్ కట్టాలి? అసలు ఈ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లపై టాక్స్ రూల్స్ ఏంటో తెలుసుకుందాం.

టయోటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు

ఆటోమొబైల్ మార్కెట్‌ ప్రస్తుతం వేగంగా మారిపోతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, వాతావరణ కాలుష్యం, అలాగే ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న గ్రీన్ మొబిలిటీ అన్నీ కలిసి ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారీ డిమాండ్‌ను సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి బ్రాండ్ అయిన టయోటా కూడా తన తదుపరి అడుగును వేగంగా వేస్తోంది. కొత్తగా అర్బన్ క్రూయిజర్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV)ను పరిచయం చేసింది. ఇండోనేషియాలో జరిగిన 2025 GIIAS మోటార్ షోలో టయోటా ఈ కొత్త మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. దీని రూపకల్పన పూర్తిగా వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమతుల్యంగా రూపొందించబడింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో మెరుగైన ఈవీ ప్రయాణ అనుభవాన్ని అందించడంపై కంపెనీ ఎక్కువ దృష్టి పెట్టింది.
Advertisement

బడ్జెట్ పై భారం తగ్గించే బెస్ట్ స్కూటర్

మైలేజ్ అంటే ప్రాణం పెట్టే భారతీయ స్కూటర్ లవర్స్‎కు సుజుకి ఒక సంచలన శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుంది. దేశంలో బాగా అమ్ముడవుతున్న సుజుకి యాక్సెస్ స్కూటర్ త్వరలో ఒక కేజీ సీఎన్‌జీకి ఏకంగా 90కి.మీ మైలేజ్ ఇచ్చే వెర్షన్‌లో రాబోతోంది. జపాన్ ఇంజనీర్ల ఈ మాస్టర్ ప్లాన్.. మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి ప్రత్యర్థి స్కూటర్లకి చెమటలు పట్టించడం ఖాయం.

మహింద్రా ఫ్యామిలీ ఈవీ వచ్చేసింది

Mahindra XEV 9S : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా బెంగళూరులో నిర్వహించిన స్క్రీమ్ ఎలక్ట్రిక్ అనే కార్యక్రమంలో తమ కొత్త తరం ఎలక్ట్రిక్ కారు మహింద్రా XEV 9Sను విడుదల చేసింది. భారత మార్కెట్‌లో 3-వరుసల సీట్లు (7 సీటర్) ఉండే కార్ల సెగ్మెంట్‌లో తొలిసారిగా ఒక ఎలక్ట్రిక్ కారు రంగంలోకి దిగుతుండటంతో, దీనిపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఫుల్ ట్యాంక్‌తో 600 కి.మీల పైనే వెళ్లొచ్చు!

హీరో గ్లామర్ (Hero Glamour) భారత మార్కెట్లో ఎప్పుడూ తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న బైక్. 125 సీసీ సెగ్మెంట్‌లో ఇది ఎప్పటినుంచో నమ్మదగినదిగా, మైలేజ్‌ఫ్రెండ్లీగా, స్టైలిష్ కమ్యూటర్‌గా పేరుపొందింది. ప్రతి నెలా దీని అమ్మకాలు హీరో బ్రాండ్ శక్తిని, అలాగే వినియోగదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తుంటాయి. అక్టోబర్ 2025 లో కూడా హీరో గ్లామర్ తన హవాను కొనసాగించింది. ఈ నెలలో మార్కెట్‌లో పోటీ ఎంత కఠినంగా ఉన్నా, గ్లామర్ మాత్రం తన స్థానాన్ని మళ్లీ ఒకసారి బలంగా నిలబెట్టుకుంది. మూడు వేర్వేరు వెర్షన్‌లతో అందుబాటులో ఉన్న ఈ 125 సీసీ మోడల్, మొత్తం 28,823 యూనిట్లు అమ్ముడవడం ద్వారా తన ఆకట్టుకునే పనితీరును మరోసారి ప్రూవ్ చేసింది.

మహింద్రా కొత్త రేసింగ్ బీస్ట్ రెడీ

భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన మహీంద్రా (Mahindra) ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ప్రపంచంలో తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. దీనికోసం ప్రత్యేకంగా బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్‌లో తమ అత్యాధునిక రేసింగ్ కారు ఎం12 ఎలక్ట్రో(M12 Electro)ను విడుదల చేసింది. ఈ కారును 2026 చివరిలో మొదలయ్యే సీజన్ కోసం రూపొందించారు.
Advertisement

రేసింగ్ లుక్‌తో దూసుకొచ్చిన మహీంద్రా BE6 ఫార్ములా E ఎడిషన్

మహీంద్రా (Mahindra) తన BE 6 ఎలక్ట్రిక్ SUV ని ఒక ప్రత్యేకమైన కొత్త అవతారంలో మార్కెట్‌కు తీసుకొచ్చింది. ఈ కొత్త వెర్షన్‌కు ఫార్ములా E ఎడిషన్ (formula e edition) అనే పేరు పెట్టారు. పేరు వినగానే చాలామందికి ఇది ఫార్ములా E రేసుల్లో ఉపయోగించే కారు అనిపించవచ్చు. కానీ ఇది రేసింగ్ కార్ల నుండి ప్రేరణ పొంది తయారైన ఒక స్టైల్-ఫోకస్‌డ్ స్పెషల్ ఎడిషన్ మాత్రమే. ఫార్ములా E అంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఎలక్ట్రిక్ సింగిల్-సీటర్ రేసింగ్ సిరీస్. అక్కడ కనిపించే కార్ల డిజైన్, లివరీ, స్పోర్టీ ఎలిమెంట్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మహీంద్రా BE 6 ఫార్ములా E ఎడిషన్ కూడా అదే రేసింగ్ ఆరా స్ఫూర్తితో రూపొందించబడింది.

90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్ రాక!

టీవీఎస్ జూపిటర్ (Tvs Jupiter) భారత టూవీలర్ మార్కెట్లో ఎన్నాళ్లుగానో తనదైన స్థానం నిలబెట్టుకుంది. స్కూటర్ సెగ్మెంట్‌లోకి చూస్తే హోండా యాక్టివా, సుజుకి యాక్సిస్ వంటి బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ, జూపిటర్ మాత్రం తన నమ్మకమైన పనితీరు, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం వంటి కారణాలతో వినియోగదారుల మన్ననలు పొందుతోంది. ప్రత్యేకంగా అక్టోబర్ 2025 అమ్మకాలు చూస్తే, టీవీఎస్ కంపెనీకి ఇది అసలైన పండుగ నెలగా మారిపోయింది. దీపావళి-దసరా సీజన్‌లో కొనుగోలు ఉత్సాహం పెరగడంతో షోరూమ్‌ల వద్ద జూపిటర్‌కు డిమాండ్ మరింతగా పెరిగింది. చాలా మంది కుటుంబాలు ఫెస్టివల్ బోనస్‌లను వినియోగిస్తూ కొత్త స్కూటర్ కోసం షోరూమ్‌లను ఆసక్తిగా సందర్శించగా, వారిలో పెద్ద శాతం మంది ఎంపికగా జూపిటర్‌పైనే నిలిచారు.

ఏ బైకులో లేని ఫీచర్‎తో రాబోతున్న హీరో బైక్

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), ఇప్పుడు కేవలం సాధారణ బైకులకు మాత్రమే పరిమితం కాకుండా, యువతను ఆకర్షించే ప్రీమియం మార్కెట్‌పై దృష్టి పెట్టింది. 160cc సెగ్మెంట్‌లో అపాచీ, పల్సర్ వంటి బైకులకు నిద్ర పట్టకుండా చేయడానికి హీరో.. తన బెస్ట్ స్పోర్ట్స్ నేకెడ్ బైక్ అయిన ఎక్స్‌ట్రీమ్ 160R కు ఏకంగా ప్రీమియం సెగ్మెంట్ ఫీచర్లను జోడించింది.

రేపు తుఫాన్ సృష్టించబోతున్న మహీంద్రా

భారతదేశంలో భారీ మైలేజ్ ఇచ్చే 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను శాసించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ తమ కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVని సిద్ధం చేసింది. రేపు (నవంబర్ 27, 2025) విడుదల కానున్న ఈ కారు పేరు మహీంద్రా XEV 9S. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కి.మీ రేంజ్ ఇచ్చే ఈ కారు మార్కెట్‌లో పెద్ద సంచలనం సృష్టించబోతోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Advertisement

తక్కువ ధరలో 75 ఫీచర్లు ఒక్క టాటాకే సాధ్యం

టాటా మోటార్స్(Tata Motors) తమ బ్రాండ్‌ను బలోపేతం చేసుకుంటూ సరికొత్త సియెర్రా (Sierra) ఎస్‌యూవీని భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.11.49లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ ధర ఈ సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos), మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి అనువుగా ఉంది.

గంటకు 150మంది కొంటున్న బైక్ ఇదే

మన దేశంలో మోటార్‌సైకిల్ అనగానే చాలా మంది సామాన్య ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి, ముందుగా గుర్తొచ్చే పేరు హీరో. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌లు వస్తున్నా, మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఇచ్చే పెట్రోల్ బైక్‌లకే ఎక్కువ డిమాండ్ ఉంది. తక్కువ ఆదాయం ఉన్నవారు, రోజువారీ పనుల కోసం, పొలం పనుల కోసం, చిన్న ఉద్యోగాల కోసం హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe) బైక్‌ను సొంతం చేసుకోవడానికి ఇష్టపడతారు. దీనికి కారణం దీని ధర చాలా తక్కువ, ఇచ్చే మైలేజ్ చాలా ఎక్కువ. ఈ బైక్ అక్టోబర్ నెలలో 1,13,998 యూనిట్లు అమ్ముడుపోవడం, సామాన్య ప్రజలకు ఈ బైక్ ఎంత నమ్మకమో తెలియజేస్తుంది.

పేదవాడి కారుకు కాలం చెల్లిందా ?

భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కార్లను విక్రయించే కంపెనీలలో మారుతి సుజుకి ముందుంటుంది. అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారుగా మారుతి ఆల్టోకు ఒకప్పుడు తిరుగులేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. గత 10 నెలల (జనవరి 2025 నుంచి అక్టోబర్ 2025 వరకు) కాలంలో ఈ కారును కేవలం 70,000 మంది మాత్రమే కొనుగోలు చేశారు.

పాత సియెర్రా వర్సెస్ కొత్త సియెర్రా

టాటా మోటార్స్ ఐకానిక్ ఎస్‌యూవీ అయిన సియెర్రా సరికొత్త రూపంలో భారతీయ మార్కెట్‌లోకి గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ కొత్త మోడల్ పాత సియెర్రాకు ఎలా డిఫరెంటుగా ఉంది. డిజైన్, టెక్నాలజీ, ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌లో 1990 మోడల్‌కు, 2025 మోడల్‌కు మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఈ వార్తలో తెలుసుకుందాం. టెక్నాలజీ పరంగా కారు ప్రపంచం ఎంత మారిందో ఈ తేడాలు చూస్తే అర్థమవుతుంది.
Advertisement

ఈ కారు మీ మాట వింటుంది

ఎంజీ మోటార్స్ కంపెనీ 2019లో హెక్టార్ (Hector) ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకొచ్చినప్పుడు ఇది కేవలం కారు మాత్రమే కాక, ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయిన కారు(కనెక్టెడ్ కార్ టెక్నాలజీ) అనే కొత్త ఆలోచనను ఇండియాకు పరిచయం చేసింది. దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నెట్ కారుగా గుర్తింపు పొందిన హెక్టార్, తన విశాలమైన స్థలం, అద్భుతమైన సౌకర్యంతో పాటు అడ్వాన్సుడ్ టెక్నాలజీకి కూడా ప్రసిద్ధి చెందింది. 2025 మోడల్ అప్‌డేట్‌తో, ఈ ఎస్‌యూవీ తన సెగ్మెంట్‌లోనే అత్యధిక ఫీచర్లు ఉన్న వాహనంగా, ఒక స్మార్ట్ లివింగ్ స్పేస్ లాగా నిలుస్తోంది.