టెస్లా నుంచి ఎగిరే కారు లాంచ్‌పై ఎలాన్ మస్క్ బిగ్ అప్‌డేట్!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన టెస్లా (Tesla) కంపెనీ, ఇప్పుడు మరొక అద్భుతమైన ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elen Musk) మళ్లీ ఒక సంచలన ప్రకటనతో ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఎప్పుడూ వినూత్న ఆలోచనలతో సాంకేతిక రంగాన్ని కదిలించే ఈ వ్యాపారవేత్త, ఈసారి ఎగిరే కారు కాన్సెప్ట్‌తో రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా, ఎలాన్ మస్క్ మాట్లాడుతూ టెస్లా కంపెనీ 2025 చివరి నాటికి ఒక ఎగిరే కార్ ప్రోటోటైప్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోందని వెల్లడించారు. ఆయన మాటల్లో ఇది ఇప్పటివరకు ఆవిష్కరించబడిన అత్యంత గుర్తుండిపోయే ఉత్పత్తి అని పేర్కొనడం, ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న విశ్వాసాన్ని, సాంకేతిక శక్తిని స్పష్టంగా చూపిస్తోంది.

మిలన్‌లో బైక్‌ల మేళా

ప్రపంచ మోటార్‌సైకిల్ ప్రేమికులకు పండుగ వాతావరణం నెలకొంది. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్, యాక్సెసరీస్ షో అయిన EICMA 2025 ఈ సంవత్సరం నవంబర్ 4 నుండి ఇటలీలోని మిలన్‌లో ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ తయారీదారులు తమ సరికొత్త మోడళ్లను ముఖ్యంగా అడ్వెంచర్ సెగ్మెంట్‌లోని పవర్ఫుల్ బైక్‌లను ఇక్కడ ప్రదర్శించనున్నారు. కేవలం పవర్‌ఫుల్ ఇంజిన్లతోనే కాకుండా స్టైల్, టెక్నాలజీలో ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లతో రానున్న 5 ప్రధాన సూపర్ బైక్‌లు, ఈ షోలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ బైక్‌ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జనాలను విపరీతంగా ఆకర్షించిన మారుతి ఈకో

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన, ప్రజాదరణ పొందిన వాహనాలలో ఒకటిగా మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) స్థిరంగా నిలిచింది. కుటుంబ అవసరాలకైనా, వ్యాపార ప్రయోజనాలకైనా లేదా స్కూల్ వ్యాన్‌‌లుగా ఉపయోగించుకునేందుకైనా ఈకో భారతీయ వినియోగదారుల జీవనశైలిలో ఒక భాగమైపోయింది. గతంలో మారుతి ఓమ్ని ఎంత ప్రాచుర్యం పొందిందో, ఇప్పుడు ఆ స్థానం మొత్తాన్ని ఈకో దక్కించుకుందనే చెప్పాలి. ఓమ్ని ఉత్పత్తి నిలిపివేయబడిన తర్వాత ఏర్పడిన ఆ ఖాళీని ఈకో భర్తి చేసి, తన విశ్వసనీయతతో మార్కెట్లో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. అక్టోబర్ 2025 నెల ఈ విజయ పరంపరలో మరో ముఖ్యమైన అధ్యాయం అయింది.

రేపే దిగుతున్న మొనగాడు

హ్యుందాయ్ కార్స్ ఇండియా (Hyundai Cars India) తమ పాపులర్ ఎస్‌యూవీ వెన్యూ (Venue)ను పూర్తిగా రీడిజైన్ చేసి, మరింత స్పోర్టీ లుక్‌తో ఎన్ లైన్ (N Line) వెర్షన్‌ను తీసుకురాబోతోంది. నవంబర్ 4, 2025న విడుదల కానున్న ఈ 2026 మోడల్‌కు సంబంధించి బుకింగ్స్ ఇప్పటికే రూ.25,000 అడ్వాన్స్‌తో మొదలయ్యాయి.
Advertisement

అక్టోబర్‌లో రికార్డు సేల్స్ చేసిన మారుతి సుజుకి

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki India Limited), అక్టోబర్ 2025లో మరొకసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. ఈ నెలలో కంపెనీ అద్భుతమైన అమ్మకాల గణాంకాలను నమోదు చేస్తూ మళ్లీ మార్కెట్‌లో దూసుకుపోయింది. మొత్తం 2,20,894 యూనిట్లను విక్రయించిన మారుతి సుజుకి, దేశీయ మార్కెట్‌లోనే కాకుండా ఎగుమతుల్లో కూడా బలమైన పనితీరును కనబరిచింది. గత ఏడాది అదే నెలలో, అంటే అక్టోబర్ 2024లో, పండుగ సీజన్ కారణంగా 2,06,434 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈసారి ఆ గణాంకాన్ని అధిగమిస్తూ కంపెనీ 7 శాతం వృద్ధిని సాధించడం విశేషం. దీని ద్వారా మారుతి సుజుకి బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకం ఎంతగానో పెరిగిందని మరోసారి తేలింది.

3 కోట్ల కారులో దిగిన అప్సరస

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల చూస్తే జాలేస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు. కారణం టాలీవుడ్ లో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా సక్సెస్ అనే పదం చేతివరకు వచ్చి చేజారిపోతుంది. తన కెరీర్లో ధమాకా తర్వాత హిట్ సినిమానే లేదు. ఆ సినిమా తర్వాత శ్రీలీల ఒకటా రెండా పొలోమని పలు సినిమాలు చేసింది. కానీ ఏ ఒక్కటి శ్రీలీల కెరీర్‎కు ఉపయోగపడే హిట్ పడలేదు.

హాట్ కేక్‌గా మారిన విక్టోరిస్ SUV.. బుకింగ్స్ చూస్తే షాక్!

ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris) SUV చివరికి సెప్టెంబర్ 16న విడుదలైంది. ఈ కారు రూపకల్పన నుంచి ఫీచర్ల వరకు ప్రతి అంశం ప్రజల్లో విశేష ఆసక్తిని రేకెత్తించింది. ఫ్రంట్ గ్రిల్‌ నుంచి టెయిల్ ల్యాంప్‌ వరకు ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం ఫినిషింగ్, అలాగే ఆధునిక టెక్నాలజీతో నిండి ఉన్న క్యాబిన్‌.. ఇవన్నీ ఈ SUVని మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. అదనంగా, మారుతి సుజుకి దీన్ని పోటీ ధరలో మార్కెట్లోకి తీసుకురావడంతో, వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. విక్టోరిస్ ప్రారంభం తర్వాత మార్కెట్లో దాని హవా ఏ రేంజ్‌లో ఉందంటే, కేవలం రెండు నెలల్లోనే ఈ SUV 33,000 పైగా బుకింగ్‌లను సాధించింది.

హ్యుందాయ్ సేల్స్ సునామీ

భారతదేశంలో అత్యధికంగా వాహనాలను విక్రయించే కంపెనీలలో ఒకటైన హ్యుందాయ్ మోటార్స్(Hyundai Motors) 2025 అక్టోబర్ అమ్మకాలలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ సంస్థ ఒక్క నెలలోనే ఏకంగా 69,894 వాహనాలను విక్రయించింది.
Advertisement

ఎగుమతుల్లోనూ మారుతికి రికార్డు

భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) అమ్మకాల విషయంలో తన రికార్డును కొనసాగిస్తోంది. తాజాగా విడుదల చేసిన 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2) ఆర్థిక ఫలితాలు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాయి. దేశీయ విక్రయాలలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, విదేశాలకు కార్ల ఎగుమతిలో మారుతి సుజుకి సరికొత్త రికార్డు సృష్టించింది.

గంటకు 14 కార్లు అమ్ముతున్న కంపెనీ

నిస్సాన్ (Nissan) కంపెనీ 2025 అక్టోబర్ నెల అమ్మకాల వివరాలను తాజాగా విడుదల చేసింది. ఈ సంస్థ ఒక్క నెలలోనే ఏకంగా 9,675 కార్లను విక్రయించి, అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ అమ్మకాలలో అత్యధిక వాటా ఎగుమతుల నుంచే వచ్చింది. అంటే, భారతదేశంలో తయారైన నిస్సాన్ కార్లకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్‌లో అమ్మకాలు 45 శాతం పెరిగాయి. దీనికి కారణాలు నిస్సాన్ ఎగుమతి రికార్డు, భవిష్యత్తులో భారత మార్కెట్‌లోకి తీసుకురాబోతున్న కొత్త కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. నిస్సాన్ కంపెనీ 2025 అక్టోబర్ నెలలో అమ్మకాల పరంగా బలమైన పనితీరును కనబరిచింది. నిస్సాన్ సంస్థ అక్టోబర్ నెలలో మొత్తం 9,675 కార్లను విక్రయించింది. భారతదేశంలో కేవలం 2,402 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మిగిలిన 7,273 వాహనాలను విదేశాలకు ఎగుమతి (Export) చేశారు. మొత్తం అమ్మకాలలో ఎగుమతుల వాటానే ఎక్కువగా ఉంది.

మార్కెట్లో ఇక నిన్ను కొట్టే వాడే లేడు మామ

భారతీయ కార్ల మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన టయోటా సియెర్రా (Tata Sierra) ఎస్‌యూవీ తిరిగి రాబోతోందనే వార్త కస్టమర్లలో భారీ అంచనాలను పెంచింది. ఈ ఎస్‌యూవీ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత లగ్జరీ ఫీచర్లు, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో రాబోతున్న ఈ న్యూ-జెన్ టయోటా సియెర్రా టీజర్ వీడియోను కంపెనీ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో కొత్త సియెర్రా చాలా వేగంగా దూసుకుపోతున్న దృశ్యాన్ని చూపించారు. నవంబర్ 25న విడుదల కాబోతున్న ఈ కొత్త ఎస్‌యూవీ డిజైన్, ఇంజన్ స్పెసిఫికేషన్స్, లగ్జరీ ఫీచర్లు, అంచనా ధర వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఆ కంపెనీ కార్లు కొనేందుకు ఎగబడ్డారు

మన దేశంలో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (Honda Cars India Limited - HCIL), పండుగల సీజన్‌లో (దసరా, దీపావళి) కస్టమర్ల నుంచి భారీ ఆదరణ పొందింది. 2025 అక్టోబర్ నెల అమ్మకాల నివేదిక ప్రకారం, హోండా ఏకంగా 10,518 కార్లను విక్రయించి గత సంవత్సరంతో పోలిస్తే 15.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ విజయం వెనుక జీఎస్టీ 2.0 ప్రకటన, తక్కువ ధరలో ADAS సేఫ్టీని అందిస్తున్న హోండా అమేజ్ (Honda Amaze) కారుకు లభించిన అపూర్వ స్పందన ప్రధాన కారణాలుగా నిలిచాయి.
Advertisement

జీఎస్టీని తగ్గించింది టయోటా కోసమేనా ?

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో జపాన్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) తిరుగులేని వృద్ధిని నమోదు చేసింది. ఇటీవల ప్రకటించిన 2025 అక్టోబర్ నెల అమ్మకాల నివేదిక (Sales Report) టయోటాకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ ఒక్క నెలలోనే టయోటా ఏకంగా 42,892 కార్లను విక్రయించి, గత సంవత్సరంతో పోలిస్తే 39% అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది.

ముగ్గురు మొనగాళ్లతో మార్కెటును దున్నేశాడు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే పాత దిగ్గజాలకే సవాల్ విసురుతూ కియా (Kia) సంస్థ అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. కేవలం ఆరేళ్ల కాలంలోనే ఈ కొత్త కుర్రాడు పెద్ద పెద్ద కంపెనీలకు చెమటలు పట్టిస్తున్నాడు. దీనికి నిదర్శనం ఇటీవల విడుదలైన 2025 అక్టోబర్ నెల అమ్మకాల నివేదిక (Sales Report). ఈ నివేదిక ప్రకారం కియా ఇండియా సంస్థ ఈ నెలలో తన చరిత్రలోనే అత్యధికంగా కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ఈ అనూహ్య వృద్ధికి కారణమేంటి? కియా సంస్థ ఏకంగా 30 శాతం పెరుగుదలతో ఎలా దూసుకుపోతోంది? ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం.

దేశంలోనే అత్యంత శక్తివంతమైన అడ్వెంచర్ బైక్ వచ్చేసింది

2025 సంవత్సరం ఆటోమొబైల్ ప్రపంచానికి మరో ఉత్సాహభరితమైన అధ్యాయం రాబోతోంది. ప్రపంచంలోని ప్రముఖ వాహన ప్రదర్శనలలో ఒకటైన EICMA 2025 ఇటలీలోని మిలన్ నగరంలో నవంబర్ 6 నుండి 9 వరకు జరుగనుంది. గతంలో లాగే ఈసారి కూడా ఈ ఎగ్జిబిషన్ కొత్త మోడళ్ల ఆవిష్కరణలతో, సాంకేతిక పరిజ్ఞానాలతో, భవిష్యత్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతో సందడి కానుంది. మిలన్ ఎగ్జిబిషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ అభిమానులకు ఒక పండుగ లాంటిది. ఇక్కడే కంపెనీలు తమ అత్యంత ప్రతిష్ఠాత్మక మోడళ్లను ఆవిష్కరించి గ్లోబల్ స్టేజ్‌పై తమ బలం చూపిస్తాయి. గత సంవత్సరం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ వేదికను ఉపయోగించి క్లాసిక్ 650, బేర్ 650, తమ తొలి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీను పరిచయం చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇండియా 2.0 విజయం.. స్కోడా అమ్మకాలలో చరిత్ర సృష్టించింది!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచిని సరిగ్గా అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా తన వ్యూహాన్ని రూపొందించిన కంపెనీల్లో స్కోడా (Skoda) ఇప్పుడు ముందువరుసలో నిలుస్తోంది. యూరోపియన్ బ్రాండ్ అయినప్పటికీ, మేడ్ ఇన్ ఇండియా, ఫర్ ఇండియా అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన కుషాక్, స్లావియా, తాజా కైలాక్ మోడళ్లతో స్కోడా భారత వినియోగదారుల మనసు గెలుచుకుంది. ఈ మోడళ్ల వలన కంపెనీ కేవలం బ్రాండ్ ఇమేజ్‌ను కాకుండా, అమ్మకాల పరంగా కూడా బలమైన స్థానం సంపాదించింది. 2025 అక్టోబర్ నెలలో స్కోడా ఆటో ఇండియా తన చరిత్రలోనే అత్యధిక అమ్మకాల నెలగా రికార్డు సృష్టించింది. ఈ నెలలోనే 8,252 యూనిట్లు విక్రయించబడటం గమనార్హం. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, స్కోడా బ్రాండ్‌పై భారత వినియోగదారుల విశ్వాసానికి ప్రతీక.
Advertisement

పండుగ సీజన్‌లో టాటా సేల్స్ సునామీ

2025 అక్టోబర్ నెల భారత ఆటోమొబైల్ రంగానికి నిజంగా చరిత్రాత్మకంగా నిలిచింది. పండుగ సీజన్ రద్దీ, కొత్తగా ప్రవేశపెట్టిన GST 2.0 విధానం, వినియోగదారుల కొనుగోలు ఉత్సాహం కలిసి ఈ నెలను పరిశ్రమకు స్వర్ణయుగంలా మార్చేశాయి. ప్రతినెల ముగియగానే మార్కెట్లో వాహనాల సేల్స్‌కు సంబంధించిన గణంకాలు అందరిని ఆకట్టుకుంటాయి. ఈక్రమంలో అక్టోబర్ సేల్స్ సంఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. వాహన్ డేటా ప్రకారం, నాలుగు చక్రాల వాహనాల అమ్మకాలు మాత్రమే కాదు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా అద్భుతమైన స్థాయిలో నమోదయ్యాయి. ఈ సానుకూల వాతావరణంలో కంపెనీల ర్యాంకింగ్స్‌లోనూ ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మారుతి సుజుకి ఎప్పటిలాగే అమ్మకాల పట్టికలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తుండగా, ఈసారి టాటా మోటార్స్ రెండవ స్థానానికి ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచింది.

నెలకు 266 మంది మాత్రమే కొంటున్న కారు

ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మంచి వేడి నెలలు గడిచాయి. దాదాపు అన్ని కంపెనీలు తమ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. కొత్త మోడళ్ల లాంచ్‌లు, ఫెస్టివల్ సీజన్ ఆఫర్లు, వినియోగదారుల డిమాండ్ కారణంగా మార్కెట్ మొత్తం సందడిగా ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో అత్యధికంగా కార్లను విక్రయించే కంపెనీగా మారుతి సుజుకి మరొకసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. స్విఫ్ట్, బలెనో, బ్రెజ్జా వంటి మోడళ్లు తమ తమ సెగ్మెంట్లలో టాప్ పొజిషన్‌లో నిలిచాయి. అయితే, ఈ విజయాల వెనుక ఒక మోడల్ మాత్రం కంపెనీకి నిరాశ కలిగిస్తోంది.. అదే మారుతి ఇన్విక్టో (Maruti Invicto). ఇన్విక్టోను మారుతి ఒక ప్రీమియమ్ MPVగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది టయోటా ఇనోవా హైక్రాస్‌పై ఆధారపడి రూపొందించబడిన మోడల్.

ఫెరారీ రేసింగ్‌లో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా

భారతీయ మోటార్‌స్పోర్ట్ ప్రపంచానికి ఇది ఒక చారిత్రాత్మక క్షణం. మహారాష్ట్రలోని పూణేకు చెందిన డయానా పుండోల్ ఇప్పుడు దేశానికి గర్వకారణమైన పేరుగా నిలిచింది. 32 ఏళ్ల వయస్సులో, ఇద్దరు పిల్లల తల్లిగా ఉన్న ఆమె, అంతర్జాతీయ స్థాయిలో ఫెరారీ రేసింగ్ సిరీస్‌లో పోటీ పడుతున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. డయానా ఈ నవంబర్ 2025 నుండి ఏప్రిల్ 2026 వరకు జరగబోయే ఫెరారీ క్లబ్ ఛాలెంజ్ మిడిల్ ఈస్ట్ సిరీస్‌లో తన ప్రతిభను ప్రదర్శించనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఛాలెంజ్ దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాల ఫార్ములా వన్ సర్క్యూట్‌లలో జరుగుతుంది. అక్కడ ఆమె ఫెరారీ 296 ఛాలెంజ్ కారును నడిపి భారత జెండాను ఎగురవేయబోతోంది.

5-స్టార్ రేటింగ్ సాధించిన మారుతి సుజుకి ఫ్రాంక్స్!

మారుతి సుజుకి ప్రసిద్ధ మోడల్ ఫ్రాంక్స్ (Fronx) ఇప్పుడు భద్రత పరంగా కొత్త గుర్తింపును సాధించింది. ఆగ్నేయాసియా దేశాలకు సంబంధించిన ASEAN NCAP (New Car Assessment Program) క్రాష్ టెస్ట్‌లో ఈ కారు తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. కేవలం మైలేజ్‌ లేదా లుక్‌లలోనే కాదు, ఇప్పుడు సురక్షిత డ్రైవింగ్‌లో కూడా మారుతి తన స్థాయిని మరొక మెట్టుపైకి తీసుకెళ్లిందని చెప్పాలి. తాజాగా నిర్వహించిన ASEAN NCAP క్రాష్ టెస్ట్‌లో ఫ్రాంక్స్ 77.70 పాయింట్ల మొత్తం స్కోరుతో 5-స్టార్ రేటింగ్ పొందింది. ఇది సాధారణ ఫలితం కాదు, ఎందుకంటే, గతంలో మారుతి కార్ల నిర్మాణ నాణ్యతపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. సేఫ్టీ లో బలహీనంగా ఉంటుంది అనే అభిప్రాయం కూడా చాలామంది వినిపించేవారు. కానీ ఈ ఫలితంతో ఆ విమర్శలకు ఫ్రాంక్స్ ఒక పక్కా సమాధానంగా నిలిచింది.
Advertisement

ఈ బైక్ మీద పోతుంటే అందరి చూపు మీ మీదే

భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో ఓలా, ఏథర్, బజాజ్, టీవీఎస్‌లతో పోటీ పడటానికి వచ్చిన ఇటాలియన్ టూ-వీలర్ తయారీ సంస్థ VLF (వెలోసిఫెరో). KAW వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం ద్వారా ఈ బ్రాండ్ దేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది. మొదట్లో EVలతో కంపెనీ దృష్టిని ఆకర్షించినప్పటికీ, ఇటీవల కొత్త 125 సీసీ పెట్రోల్ స్కూటర్‌ను ప్రవేశపెట్టి చాలా మంది మనసుల్లో చోటు సంపాదించుకుంది. టీవీఎస్ ఎన్‌టార్క్, అప్రిలియా SR సిరీస్ డామినేట్ చేస్తున్న పర్ఫార్మెన్స్ స్కూటర్ విభాగంలోకి వెలోసిఫెరో మోబ్‌స్టర్ ప్రవేశించింది.

రోజూ ఆఫీసు వెళ్లే వాళ్లకు బెస్ట్ కారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Electric SUV) సెగ్మెంట్‌లో సంచలనం సృష్టించడానికి మారుతీ సుజుకీ (Maruti Suzuki) సిద్ధమవుతోంది. వినియోగదారులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతీ సుజుకీ ఈ-విటారా (Maruti Suzuki e-Vitara) లాంచ్ తేదీ ఖరారైంది. డిసెంబర్ 2న ఈ 5-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారత మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించనుంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, రెండు స్ట్రాంగ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు, 500 కి.మీల అంచనా రేంజ్‎తో వస్తున్న ఈ కారు ధరలు, ఫీచర్లు, ప్రత్యర్థుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

టాటా నెక్సాన్ వేరియంట్ వారీగా ఆన్-రోడ్ ధరలు, EMI వివరాలు

టాటా నెక్సాన్ (Tata Nexon) ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటి. తన బలమైన డిజైన్, నాణ్యమైన నిర్మాణం, ఆధునిక ఫీచర్లు, విశ్వసనీయమైన పనితీరు వల్ల ఇది వినియోగదారులలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ SUV ఇంకా అదే ఉత్సాహంతో కొనుగోలు చేయబడుతున్నదని స్పష్టమవుతోంది. 2025 సెప్టెంబర్ నెలలో టాటా నెక్సాన్ భారీ విజయాన్ని నమోదు చేసింది. కేవలం ఒక నెలలోనే మొత్తం 22,500 యూనిట్లు డెలివరీ చేయడం ద్వారా ఇది మరోసారి మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టాటా నెక్సాన్ ధర విషయానికి వస్తే, ఇది విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 7.32 లక్షలు.

ఈ స్కూటరే కావాలంటున్న జనాలు

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ ఐగో వైజ్ మొబిలిటీ (iGo Wise Mobility) ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్మార్ట్, టెక్నాలజీ ఆధారిత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ బి-ఐగో 4ఎక్స్ (B-iGo 4X) తో ఒక కీలక మైలురాయిని సాధించింది. ఇటీవలే ప్రారంభించబడిన ఈ స్కూటర్ వినియోగదారుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. కేవలం ప్రారంభించిన మొదటి వారంలోనే బి-ఐగోకు 1,000 కంటే ఎక్కువ ముందస్తు బుకింగ్‌లు రావడం కంపెనీకి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఉన్న పెరుగుతున్న నమ్మకాన్ని మాత్రమే కాకుండా, కొత్త కంపెనీలకు కూడా అవకాశాలు ఉన్నాయని సూచిస్తుంది.
Advertisement

ఏం లుక్కురా బాబు.. కొత్త వెన్యూ N లైన్ చూశారా?

ఎస్‌యూవీ మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త మోడల్ కొనాలని అనుకుంటే ఏది కొనాలని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇందులో మిడిల్ క్లాస్ వారికి సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలంటే చాలా ఇష్టం. కుటుంబానికి సరిపడా సైజు, బడ్జెట్, మైలేజ్ అన్నీ వీటి ప్రత్యేకతలు. ఇప్పుడు అందరినీ ఆకట్టుకోవడానికి కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) సిద్ధంగా ఉంది. నవంబర్ 4న లాంచ్ కానున్న ఈ పెద్ద మోడల్ ఫోటోలు, ఇతర వివరాలను బయటపెట్టి దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ అంచనాలను పెంచుతోంది.