ఏథర్ సర్వీస్ కార్నివాల్ షురూ

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో ఏథర్ ఎనర్జీ తనదైన ముద్ర వేసింది. ఓలా వంటి పెద్ద కంపెనీలకు ముందే భారతీయ వినియోగదారులకు ఈవీ అనుభవాన్ని పరిచయం చేసిన బెంగళూరుకు చెందిన ఈ సంస్థ, నాణ్యమైన ఉత్పత్తులు, నమ్మకమైన సర్వీసులతో మార్కెట్‌లో ముందుంది. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఏథర్ తన ప్రస్తుత కస్టమర్ల కోసం ఒక ప్రత్యేక సర్వీస్ కార్నివాల్‌ను ప్రకటించింది.

మార్కెట్లోకి దర్జాగా దిగబోతున్న స్కోడా నయా కార్

భారత మార్కెట్లో తమ ఇండియా 2.0 వ్యూహంతో విజయం సాధిస్తున్న చెక్ రిపబ్లికన్ వాహన తయారీ సంస్థ స్కోడా..ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ప్రియుల కోసం ఒక కొత్త సంచలనాన్ని తీసుకురాబోతోంది. ఆటోమొబైల్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, స్కోడా చరిత్రలోనే ప్రత్యేక స్థానం ఉన్న ఒక్టావియా ఆర్ఎస్ (Octavia RS) కొత్త పెర్ఫార్మెన్స్ ఎడిషన్‌ను అక్టోబర్ 17న భారతదేశంలో లాంచ్ చేయనుంది.

ఎద్దుల బండిలో రూ.1.48 కోట్ల విలువైన కారు కొనడానికి వచ్చాడు.

సోషల్ మీడియా ట్రెండ్స్ ఈ రోజుల్లో జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా వైరల్ చేస్తుంది. ముఖ్యంగా కొత్త కారు, బైక్, లేదా ఇతర వాహనాలను కొనుగోలు చేయడం ఇప్పుడు కేవలం వ్యక్తిగత అంశం మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో పెద్ద దృష్టిని ఆకర్షించే అవకాశంగా మారింది. ప్రతి కొత్త వాహన డెలివరీని కేవలం వ్యక్తిగత ఆనందం మాత్రమే కాకుండా, అందరికి తెలిసేలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రతి ఆన్‌లైన్ ఫీడ్‌లో కొత్త వాహనాలు, డెలివరీలు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటివి మరిన్ని కనిపించాయి. కొన్ని నెలల క్రితం, ఒక వ్యక్తి తన బెంట్లీ బెంటెగా SUV డెలివరీ కోసం హెలికాప్టర్‌లో దిగిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అది సోషల్ మీడియా వినియోగదారులను, ఇతరులను కూడా ఆకర్షించింది.

ఇండియాలో ఈ కారు ఉండని ఊరు లేదు

దేశ వ్యాప్తంగా ఆటోమొబైల్ మార్కెట్లో ఈ మధ్య కాలంలో సంచలనాత్మక మార్పు తెచ్చిన అంశం ఏమిటంటే జీఎస్టీ (GST) తగ్గింపు. ఈ పన్ను తగ్గింపు కారణంగా అనేక కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా వినియోగదారులలో ఆనందం వెల్లివిరుస్తోంది. షోరూమ్‌ల ముందు కొత్త వాహనాల కోసం క్యూలు ఏర్పడుతున్నాయి. చాలా మంది తమ డ్రీమ్ కారు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. ప్రత్యేకంగా 4 మీటర్ల లోపు వాహనాల విభాగం ఈ జీఎస్టీ తగ్గింపుతో అత్యధిక లాభం పొందిన సెగ్మెంట్‌గా నిలిచింది. ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి కంపెనీకి చెందిన బ్రెజ్జా (Maruti Suzuki Brezza) మోడల్ డిమాండ్ మరింతగా పెరిగింది. బ్రెజ్జా అనేది SUV మార్కెట్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ఒక ఉత్తమ ఎంపికగా ఎప్పటి నుంచో గుర్తింపు పొందింది.
Advertisement

టయోటా కారుకు భారీ డిమాండ్

మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఎస్‌యూవీకి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. స్ట్రాంగ్ బాడీ, బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్, ఆకట్టుకునే ఫీచర్ల కారణంగా ఈ కారును కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా, జిఎస్‌టి 2.0 అమలు తర్వాత ధర తగ్గడం, పండుగ సీజన్ కలిసి రావడంతో ఈ ఎస్‌యూవీ విక్రయాలు భారీగా పెరిగాయి. రూ.10.95 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ హైరైడర్ స్పెషాలిటీ, అది అందిస్తున్న మైలేజ్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒకే కారులో 9 మంది.. రెండు కుటుంబాలకు బెస్ట్!

భారతీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా (Mahindra) అనే పేరు వినిపిస్తే, అది విశ్వసనీయతకు ప్రతీకగా గుర్తింపు పొందింది. దేశంలోని ప్రతి తరానికి, ప్రతి వర్గానికి చేరువైన బ్రాండ్‌గా మహీంద్రా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన మోడల్ మహీంద్రా బొలెరో (Bolero). ఇది కేవలం ఒక SUV మాత్రమే కాదు, భారతదేశపు రోజువారి జీవితానికి దగ్గరగా ఉన్న వాహనం అని చెప్పొచ్చు. 2000 సంవత్సరంలో మొదటిసారి మార్కెట్లోకి అడుగుపెట్టిన బొలెరో, రెండు దశాబ్దాలకుపైగా కాలాన్ని విజయవంతంగా దాటింది. ఈ కాలంలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందిందో, అలాగే బొలెరో కూడా తనను తాను పునర్నిర్మించుకుంటూ ముందుకు సాగింది.

మారుతి, టాటా, మహీంద్రా బహుపరాక్

ఇండియన్ ఆటోమోటివ్ మార్కెట్లో మరోసారి తమ సత్తా చాటడానికి రెనాల్ట్ రెడీ అవుతుంది. ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్‌ల ప్రియులకు శుభవార్త చెబుతూ రెనాల్ట్ ఏకంగా మూడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. వీటిలో రెండు పవర్‌ఫుల్ ఎస్‌యూవీలు కాగా, మరొకటి పూర్తి ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. ఈ మూడు మోడళ్లు ఆల్ న్యూ రెనో డస్టర్, రెనో బోరియల్ 7 సీటర్ ఎస్‌యూవీ, రెనో క్విడ్ ఈవీ తమ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మూడు మోడళ్ల ప్రత్యేకతలు, ఫీచర్ల వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ డెలివరీలు వాయిదా

బెంగళూరుకు చెందిన అల్ట్రావయోలెట్ (Ultraviolette) అనే సంస్థ ప్రస్తుతం దేశీయంగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా మంచి పేరు సంపాదించింది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా ఎదుగుతున్న ఈ కంపెనీ తన సాంకేతికత, డిజైన్ ప్రత్యేకతలతో యువతను ఆకట్టుకుంటోంది. ఈ సంవత్సరం మార్చిలో అల్ట్రావయోలెట్ నుంచి విడుదలైన టెస్సెరాక్ట్ (Ultraviolette Tesseract) ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ క్రమంలో మరో సంచలనాన్ని సృష్టించింది. టెస్సెరాక్ట్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, ఇది భవిష్యత్ తరహా ఆకృతి కలిగిన మోడల్. సొగసైన బాడీ లైన్లు, మస్కులర్ ఫ్రంట్ లుక్, ఆధునిక ఎయిరోడైనమిక్ ఆకారంతో ఇది నగరంలో ఎక్కడ నడిపినా అందరి చూపులు ఆకర్షించేలా ఉంటుంది.
Advertisement

కాంపాక్ట్ ఎస్‌యూవీల సమరం.

మారుతున్న కాలానికి తగ్గట్టు, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ విభాగంలో ఇప్పటికే తన సత్తా చాటుతున్న హ్యుందాయ్ క్రెటాకు, మారుతి సుజుకి నుంచి తాజాగా వచ్చిన విక్టోరిస్ గట్టి పోటీ ఇస్తోంది. ఈ రెండింటితో పాటు, ప్రీమియం విభాగంలో ఉన్న మారుతి గ్రాండ్ విటారా కూడా కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఫీచర్లు, ధర, ఇంజన్ పరంగా ఈ మూడు ఎస్‌యూవీలలో ఏది బెస్ట్? కొనుగోలుదారులు దేనిని ఎంచుకోవాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశంలో బైక్‌లా మైలేజ్ ఇస్తున్న మారుతి వ్యాగన్‌ఆర్‌ సేల్స్

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ భారతదేశంలో ప్రతి కుటుంబానికి దగ్గరైన పేరు. చిన్న కారు సెగ్మెంట్‌లో ఎంతోకాలంగా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న ఈ హ్యాచ్‌బ్యాక్, అందరికీ అందుబాటులో ఉండే సరసమైన ధరతో పాటు మెరుగైన పనితీరు, విశాలమైన ఇంటీరియర్, స్టైలిష్ లుక్‌లతో ఆకట్టుకుంటుంది. కారు మైలేజ్, విశ్వసనీయత కారణంగా ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి వర్గం ప్రజల మనసును దోచుకుంది. ముఖ్యంగా ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రభుత్వ టీచర్లు, బ్యాంక్ ఉద్యోగులు వంటి మధ్యతరగతి వర్గానికి ఇది ఒక కలల కారు లాంటిది. దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ తన మోడర్న్ డిజైన్, ఎత్తైన సీటింగ్ పొజిషన్, సౌకర్యవంతమైన క్యాబిన్, ప్రాక్టికల్ ఫీచర్లతో ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మారుస్తుంది.

టాటాకు నిద్రపట్టకుండా చేసిన కారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో ఎంజీ విండ్సర్ ఈవీ మోడల్ ప్రస్తుతం పెద్ద ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించిన టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)ని కూడా వెనక్కి నెట్టి, విండ్సర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ తాజాగా ఈ కారు కొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది. మార్కెట్‌లోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చారు. దీనికి ఎంజీ విండ్సర్ ఈవీ ఇన్‌స్పైర్ ఎడిషన్ అని పేరు పెట్టారు.

రూ.7 లక్షలకే మారుతి కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్

భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో రోజురోజుకు పోటీ తీవ్రమవుతోంది. ప్రస్తుతం టాటా మోటార్స్ ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి సంస్థ ఆ పట్టును సడలించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా, తక్కువ ధరలో ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా ఒక చవకైన ఈవీ కారును తీసుకురావాలని మారుతి ప్లాన్ చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగమే అక్టోబర్ 29న ప్రారంభమయ్యే జపాన్ మొబిలిటీ షోలో సుజుకి సంస్థ ప్రదర్శించనున్న వాహనాల వివరాలు.
Advertisement

తక్కువ ధరలో 7- సీటర్ కారు ఇదే

రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) భారత మార్కెట్లో తన డిజైన్, వాల్యూ ఫర్ మనీ ప్రైస్ ట్యాగ్తో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ఈ కారు ఒక MPV (మల్టీ పర్పస్ వెహికల్) అయినప్పటికీ, దాని లోపల ఏడు మంది సౌకర్యంగా కూర్చునే స్థలం కలిగి ఉంటుంది. 2019లో మొదటిసారి భారతదేశంలో లాంచ్ అయిన ఈ ట్రైబర్, ప్రస్తుతం కూడా కుటుంబాలకు బడ్జెట్‌లో 7 సీటర్ ఆప్షన్‌గా అత్యంత ప్రజాదరణ పొందుతోంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన సేల్స్ వివరాలు చూసినట్లయితే ఇది 2025 ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నెలలో మెరుగైన సేల్స్‌ను నమోదు చేసింది. రెనాల్ట్ ట్రైబర్ మార్కెట్లో మళ్లీ తన పాత జోష్‌ను తెచ్చుకుంటోంది. తక్కువ ధరలో లభించే 7-సీటర్ కారు కావడంతో పాటు, ఇటీవల విడుదలైన ఫేస్‌లిఫ్ట్ మోడల్ ట్రైబర్‌కు కొత్త ఊపిరి నింపింది.

కియా నయా కార్ వచ్చేసింది

భారత మార్కెట్లో ఏడు సీట్ల ఎంపీవీ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్న మోడల్ కియా కారెన్స్. ఇటీవల మరింత స్టైలిష్‌గా క్లావిస్ అనే పేరును జోడించుకున్న ఈ కారు, మంచి ఫ్యామిలీ కారు కోసం చూస్తున్న వారికి ఇష్టమైన ఎంపికగా ఉంది. ఇందులో అనేక రకాల వేరియంట్లు, ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండడం మరో విశేషం. వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకుని, తమ మోడళ్లలో అవసరమైన మార్పులు చేసే అలవాటు కియాకు ఉంది.

దేశంలో అందరూ ఎదురుచూస్తున్న కారు.. వచ్చేది అప్పుడే!

మారుతి సుజుకి (Maruti Suzuki) భారత మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ SUV‌ను ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. కంపెనీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కొత్త మోడల్ పేరు మారుతి సుజుకి e-Vitara (ఇ-విటారా). భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు చేసే తొలి పెద్ద అడుగుగా ఇది భావిస్తున్నారు. ఇ-విటారా గురించి మొదటిసారి ఈ ఏడాది జనవరిలో జరిగిన 2025 ఆటో ఎక్స్‌పోలో అధికారికంగా పరిచయం చేశారు. అప్పట్లోనే కంపెనీ దీన్ని ఈ సంవత్సరపు మొదటి అర్ధభాగం ముగిసేలోపు మార్కెట్లోకి తీసుకురావాలని ప్రణాళిక వేసింది. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా ఆ లాంచ్ వాయిదా పడింది.

టీవీఎస్ కొత్త బైక్‌పైనే అందరి దృష్టి

భారత మార్కెట్‌లో ప్రస్తుతం చాలా కంపెనీలు అడ్వెంచర్ బైకులను విక్రయిస్తున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, యెజ్డీ అడ్వెంచర్, హీరో ఎక్స్‌పల్స్ 210, కేటీఎం 250 అడ్వెంచర్ వంటి బైకులు బాగా పాపులారిటీ సంపాదించుకున్నాయి. అయితే, ఈ జాబితాలో టీవీఎస్ కంపెనీకి చెందిన బైక్ ఒక్కటి కూడా లేదు. కానీ, ఈ లోటు త్వరలోనే తీరబోతుంది. ఎందుకంటే, టీవీఎస్ సంస్థ అడ్వెంచర్ బైకుల విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
Advertisement

కొత్త ఫీచర్లతో స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన జీప్ కంపాస్ ట్రాక్ ఎడిషన్!

ప్రముఖ వాహన తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) మరోసారి భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన శక్తిని చాటుకునే ప్రయత్నం చేసింది. SUV ప్రియుల హృదయాలను గెలుచుకునే లక్ష్యంతో, కంపెనీ తన ప్రీమియం SUV మోడల్ అయిన జీప్ కంపాస్ (Jeep Compass)కు ఒక ప్రత్యేకమైన, పరిమిత ఎడిషన్ కంపాస్ ట్రాక్ ఎడిషన్ (Compass Track Edition)ను ఆవిష్కరించింది. ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం పేరు కోసం కాకుండా, పూర్తిగా ప్రత్యేకమైన డిజైన్ టచ్‌లు, సాహస యాత్రల కోసం అనుకూలమైన ఫీచర్లు, విలాసవంతమైన ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లతో రూపొందించబడింది. జీప్ బ్రాండ్‌కు ఉన్న ఆఫ్‌రోడ్ సామర్థ్యం, ప్రీమియం లగ్జరీ లుక్‌ వంటి ఈ రెండు లక్షణాలు ట్రాక్ ఎడిషన్‌లో చక్కగా కలిసిపోయాయి.

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కొత్త క్రేజ్

క్రికెట్ ప్రపంచంలో దేశానికి పేరు తెచ్చిన స్టార్ ప్లేయర్, టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ కొత్త కారు కొన్నారు. హై స్పీడ్ లగ్జరీ కార్లంటే ఇష్టపడే రోహిత్ ప్రస్తుతం ఓ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రోహిత్ కొనుగోలు చేసినా కారు టెస్లా మోడల్ Y.

పెట్రోల్, కరెంట్ ఖర్చులకు గుడ్ బై

ఇండియాలో వాహన పరిశ్రమ ఒక కొత్త మార్పునకు సిద్ధమవుతోంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్నా, కాలుష్యం సమస్య ఎక్కువవుతున్నా, వీటికి పరిష్కారంగా కొత్తతరం ఇంధనాలను తీసుకురావడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ అగ్రగామి వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌తో పాటు పూర్తిగా ఇథనాల్‌‎తో కూడా నడిచే ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారును త్వరలో భారత మార్కెట్‌కు తీసుకురానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

దేశంలో జనాలు ఎక్కువగా కొంటున్న బడ్జెట్ కారు

హ్యుందాయ్ క్రెటా SUV మార్కెట్లో నమ్మకమైన, అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌గా నిలిచింది. దీని ఆధునిక డిజైన్, అద్భుతమైన ఫీచర్లు, పోటీ ధర వినియోగదారులను ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ కారు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం, అత్యాధునిక టెక్నాలజీ, భద్రతా ఫీచర్లతో పాటు ప్రతి సెగ్మెంట్‌లో ఆకర్షణీయంగా నిలుస్తుంది. ఈ కారుకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దానికి నిదర్శనంగా గత నెల సేల్స్ నిలుస్తున్నాయి. తాజాగా వెల్లడైన గణంకాల ప్రకారం, ఈ 2025 సెప్టెంబర్ నెలలో క్రెటా SUV అమ్మకాలు విశేషంగా పెరిగాయి. సుమారు 18,861 యూనిట్లు వినియోగదారుల కోసం డెలివరీ చేయబడ్డాయి. ఆసక్తికరంగా, ఈ ఏడాది జూన్ నుండి ఆగస్టు వరకు 48,608 యూనిట్లు క్రెటా అమ్ముడయ్యాయి, ఇది మోడల్ పై వినియోగదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
Advertisement

ఈ కారు కొంటే పక్కింటోళ్లు కుళ్లు కుంటారు!

ప్రముఖ వాహన తయారీ దిగ్గజం టయోటా (Toyota) తాజాగా భారత మార్కెట్లో మరోసారి తన శక్తిని చాటుకుంది. కొత్తగా 2025 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ ఎస్‌యూవీ (Fortuner Leader Edition)ను ఆవిష్కరించింది. ఈ కొత్త వెర్షన్ డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా, రోడ్డుపై ఉనికి పరంగా ఫార్చ్యూనర్ అభిమానులను మరింత ఆకర్షించేలా రూపొందించబడింది. టయోటా ప్రతినిధుల ప్రకారం, ఈ లీడర్ ఎడిషన్‌కి ప్రత్యేకమైన స్టైలింగ్ టచ్‌లు, స్పోర్టీ లుక్, మెరుగైన ప్రీమియం ఫీచర్లు అందించబడ్డాయి. కొత్త ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌లో ఫ్రంట్ గ్రిల్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా ఉండగా, బ్లాక్ అవుట్ ట్రీట్‌మెంట్, ప్రత్యేక బాడీ గ్రాఫిక్స్, కొత్త డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ ఈ SUVకి మరింత డైనమిక్ అప్పీల్‌ను ఇస్తుంది.

ఉలిక్కి పడ్డ చిత్ర పరిశ్రమ

భూటాన్ నుంచి లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. మలయాళ సూపర్ స్టార్స్ అయిన మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, నటుడు అమిత్ చొక్కాలక్కల్ ఇళ్లతో సహా మొత్తం 17 చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఈ దాడులు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనలకు సంబంధించి జరుగుతున్నాయి.

హీరో మోటోకార్ప్ పండుగ సీజన్‌లో రికార్డ్ సేల్స్

దసరా, దీపావళి పండుగలతో దేశవ్యాప్తంగా ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది. పండుగల సీజన్ అనగానే ప్రజల్లో కొత్త వాహనాలు కొనుగోలు చేసే ఉత్సాహం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏడాది పరిస్థితులు ఆటోమొబైల్ రంగానికి చాలా అనుకూలంగా మారాయి. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ (GST) తగ్గింపు టూవీలర్ మార్కెట్‌లో కొత్త ఊపును తెచ్చింది. ముఖ్యంగా 100 సిసి, 125 సిసి విభాగాల్లో ఈ పన్ను తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్నా, జీఎస్టీ తగ్గింపుతో వాహనాల మొత్తం ధర తగ్గడం వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చింది. దీంతో మొదటిసారి బైక్ లేదా స్కూటర్ కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ కొత్త ఆసక్తి కారణంగా ద్విచక్ర వాహన మార్కెట్‌లో మళ్లీ రద్దీ పెరిగింది.

ఆ విషయంలో టాప్ 2కు చేరిన టాటా

భారతదేశంలో కార్ల అమ్మకాలు సెప్టెంబర్ 2025లో చాలా ఆసక్తికరంగా మారాయి. జీఎస్‌టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి నెల ఇదే. పండుగ సీజన్ ఆఫర్లు, తగ్గిన జీఎస్‌టీ రేట్ల కారణంగా వినియోగదారులు కార్ షోరూమ్‌లకు పరుగులు తీశారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) నివేదిక ప్రకారం.. సెప్టెంబర్‌లో ప్రయాణీకుల వాహనాల రిటైల్ అమ్మకాలు 5.8% పెరిగి 2,99,369 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, ఆగస్టుతో పోలిస్తే కొంచెం తగ్గుదల (7.39%) ఉన్నప్పటికీ, మొత్తం సంవత్సరం అమ్మకాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి.
Advertisement

నెలకు రూ.13 వేలతో అదిరిపోయే కారు

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) నమ్మకమైన SUVల జాబితాలో తనదైన స్థానం సంపాదించుకుంది. మధ్యతరగతి నుంచి యువత వరకు అందరికీ అందుబాటులో ఉండే, శక్తివంతమైన, స్టైలిష్ SUVగా ఇది భారత మార్కెట్లో వేగంగా ఆదరణ పొందుతోంది. టయోటా విశ్వసనీయత, బలమైన బాడీ క్వాలిటీ, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం కలగలిపిన ప్యాకేజీగా టైజర్‌ను మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన మోడల్‌గా నిలిపాయి. ఇటీవల GST రేట్ల సవరణ ఆటోమొబైల్ రంగానికి పెద్ద ఊపిరి అందించింది. సెప్టెంబర్ 22 నుండి కొత్త GST రేట్లు అధికారికంగా అమలులోకి వచ్చాయి, దీని ప్రభావం టయోటా వాహనాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పుతో టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ధర రూ.1.12 లక్షల వరకు తగ్గించబడింది.