దుమ్మురేపిన మహీంద్రా.. రికార్డు స్థాయిలో భారీగా పెరిగిన సేల్స్

భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక ప్రసిద్ధ పేరు మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) సెప్టెంబర్ 2025లో తన అమ్మకాల గణాంకాలను తాజాగా ప్రకటించింది. ఈ వివరాల ప్రకారం, కంపెనీ మొత్తం 1,00,298 వాహనాల అమ్మకాలు నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే సమయంలో కన్నా 16% వృద్ధిని సూచిస్తుంది, ఇందులో ఎగుమతులు కూడా ఉన్నాయి. ఈ ఫలితాలు మహీంద్రా దేశీయంగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లలో కూడా బలమైన స్థిరత్వాన్ని, స్థిరమైన వృద్ధిని ప్రదర్శిస్తున్నదని స్పష్టం చేస్తాయి. విశేషంగా, సెప్టెంబర్ 2025లో యుటిలిటీ వెహికల్ విభాగంలో మహీంద్రా తన మార్కెట్ సత్తాను మరింత స్థిరపరిచింది.

ఫ్యామిలీకి దేశంలోనే బెస్ట్ కారు.. ధర బాగా తగ్గించారు

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి ఒక అగ్రగామి సంస్థ. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్ల జాబితాలో ఎప్పటికీ అగ్రస్థానంలో నిలిచే కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ అంటే అదే మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift). ఈ కారు విడుదలైన మొదటి రోజునుంచే యువత నుంచి కుటుంబాల వరకు అందరి హృదయాలను గెలుచుకుంది. ఇంధన సామర్థ్యం, మన్నికైన ఇంజిన్, స్పోర్టీ డిజైన్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం స్విఫ్ట్‌ను ఒక పర్ఫార్మెన్స్ కార్గా నిలబెట్టాయి. ఇక ఉపయోగించిన కార్ల మార్కెట్లో కూడా స్విఫ్ట్‌కు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇతర మోడళ్లతో పోలిస్తే దీని రీసేల్ విలువ ఎక్కువగా ఉండటం వల్ల, రెండవ చేతి మార్కెట్లో కూడా ఈ కారు అత్యంత వేగంగా అమ్ముడవుతుంది. ఈ విషయమే దాని ప్రజాదరణకు నిదర్శనం.

జోరుమీదున్న టయోటా.. సెప్టెంబర్ నెలలోనే 31,091 కార్ల సేల్స్!

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్న కంపెనీలలో టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా తన మోడళ్ల నాణ్యత, నమ్మకంతో పేరుగాంచిన ఈ బ్రాండ్, భారత మార్కెట్లో కూడా వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. తాజాగా విడుదల చేసిన అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టంగా చెబుతున్నాయి. సెప్టెంబర్ 2025లో టయోటా మొత్తం 31,091 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 26,847 యూనిట్లతో పోలిస్తే 16 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ సంఖ్యలో దేశీయ మార్కెట్‌లో జరిగిన విక్రయాలు ప్రధాన పాత్ర పోషించాయి. మొత్తం అమ్మకాలలో 27,089 యూనిట్లు భారతీయ వినియోగదారుల చేతికి చేరగా, మిగిలిన 4,002 యూనిట్లు ఎగుమతి మార్కెట్‌లోకి వెళ్లాయి.

మెర్సిడెస్ కార్లలో భారీ లోపం

మీరు మెర్సిడిస్-బెంజ్ కార్ల యజమానులా? అయితే మీకో ముఖ్యమైన వార్త. మెర్సిడిస్-బెంజ్ సంస్థ తమ మూడు మోడల్స్‌కు చెందిన కొన్ని కార్లలో ఒక చిన్న సమస్యను గుర్తించి, వాటిని తిరిగి సర్వీస్ కోసం తీసుకురావాలని సంబంధిత కస్టమర్లను అభ్యర్థించింది. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2022, 2025 మధ్య తయారైన కార్లలో కేవలం నలుగురు కస్టమర్లు మాత్రమే ఈ రీకాల్ పరిధిలోకి వస్తారు. ఈ రీకాల్ వెనుక అసలు కారణం ఏమిటి, ఏ మోడల్స్ ప్రభావితం అయ్యాయి, యజమానులు ఏమి చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Advertisement

జూపిటర్ స్కూటర్ కొత్త ధరలు.. GST తగ్గింపుతో షాకింగ్ రేట్స్

సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా సవరించిన వస్తువులు, సేవల పన్ను (GST) రేట్లు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మార్పులు ముఖ్యంగా టూవీలర్ వాహనాల మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటి వరకు 350 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైకులు, స్కూటర్లపై 28 శాతం GST విధించబడుతుండగా, ఇప్పుడు దానిని 18 శాతానికి తగ్గించారు. అంటే, కస్టమర్ కొనుగోలు చేసే వాహనంపై ప్రత్యక్షంగా ధరలో తగ్గింపు లభించేలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ తగ్గింపు వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందుతున్న స్కూటర్లలో TVS జూపిటర్ ఒకటి. పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ పొందిన ఈ స్కూటర్, ఇంధన సామర్థ్యం, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి లక్షణాలతో ఇప్పటికే కుటుంబాల ఫేవరెట్‌గా నిలిచింది.

బడ్జెట్లో ఎలక్ట్రిక్ కారు కావాలా ?

నవరాత్రి పండుగను హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త పనులు ప్రారంభించడం కుటుంబానికి ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. అందుకే ఈ నవరాత్రులలో మీరు ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, ఇది చాలా మంచి సమయం.

జీఎస్టీ తగ్గింపుతో మారుతి సెలెరియో కొత్త ధరలు ఇవే

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) ఎప్పటినుంచో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే హ్యాచ్‌బ్యాక్‌గా గుర్తింపు పొందింది. తక్కువ ఖర్చుతో కారు కొనే అవకాశం ఇవ్వడంతో పాటు, మంచి మైలేజీ, సౌకర్యవంతమైన డిజైన్, సరళమైన నిర్వహణతో ఈ కారు పేద, మధ్య తరగతి కుటుంబాలకి నిజమైన తోడుగా నిలుస్తుంది. అందుకే కొత్తగా కారు కొనాలనుకునే వారిలో ఎక్కువ మంది సెలెరియో వైపు మొగ్గు చూపుతుంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వస్తు, సేవల పన్ను (GST) నిర్ణయం ఈ కారు ధరను మరింత ఆకర్షణీయంగా మార్చింది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త GST రేట్ల ప్రకారం, కార్లపై పన్ను రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించబడింది.

షోరూంలో డిస్‌ప్లే కార్లు కొంటే ఎన్ని లాభాలో ?

పండగల సీజన్ వచ్చేసింది. ఈ సమయంలో చాలా మంది కొత్త కార్లు కొనడానికి ప్లాన్ చేసుకుంటారు. అయితే, కొత్త కారు కొనేటప్పుడు చాలామంది డిస్‌ప్లే యూనిట్లు అంటే షోరూమ్‌లో ప్రదర్శనకు ఉంచిన కార్ల వైపు కన్నెత్తి కూడా చూడరు. వాటిని వాడినవి అనే భావనతో పక్కన పెట్టేస్తారు.
Advertisement

డ్రైవర్ లెస్ ఆటో వచ్చేసింది

భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబడింది. ఓమెగా సెక్కి మొబిలిటీ (Omega Seiki Mobility) కంపెనీ ప్రపంచంలోనే మొదటిసారిగా డ్రైవర్ లేకుండా నడిచే 3 వీలర్ (డ్రైవర్‌లెస్ ఆటో) ను రూపొందించి చరిత్ర సృష్టించింది. కేవలం రూ.4 లక్షల ప్రారంభ ధరతో ఈ వాహనాన్ని మార్కెట్‌లోకి తీసుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆయుధ పూజకు ముందు.. ఇంట్లోనే కారును శుభ్రం చేసే సులభమైన టిప్స్

ఆయుధ పూజ భారతీయ సంస్కృతి, సంప్రదాయం లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది కేవలం మనం ప్రతిరోజు ఉపయోగించే వాటిని, ఆయుధాలను పూజించడం మాత్రమే కాదు, వాటి ద్వారా మనకు లభించే శక్తి, రక్షణ, సామర్థ్యానికి గౌరవాన్ని చూపించే ఒక ఆధ్యాత్మిక ఆచారం. మన జీవితంలో మనం ప్రతిరోజూ ఉపయోగించే పెన్నులు, కత్తులు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కార్లు, బస్సులు, బైకులు, కార్లు వంటివి మనం ప్రతిరోజూ ఉపయోగించే సాధనాలే. దసరా పండుగ రోజు అందరు కూడా తాము రోజు ఉపయోగించే వాటికి ప్రత్యేకంగా ఆయుధ పూజ చేస్తారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆయుధ పుజను ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ రోజున, ప్రజలు తమ వాహనాలను శుభ్రం చేసుకుంటారు. ఈ ఆయుధ పూజ కోసం మీ వాహనాన్ని ఇంటి వద్దే ఎలా శుభ్రం చేయాలో ఇక్కడ కొన్ని చిట్కాలు అందించడం జరిగింది.

ప్రపంచంలో విలువైన కార్ల కంపెనీల్లో 8వ స్థానంలో మారుతి

భారతదేశంలో కార్ల గురించి మాట్లాడితే, మనకి మొదట గుర్తుకు వచ్చే పేరు మారుతి సుజుకి (Maruti Suzuki). దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారుగా అది తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. చిన్న కారు నుంచి పెద్ద ఎంపీవీ వరకు, దాదాపు ప్రతి విభాగంలోనూ తన మోడళ్లతో మార్కెట్లో ఆధిపత్యం చాటుతుంది. భారతీయ వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని, అందుబాటు ధరల్లో, విశ్వసనీయమైన, ఇంధన పొదుపు చేసే వాహనాలను అందించడం వల్లే మారుతి సుజుకి ఈ స్థాయికి ఎదిగింది. కానీ, ప్రపంచ స్థాయి పోటీ వాతావరణం మాత్రం పూర్తిగా వేరుగా ఉంటుంది. అక్కడ మారుతి సుజుకి లాంటి కంపెనీకి కేవలం స్థానిక అవసరాలు తీర్చడం సరిపోదు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థలు టయోటా, టెస్లా, వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్ వంటి దిగ్గజాలతో పోటీ పడాల్సి ఉంటుంది.

నెయ్యి అమ్ముకుంటున్న కార్ల కంపెనీ

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను తయారు చేసే పోర్షే కంపెనీ ఇప్పుడు నెయ్యిని కూడా తయారు చేసి అమ్ముతోందంటూ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఈ వార్త చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పోర్షే వంటి ప్రీమియం బ్రాండ్‌లు బ్యాగులు, పర్సులు, వాటర్ బాటిల్స్ వంటి లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను విక్రయించడం తెలిసిందే, కానీ ఆహార ఉత్పత్తుల విక్రయం గురించి తెలిసి అందరూ షాక్ అయ్యారు. అసలు ఈ వీడియోలో ఉన్న నిజానిజాలు ఏమిటి? పోర్షే నిజంగా నెయ్యి అమ్ముతోందా? ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న వాస్తవాలను ఈ వార్తలో పరిశీలిద్దాం.
Advertisement

మారుతి డిజైర్ ఇప్పుడు మరింత అందుబాటులో!

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్లలో మారుతి సుజుకి డిజైర్ ఒకటి. దీని ఆధునిక డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్, అత్యాధునిక ఫీచర్లు వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉన్నాయి. డిజైర్ కేవలం వ్యక్తిగత వినియోగదారులే కాకుండా, టాక్సీ, క్యాబ్ మార్కెట్లో కూడా విపరీతమైన ఆదరణను పొందుతోంది. అందుకే దీని అమ్మకాలు ఎప్పుడూ బలంగానే కొనసాగుతాయి. ఇటీవల ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ సెడాన్‌కి మరింత లాభం కలిగింది. సెప్టెంబర్ 22 నుంచి సవరించిన వస్తువులు, సేవల పన్ను (GST) రేట్లు అమలులోకి వచ్చాయి. ఈ మార్పు ప్రభావం నేరుగా వినియోగదారులపై పడింది. ముఖ్యంగా డిజైర్ వంటి పాపులర్ కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. మారుతి సుజుకి డిజైర్ ధర దాదాపు రూ. 87,700 వరకు తగ్గించబడింది.

టెస్లా కారుతో పాటు ఏమేమి ఇస్తారంటే

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎంతో కాలంగా ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla), తన కార్ల డెలివరీలను భారత్‌లో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా టెస్లా కార్ల కోసం భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ డెలివరీలు మొదలవడం కారు ప్రియులలో ఉత్సాహాన్ని నింపింది.

కొత్త కారులో ఈ ఫీచర్ ఉండాల్సిందే

కొత్త కారు కొనాలనుకునే చాలా మంది దాని డిజైన్, మైలేజ్, ఫీచర్లు, ధర వంటి వాటిపైనే ఎక్కువ దృష్టి పెడతారు. కానీ, డ్రైవింగ్ అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరిచే ఒక ముఖ్యమైన అంశాన్ని తరచుగా విస్మరిస్తుంటారు. అదే పవర్ స్టీరింగ్. ముఖ్యంగా నగరాల్లో, ట్రాఫిక్‌లో లేదా తక్కువ వేగంతో కారు నడుపుతున్నప్పుడు పవర్ స్టీరింగ్ ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో అనుభవించిన వారికి తెలుస్తుంది.

టీవీఎస్ జూపిటర్ స్కూటర్ సేల్స్ అదిరిపోయాయి

భారతీయ స్కూటర్ మార్కెట్‌ గురించి చెప్పుకుంటే, హోండా యాక్టివా (Honda Activa) పేరు ముందుగా వినిపించడం సహజమే. కానీ, అదే స్థాయిలో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మరో స్కూటర్‌ టీవీఎస్ జూపిటర్ (Tvs Jupiter). యాక్టివాతో నేరుగా పోటీ పడుతున్నప్పటికీ, జూపిటర్‌కు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. దాని నమ్మకమైన పనితీరు, సౌకర్యవంతమైన డిజైన్, ఇంధన సామర్థ్యం వంటివి వినియోగదారుల మన్ననలు పొందే ప్రధాన కారణాలు. ఇది కేవలం మాటల్లోనే కాదు, అమ్మకాల గణాంకాలు కూడా దీనికి సాక్ష్యం చెబుతున్నాయి. ఆగస్టు 2025లో టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఒక్క ఆగస్టు నెలలోనే 1,42,411 యూనిట్ల జూపిటర్ అమ్ముడవడం ఒక పెద్ద మైలురాయి.
Advertisement

సింగిల్ ఛార్జ్‎తో 323 కి.మీ..డిజైన్ అదుర్స్, ఫీచర్లు సూపర్..మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ బైక్ సంచలనం

Ultraviolette X47 భారతదేశంలో ప్రారంభించబడింది, ఇది 323 కిలోమీటర్ల పరిధిని మరియు అధునాతన ఫీచర్లను అందిస్తుంది. ధర, పనితీరు మరియు లభ్యత గురించి తెలుసుకోండి. | Ultraviolette X47 Bhaarathadheshamlo Praarambhimchabadindhi, Idhi 323 Kilomeetarla Paridhini Mariyu Adhunaathana Feecharlanu Andhistundhi. Dhara, Panitheeru Mariyu Labhyatha Gurinchi Telusukondi.

2024 చివర్లో లాంచ్.. 2025లోనే స్కోడా కైలాక్ సేల్స్ 30 వేల దాటేశాయి

స్కోడా ఇండియా ఇటీవల కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో విడుదల చేసిన కైలాక్ (Kylaq) కారు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. తొమ్మిది నెలల క్రితం ఎంట్రీ లెవల్ SUVగా మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ మోడల్, తక్కువ సమయంలోనే వినియోగదారుల మనసులను దోచుకుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, 2024 చివర్లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 30,000 యూనిట్లకు పైగా అమ్మకాల మైలురాయిని చేరుకుంది. 2025 జనవరి నుండి ఆగస్టు వరకు గణాంకాలను పరిశీలిస్తే, స్కోడా మొత్తం 46,000 యూనిట్ల కార్లను విక్రయించింది. అందులో కైలాక్ SUV ఒంటరిగా 65% వాటా సాధించడం విశేషం. అంటే, ఈ SUV మార్కెట్లో ఎంత పాపులర్ అయిందో ఈ సంఖ్యలు స్పష్టంగా చెబుతున్నాయి.

రూ.10 లక్షల్లోపు 5 స్టార్ రేటింగ్ కారు

దేశవ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. ఈ తరుణంలో కొత్త కారు కొనాలనుకునే వాళ్లకు శుభవార్త. సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ (Citroen Aircross) కారు Bharat NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దల భద్రత విషయంలో ఏకంగా 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ పరీక్షలలో ఎయిర్‌క్రాస్ కారు 5S వేరియంట్‌ను ఉపయోగించారు.

ఈ కారును 7 మంది మాత్రమే కొన్నారు

ఫ్రెంచ్ ఆటోమొబైల్ బ్రాండ్ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుండి తనదైన ప్రత్యేకతను చూపించగలిగింది. డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా, అలాగే కొత్తదనాన్ని కోరుకునే వినియోగదారులకు ఈ కంపెనీ వాహనాలు ఒక ప్రత్యామ్నాయంగా నిలిచాయి. అయితే, అందులో భాగంగా విడుదలైన సిట్రోయెన్ బసాల్ట్ (Citroen Basalt) మాత్రం ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. తక్కువ ధర శ్రేణిలో ఉండి, ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉన్నప్పటికీ, ఈ SUV భారతీయ మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా వెలువడిన ఆగస్టు 2025 అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సిట్రోయెన్ బసాల్ట్ గత నెలలో కేవలం 7 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది. ఇది ఒక అంతర్జాతీయ బ్రాండ్ SUVకి చాలా తక్కువ సంఖ్య.
Advertisement

ఆగస్టు 2025లో బజాజ్ ప్లాటినా బైక్ సేల్స్ 39,110 యూనిట్లు

భారతదేశంలో తక్కువ ధరతో పాటు అధిక మైలేజీ ఇస్తే సరిపోతుంది, ఆ బైక్ మార్కెట్లో మంచి స్థానం సంపాదిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్ల అంచనాలను సరిగ్గా తీర్చిన మోడళ్లలో బజాజ్ ప్లాటినా (Bajaj Platina) ఎప్పటినుంచో ముందు వరుసలో నిలుస్తోంది. ఎందుకంటే, ఈ బైక్ కేవలం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండటం మాత్రమే కాదు, లీటరుకు అధిక మైలేజీని కూడా ఇస్తోంది. దీంతో ముఖ్యంగా రోజువారీ ప్రయాణం చేసే మధ్యతరగతి వినియోగదారులకు ఇది అత్యంత సరైన ఎంపికగా మారింది. ఇది దాదాపు లీటరుకు 75 నుంచి 90 కి.మీల వరకు ఇస్తోంది. ఆగస్టు 2025లో బజాజ్ ప్లాటినా అమ్మకాలు బాగానే జరిగాయి. మార్కెట్‌ డేటా ప్రకారం, ఈ నెలలో మొత్తం 39,110 యూనిట్లు విక్రయించబడ్డాయి. అయితే ఇది గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే కొద్దిగా తగ్గుదలని చూపించింది.

అభిషేక్ శర్మకు బంపర్ గిఫ్ట్

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించగా ఈ టోర్నమెంట్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ తన మెరుపు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. నిలకడగా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్‌ను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‎గా ఎంపిక చేశారు. ఈ పురస్కారం కింద అతనికి బహుమతిగా ఒక లగ్జరీ HAVAL H9 SUV లభించింది. టయోటా ఫార్చ్యూనర్ వంటి కార్లకు గట్టి పోటీనిచ్చే ఈ SUV ధర, ప్రత్యేకతలు ఏంటి? అసలు ఈ కారు విశేషాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం.

ట్యాంక్ కన్నా ఎక్కువ పెట్రోల్ పోశారు.. యజమాని షాక్ అయ్యాడు

భారతదేశంలో పెట్రోల్ పంపుల వద్ద ఫ్యూయల్ సంబంధిత గొడవలు కొత్త విషయం కాదు. సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో దేశంలో ఏ మూలన గొడవలు చోటుచేసుకున్న అవి క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన ప్రత్యేకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, తెల్లటి కలర్‌లో మెరిసిపోతున్న BMW 5 సిరీస్ లగ్జరీ సెడాన్ యజమాని సాయంత్రం 6 గంటలకు, కర్నాల్ హైవేలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ పంప్‌లో తన వాహనానికి ఫుల్ ట్యాంక్ నింపడానికి వెళ్ళాడు. అతను బంక్ సిబ్బందికి స్పష్టంగా, తన కారులో పూర్తిగా ఫ్యూయల్ నింపాలని అడిగాడు.

హీరో 12.5కోట్ల మంది నమ్మకం

భారతీయ టూ వీలర్ ఇండస్ట్రీలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికిన హీరో హోండా మోటార్స్ 1984లో ప్రారంభమైంది. అప్పటినుండి నేటి వరకు అంటే 41 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో ప్రస్తుతం స్వతంత్ర సంస్థగా ఉన్న హీరో మోటోకార్ప్ ఒక అసాధారణ రికార్డును నెలకొల్పింది. ఈ సంస్థ ఏకంగా 125 మిలియన్ల (12.5 కోట్ల) టూ వీలర్లను ఉత్పత్తి చేసి, భారతీయ ప్రజల ఆదరణను మరోసారి నిరూపించింది.
Advertisement

తక్కువ EMIలో దొరుకుతోన్న కొత్త మారుతి ఎస్-ప్రెస్సో!

భారతదేశంలో సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో కార్లను అందించడంలో మారుతి సుజుకి(Maruti Suzuki) ఎప్పటికీ ముందంజలో ఉంటుంది. కుటుంబ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని, తక్కువ ఖర్చుతో, ఎక్కువ మైలేజ్ ఇస్తూ, సులభంగా నిర్వహించగలిగే వాహనాలను అందించడం ఈ కంపెనీ ప్రత్యేకత. తాజాగా ప్రభుత్వం జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల కార్ల ధరలు భారీగా పడిపోయాయి. ఈ తగ్గింపుతో మారుతి కార్లపై కూడా వినియోగదారులు మంచి లాభాన్ని పొందే అవకాశం కలిగింది. మారుతి సుజుకి తయారుచేసిన ప్రసిద్ధ మోడల్ ఎస్-ప్రెస్సో (S-Presso) ఇప్పుడు మరింత అందుబాటు ధరలో లభిస్తోంది. సాధారణంగా చిన్న కుటుంబాలకు లేదా మొదటి కారు కొనుగోలు చేసేవారికి ఇది సరైన ఎంపికగా మారుతుంది.