భారత్‌లో ప్రవేశించిన VLF మాబ్‌స్టర్ స్కూటర్

ఇటాలియన్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు VLF భారతీయ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని, ఈ కంపెనీ KAW వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో దేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ బ్రాండ్, స్టైలిష్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన పనితీరు కలిగిన మోడల్‌ను పరిచయం చేసింది, అదే VLF మాబ్‌స్టర్ 135 (VLF Mobster 135). ఈ స్కూటర్ ప్రత్యేకంగా యువతను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది. రోజువారీ ప్రయాణాల్లో స్టైల్‌తో పాటు వేగం, పనితీరుకు కూడా ప్రాధాన్యత ఇచ్చే రైడర్‌లకు ఇది మంచి ఎంపిక అవుతుంది. బోల్డ్ డిజైన్, స్పోర్టీ ప్రెజెన్స్, అగ్రెసివ్ లుక్ కలిపి మాబ్‌స్టర్ ను రోడ్డుపై ప్రత్యేకంగా నిలబెడతాయి.

ఇండియన్ కార్లే కావాలంటున్న జపాన్ జనం.. రికార్డ్ క్రియేట్ చేసిన హోండా

మేక్ ఇన్ ఇండియా నినాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఒకప్పుడు విదేశీ కార్ల కోసం ఎదురుచూసిన మనం, ఇప్పుడు మన దేశంలో తయారైన కార్లను ప్రపంచంలోని ఇతర దేశాలకు గర్వంగా ఎగుమతి చేస్తున్నాం. ఈ ఘనతలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా కార్స్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఈ సంస్థ భారతదేశంలోని తమ ప్లాంట్ నుండి ఏకంగా 2 లక్షల కార్లను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి చేసింది.

గత ఏడాదితో పోలిస్తే గ్లాంజా అమ్మకాల్లో భారీ పెరుగుదల

భారత మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఎప్పటికప్పుడు మంచి పోటీ నెలకొంటుంది. ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా మోడళ్లకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. బాలెనో ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నప్పటికీ, అదే మోడల్‌ను రీబ్యాడ్జ్ చేసి టయోటా గ్లాంజా (Toyota Glanza) పేరుతో కూడా అమ్మకం చేయడం రెండు కంపెనీలకూ లాభదాయకంగా మారింది. గ్లాంజా గురించి చెప్పుకుంటే, ఇది డిజైన్, ఫీచర్లు, పనితీరు పరంగా బాలెనోతో సమానమైనదే అయినా, టయోటా బ్రాండ్ నమ్మకం దానిని మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు టయోటా గ్లాంజాను కూడా ప్రధానంగా పరిగణిస్తున్నారు.

కారుకి స్క్రాచెస్ పడ్డాయా?..ఇంట్లోనే ఈ చిట్కాలతో ఈజీగా తొలగించండి

ప్రతి ఒక్కరూ తమ కారు ఎప్పుడూ మెరిసిపోతూ, కొత్త దానిలా కనిపించాలని కోరుకుంటారు. కారును ఎంత జాగ్రత్తగా నడిపినా, పార్క్ చేసినా, అనుకోకుండా జరిగే చిన్న చిన్న సంఘటనలు, రద్దీగా ఉండే పార్కింగ్ ప్రదేశాలలో జరిగే రాపిడి, దారిన పోయే చిన్నపిల్లలు చేసే అల్లర్లు లేదా చిన్నపాటి ప్రమాదాలు కారు బాడీపై స్క్రాచ్‌లు ఏర్పడేలా చేస్తాయి. ఈ స్క్రాచ్‌లు కారు అందాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. కారు పాతదిగా కనిపించేలా చేస్తాయి.
Advertisement

భారత్ NCAPలో ఫుల్ 5-స్టార్ రేటింగ్ సాధించిన మారుతి ఇన్విక్టో!

టాటా, మహీంద్రా తర్వాత ఇప్పుడు మారుతి సుజుకి కూడా భద్రతా పరంగా తన శక్తిని నిరూపించుకుంటోంది. ఇప్పటి వరకు మారుతి కార్లు అంటే కేవలం మైలేజ్ మాత్రమే, సేఫ్టీ అంతంత మాత్రంగానే అనే భావన ఎక్కువమందిలో ఉండేది. కానీ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసేలా మారుతి సుజుకి వరుస విజయాలు సాధిస్తోంది. ఇంతకుముందే గ్లోబల్ NCAP, భారత్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో మారుతి సుజుకి డిజైర్, విక్టోరిస్ లాంటి కార్లు అద్భుతంగా రాణించి పూర్తి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకున్నాయి. ఇది మారుతి ప్రయాణంలో కీలక మలుపుగా మారింది. ఎందుకంటే, ఇప్పటి వరకు ఫ్యామిలీ కార్లలో మారుతి ప్రధానంగా ఫ్యూయల్ ఎఫిషెన్సీ, తక్కువ మెయింటెనెన్స్‌పై దృష్టి పెట్టేది. ఇప్పుడు అదే కంపెనీ తన కార్లను అంతర్జాతీయ ప్రమాణాల భద్రతా ప్రమాణాలతో అందించడం విశేషం.

వ్యాగన్ఆర్ కొత్త ధరలు వేరియంట్ వారీగా చూద్దాం

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki Wagonr) భారత మార్కెట్లో ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్‌గా నిలుస్తుంది. ఈ మోడల్ ఇండియాలో చాలా మందికి ఫేవరెట్ కారు. ముఖ్యంగా ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రభుత్వ టీచర్లు మొదలగు వారు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుబాటు ధరలో లభిస్తూ మంచి మైలేజ్ ఇవ్వడంలో ప్రసిద్ధి చెందింది. స్టైలిష్ డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, ఫీచర్లతో, వ్యాగన్ఆర్ ప్రతి ఒక్కరికీ ఆకర్షణీయంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా GST 2.0 రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చిన తరువాత, వ్యాగన్ఆర్ తన పూర్తి ప్రయోజనాన్ని పొందింది. కొత్త జీఎస్‌టి రేట్లతో, ఈ హ్యాచ్‌బ్యాక్ ధరలో రూ.79,600 వరకు తగ్గింపు కనిపిస్తుంది. ఈ తగ్గింపు కేవలం ఒక వేరియంట్‌కి మాత్రమే కాకుండా, వ్యాగన్ఆర్ ప్రతి వేరియంట్‌లో వర్తిస్తుంది.

కైనెటిక్ ఈ-లూనా ప్రైమ్.. పెట్రోల్ బైకులను పక్కన పెట్టేయాల్సిందే

భారతదేశంలో టూ వీలర్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ కైనెటిక్ గ్రీన్ తమ E-Luna Prime ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. కేవలం కొన్ని నెలల్లోనే 25,000 యూనిట్లకు పైగా అమ్ముడైన పాత E-Lunaకు ఇది మరింత అప్‌డేటెడ్ వెర్షన్.

వోల్వో EX30 ఎలక్ట్రిక్ SUV ఇండియా లాంచ్.. ధర, బ్యాటరీ, ఫీచర్స్

వోల్వో సరికొత్త EX30 ఎలక్ట్రిక్ SUVను భారత EV మార్కెట్లోకి ఇటీవల తీసుకొచ్చింది. ఈ SUV చూడగానే ఆకట్టుకునే ప్రత్యేకమైన డిజైన్, ప్రతి కోణంలో ఉన్న ప్రీమియం ఫినిషింగ్, డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తోంది. వోల్వో EX30 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.41 లక్షలుగా నిర్ణయించగా, కంపెనీ మరో ఆఫర్ కూడా అందించింది. అక్టోబర్ 19 వరకు బుకింగ్ చేసుకునే కస్టమర్లకు ప్రత్యేకంగా రూ.39.99 లక్షలకే SUVను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ వలన ప్రీమియం సెగ్మెంట్‌లో SUV కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించే వినియోగదారులు మరింత ముందుగానే బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Advertisement

GST పెరిగినా నో టెన్షన్.. బీఎస్ఏ గోల్డ్ స్టార్‌పై భారీ ఆఫర్

బైక్ లవర్స్ అందరికీ నిజంగా ఇది ఓ పండుగలాంటి వార్తే. ఒకప్పుడు ఎంతో పేరుగాంచిన మోటార్‌సైకిల్ బ్రాండ్ BSA, తమ పవర్‌ఫుల్ గోల్డ్‌స్టార్ 650సీసీ బైక్‌పై ఓ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఇటీవల GST 2.0 నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత, 350సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్‌ల ధరలు చాలా వరకు పెరిగాయి.

ఈ బైక్‌లో ఏముంది? ఒక్కరోజులో 3,000 మంది బుకింగ్

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) యాజమాన్యంలోని అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్ భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. ఇప్పటికే ప్రీమియం సెగ్మెంట్‌లో విభిన్నమైన డిజైన్లు, అధునాతన సాంకేతికతతో EV బైకులు అందిస్తున్న ఈ కంపెనీ, ఇప్పుడు మరింత విస్తృతమైన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. అదే దిశగా తాజాగా X-47 క్రాస్‌ఓవర్ (X-47 Crossover)‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. డిజైన్ పరంగా, టెక్నాలజీ పరంగా X-47 క్రాస్‌ఓవర్ ప్రత్యేకంగా నిలుస్తోంది. స్పోర్టీ లుక్‌తో పాటు క్రాస్‌ఓవర్‌కి తగిన స్టాన్స్ ఇవ్వడం వలన, ఇది యువతను ఆకర్షించేలా ఉంది. పైగా, అధిక పనితీరును అందించగల బ్యాటరీ టెక్నాలజీ, రైడర్‌కి సౌకర్యవంతమైన ఫీచర్లు ఇందులో ఉండటం వలన ఇది EV అభిమానుల దృష్టిని వెంటనే ఆకర్షించింది.

కోట్ల కారు కాదు.. బుల్లి కారే బెస్ట్.. రోల్స్ రాయిస్ ఘోస్ట్ బ్రేక్‌డౌన్

రూ. 10 కోట్లు పెట్టి కొన్న లగ్జరీ కారు వర్షపు నీటిలో ఆగిపోతే ఎలా ఉంటుంది? ప్రస్తుతం అదే జరిగింది. కోల్‌కతాలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై వరద భారీగా నిలిచిపోగా.. అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II కారు మధ్యలోనే బ్రేక్‌డౌన్ అయింది. పక్కనుంచి రూ.10 లక్షల టాటా కారు దూసుకుపోతుంటే, కోట్ల కారు మొరాయించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, చిన్న కార్లే నయమని కామెంట్ చేస్తున్నారు.

మారుతి సుజుకి ఇగ్నిస్ డిమాండ్ తగ్గింది

మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis) భారత మార్కెట్లో ఒక ప్రత్యేకమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా గుర్తింపు పొందింది. కాంపాక్ట్ డిజైన్‌తో పాటు ఆధునిక లుక్స్, స్పోర్టీ స్టాన్స్, యువతను ఆకట్టుకునే ఎక్స్‌టీరియిర్ స్టైలింగ్ కారణంగా ఇగ్నిస్ ఎప్పటికప్పుడు తన సత్తాను చూపిస్తుంది. సధారణంగా హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఇటీవల కాలంలో కొంత డిమాండ్ తగ్గింది. దీనిని రుజువు చేస్తూ, గత నెలలో ఇది ఆశించిన మేరకు అమ్మకాలను సాధించలేకపోయింది. అమ్మకాల పరంగా చూస్తే ఈ ఆగస్టు నెల ఇగ్నిస్‌కు అంత బలమైన ఫలితాలు ఇవ్వలేకపోయింది. మొత్తం 2,097 యూనిట్ల డెలివరీ మాత్రమే జరిగాయి. ఈ సంఖ్యను గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే, గణనీయమైన తేడా కనిపిస్తోంది. 2024 ఆగస్టులో 2,464 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది మాత్రం దాదాపు 15 శాతం తగ్గుదల నమోదైంది.
Advertisement

6 ఎయిర్‌బ్యాగ్‌లు, బోలెడు ఫీచర్లు.. 5 లక్షలకే ప్రీమియం కారు

తక్కువ బడ్జెట్‌లో, ఎక్కువ ఫీచర్లు, మంచి సేఫ్టీని కోరుకునే వినియోగదారులకు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఒక మంచి ఆప్షన్. దీని ప్రారంభ ధర కేవలం రూ.5.47 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే. ఇంత తక్కువ ధర ఉన్నప్పటికీ, నియోస్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లను అందించారు. ఇది మార్కెట్‌లో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్, ఇగ్నిస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే, ఆగస్టు 2025లో ఈ కారు అమ్మకాలు కొంచెం తగ్గాయి.

22 ఏళ్ల తర్వాత మారుతి సుజుకి లోగోలో మార్పు.. కారణం ఏంటంటే?

చీకట్లోనైనా సులభంగా గుర్తించగలిగే బ్రాండ్ లోగో ఏదని అడిగితే, తడుముకోకుండా మారుతి సుజుకి అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే చిన్నతనం నుంచీ మనం చూస్తున్న లోగో అది. అలాంటి మారుతి సుజుకి ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత తమ లోగోలో మార్పు తీసుకొచ్చింది. అసలు ఈ లోగో మార్చడానికి వెనుక ఉన్న కారణం ఏమిటి? కొత్త లోగోతో పాటు వచ్చిన బై యువర్ సైడ్ అనే ట్యాగ్‌లైన్ అర్థం ఏమిటి? ఈ కొత్త లోగోతో రాబోతున్న కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ విక్టోరిస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 22 ఏళ్ల తర్వాత కొత్త లోగోతో మారుతి సుజుకిభారతదేశంలో అత్యంత సుపరిచితమైన బ్రాండ్ లోగోలలో మారుతి సుజుకి ఒకటి. దశాబ్దాలుగా మనకు అలవాటైన ఆ లోగో, ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత కొత్త రూపంలో కనువిందు చేయబోతోంది. కేవలం లోగో మార్చడమే కాకుండా బై యువర్ సైడ్ అనే కొత్త ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేసింది. దీని ద్వారా వినియోగదారుల పట్ల తమ నిబద్ధతను, వారి అవసరాలపై తమ దృష్టిని స్పష్టం చేస్తోంది.

రోజూ ఎక్కువ కిలోమీటర్లు వెళ్లేవారికి బెస్ట్ ఆప్షన్ బజాజ్ ప్లాటినా బైక్

బజాజ్ ప్లాటినా (Bajaj Platina) 2006లో మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, మార్కెట్లో తన ప్రత్యేక స్థానం నిలబెట్టుకుంటోంది. ప్రతి రోజు ఉద్యోగానికి వెళ్లే వారైనా, కాలేజీకి వెళ్లే స్టూడెంట్ అయినా, లేదా చిన్న వ్యాపారం చూసుకునే వ్యక్తి అయినా, ప్లాటినా అందరికీ సులభంగా సరిపోయే, నమ్మకమైన ఆప్షన్‌గా మారింది. తక్కువ ధరలో అందుబాటులో ఉండటం, పెట్రోల్ ధరలు పెరిగినా భారం కాకుండా, 70 నుండి 90 కి.మీ. వరకు మైలేజ్ ఇవ్వగలగడం, ఈ బైక్ నిజమైన బలం. డైలీ రైడ్ కోసం అవసరమయ్యే సమర్థత, ఇంధన సామర్థ్యం, తక్కువ ఖర్చులు ప్లాటినాకు ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. మారుతున్న ట్రెండ్స్, పెరుగుతున్న పోటీ మధ్య కూడా, ప్లాటినా తన క్రేజ్‌ను కోల్పోలేదు.

మోహన్ లాల్ గ్యారేజీలో అరుదైన, ఖరీదైన కార్లు.. మీరు ఓ లుక్కేయండి

భారతీయ సినీ పరిశ్రమలో విశిష్ట స్థానం కలిగిన నటుడు మోహన్ లాల్ (Mohanlal), ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఈ అత్యున్నత చిత్రపరిశ్రమ పురస్కారం, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయనకు సెప్టెంబర్ 23, 2025న జరగనున్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో అందించబడింది. మోహన్ లాల్ కేవలం ఒక నటుడే కాదు; దర్శకుడు, నిర్మాత, గాయకుడిగా కూడా దేశీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. మళయాళం సినిమాలతోపాటు, ఇతర భాషల్లో తెలుగు సహా, స్టార్డమ్, అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇలాంటి ప్రతిభ కలిగిన ఆయనికి లగ్జరీ కార్ల పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది.
Advertisement

దసరాకి కారు కొనాలనుకునే వారికి ముఖ్య సూచనలు

నవరాత్రి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన, సుదీర్ఘంగా జరుపుకునే ఉత్సవాల్లో ఒకటిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం హిందువులు ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే అట్టహసంగా జరుగుతుంది. ఈ సంవత్సర నవరాత్రి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఘనంగా జరగుతుంది. ఈ పండుగల సీజన్‌లో చాలా మంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. పండుగ టైంలో వాహనం ఇంటికి తెచ్చుకుంటే కలిసి వస్తుందని అందరి భావన. ఇప్పటికే జీఎస్టీ తగ్గింపు కూడా అమల్లోకి రావడంతో తక్కువ ధరలో బైకులు, కార్లు వస్తున్నాయని చాలా మంది షోరూమ్‌లకు ఎగబడుతున్నారు.

చిన్న కార్లకు రారాజు.. 8 ఏళ్లుగా మార్కెట్లో ఇదే హవా!

టాటా మోటార్స్ కంపెనీ కార్ల మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చింది. 8 సంవత్సరాల క్రితం అంటే 2017లో మార్కెట్లోకి వచ్చిన టాటా నెక్సాన్ ఇప్పుడు యువతలో బాగా పాపులర్ అయిన ఎస్‌యూవీ. ఈ కారు తన ప్రయాణాన్ని విజయవంతంగా ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

కస్టమ్స్‌ అధికారుల దాడిలో దుల్కర్ సల్మాన్ లగ్జరీ కార్లు స్వాధీనం

దేశంలో లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ కేసు ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. భూటాన్ నుంచి లగ్జరీ కార్లను అక్రమంగా భారత్‌కు తీసుకువచ్చి, ఇక్కడ రోడ్లపై నడుపుతున్నారనే అనుమానాలపై కస్టమ్స్‌ అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్‌ నుమకూర్‌ అనే పేరు పెట్టి, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 23న కేరళలోనే సుమారు 30 ప్రాంతాల్లో అధికారులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున సినీ ప్రముఖుల ఇళ్లు కూడా చేరాయి. ముఖ్యంగా మళయాళ సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, అమిత్ చొక్కాలకల్ నివాసాలు సోదా చేసిన ప్రాంతాల్లో ఉన్నాయి.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫ్యాక్టరీలో సైబర్ దాడి కలకలం

సైబర్ నేరాలు ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. కంపెనీలను, ప్రభుత్వ వ్యవస్థలను టార్గెట్ చేసే హ్యాకర్లు ఇప్పుడు లగ్జరీ కార్ల తయారీ సంస్థలను కూడా విడిచి పెట్టడం లేదు. దీనికి తాజా ఉదాహరణ.. టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్). సెప్టెంబర్ 2న జరిగిన సైబర్ దాడి కారణంగా కంపెనీ తన కార్ల ఉత్పత్తిని వచ్చే అక్టోబర్ 1వరకు నిలిపివేసింది.
Advertisement

యువ జంట పోలీసు జీపుపై అసభ్యకర ప్రవర్తనతో వైరల్

నేటి యువతరంలో చాలా మంది చెడు వ్యసనాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. స్త్రీ-పురుషుల తేడా లేకుండా మధ్య తాగుతూ రోడ్లపై ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో చాలా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటివి వెంటనే వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇటీవల ఒక యువ జంట బహిరంగ ప్రదేశంలో ఘర్షణ సృష్టించింది. మద్యం ప్రభావంలో, వారు ఏకంగా పోలీసు జీపుపై ఎక్కి గొడవ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ సంఘటన చాలా వేగంగా వైరల్ అయింది, ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చర్చకు కేంద్రంగా మారింది. దీనిని మేము న్యూస్ 24 యూట్యూబ్ ఛానెల్‌ నుంచి తీసుకున్నాం.

బైక్ కంటే స్పీడుగా వెళ్లే స్కూటర్.. ఇది ఎక్కారంటే రేసింగ్ ఫీల్ పక్కా

భారతదేశంలో స్కూటర్లకు మంచి ఆదరణ ఉంది. హోండా యాక్టివా నుండి ప్రారంభించి, మార్కెట్లో ఇప్పుడు చాలా రకాల స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. స్పోర్టీ లుక్‌తో కూడిన పెర్ఫార్మెన్స్ స్కూటర్‌ను భారతీయులకు మొదటిసారి పరిచయం చేసింది ఇటాలియన్ బ్రాండ్ అప్రిలియా. ఇప్పుడు యూత్ ను లక్ష్యంగా చేసుకుని, కొత్త 175 సీసీ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ MotoGP రేసింగ్ ప్రియులను ఆకట్టుకోవడం ఖాయం.

జీఎస్టీ తగ్గింపు తర్వాత ఒక్క రోజే 10,000 కార్ల డెలివరీ

భారతదేశంలో జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చిన 22వ తేదీ ఆటోమొబైల్ రంగానికి ఒక కీలక మలుపు తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం, వాహనాలపై జీఎస్టీ పన్ను రేటును 28 శాతం నుంచి కేవలం 18 శాతానికి తగ్గించారు. అంతేకాకుండా, ఇంతకు ముందు వాహనాలపై అదనంగా విధించే సెస్ కూడా తొలగించబడింది. దీని ఫలితంగా చిన్న కార్ల నుంచి మధ్యతరహా కార్ల వరకు అన్ని వర్గాల్లో ధరలు గణనీయంగా తగ్గాయి. లగ్జరీ వాహనాల విషయంలో మాత్రం 40 శాతం జీఎస్టీ పన్ను కొనసాగుతున్నప్పటికీ, గతంతో పోలిస్తే మొత్తం వ్యయం కొంతవరకు తక్కువయ్యింది. ఈ మార్పు ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక పెద్ద ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసిన కస్టమర్లు, జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన వెంటనే షోరూమ్‌లకు తరలి వచ్చారు.

కాంతార స్టార్ రిషబ్ శెట్టి కలెక్షన్‌లో ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా ?

కాంతార చాప్టర్ 1 సినిమాతో దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాంతార ఫస్ట్ పార్టుతో 100కోట్లు కొల్లగొట్టి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న రిషబ్ శెట్టికి కార్లంటే కూడా చాలా ఇష్టం.
Advertisement

ఒకే రోజు 30,000 కార్ల డెలివరీలు.. మారుతి సుజుకి రికార్డ్!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఆటోమొబైల్ రంగానికే కాదు, వినియోగదారులకూ కూడా శుభవార్తగా మారింది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం, వాహనాలపై ఇంతవరకు 28 శాతం వసూలు చేసిన పన్ను 18 శాతానికి తగ్గించబడింది. ఈ నిర్ణయం అమలులోకి రావడంతో దేశవ్యాప్తంగా కార్లు, బైకుల ధరలు గణనీయంగా తగ్గాయి. ధరలు పడిపోవడంతో వినియోగదారుల్లో ఉత్సాహం రెట్టింపైంది. అసలుకే దేశంలో దసరా పండుగ సమయం దగ్గరపడుతుండటంతో, ప్రజలు ఈ సమయంలో కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అలాంటి సమయంలో ధరలు తగ్గడంతో, ఈ అవకాశం వదులుకోవద్దని భావించి, షోరూమ్‌లకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.