నవరాత్రి, జీఎస్టీ తగ్గింపు.. ఈ డబుల్ ధమాకాతో కార్ల రికార్డు సేల్స్!

సాధారణంగా దసరా పండుగ సమయంలో కార్ల అమ్మకాలు అవి ఏ కంపెనీ అయినా ఎక్కువగానే ఉంటాయి. ఈసారి నవరాత్రి మొదటి రోజు (సెప్టెంబర్ 22) జీఎస్టీ రేట్ల తగ్గింపు కూడా తోడవడంతో కార్ సేల్స్ భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కార్లు అమ్ముడయ్యాయి. భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ భారీ అమ్మకాలను నమోదు చేశాయి.

పల్సర్ కొనేవారికి బజాజ్ హ్యాట్రిక్ ఆఫర్

మీరు కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా బజాజ్ పల్సర్ మోడల్ అంటే ఇష్టమా? అయితే మీకోసం బజాజ్ ఒక అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. జిఎస్‌టి తగ్గింపుతో పాటు, పండుగ సీజన్ సందర్భంగా హాట్రిక్ ఆఫర్ పేరుతో వినియోగదారులకు మూడు మెయిన్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్‌తో మీరు కొత్త పల్సర్‌ను ఎలా తక్కువ ధరకు, తక్కువ ఖర్చుతో సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆహా! ఎలక్ట్రిక్ బైక్‌లో రాడార్ టెక్నాలజీ.. ఇక రోడ్లపై ఫుల్ సేఫ్టీ!

మామూలుగా రోడ్ల మీద రయ్ రయ్ మని దూసుకెళ్లే బైకులను చూసే ఉంటారు. అయితే వాటికి భిన్నంగా ఇప్పుడు ఒక సూపర్ బైక్ వచ్చేసింది. దాని పేరే అల్ట్రావైలెట్ X-47 క్రాస్‌ఓవర్ (Ultraviolette X-47 Crossover). ఇది సాదాసీదా ఎలక్ట్రిక్ బైక్ కాదు, దీనికి ఫైటర్ జెట్ DNA ఉంది.

రూ.72 వేలకే కొత్త హీరో స్కూటర్.. ఫ్యామిలీకి సరైన ఛాయిస్!

ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్, స్కూటర్ తయారీ సంస్థగా పేరుగాంచిన హీరో మోటోకార్ప్ (Hero Motocorp), భారత వినియోగదారుల కోసం మరోసారి కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. సంస్థ తాజాగా పరిచయం చేసిన కొత్త స్కూటర్ హీరో డెస్టినీ 110 (Hero Destini 110). ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా కుటుంబాల రోజువారీ అవసరాలను తీర్చడానికి, మొదటిసారి స్కూటర్ కొనుగోలు చేసే వారికి సరిపోయేలా డిజైన్ చేశారు. డిజైన్ నుండి ఫీచర్ల వరకు ప్రతి అంశంలోనూ డెస్టినీ 110 ఒక మల్టీ పర్పస్ స్కూటర్‌గా కనిపిస్తుంది. ఇంటి పనుల కోసం రోజూ మార్కెట్‌కి వెళ్లే వాళ్లు, ఆఫీస్‌లకు వెళ్ళే ఉద్యోగులు, క్యాంపస్‌కి వెళ్లే కాలేజీ విద్యార్థులు.. అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని హీరో ఈ స్కూటర్‌ను తీర్చిదిద్దింది.
Advertisement

5 ఏళ్ల రికార్డు బ్రేక్.. ఒక్క రోజులోనే 11,000 కార్లు అమ్మిన హ్యుందాయ్

నవరాత్రుల మొదటి రోజు నిన్న (సెప్టెంబర్ 22, 2025) భారతదేశంలో కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. చాలా వాహన తయారీ సంస్థలు కూడా తమ ధరల తగ్గింపును నిన్నటి నుంచే అమలు చేయడం మొదలుపెట్టాయి. ఊహించినట్లే, జీఎస్టీ సంస్కరణలు, వాటితో వచ్చిన ధరల తగ్గింపు షోరూమ్‌లలో పండుగ వాతావరణాన్ని సృష్టించాయి.

ఒకప్పుడు షోరూమ్‌లో ఉద్యోగి.. ఈరోజు అదే షోరూమ్‌లో బైక్ యజమాని

ప్రతి ఒక్కరికీ తమ కలలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ ఆ కలలు కొన్నిసార్లు దూరంగా కనిపించినప్పుడు చాలామంది వెనుదిరిగి వదిలేస్తారు. అయితే, కృషి చేయాలనే సంకల్పం, అంకితభావం ఉంటే ఏదైనా సాధ్యమే అని ఒక యువకుడు తన జీవితంతోనే నిరూపించాడు. తాజాగా అతను సోషల్ మీడియాలో పంచుకున్న కథనం ఇప్పుడు అందరికీ ప్రేరణగా మారుతోంది. ఒకప్పుడు హోండా షోరూమ్‌లో ఉద్యోగిగా పనిచేసిన ఈ యువకుడు, అదే షోరూమ్‌కు ఈసారి కస్టమర్‌గా తిరిగి వచ్చాడు. కారణం ఏమిటంటే, చాలా కాలంగా కలగా పెట్టుకున్న తనకు ఇష్టమైన హోండా CBR 650Rను తన సొంత డబ్బులతో కొనుగోలు చేయడం. తన కలల బైక్ ముందు నిలబడి తీసుకున్న ఆ ఫోటోలను అతను ఆనందంతో పంచుకున్నాడు. కష్టపడితే కలలు ఎంత పెద్దవైనా నిజమవుతాయనే సందేశాన్ని ఈ కథ అందరికీ గుర్తు చేస్తోంది.

ఫ్యామిలీ కార్లలో సూపర్ హిట్ XL6.. ఒకే నెలలో దాదాపు 2,973 యూనిట్లు

మారుతి సుజుకి XL6 భారత మార్కెట్లో ఒక ప్రముఖమైన ప్రీమియమ్ MPVగా గుర్తింపు పొందింది. ఇది కేవలం ఒక కార్‌ మాత్రమే కాకుండా, కుటుంబాల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఒక పూర్తి సౌకర్యవంతమైన వాహనం. దాని విస్తారమైన కేబిన్‌, ఆధునిక డిజైన్‌, సౌకర్యం, సేఫ్టీ ఫీచర్లు XL6ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ మోడల్‌ ముఖ్యంగా 6 సీటర్ల కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. అంటే రెండు కుటుంబాలు లేదా పెద్ద గ్రూప్‌ కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. రెండో రోలో అందించే కెప్టెన్‌ సీట్లు ఎయిర్‌లైన్‌ తరహా కంఫర్ట్‌ ఇస్తాయి. వీటితో పాటు మూడో రో సీట్లు కూడా సరిగ్గా లెగ్‌రూమ్‌, హెడ్‌రూమ్‌ కలిగి ఉండటంతో, పెద్దలు కూడా సులభంగా కూర్చోగలరు. దీని వల్ల ప్రతి ప్రయాణం ఒక రిలాక్స్‌డ్‌, అనుభూతిగా మారుతుంది. ఈ కారుకు సంబంధించిన అమ్మకాలను ఒకసారి చూద్దాం.

ట్రాఫిక్ పోలీసులకు మీ వాహనాల టైర్లలో గాలి తీసే పవర్ ఉంటుందా ?

మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుంటే భయపడుతున్నారా? మీ వాహనం కీస్ లాగేసుకుంటారేమో, లేకపోతే టైర్లలో గాలి తీసేస్తారేమో అని ఆందోళన చెందుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ట్రాఫిక్ పోలీసులకు మీ వాహనంపై ఎలాంటి అధికారం ఉంటుందో, ఏ రూల్స్ పాటించాలో ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు తెలిస్తే మీరు ధైర్యంగా ఉండొచ్చు.
Advertisement

బైక్‌ల కంటే స్కూటర్లు బెస్టా? తరచూ టైర్లు మార్చేది అందుకేనా!

భారతీయ రోడ్లపై స్కూటర్లు చాలా ప్రాచుర్యం పొందాయి. సిటీ ప్రయాణాలకు ఇవి ఎంతో సౌకర్యంగా ఉంటాయి. అయితే, చాలామంది తమ స్కూటర్ల టైర్లు బైక్‌ల టైర్ల కంటే త్వరగా అరిగిపోతున్నాయని గమనించి ఉంటారు. దీనికి గల కారణాలు, టైర్ల జీవితకాలాన్ని పెంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రుమియన్ మోడళ్లలో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా (Toyota), భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి కొత్త కొత్త మార్గాల్లో వినియోగదారులకు దగ్గరవుతోంది. మారుతి సుజుకితో కుదుర్చుకున్న భాగస్వామ్యంతో రీబ్యాడ్జ్ మోడళ్లను పరిచయం చేస్తూ గ్లాంజా, రుమియన్, టైజర్ వంటి కార్లను అందించింది. ఈ మోడళ్లు తక్కువ సమయంలోనే దేశీయ వినియోగదారుల మనసులను గెలుచుకుని, టయోటాకు ఒక స్థిరమైన మార్కెట్‌ను తెచ్చిపెట్టాయి. అయితే, ప్రస్తుత కాలంలో కారు ఎంపికలో కేవలం లుక్స్, మైలేజ్, ధర మాత్రమే కాదు, భద్రత (సేఫ్టీ) కూడా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి వాహన తయారీదారు తమ కస్టమర్లకు మరింత సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు కొత్త సేఫ్టీ ఫీచర్లను పరిచయం చేస్తున్నారు.

10 ఏళ్లు పూర్తి చేసుకున్న క్విడ్.. స్పెషల్ యానివర్సరీ ఎడిషన్ లాంచ్!

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. 2015లో తొలిసారి పరిచయం అయిన ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్, తక్కువ ధరలో స్టైలిష్‌గా, SUV లాంటి లుక్‌తో అందుబాటులోకి రావడం వల్లే ఆటోమొబైల్ మార్కెట్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. బడ్జెట్‌ కస్టమర్లకు ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌ అందించడం ద్వారా క్విడ్ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌కి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ ప్రయాణం ఇప్పుడు 10 సంవత్సరాల మైలురాయిని చేరుకుంది. భారతదేశంలో 5 చౌకైన కార్లలో ఒకటిగా గుర్తింపు పొందిన క్విడ్, ఈ 10 ఏళ్లలో లక్షలాది మంది కస్టమర్లను ఆకట్టుకుంది. దీనిని పురస్కరించుకుని, రెనాల్ట్ ఒక ప్రత్యేకమైన యానివర్సరీ ఎడిషన్‌ను లాంచ్ చేసింది.

పొలిటీషియన్ల పవర్ పెంచే కారు పై రూ.1.15లక్షల తగ్గింపు

భారతదేశంలో వాహనాలకు పండుగ సీజన్ ప్రారంభమైంది. ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీలో మార్పులు చేసింది. దీని వల్ల చాలా కార్ల తయారీ సంస్థలు తమ వాహనాల ధరలను తగ్గించాయి. అదే బాటలో జపాన్ దిగ్గజం టయోటా కూడా నడిచింది. టయోటా తమ కార్లైన ఫార్చ్యూనర్, ఇన్నోవా క్రిస్టా, ముఖ్యంగా ఇన్నోవా హైక్రాస్ ధరలను తగ్గించింది. ఈ తగ్గింపుల వల్ల వినియోగదారులకు ఇప్పుడు భారీగా డబ్బు ఆదా అవుతుంది.
Advertisement

ఇండియాలో కొత్తగా లాంచ్ అయిన స్కోడా కోడియాక్ 5 సీటర్

స్కోడా ఆటో ఇండియా తన ప్రముఖ SUV కోడియాక్‌లో మరో కొత్త వెర్షన్‌ను జోడించింది. భారత మార్కెట్లోకి నిశ్శబ్దంగా తీసుకొచ్చిన ఈ కొత్త లాంజ్ వేరియంట్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పటి వరకు కోడియాక్‌ను కేవలం 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందించిన స్కోడా, ఈసారి కొత్తగా 5 సీటింగ్ ఆప్షన్‌లో వేరియంట్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. కొత్తగా వచ్చిన ఈ లాంజ్ వేరియంట్, ఎంట్రీ-లెవల్ మోడల్‌గా నిలుస్తుంది. దీనితో కోడియాక్‌ను మరింత విస్తృతంగా వినియోగదారులు పొందే అవకాశం ఉంటుంది. దీనిలో లగ్జరీ టచ్, స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్ వంటి ముఖ్యమైన లక్షణాలు అలాగే కొనసాగుతాయి. పండుగ టైంలో కొత్తగా కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నవారు దీనిని ఎంచుకునే అవకాశం ఉంది.

రోనిన్ దెబ్బకు రాయల్ ఎన్‌ఫీల్డ్ చిత్తు అవ్వాల్సిందే

కొత్త జీఎస్టీ నిబంధనల వల్ల టీవీఎస్ రోనిన్ బైక్ ధరలు భారీగా తగ్గాయి. గతంలో 28% ఉన్న జీఎస్టీ ఇప్పుడు 18%కి తగ్గడంతో, ఈ బైక్‌పై రూ.14,330 వరకు తగ్గింపు లభించింది. దీంతో ఈ బైక్ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ కంటే తక్కువ ధరకే లభిస్తోంది. టీవీఎస్ రోనిన్ ధరల వివరాలు ఈ వార్తలో చూద్దాం.

సచిన్ టెండూల్కర్ లగ్జరీ కార్ పోర్షే కయెన్.. ధర వింటే సైలెంట్!

క్రికెటర్స్ లైఫ్‌స్టైల్ ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా లగ్జరీ కార్లలో వారి ప్రయాణం అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలాంటి వారిలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరు ముందువరుసలో ఉంటుంది. ఆయన వద్ద ఇప్పటికే కోట్ల విలువ చేసే అరుదైన కార్ల కలెక్షన్ ఉందని అందరికీ తెలిసిందే. ఏ కారు నడిపినా అది ఆటోప్రేమికుల దృష్టిని ఆకర్షించకుండా ఉండదు. తాజాగా సచిన్ గురించి సోషల్ మీడియాలో మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఆయన జిమ్‌ నుంచి బయటికొచ్చినప్పుడు, పోర్షే కయెన్ లగ్జరీ కారులో కనిపించారు. దానిని కెమెరాల్లో బంధించగా, వెంటనే వైరల్ అయ్యాయి. బయటకు వచ్చిన వెంటనే సచిన్ వైపు అభిమానులు కెమెరాలు తిప్పగా, ఆయన కూడా సంతోషంగా ఫోటోలు తీయడానికి అవకాశం ఇవ్వడం అభిమానులను మరింత ఆనందపరిచింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్.. ఫీచర్స్ చూస్తే షాక్ అవుతారు!

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ ప్రసిద్ధ క్రూజర్ బైక్ మీటియోర్ 350.. 2025 వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 2020లో విడుదలైన ఈ బైక్‌కి ఇప్పుడు మొదటిసారిగా గణనీయమైన అప్‌డేట్‌లు వచ్చాయి. కొత్త మీటియోర్ 350 లో డిజైన్, రంగులు, ఫీచర్లలో అనేక మార్పులు చేశారు. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.96 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది టాప్ మోడల్ సూపర్నోవాకు రూ.2.16 లక్షల వరకు ఉంటుంది. ఈ కొత్త అప్‌డేట్‌లతో బైక్ మరింత ఆకర్షణీయంగా, అడ్వాన్సుడ్‎గా మారింది.
Advertisement

పండుగ సీజన్ బంపర్ ఆఫర్.. టాటా మోడళ్లను తక్కువ ఖర్చులో గెలవండి

టాటా మోటార్స్ (Tata Motors) పండుగ సీజన్‌‌లో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దేశంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన టాటా మోటార్స్, తమ ప్యాసింజర్ వాహనాలపై భారీ స్థాయిలో ఆఫర్‌లను ప్రకటించింది. టాటా కార్లను కొనుగోలు చేసే వారికి రూ.2 లక్షల వరకు ప్రత్యేక ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ ఆఫర్‌లు సెప్టెంబర్ 30, 2025 వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టంగా తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు అమలు చేయడంతో కార్ల ధరల్లో తగ్గింపులు వచ్చాయి. దానికి తోడు టాటా మోటార్స్ అదనంగా నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, పండుగ ఆఫర్‌లు వంటి బెనిఫిట్స్‌ను వినియోగదారులకు అందిస్తోంది. దీంతో ఈ పండుగ కాలం టాటా కస్టమర్లకు డబుల్ ఆనందం ఇచ్చేలా మారింది.

పాత వాహనాల విషయంలో మాట నిలబెట్టుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వాహనదారులకు ఒక గొప్ప శుభవార్తను అందించింది. భారీ వాణిజ్య వాహనాలపై (HCVs) వసూలు చేసే గ్రీన్ ట్యాక్స్‌ను భారీగా తగ్గిస్తూ అసెంబ్లీలో ఒక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే, పాత వాహనాలపై రూ.20,000 వరకు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ఇకపై కేవలం రూ.3,000గా ఉండనుంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 సెవెన్ సీటర్ కార్లు

భారతదేశంలో ప్రస్తుతం కార్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే సరిపడే కార్ల కంటే, మొత్తం కుటుంబం కలసి ప్రయాణించడానికి వీలయ్యే వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా వీకెండ్ ట్రిప్స్, ఫ్యామిలీ వెకేషన్స్, లాంగ్ డ్రైవ్స్ కోసం 7-సీటర్ కార్లు చాలా మంది ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. బడ్జెట్ ధరల్లోనే మంచి స్పేస్, కంఫర్ట్, మైలేజ్ ఇస్తుండటంతో వీటి మీద డిమాండ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల ఆగస్టు నెల అమ్మకాల గణాంకాలు కూడా అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. గత నెలలో 7-సీటర్ వాహనాల విక్రయాలు గణనీయంగా నమోదయ్యాయి. మార్కెట్లోని విభిన్న బ్రాండ్లు, విభిన్న సెగ్మెంట్లలో లభించే మోడళ్లు ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కార్లు అన్నీ బాగా ఆమోదం పొందాయి.

ఏకంగా రూ.1.55లక్షలు తగ్గిన మహీంద్రా టాప్ సెల్లర్ మోడల్ ధర

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా థార్ పేరు ఆఫ్-రోడింగ్ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉంటుంది. దీని అద్భుతమైన రోడ్ ప్రెసెన్స్, రగ్గడ్ డిజైన్ కారణంగా ఈ ఎస్‌యూవీ యువకుల నుండి అడ్వెంచర్ ప్రియుల వరకు అందరికీ మొదటి ఎంపికగా మారింది. ఇప్పుడు కంపెనీ కస్టమర్లకు ఒక శుభవార్త అందించింది. జీఎస్టీ తగ్గింపు తర్వాత థార్ ధరలు తగ్గాయి.
Advertisement

ఈ సారి అదిరిపోయే లుక్‌తో డస్టర్ రీ-ఎంట్రీ!

రెనాల్ట్ డస్టర్ పేరు వినగానే ఆటోప్రేమికుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం తళుక్కుమంటుంది. ఒకప్పుడు SUV సెగ్మెంట్‌లో తన సొంత మార్కెట్‌ని క్రియేట్ చేసుకున్న ఈ కారు, సాధారణ వినియోగదారుల నుండి ఆఫ్-రోడ్ లవర్స్ వరకు అందరికీ బాగా నచ్చేది. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం భారత మార్కెట్లో దీని అమ్మకాలు నిలిచిపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. అప్పటి నుండి కొత్త మోడల్ ఎప్పుడు వస్తుందో అని ప్రతి చిన్న రూమర్‌కూ ఆటోప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రోడ్డు పరీక్షల సమయంలో 5-సీటర్ డస్టర్ మోడల్ స్పై చిత్రాలు బయటకు రావడంతో మళ్లీ చర్చలు జోరందుకున్నాయి. ఇప్పటివరకు బిగ్‌స్టర్, బోరియల్ పేర్లతో 5-సీటర్, 7-సీటర్ వెర్షన్‌లు చాలాసార్లు కెమెరాలో చిక్కాయి. అయితే, ఈసారి బయటకు వచ్చిన ఫోటోలు ప్రత్యేకంగా 5-సీటర్ వెర్షన్‌కు సంబంధించినవే కావడం గమనార్హం.

భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 5 సేఫ్టీ కార్లు ఇవే

కొత్త కార్లను కొనుగోలు చేసేటప్పుడు ప్రస్తుతం చాలా మంది డిజైన్, మైలేజీ, ఫీచర్లతో పాటు ఇప్పుడు సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసమే కార్ల తయారీ కంపెనీలు తమ వాహనాలలో సేఫ్టీ ప్రమాణాలను పెంచుతున్నాయి. గతంలో సేఫ్టీ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న మారుతి సుజుకీ లాంటి టాప్ కంపెనీ కూడా ప్రస్తుతం క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగులు సాధిస్తోంది.

రూ.100 కోట్లు కొల్లగొట్టి.. 4 కోట్లు పెట్టి కారు కొన్న సన్నీ డియోల్

బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) 67 ఏళ్ల వయసులో కూడా సినిమాల్లో చాలా చురుగ్గా ఉన్నారు. 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. ఇటీవల ఆయన నటించిన జాట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 102 కోట్లు వసూలు చేసింది. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.
Advertisement

కొనడానికి ఎవరూ లేరు.. హ్యుందాయ్ ఈవీపై అంతగా ఆసక్తి ఎందుకు లేదు?

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో హ్యుందాయ్ సంస్థ కోనా ఈవీతో అడుగుపెట్టింది. కోనా ఈవీ ఆశించినంత విజయం సాధించలేకపోయినా, హ్యుందాయ్ వెనక్కి తగ్గలేదు. తాజాగా, 'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలుచుకున్న తమ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయోనిక్ 5ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కారుకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తుందని అందరూ భావించారు.