ఇంజిన్ సీసీపై జీఎస్టీ ఆధారపడి ఉంటుందా?

మనం బైక్, స్కూటర్ లేదా కారు గురించి మాట్లాడినప్పుడు ముందుగా ఇంజిన్ కెపాసిటీ అంటే సీసీ గురించి మాట్లాడుకుంటాం. ప్రకటనల నుంచి షోరూమ్‌ల వరకు.. 100సీసీ, 350సీసీ లేదా 2000సీసీ వంటి పదాలు మనకు తరచుగా వినిపిస్తుంటాయి. అయితే, ఇంజిన్ కెపాసిటీ సీసీలో ఎందుకు కొలుస్తారు? అసలు సీసీ అంటే ఏమిటి? దానిపై పన్ను అంటే జీఎస్టీ రేటు ఎందుకు ఆధారపడి ఉంటుంది? ఈ విషయాల గురించి వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

రేంజ్ రోవర్ లాగే మలైకా కూడా ఎవర్ గ్రీన్

బాలీవుడ్ అందాల తార మలైకా అరోరా తన స్టైలిష్ లుక్, లగ్జరీ లైఫ్ స్టైల్‎తో ప్రసిద్ధి చెందారు. 1998లో వచ్చిన దిల్ సే సినిమాలోని ఛైయ్యా ఛైయ్యా పాటలో డ్యాన్స్ చేసిన తర్వాత ఆమె అదృష్టమే మారిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో కనిపించారు. ఇటీవల 51 ఏళ్ల మలైకా అరోరా కొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (Range Rover Autobiography) ఎస్‌యూవీని కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఒక కుటుంబంలోనే 11 ఏథర్ స్కూటర్లు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

ఇటీవలి కాలంలో భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా టూవీలర్స్ విభాగంలో ఈ పెరుగుదల మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొని, దాని పనితీరుతో సంతృప్తి చెందితే, ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యుల కోసం కూడా అదే బ్రాండ్ స్కూటర్లను కొనడం ఒక సాధారణమైన ట్రెండ్‌గా మారింది. ఇలాంటి ఆసక్తికరమైన ఉదాహరణగానే దివాకర్ అనే వ్యక్తి కథ ప్రస్తావనలోకి వచ్చింది. ఏథర్ ఎనర్జీ ఇటీవల తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్న సమాచారం ప్రకారం, దివాకర్ ఇప్పటి వరకు మొత్తం 11 ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేశారు. ఇది సాధారణమైన విషయం కాదు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి ఒకే బ్రాండ్‌కి ఇంతగా ఆకర్షితుడై, వరుసగా 11 స్కూటర్లు కొనడం విశేషం.

కేవలం రూ. 10.50 లక్షలకే మారుతి అద్బుతమైన కారు

మారుతి సుజుకి ఎప్పుడూ భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తన కొత్త మోడళ్లను రూపొందిస్తూ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అందులో భాగంగా ఇటీవల కంపెనీ విక్టోరిస్ అనే అత్యాధునిక SUVను ఆవిష్కరించింది. ఈ కారు కేవలం డిజైన్ పరంగానే కాకుండా, భద్రతా ప్రమాణాల్లోనూ ఒక కొత్త మైలురాయిగా నిలిచింది. తాజాగా విక్టోరిస్ SUV ప్రారంభ ధరను కంపెనీ ఎక్స్ షోరూమ్ రూ.10.50 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరతో ఇది తన సెగ్మెంట్‌లో వినియోగదారులకు పోటీగా, విలువైన ఆప్షన్‌గా నిలవనుంది. అధికారికంగా విక్రయాలు సెప్టెంబర్ 22, 2025 నుండి మొదలుకానున్నప్పటికీ, ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభించడంతో ఈ కొత్త SUVపై ఆటోమొబైల్ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
Advertisement

ఆగస్టు 2025లో అమ్మకాలలో మరోసారి సత్తా చాటిన బాలెనో

మారుతి సుజుకి బాలెనో (maruti suzuki baleno) ఎప్పటినుంచో దేశీయ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సొగసైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, విశాలమైన ఇంటీరియర్, మంచి మైలేజ్ వంటి అంశాల వల్ల ఇది వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. సాధారణ హ్యాచ్‌బ్యాక్‌లతో పోల్చితే ప్రీమియం టచ్ కలిగిన ఈ మోడల్, మారుతి సుజుకి నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండటం కూడా దీన్ని ప్రత్యేకంగా నిలిపింది. ఒకవైపు యూత్‌కు ఆకర్షణీయమైన లుక్, మరోవైపు కుటుంబానికి సరిపడే ప్రాక్టికాలిటీని కలగలిపినందువల్ల బాలెనో ఎప్పుడూ హాట్‌ సేలర్‌గా నిలుస్తూ వస్తోంది. తాజాగా విడుదలైన ఆగస్టు 2025 సేల్స్ గణాంకాలు కూడా ఈ విషయాన్నే రుజువు చేశాయి.

టీమిండియా కెప్టెన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ దుబాయ్‌లో జరిగింది. ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. ఆసియా కప్ 2025లో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ తన దూకుడు బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు.

బ్రెజ్జా, వెన్యూ, సోనెట్‌లను అధిగమించిన నెక్సాన్

దేశీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ (tata motors) ఎప్పటినుంచో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తోంది. వినియోగదారుల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా వాహనాలను అందిస్తూ, మార్కెట్లో పోటీదారులకు గట్టి సవాలు విసురుతోంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో ఈ కంపెనీకి ఉన్న పట్టుదల ప్రత్యేకం. ప్రస్తుతం దేశీయంగా SUVల క్రేజ్ పెరిగిపోతుండటంతో, టాటా మోడళ్లకు డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ఇందులో నెక్సాన్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మోడల్. తాజాగా ఆగస్టు 2025లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ అమ్మకాల గణాంకాలు వెలువడగా, టాటా నెక్సాన్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించింది. గత నెలలోనే 14,004 యూనిట్లు అమ్ముడవడంతో ఈ విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

హోండా నుండి డబుల్ ఆఫర్స్

ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏమిటంటే జీఎస్‌టీ (GST) తగ్గింపు. చిన్న కార్ల నుండి పెద్ద లగ్జరీ ఎస్‌యూవీల వరకు, భారతదేశంలో ఇప్పుడు మరింత చౌకగా లభించనున్నాయి. కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి ఇది ఒక రకంగా లాటరీ తగిలినట్లే. అయితే ధరలు తగ్గినా, బ్రాండ్‌లు ప్రతి నెల ఇచ్చే డిస్కౌంట్‌లను నిలిపివేస్తాయేమో అని చాలామంది ఆందోళన చెందారు. కానీ, హోండా ఈ నెల అసాధారణమైన తగ్గింపులతో తమ కార్లను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
Advertisement

టాటా పంచ్‌కు షాక్‌.. ఆగస్టు అమ్మకాలు 32% కిందకు పడిపోయాయి!

టాటా మోటార్స్ తయారు చేసిన పంచ్ మైక్రో SUV భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచే వినియోగదారులలో మంచి పేరు తెచ్చుకుంది. చిన్న సైజులో స్టైలిష్ డిజైన్, అద్భుతమైన భద్రతా ప్రమాణాలు, అలాగే రోడ్డుపై నమ్మకమైన పనితీరుతో ఈ కారుకు ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఏర్పడింది. అయితే, తాజాగా వెలువడిన అమ్మకాల గణాంకాలు ఈసారి పంచ్‌కు పెద్దగా అనుకూలంగా లేకపోవడం గమనార్హం. 2025 ఆగస్టు నెలలో టాటా మోటార్స్ కేవలం 10,704 పంచ్ కార్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ సంఖ్యను గత ఏడాది అదే నెలలోని అమ్మకాలతో పోలిస్తే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఎందుకంటే 2024 ఆగస్టులో టాటా పంచ్ 15,643 యూనిట్లు అమ్ముడైంది. అంటే ఒక్క సంవత్సరంలోనే అమ్మకాలలో దాదాపు 32 శాతం క్షీణత చోటుచేసుకుంది.

రూ.1.64 లక్షల వరకు తగ్గింపు.. ఈ టాప్ 5 కార్లను మిస్ అవ్వకండి!

జీఎస్‌టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా వంటి అనేక వాహన తయారీదారులు భారతీయ మార్కెట్‌లో తమ కార్ల ధరలను భారీగా తగ్గించారు. ఇందులో హ్యాచ్‌బ్యాక్, సెడాన్, కాంపాక్ట్ ఎస్‌యూవీ, మిడ్-సైజ్ ఎస్‌యూవీలతో సహా ఇతర ప్రముఖ మోడల్స్ ఉన్నాయి.

జీఎస్టీ రేట్లు తగ్గడంతో టైర్ల ధరల కోత.. CEAT అధికారిక ప్రకటన

భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఆటోమొబైల్ రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయంతో వినియోగదారులకు నేరుగా లాభం చేకూర్చే ప్రయత్నంలో ప్రముఖ టైర్ తయారీదారు CEAT లిమిటెడ్ ముందడుగు వేసింది. తమ మొత్తం టైర్ శ్రేణిపై ధరల తగ్గుదలను అమలు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ తగ్గింపు వల్ల కార్లు, బైకులు, కమర్షియల్ వాహనాలు, అలాగే వ్యవసాయ యంత్రాలు నడిపే వినియోగదారుల వరకు అందరికీ ప్రయోజనం కలుగనుంది. సీఈఏటీ తెలిపిన ప్రకారం, కొత్త ధరలు సెప్టెంబర్ 22, 2025 నుండి అధికారికంగా అమలులోకి రానున్నాయి. అంటే, ఆ తేదీ తరువాత డీలర్లు, ఎండ్ యూజర్లకు తక్కువ ధరలోనే టైర్లు లభ్యం అవుతాయి. దీనివల్ల కేవలం వినియోగదారులే కాదు, కంపెనీ సేల్స్ నెట్‌వర్క్‌కి కూడా ఒక సానుకూల వాతావరణం ఏర్పడనుంది.

ఎస్యూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. జీఎస్‌టీ తగ్గింపుతో అద్భుతమైన ఆఫర్స్

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుండి జీఎస్‌టీ పన్ను తగ్గింపును అమలు చేయనుంది. దీనివల్ల వాహనాల ధరలు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా కంప్లీట్ సైజు ఎస్‌యూవీ కార్ల ధరలు లక్షల్లో తగ్గుతాయి. ఈ తగ్గిన ధరతో ఒక చిన్న కొత్త కారునే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. ఏయే కార్ల ధరలు ఎంత తగ్గుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Advertisement

రూ.10 లక్షల లోపు టాప్ సెల్లింగ్ కార్లు ఇవే

ఆగస్టు 2025 అమ్మకాల డేటా ప్రకారం.. భారతీయ కార్ల మార్కెట్‌లో రూ.10 లక్షల లోపు ధర ఉన్న వాహనాలదే పైచేయిగా ఉంది. ముఖ్యంగా, భారతదేశంలోనే నంబర్ వన్ కార్ల కంపెనీ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) మార్కెట్‌లో తన లీడర్‌షిప్‌ను నిలబెట్టుకుంటోంది. అదే సమయంలో టాటా (Tata), హ్యుందాయ్ (Hyundai) కంపెనీల కార్లు కూడా ఈ ధరల విభాగంలో మంచి అమ్మకాలను నమోదు చేశాయి. గత ఆగస్టు నెలలో రూ.10 లక్షల లోపు ఎక్కువగా అమ్ముడైన టాప్ 6 కార్ల వివరాలను ఇప్పుడు చూద్దాం.

పండుగల ముందు స్విఫ్ట్ అమ్మకాలు డౌన్

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) అనే పేరు వినగానే మనసులో ఒక ప్రత్యేకమైన అనుబంధం కలుగుతుంది. ఈ కారును భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌గా గుర్తిస్తారు. ఆకర్షణీయమైన డిజైన్, ప్రాక్టికల్ ఫీచర్లు, మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు ఇవన్నీ కలిసి స్విఫ్ట్‌కి ప్రత్యేకమైన స్థానం తీసుకువచ్చాయి. ఈ కారు ఎప్పటిలాగే మార్కెట్లో బలమైన అమ్మకాలను కొనసాగిస్తున్నప్పటికీ, 2025 ఆగస్టు నెలలో వచ్చిన గణాంకాలు కొంచెం వేరే కథ చెబుతున్నాయి. ఈ నెలలో మొత్తం 12,385 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో, అంటే 2024 ఆగస్టులో, 12,844 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, కేవలం ఒకే నెలలోనే గత సంవత్సరం కంటే తక్కువ సంఖ్యలో విక్రయాలు నమోదయ్యాయి.

కార్లు, బైకులపై GST తగ్గింపు.. మధ్యతరగతి ప్రజలకు డబుల్ గిఫ్ట్!

భారతదేశంలో మధ్యతరగతి వర్గం ఎప్పటినుంచో ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాగా నిలుస్తూ వస్తోంది. దేశ జనాభాలో పెద్ద భాగం ఈ వర్గానిదే. రోజువారీ అవసరాలు, లైఫ్‌స్టైల్, ఖర్చులు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. అందుకే వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ధరల విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. కార్లు, బైకులు, స్కూటర్లు వంటి వాహనాలు మధ్యతరగతి కుటుంబానికి కేవలం సౌకర్యమే కాకుండా, ఒక కలల సాధనంగా మారతాయి. కానీ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల తమ కలలను వాయిదా వేసుకునే పరిస్థితి చాలా మందికి ఎదురయ్యేది. ఇలాంటి సమయంలో వస్తువులు, సేవల పన్ను (GST) తగ్గింపు రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు నిజమైన ఊరటను కలిగించింది.

విక్టోరిస్ SUV ధరను వెల్లడించబోతున్న మారుతి

దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తూ, తన స్థాయిని మరింత బలపరుస్తూ వస్తోంది. ఆధునిక కాలానికి తగ్గట్టుగా డిజైన్‌, టెక్నాలజీ, ఫీచర్స్ అన్నింటినీ సమన్వయం చేస్తూ కొత్త వాహనాలను పరిచయం చేయడంలో కంపెనీ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో తాజాగా విక్టోరిస్ SUVను ఆవిష్కరించడం ద్వారా మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఈ మోడల్‌లో అందించిన డిజైన్‌ ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఉండగా, ఎక్స్‌టీరియర్ నుంచి ఇంటీరియర్ వరకు ప్రతిదీ లేటెస్ట్ లుక్‌ను ప్రతిబింబిస్తుంది. ఒక SUVలో కావలసిన ప్రతి ఫీచర్‌ను దాదాపుగా సమకూర్చి, మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అందుబాటు ధరలో అందించాలన్న ఆలోచనతో మారుతి ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది.
Advertisement

ఆస్ట్రేలియా NCAP అగ్నిపరీక్షలో స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. భారతదేశంలో ఈ కారుకు ఉన్న ఆదరణ ప్రత్యేకమే. మొదటిసారి కారు కొనుగోలు చేయాలని అనుకునే వారు, మైలేజ్‌తో పాటు పనితీరు, డిజైన్, అందుబాటు ధరను ప్రాధాన్యతనిచ్చే వారు స్విఫ్ట్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఈ కారు ఒక విధంగా మధ్య తరగతి కుటుంబాలకు సరిపోయే మోడల్‌గా నిలుస్తోంది. తాజాగా స్విఫ్ట్‌పై ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకొచ్చింది. 2025 మోడల్ స్విఫ్ట్ కారు ఆస్ట్రేలియాలో నిర్వహించిన క్రాష్ టెస్టులో 3 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఇది సాధారణ అప్‌డేట్ కాదని చెప్పాలి, ఎందుకంటే గతంలో 2024 డిసెంబర్‌లో పరీక్షించినప్పుడు అదే ఆస్ట్రేలియా-స్పెక్ మోడల్ కేవలం 1 స్టార్ రేటింగ్ మాత్రమే పొందింది.

కాంపిటీషన్ ఎంత ఉన్నా.. ఫ్రాంక్స్ SUVకు ఉన్న క్రేజ్ తగ్గట్లేదు!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి (Maruti Suzuki) పేరు చెప్పగానే విశ్వసనీయత, సౌకర్యం, అందుబాటులో ధర అనేవి మనసుకు తట్టే మూడు ప్రధాన అంశాలు. ఇప్పటికే విభిన్న సెగ్మెంట్లలో ఆధిపత్యం చాటుకుంటున్న ఈ కంపెనీ, SUV విభాగంలో కూడా తన ప్రత్యేక గుర్తింపును ఫ్రాంక్స్ (Fronx) ద్వారా సంపాదించింది. ప్రీమియం లుక్, శక్తివంతమైన పనితీరు, కుటుంబం మొత్తానికి సరిపడే స్పేస్ అన్నీ ప్యాకేజీగా ఈ కారు వినియోగదారుల మన్ననలు పొందుతోంది. తాజాగా విడుదలైన ఆగస్టు 2025 అమ్మకాల నివేదికలోనూ ఈ కారు తన స్థిరమైన డిమాండ్‌ను మరోసారి నిరూపించుకుంది. నివేదిక ప్రకారం, ఆగస్టు 2025లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ మొత్తం 12,422 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 12,387 యూనిట్లతో పోలిస్తే కాస్త ఎక్కువ.

ఒక్క లీటరుతోనే 70 కి.మీ మైలేజ్ ఇచ్చే హీరో కొత్త మోడల్ వచ్చేసింది

భారతదేశంలో రోజువారీ ప్రయాణాలకు వినియోగదారులు ఎక్కువగా ఆశించే అంశం మంచి మైలేజ్, తక్కువ ధర, విశ్వసనీయత. ఈ మూడు లక్షణాలను సమన్వయం చేస్తూ మార్కెట్‌లో స్థిరమైన గుర్తింపును సంపాదించుకున్న మోడల్‌లో ఒకటి హీరో HF డీలక్స్. ఎంతో కాలంగా మిడిల్ క్లాస్ కుటుంబాలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఈ బైక్‌ను నమ్మకంగా ఉపయోగిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే ఈ మోడల్, ప్రతి రూపాయికి విలువ అనే మాటను నిజం చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ డిమాండ్‌ను బలోపేతం చేస్తూ, హీరో మోటోకార్ప్ 2025 HF డీలక్స్ ప్రో (Hf Deluxe Pro)ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పోటీదారులకు టఫ్ ఫైట్ ఇవ్వడానికి, దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.73,550గా నిర్ణయించారు. అంటే, ధరలో అందుబాటులో ఉండి కూడా ఫీచర్లలో ఏ మాత్రం తగ్గని మోడల్‌గా దీన్ని డిజైన్ చేశారు.

కేవలం రూ. 10 లక్షల్లో 5-స్టార్ రేటింగ్‌తో టాప్ సేఫ్టీ కార్లు ఇవే !

భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాలు కొత్తగా కారు కొనుగోలు చేసేవారికి చాలా ముఖ్యమైన అంశంగా మారాయి. అంటే, ఈ మధ్య కాలంలో ప్రజలు కారు కొనేటప్పుడు మైలేజ్, ధరతో పాటు, ఆ కారుకు భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఎన్ని స్టార్ రేటింగ్ వచ్చిందో కూడా జాగ్రత్తగా చూస్తున్నారు.
Advertisement

మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా యెజ్డి రోడ్‌స్టర్

Yezdi Roadster 2025 launched in India with updated styling, improved engine, and enhanced comfort. Prices start from ₹2,10,000. | యెజ్డి రోడ్‌స్టర్ 2025 భారతదేశంలో నవీకరించబడిన శైలి, మెరుగైన ఇంజిన్ మరియు మెరుగైన సౌకర్యంతో ప్రారంభించబడింది. ధరలు ₹ 2,10,000 నుండి ప్రారంభమవుతాయి.

కియా కార్లు కొనే వాళ్లకు పండుగ ముందే వచ్చింది

కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ తగ్గించడంతో మార్కెట్‌లో ధరల తగ్గింపు సందడి నెలకొంది. చాలా కంపెనీలు ఈ పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నాయి. పండుగల సీజన్‌కు ముందు వచ్చిన జీఎస్టీ తగ్గింపు నిర్ణయం మార్కెట్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

కారు కొనేముందు ఈ విషయాలు మర్చిపోవద్దు

కారు కొనుగోలు అనేది చాలా మందికి ఒక కల. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో చాలా మంది కొన్ని ముఖ్యమైన విషయాలను పట్టించుకోరు. ముఖ్యంగా మీరు మొదటిసారి కారు కొంటున్నట్లయితే, మొత్తం ఖర్చును అర్థం చేసుకోవడం చాలా అవసరం. టీవీల్లో, వార్తల్లో తరచుగా కారు ఎక్స్-షోరూమ్ ధరల గురించి మాత్రమే చెబుతారు. కానీ కారు కొనడం అనేది కేవలం ఎక్స్-షోరూమ్ ధరతో ముడిపడి ఉండదు.

బీఎండబ్ల్యూ బైకులపై ఏకంగా రూ. 92,000 ఆదా

బీఎమ్‌డబ్ల్యూ మోటరాడ్ ఇండియాలో తన G310RR సూపర్‌స్పోర్ట్ బైక్, C400 GT మ్యాక్సీ-స్కూటర్ ధరలను భారీగా తగ్గించింది. జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను పూర్తిగా వినియోగదారులకు అందించే ఉద్దేశ్యంతో ఈ ధరల తగ్గింపును ప్రకటించారు. 350సీసీ కంటే తక్కువ కెపాసిటీ గల టూవీలర్స్‌పై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించడంతో ఈ రెండు మోడల్స్ భారత మార్కెట్లో మరింత అందుబాటులోకి వచ్చాయి. ఈ తగ్గింపుల వివరాలు, మోడల్స్ ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.
Advertisement

కొత్త టీవీఎస్ జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది

భారతీయ మార్కెట్లో గేర్‌లెస్ స్కూటర్‌లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. హోండా యాక్టివా (Honda Activa), టీవీఎస్ జుపిటర్ (TVS Jupiter) వంటి మోడల్స్ ప్రతి నెలా లక్షల్లో అమ్ముడవుతూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీవీఎస్ జుపిటర్ 110 మోడల్‌కు సంబంధించి సరికొత్త స్పెషల్ ఎడిషన్ విడుదలైంది. నల్లని అందం, అప్‌డేటెడ్ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చిన ఈ స్కూటర్ ధర, మైలేజ్, ఇతర ప్రత్యేకతలు వివరంగా చూద్దాం.