డాక్టర్లు, ఇంజనీర్ల ఫేవరెట్ కారు.. రూ.5.79 లక్షలు, 34 కి.మీల మైలేజ్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) ఎప్పటినుంచో భారతీయ మార్కెట్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌గా పేరు గడించింది. సాదాసీదా డిజైన్, విశాలమైన ఇంటీరియర్, మైలేజ్‌ ఫ్రెండ్లీ ఇంజిన్‌, విశ్వసనీయమైన మారుతి సర్వీస్ నెట్‌వర్క్‌ కారణంగా ఈ కారు మిలియన్లాది కుటుంబాల ఫ్యామిలీ కార్గా నిలిచింది. దీని పెర్ఫామెన్స్‌కు దేశంలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రధానంగా డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ కారును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే కాలానికి అనుగుణంగా మారుతూ మరింత ఆధునిక రూపకల్పనతో, వినియోగదారుల కోసం డజన్ల కొద్దీ ఫీచర్లతో వస్తున్నా, ఈసారి అమ్మకాల గ్రాఫ్‌లో మాత్రం కొంత వెనుకంజ వేసింది.

మహీంద్రా కారు కొనుగోలు దారులకు పండగే

భారత మార్కెట్లో మహీంద్రా XUV700కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఎస్‌యూవీ ఇప్పుడు కొనుగోలుదారులకు మరింత అందుబాటులోకి వచ్చింది. పెద్ద ఎస్‌యూవీలపై జీఎస్టీ, కాంపెన్సేషన్ సెస్ తగ్గింపుల తర్వాత, మహీంద్రా XUV700 ధరలు రూ.1.43 లక్షల వరకు తగ్గాయి.

కోటిన్నర కారులో వెళ్తూ తమన్నా చేసిన పనికి నెటిజన్లు ఫిదా

ఇండియా సినిమా ఇండస్ట్రీలో తన అద్భుతమైన నటన, అందంతో టాప్ హీరోయిన్‎గా వెలుగొందుతున్న తమన్నా భాటియాకు తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో సహా పలు భాషల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మిల్కీ బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తమన్నా ఒక అత్యంత ఖరీదైన లగ్జరీ కారులో ప్రయాణిస్తూ ఆమె తనలో ఉన్న దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ జోరు ఆగట్లేదు

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) భారతీయ మార్కెట్లో SUV లవర్స్ కోసం ఒక ప్రత్యేకమైన ఎంపికగా నిలుస్తోంది. ఆధునిక డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు లగ్జరీ లుక్ కలగలిపిన ఈ కారు వినియోగదారులను ఆకర్షిస్తోంది. తాజాగా విడుదలైన సేల్స్ రిపోర్ట్ ప్రకారం, హైరైడర్ డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టమవుతోంది. 2025 ఆగస్టు నెలలోనే టయోటా ఈ SUVని 9,854 యూనిట్ల డెలివరీలు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో అంటే 2024 ఆగస్టులో కేవలం 4,385 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఈసారి రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. అంటే, కేవలం ఒక సంవత్సరంలోనే అమ్మకాల వృద్ధి 124.52 శాతం వరకు పెరిగిందని అర్థం.
Advertisement

కోట్లు విలువ చేసే కారులో పిడకలా ?

భారతీయులకు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లంటే ఎంతో కోపం ఉండేది. ఇప్పుడు ఆ కోపం వారి కార్లపై చూపిస్తున్నారా? ఈ వీడియో చూస్తే అవుననే అనిపిస్తోంది. సాధారణంగా కోట్లాది రూపాయల ఖరీదు చేసే ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు వంటి సంపన్నులు తమ ప్రయాణాల కోసం ఉపయోగిస్తారు. కానీ, భారతదేశంలో డిఫెండర్ కారును ఆవు పేడ పిడకలు తీసుకెళ్లడానికి కూడా వాడుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్.. అయినా సేల్స్‌లో దెబ్బతిన్న SUV!

భారత ఆటోమొబైల్ రంగంలో కొత్త బ్రాండ్లు అడుగుపెడుతున్నా, పాత బ్రాండ్లు పోటీని తట్టుకుని నిలబడుతున్నా, ప్రతి కంపెనీకి మార్కెట్‌లో నిలదొక్కుకోవడం సవాల్‌గానే ఉంటుంది. ఆ క్రమంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీదారు సిట్రోయెన్ (Citroën) కూడా కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్‌లో తన వాహనాలను అందిస్తోంది. స్టైలిష్ డిజైన్, యూరోపియన్ ఫీల్, ప్రీమియం లుక్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ కంపెనీకి అభిమానులు ఏర్పడ్డారు. అయితే, ఆగస్టు నెల ముగిసిన వెంటనే వెలుగులోకి వచ్చిన తాజా సేల్స్ రిపోర్ట్ మాత్రం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేలా చేసింది. సిట్రోయెన్ తన అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రీమియం SUV C5 ఎయిర్‌క్రాస్‌ (C5 aircross)కు సంబంధించిన సేల్స్ వివరాలను ప్రకటించింది.

స్కోడా నయా మోడల్.. స్పీడ్ పిచ్చోళ్లకు కిక్కిచ్చే కారు

భారతీయ రోడ్లపై స్పీడు, స్టైల్‌ను మిక్స్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం స్కోడా ఒక అద్భుతమైన కారును సిద్ధం చేసింది. స్కోడా నవంబర్ 2025 నాటికి ఇండియాలో కొత్త అక్టేవియా ఆర్‌ఎస్ (Octavia RS) సెడాన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు కేవలం స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, అద్భుతమైన పర్ఫామెన్స్‎తో స్పీడ్ లవర్స్‎ను ఆకట్టుకుంటుంది. ఈ కారు ఇంజిన్, ఫీచర్లు, ధర, విడుదల తేదీ గురించి వివరంగా తెలుసుకుందాం.

లగ్జరీ కార్లతో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్న లారీ ఎల్లిసన్!

ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ తాజాగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించడం గ్లోబల్ బిజినెస్ వర్గాలను కదిలించింది. ఎల్లిసన్ సంపద సెన్సేషన్ సృష్టించేలా 101 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.8.8 లక్షల కోట్లు) పెరగడంతో ఆయన ఆస్తుల విలువ 393 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ గణాంకం టెస్లా, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ఆస్తులను దాటేసింది. ప్రస్తుతం మస్క్ వద్ద 385 బిలియన్ల ఆస్తులు ఉండగా, లారీ ఎల్లిసన్ అతనిని 8 బిలియన్ల తేడాతో అధిగమించి మొదటి స్థానంలో నిలిచారు. 81 ఏళ్ల వయసులోనూ ఒరాకిల్ చైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా వ్యవహరిస్తూ ఎల్లిసన్ చూపిస్తున్న వ్యాపార దూరదృష్టి నిజంగా విశేషమే. ఆయన సంపదలో ఎక్కువ భాగం డేటాబేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ ద్వారానే వస్తోంది.
Advertisement

జీఎస్టీ పుణ్యమా అని భారీగా తగ్గిన ఇన్నోవా ధర

సాధారణంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న కార్ల ధరలు తగ్గడం చాలా కష్టం. ఆ కోవలోనిదే టయోటా ఇన్నోవా క్రిస్టా. ఈ కారుకు మార్కెట్లో ఉన్న డిమాండ్ వల్ల, కస్టమర్లు బతిమాలినా ఒక్క రూపాయి కూడా తగ్గించరు. కానీ ఇప్పుడు, జీఎస్‌టీ తగ్గింపు కారణంగా ఇన్నోవా క్రిస్టా ధర ఏకంగా రూ.1.80 లక్షలు వరకు తగ్గనుంది. ఈ బంపర్ ఆఫర్ గురించి, వివిధ వేరియంట్ల కొత్త ధరల గురించి, ఈ కారు స్పెషల్ ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ బైక్ కొనగానే ఐఫోన్ గెలుచుకునే ఛాన్స్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా టూవీలర్ విభాగంలో కొత్త మోడళ్లతో పాటు వినూత్నమైన ఆఫర్‌లను తీసుకొస్తూ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు ఒబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) తన కొత్త పథకాన్ని ప్రకటించింది. మెగా ఫెస్టివ్ ఉత్సవ్ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆఫర్ స్కీమ్, పట్టణ ప్రయాణికులకు హై-ఎండ్ ఎలక్ట్రిక్ బైక్‌లను మరింత సులభంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద వినియోగదారులు గరిష్టంగా రూ.35,000 వరకు ప్రయోజనాలు పొందే అవకాశం కలదు. ముఖ్యంగా, ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఒబెన్ ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ షోరూమ్‌లలో అందుబాటులో ఉండటం మరింత ప్రత్యేకం.

స్వల్ప తగ్గుదల ఉన్నా సేల్స్‌లో టాప్‌లోనే నిలిచిన మారుతి ఎర్టిగా

భారతదేశంలో కుటుంబం అనగానే మొదట గుర్తొచ్చేది అందరూ కలిసి చేసే ప్రయాణాలే. చిన్నా పెద్దా అందరినీ ఒకే కారులో కూర్చోబెట్టుకుని ఆడుతూ, పాడుతూ వెళ్తుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. రోడ్డు మీద వెళ్ళే దారిలో జరిగే సంభాషణలు, నవ్వులు, పాటలు ఇవి అన్నీ కలిసి ఆ ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చేస్తాయి. అందుకే ఎక్కువ మందిని ఒకేసారి ఎక్కించుకునే వాహనాలకు భారతీయ మార్కెట్లో ఎప్పుడూ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. అలాంటి కేటగిరీలో అత్యంత పాపులర్‌గా నిలిచింది మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga). మారుతి సుజుకి ఎర్టిగా ఎప్పటినుంచో ఫ్యామిలీ కార్ అన్న పేరుకి సరైన అర్థాన్ని ఇస్తూ వచ్చింది. విస్తారమైన సీటింగ్, మల్టీపర్పస్ యూజ్, అందరికీ అందుబాటులో ఉండే ధర ఈ మూడు కారణాల వల్లే ఇది మధ్యతరగతి దృష్టిని ఆకర్షించింది.

మైలేజ్ బైకుల కింగ్.. తక్కువ ధరలో బజాజ్ ప్లాటినా 100

రోజువారీ జీవితంలో బైకులు మనకు ఒక భాగంలా మారిపోయాయి. ఉద్యోగానికి, పిల్లలను స్కూల్‌కి, షాపింగ్‌కి, లేదా చిన్న చిన్న పనులు చేసుకోవాలి అంటే బైక్ లేకుండా ఊహించలేం. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లోనూ, రోడ్లు చిన్నగా ఉండే పట్టణాల్లోనూ బైకే సులభమైన పరిష్కారం. బైక్‌లకు మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇవి అద్భుతమైన మైలేజ్ ఇస్తాయి. ఒక లీటర్ పెట్రోల్‌లో 60 నుండి 70 కిలోమీటర్ల వరకు వెళ్లగలిగే బైకులు మార్కెట్లో ఉన్నాయి. పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరుగుతున్న ఈ కాలంలో, ఇంత మైలేజ్ ఇవ్వడం వినియోగదారులకు చాలా పెద్ద ప్రయోజనం. అలాగే, బైకులు పెర్ఫామెన్స్ పరంగా కూడా నమ్మకంగా ఉంటాయి. చిన్న ఇంజిన్ బైకులైనా, సిటీ ట్రాఫిక్‌లో చక్కగా పరిగెడతాయి. పెద్ద ఇంజిన్ బైకులు అయితే హైవేలపై స్పీడ్, స్టాబిలిటీ ఇవ్వగలవు. దీని వల్ల యంగ్ జనరేషన్ కూడా బైకులపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది.
Advertisement

ఆగస్టులో క్రెటా అమ్మకాలు 5% డౌన్.. కొత్త ఆఫర్లతో మళ్లీ పుంజుకునేనా?

హ్యూందాయ్ క్రెటా (Hyundai Creta) పేరు వినగానే భారత మార్కెట్లో SUV లవర్స్‌కు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. తన స్టైలిష్ డిజైన్‌, ఫీచర్లు, రోడ్డు మీద ఇచ్చే రైడింగ్ అనుభవం కారణంగా ఇది ఎప్పటినుంచో బెస్ట్ సెల్లింగ్ SUVలలో ఒకటిగా కొనసాగుతోంది. తాజాగా ఆగస్టు 2025 నెలలో కార్ల అమ్మకాల గణాంకాలు విడుదల కాగా, క్రెటా మరోసారి టాప్ 10 జాబితాలో స్థానం సంపాదించింది. ఈ జాబితాలో క్రెటా మూడవ స్థానంలో నిలిచింది. ఆగస్టు నెలలో మొత్తం 15,925 యూనిట్లు అమ్ముడవడం దీని స్థిరమైన డిమాండ్‌ను మరోసారి చాటిచెప్పింది. అయితే, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ అమ్మకాలలో కొంత వెనుకడుగు పడింది. 2024 ఆగస్టులో క్రెటా అమ్మకాలు 16,762 యూనిట్లు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గి -5 శాతం పడిపోయింది.

లగ్జరీ కార్లను పక్కన పెట్టి.. జిమ్నీని ఎంచుకున్న హీరో

సెలబ్రిటీలు ఎప్పుడూ లగ్జరీ కార్లు, ప్రీమియం బైక్‌లు, ఖరీదైన ఆస్తులు వంటివి కొనుగోలు చేస్తారని మనం ఊహించుకుంటాం. కానీ అందరికీ అది వర్తించదు. కొందరు నటులు చాలా సాధారణమైన జీవనశైలిని అనుసరిస్తారు. అలాంటి వారిలో హర్షవర్ధన్ రాణే ఒకరు. హిందీ, తెలుగు సినిమాల్లో నటిస్తూ భారత్ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ యంగ్ హీరో, ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తాడు. తెలుగులో తకిట తకిట, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, బెంగాల్ టైగర్, ఫిదా వంటి సినిమాల్లో నటించాడు. ఇదిలా ఉంటే ఇటీవల హర్షవర్ధన్ రాణే ఒక కొత్త కారు కొనుగోలు చేశాడు. అయితే అది మరే లగ్జరీ బ్రాండ్ కాదు, మన అందరికీ సుపరిచితమైన మారుతి సుజుకి నుంచి వచ్చిన జిమ్నీ ఎస్‌యూవీ (Jimny SUV). జిమ్నీ అనేది ఆఫ్-రోడ్ సాహసాలకు ప్రసిద్ధి చెందిన వాహనం.

స్కూటర్ల రేట్లు రూ.5,000-రూ.7,000 తగ్గాయ్!

భారతదేశంలో స్కూటర్లకు ఉన్న డిమాండ్‌ ఎంతగానో ప్రత్యేకం. తక్కువ ఖర్చుతో అందరికి అందుబాటులో ఉండే ఈ వాహనాలు రోజువారీ జీవితంలో ఒక ప్రధాన భాగంగా మారిపోయాయి. ఉద్యోగాలకు వెళ్లడమో, షాపింగ్‌ చేయడమో, పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడమో ఏదైనా పని స్కూటర్‌తో సులభంగానే పూర్తి చేయవచ్చు. అందుకే పురుషులు, మహిళలు ఎవరైనా సౌకర్యంగా డ్రైవ్ చేయగలిగే వాహనాలుగా ఇవి ఎప్పటినుంచో ప్రాచుర్యం పొందాయి. ఇకపై ఈ స్కూటర్లకు మరింత డిమాండ్‌ పెరగడానికి మరో కీలక కారణం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిఎస్‌టి విధానం ప్రకారం, ఇప్పటివరకు 28 శాతం పన్ను కిందకి వచ్చే అనేక వాహనాలపై రేటు 18 శాతానికి తగ్గించబడింది. ఈ కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.

భద్రతలో 5-స్టార్.. అమ్మకాలలో సూపర్‌స్టార్‌గా మారిన డిజైర్!

మారుతి సుజుకి డిజైర్‌ (Maruti Suzuki Dzire) ఎప్పటినుంచో భారతీయ కుటుంబాల నమ్మకాన్ని సంపాదించిన సెడాన్‌. ఆకర్షణీయమైన డిజైన్‌, సరళమైన డ్రైవింగ్ అనుభవం, డజన్ల కొద్దీ ఆధునిక ఫీచర్లు, సరసమైన ధరతో ఈ కారుకు ప్రత్యేకమైన మార్కెట్‌ ఉంది. అందుకే, గతంలోనూ వరుసగా ప్రజలు ఈ కారును పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తూ వచ్చారు. ఇక తాజాగా, 2025 ఆగస్టు నెలలో కూడా డిజైర్‌ తన అమ్మకాలలో మరోసారి రికార్డు నెలకొల్పింది. ఈ ఒక్క నెలలోనే మొత్తం 16,509 యూనిట్లు కొనుగోలుదారుల చేతికి చేరాయి. ఈ సంఖ్య గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే విపరీతమైన వృద్ధిని సూచిస్తోంది.
Advertisement

ఇప్పుడు ఇంటికో బైక్ ఉంటుందేమో.. మరి రేట్లు అంతలా తగ్గాయి భయ్యా

పండుగ సీజన్‌కు ముందు టూ వీలర్లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసే వాళ్లకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్‌టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను కస్టమర్లకు పూర్తిగా బదిలీ చేస్తూ హీరో మోటోకార్ప్ తమ మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను గణనీయంగా తగ్గించింది. సెప్టెంబర్ 22, 2025 నుండి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి. ఈ తగ్గింపుల వల్ల ఏ బైక్‌పై ఎంత ప్రయోజనం లభిస్తుందో వివరంగా చూద్దాం.

తక్కువ ధరలో సూపర్ స్కూటర్.. జెలియో గ్రేసీ కొత్త ఫేస్‌లిఫ్ట్ లాంచ్

ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ZELIO E మొబిలిటీ తన తక్కువ-వేగ ఎలక్ట్రిక్ స్కూటర్ Gracyiకి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పట్టణాల్లో రోజువారీ ప్రయాణాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కొత్త స్కూటర్, పనితీరులోనూ, సౌకర్యంలోనూ, వినియోగదారుల అంచనాలకు తగినట్లుగానే కాకుండా దాటిపోతుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, చిన్నతరహా వ్యాపారులు వంటి ప్రతి ఒక్కరి అవసరాలకు సరిపోయేలా దీనిని తీర్చిదిద్దారు. ముఖ్యంగా స్మార్ట్, స్థిరమైన పనితీరు అందరికీ అందుబాటులో ఉండే ధర ఈ మూడు లక్షణాలు ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి. కొత్తగా వచ్చిన గ్రేసీని మూడు రకాల బ్యాటరీ కాన్ఫిగరేషన్లలో కొనుగోలు చేసే అవకాశం ఉంది.

బైక్ కొనేవారికి బంపర్ ఆఫర్.. భారీగా తగ్గించిన యమహా

మీరు పండుగ సీజన్‌లో టూ వీలర్ కొనాలనుకుంటున్నారా? అయితే యమహా మోటార్స్ ఒక శుభవార్త చెప్పింది. జీఎస్‌టీ పన్ను తగ్గించిన ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు నేరుగా అందించాలని యమహా నిర్ణయించింది. దీంతో సెప్టెంబర్ 22 నుండి యమహా బైక్‌లు, స్కూటర్ల ధరలు రూ.7,759 నుంచి రూ.17,581 వరకు తగ్గనున్నాయి.

జీఎస్టీ తగ్గింపుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ ధర తగ్గుదల

ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించడం దేశ వ్యాప్తంగా వినియోగదారులకు ఒక పెద్ద ఊరటగా మారింది. కేవలం కార్లకే కాకుండా టూవీలర్ వాహనాల ధరలు కూడా ఇప్పుడు గణనీయంగా తగ్గబోతున్నాయి. ముఖ్యంగా 350సిసి వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్‌లు, స్కూటర్లపై జీఎస్టీని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడం వల్ల, ధరల్లో స్పష్టమైన మార్పు కనిపించబోతోంది. ఈ తరుణంలో ఇప్పటికే TVS వంటి ప్రముఖ బ్రాండ్లు తమ వాహనాలపై కొత్త ధరలను ప్రకటించగా, మరిన్ని తయారీదారులు కూడా అదే దారిని అనుసరిస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా అధికారికంగా జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందజేస్తామని ప్రకటించడం బైక్ ప్రియులకు ఆనందాన్ని కలిగించింది.
Advertisement

వోల్వో కార్లు ఇంత తక్కువ ధరలకు మళ్లీ దొరకవు

పండుగ సీజన్‌కు ముందు లగ్జరీ కార్ల ప్రియులకు వోల్వో కార్ ఇండియా ఒక అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ తన ఐసీఈ (ఇంటర్నల్ కంబుషన్ ఇంజిన్) మోడల్స్ అయిన వోల్వో XC60, వోల్వో XC90 కార్ల ధరలను ఏకంగా దాదాపు రూ.7 లక్షల వరకు తగ్గించింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వస్తాయి. దీంతో పాటు, వోల్వో డబుల్ ఫెస్టివ్ డిలైట్ పేరుతో ప్రత్యేక పండుగ ఆఫర్లను కూడా అందిస్తోంది.

ఇంత తక్కువ ధరలో ఫ్యామిలీ కారు? జీఎస్టీ తగ్గింపుతో ఎస్-ప్రెస్సో సంచలనం

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం ఆటోమొబైల్ రంగానికి పెద్ద ఊపును తెచ్చింది. ఇప్పటివరకు కార్లపై అమల్లో ఉన్న 28 శాతం జీఎస్‌టీని 18 శాతానికి తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా వాహనాల ధరలు గణనీయంగా తగ్గబోతున్నాయి. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఆ తేదీ తరువాత మార్కెట్లో కొత్త కార్లు మరింత తక్కువ ధరలకు లభించనున్నాయి. ఇక పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల సమయంలో ప్రజలు కొత్త వాహనాలు కొనుగోలు చేయడం ఒక సంప్రదాయం లాగా మారిపోయింది. కాబట్టి ఈ ధరల తగ్గింపు వినియోగదారుల కొనుగోలు నిర్ణయంపై నేరుగా ప్రభావం చూపనుంది.

షోరూం నుంచి బయటకు రాకముందే నుజ్జునుజ్జు అయిన థార్

కారు కొనడం అనేది సామాన్యులకు కల లాంటిది. కొత్త కారు కొనే రోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా సామాన్యులు కారు కొనుగోలు చేయడానికి రూపాయి రూపాయి కూడబెట్టుకుంటారు. వారు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుందని.. కారు డెలివరీ తీసుకునే రోజు వారి సంతోషానికి అవధులు ఉండవు. కానీ, ఒక్కోసారి ఆ ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకోలేక కొందరు కొత్త కారుతో క్షణాల్లోనే ప్రమాదాలకు గురవుతుంటారు.

జీప్ రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ ధరలు భారీగా పడిపోయాయ్

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్‌టీ పన్ను తగ్గింపు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానుండగా, ఆటోమొబైల్ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాహన తయారీదారులు ఈ అవకాశాన్ని వినియోగదారులకు చేరవేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అనేక కంపెనీలు తమ వాహనాల ధరలను సవరించినట్లు ప్రకటించగా, ఇప్పుడు జీప్ ఇండియా (Jeep India) కూడా అదే దారిలో నడిచింది. జీప్ ప్రస్తుతం భారత మార్కెట్లో కంపాస్, మెరిడియన్, రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ వంటి ప్రీమియం SUV మోడళ్లను విక్రయిస్తోంది. జీఎస్‌టీ తగ్గింపుతో వచ్చిన ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ క్రమంలో కొత్త ధరల వివరాలను అధికారికంగా ప్రకటించింది.
Advertisement

సెల్‎ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు

భారత మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల పట్ల వినియోగదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ స్కూటర్లలో కొన్ని అయితే స్మార్ట్‌ఫోన్ ధర కంటే కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 16 ప్రొ ధర సుమారు రూ.1.44 లక్షల నుంచి రూ.1.84 లక్షల వరకు ఉండగా, అంతకంటే తక్కువ ధరకే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. తక్కువ ధరలో లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు, వాటి స్పెషాలిటీల గురించి వివరంగా తెలుసుకుందాం.