జీప్ రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ ధరలు భారీగా పడిపోయాయ్
ఆటోమొబైల్స్
- 1 year, 9 days ago
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ పన్ను తగ్గింపు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానుండగా, ఆటోమొబైల్ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాహన తయారీదారులు ఈ అవకాశాన్ని వినియోగదారులకు చేరవేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అనేక కంపెనీలు తమ వాహనాల ధరలను సవరించినట్లు ప్రకటించగా, ఇప్పుడు జీప్ ఇండియా (Jeep India) కూడా అదే దారిలో నడిచింది. జీప్ ప్రస్తుతం భారత మార్కెట్లో కంపాస్, మెరిడియన్, రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ వంటి ప్రీమియం SUV మోడళ్లను విక్రయిస్తోంది. జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ క్రమంలో కొత్త ధరల వివరాలను అధికారికంగా ప్రకటించింది.