కేవలం 5 లక్షలలోనే కారు.. మారుతి సుజుకి సెలెరియో కొత్త ధర

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) ఒకప్పుడు చిన్న కార్ల విభాగంలో మంచి డిమాండ్‌ను సంపాదించిన మోడల్‌గా నిలిచింది. కానీ తాజాగా మార్కెట్ పరిస్థితులు మారడంతో, ఈ కారుకు అంతగా డిమాండ్ రాలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్ నుండి జూలై వరకు) సెలెరియో అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం నాలుగు నెలల్లో కేవలం 6,765 యూనిట్లే అమ్ముడవ్వడం వల్ల, నెలకు సగటున 1,691 కార్లు మాత్రమే రోడ్ల మీదకు వచ్చాయి. ఈ సంఖ్య మారుతి సుజుకి లైనప్‌లో చాలా తక్కువ. బలమైన పోటీదారుల మధ్యలో నిలబడే ఇతర మోడళ్లతో పోలిస్తే, సెలెరియో అమ్మకాల పరంగా వెనుకబడిపోయినట్టే అనిపిస్తుంది. ఇకపోతే, ఇది మారుతి సుజుకి అత్యల్పంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా కూడా గుర్తించబడుతోంది.

జీఎస్టీ తగ్గింపుతో రెనాల్ట్ కార్లలో భారీ తగ్గుదల

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ సమావేశం దేశ వ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ సమావేశంలో కార్లపై జీఎస్టీ రేటును తగ్గించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. అంటే ఆ తేదీ తర్వాత మార్కెట్లో అమ్ముడవుతున్న ప్రతి కారుకు కొత్తగా తగ్గిన ధరలు వర్తించనున్నాయి. ఈ పరిణామం వాహన కొనుగోలు దారులకే కాకుండా కార్ల కంపెనీలకు కూడా ఒక పెద్ద ఊరటగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా విభాగం జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను తమ వినియోగదారులకు నేరుగా అందించాలనే ఉద్దేశంతో, తమ కార్ల ధరలను సవరించాలని నిర్ణయించింది.

జీఎస్టీ తగ్గడంతో అమాంతం పడిపోయిన హ్యుందాయ్ కార్ల ధర

పండగ సీజన్ వస్తున్న వేళ హ్యుందాయ్ కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో వచ్చిన లాభాన్ని పూర్తిగా కస్టమర్లకే బదిలీ చేస్తున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ప్రకటించింది. మరి ఏ కారు ఎంత చౌకగా లభిస్తుందో ఈ వార్తలో తెలుసుకుందాం.

పెట్రోల్​ బంకులకు గుడ్​బై చెప్పేయండి.. కొత్త స్కూటర్ వచ్చేసింది!

దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే న్యూమెరోస్ మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దాని పేరు డిప్లోస్ మ్యాక్స్+(Diplos Max+). ఈ కొత్త స్కూటర్ ఐదు కొత్త అప్‌డేట్‌లతో వచ్చింది. దీని డిజైన్, డ్యూయల్ కలర్ వేరియంట్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 4.0 kWh కెపాసిటీ గల డ్యూయల్ లిక్విడ్ ఇమ్మర్షన్ కూలింగ్ బ్యాటరీ ప్యాక్, గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగం, 156 కిలోమీటర్ల రేంజ్, అధిక పికప్ దీని ప్రత్యేకతలు.
Advertisement

టయోటా ఫార్చ్యూనర్ పై ఏకంగా రూ.3.5 లక్షలు డౌన్!

మనం అవసరం ఉన్నా పెద్ద కారు కొనాలనుకున్నప్పుడు బడ్జెట్ చూసి వెనకడుగు వేస్తుంటాం. కానీ ఇప్పుడు టయోటా తీసుకున్న ఒక సంచలన నిర్ణయం తర్వాత ఇకపై అలా ఆలోచించాల్సిన అవసరం రాదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ విధానంతో టయోటా తన కార్ల ధరలను ఏకంగా రూ. 3.49 లక్షల వరకు తగ్గించింది. ఈ శుభవార్త పండుగ సీజన్‌కు ముందు ప్రజలకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు. అసలు ఈ కొత్త జీఎస్టీ విధానం ఏంటి? ఏ కారుపై ఎంత ధర తగ్గిందో తెలుసుకుందాం.

టాటా నుంచి బీఎండబ్ల్యూ వరకు లక్షల్లో తగ్గనున్న కార్ల ధరలు

పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో కొత్త కారు కొనాలని కలలు కనేవారికి ఇది సరైన సమయం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక కీలక నిర్ణయం వల్ల కార్ల ధరలు భారీగా తగ్గాయి. ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీని తగ్గించడంతో, ప్రముఖ కార్ల కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రెనాల్ట్, బీఎండబ్ల్యూ, మారుతీ సుజుకి వంటివి ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి సిద్ధమయ్యాయి.

గుడ్‌న్యూస్! భారీగా తగ్గిన మహీంద్రా కార్ల ధరలు

పండుగ సీజన్ వచ్చేసింది. కొత్తగా కారు కొనాలనుకునే వారికి ఇది నిజంగా బెస్ట్ టైం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం వల్ల కార్ల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. సాధారణంగా ఈ ధరల తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రావాలి. కానీ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ తేదీ వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. మీరు ఇప్పుడు కొత్త ధరలతోనే మహీంద్రా కార్లను కొనుగోలు చేయవచ్చు.

ట్రాఫిక్ లైట్లు ఎప్పుడు వచ్చాయ్.. వాటి వెనక అసలు కథ ఇదే..

ట్రాఫిక్ లైట్లు మన రోడ్లలో ట్రాఫిక్‌ను నియంత్రించడంలో, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడంలో చాలా కీలకం. రోడ్లపై వాహనలను కంట్రోల్ చేయడంలో, వేగం నియంత్రణ ఇలా అన్ని విషయాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ లైట్ల ద్వారా వాహనాలను, బైక్‌లను, బస్సులను, ట్రక్కులను ఎలా, ఎప్పుడు ఆపాలనేది, ఎప్పుడు జాగ్రత్తగా నడిపాలనేది స్పష్టంగా తెలియజేస్తుంది. ట్రాఫిక్ లైట్లు ఉన్న రహదారులు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయి. ముఖ్యంగా, పాదచారులు, సైకిల్ రైడర్లు, చిన్న వాహనాలు రోడ్లను సురక్షితంగా దాటగలరు. ప్రస్తుతం జనాభా విపరీతంగా పెరుగుతుంది. ఇలాంటి తరుణంలో వాహనాల సంఖ్య కూడా క్రమంగా భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో టూవీలర్, ఫోర్ వీలర్, త్రీవీలర్ల సంఖ్య పెరిగిపోతుంది.
Advertisement

ఈ కారు ఉంటే పెట్రోల్ బంకుల వైపు అసలే చూడరు

ప్రఖ్యాత ఆటోమొబైల్ బ్రాండ్ వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ (VinFast) తాజాగా తన VF7 ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్‌లో ఈవీ మార్కెట్ వేగంగా పెరుగుతున్న ఈ సమయంలో, వియత్నాంకు చెందిన ఈ బ్రాండ్ కొత్త మోడల్‌తో ఘనంగా అడుగుపెట్టింది. VF7, దాని సోదరుడు VF6 తో కలిసి, భారత వినియోగదారులకు ఆధునిక, శక్తివంతమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందించడానికి సిద్ధమవుతోంది. VF7 వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కార్ ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ, స్కై, స్కై ఇన్ఫినిటీ అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ప్రతీ వేరియంట్ దాని ఆకట్టుకునే సదుపాయాలు, అద్భుతమైన ఫీచర్లు, ఆధునిక డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ VF6 SUV ఎంట్రీ

వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ విన్‌ఫాస్ట్ (VinFast) ఇప్పుడు భారత మార్కెట్‌లో తన పాదం మోపింది. శనివారం నాడు న్యూఢిల్లీలో ఘనంగా జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో ఈ బ్రాండ్ తన తొలి వాహనాన్ని పరిచయం చేసింది. అది VF6 ఎలక్ట్రిక్ SUV. ఈ కొత్త SUVలో భవిష్యత్‌తరహా ఆధునిక డిజైన్ కనిపిస్తుంది. సాఫ్ట్ లైన్స్, స్పోర్టీ లుక్,ప్రత్యేకమైన స్టైల్ ఎలిమెంట్స్ వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా నిలిపాయి. అంతేకాదు, సౌకర్యం, సేఫ్టీ, టెక్నాలజీని కలిపి వినియోగదారునికి ప్రీమియం అనుభూతిని ఇవ్వాలని విన్‌ఫాస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. VinFast VF6 మూడు వేరియంట్లలో ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీలలో అందుబాటులో ఉంది. ఒక్కో వేరియంట్ ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది.

కొత్త లుక్‌తో కొత్త పోటీ.. డీలర్‌షిప్‌లకు చేరుకున్న మారుతి సుజుకి విక్టోరిస్ SUV

భారత ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న పోటీకి సమాధానంగా మారుతి సుజుకి (Maruti Suzuki) తన సత్తాను మరోసారి చూపించేందుకు సిద్ధమవుతోంది. ఎప్పుడూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో, నమ్మకమైన పనితీరుతో వాహనాలను అందించే ఈ దిగ్గజ సంస్థ ఇప్పుడు SUV మార్కెట్‌లో అడుగు వేసింది. తాజాగా మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki victoris) SUVను అధికారికంగా పరిచయం చేసింది. ఈ కొత్త SUV రూపకల్పనలోనే కాకుండా ఫీచర్ల పరంగా కూడా ఆధునికతను మిళితం చేస్తూ వచ్చింది. బలమైన డిజైన్, ఆకర్షణీయమైన లుక్, సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తోవినియోగదారులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతుందని కంపెనీ చెబుతోంది. ఇది కేవలం డిజైన్ పరంగానే కాకుండా, టెక్నాలజీ పరంగా కూడా పూర్తిగా అప్డేట్ అవుతూ వచ్చింది.

కేవలం 5 నెలల్లోనే మహీంద్రా EVలకు మైండ్‌బ్లోయింగ్ సక్సెస్

దేశీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా (Mahindra) తన ముద్రను మరింత బలంగా వేసుకుంటోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో ఈ కంపెనీ రూపొందించిన మోడళ్లు XEV 9E, BE6 మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. జనవరిలో భారీ అంచనాల మధ్య మార్కెట్‌లోకి వచ్చిన ఈ మోడళ్లకు ప్రారంభం నుంచే విపరీతమైన డిమాండ్ నెలకొంది. కంపెనీ మొదటగా టాప్ వేరియంట్‌ల డెలివరీలను మార్చి 20న ప్రారంభించింది. అప్పటినుండి ఒక్కొక్కటిగా ఈ కార్లు రోడ్డెక్కుతూ, కస్టమర్ల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ప్రారంభ దశలోనే ఈ రెండు మోడళ్లకు విపరీతమైన బుకింగ్‌లు రావడంతో మహీంద్రా డెలివరీ వ్యవస్థను వేగవంతం చేయాల్సి వచ్చింది. డెలివరీలు మొదలైన మొదటి 70 రోజుల్లోనే దాదాపు 10,000 కార్లు కస్టమర్లకు అందజేయడం ఒక రికార్డ్‌గా నిలిచింది.
Advertisement

టాటా కార్ల ధరలు రూ.65,000 నుంచి 1.45 లక్షల వరకు పడిపోయాయ్

టాటా మోటార్స్ (tata motors) వినియోగదారుల కోసం నిజంగా సంతోషకరమైన వార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వం కార్లపై GST రేటును గణనీయంగా తగ్గించడం వల్ల, ఆ లాభాన్ని పూర్తిగా తమ కస్టమర్లకు చేరవేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుండి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అంటే ఆ తేదీ నుండి సవరించిన ధరలు వర్తించనున్నాయి. ఈ మార్పుతో టాటా మోటార్స్‌కి చెందిన దాదాపు అన్ని హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా, మధ్యతరగతి నుండి ఉన్నత తరగతి వరకు ప్రజాదరణ పొందిన మోడళ్లు..టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, కర్వ్, హారియర్, సఫారీ కొత్త GST రేట్ల కారణంగా గణనీయమైన ధర తగ్గింపును చూశాయి.

ఎవరికీ తెలియకుండా రూ.10 కోట్ల కారు కొన్న పుష్ప విలన్

కొత్త కారు కొనడం అనేది చాలామంది కల. అందులోనూ అత్యంత విలాసవంతమైన ఫెరారీ లాంటి కారు కొనడం సెలబ్రిటీలకే సాధ్యం. ముఖ్యంగా కేరళ సినీ పరిశ్రమలో సూపర్ కార్లంటే హీరోలకు చాలా ఆసక్తి. లంబోర్గినీ, పోర్షే, మెర్సిడెస్-బెంజ్, ల్యాండ్ రోవర్ వంటి లగ్జరీ కార్ల కలెక్షన్‌ ఉన్న నటుడు ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil). ఆయనకు కార్లంటే ఎంత ఇష్టమో మరోసారి రుజువైంది.

రూ.6.89 లక్షలకే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కారు!

ఇటీవల కాలంలో కార్ల మార్కెట్‌లో ఒక ప్రత్యేకమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఒక వాహనం అవసరం కోసం కాకుండా, సౌకర్యం, భద్రత, ఫీచర్లు అన్నీ కలిసిన పూర్తి ప్యాకేజ్ కోసం వినియోగదారులు ఎక్కువగా వెతుకుతున్నారు. అందుబాటు ధరలోనే మంచి మైలేజ్ ఇస్తే బాగుంటుందని, లాంగ్ జర్నీలో ఇబ్బందులు లేకుండా నడిస్తే ఇంకా మంచిదని కోరుతున్నారు. కేవలం ఇంధన ఖర్చు తక్కువగా ఉండడమే కాదు, డ్రైవ్ చేసే వారికి నమ్మకం కలిగించే సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండాలని భావిస్తున్నారు.రోడ్డుపై కారు నడపగానే శక్తివంతంగా స్పందిస్తేనే దాని విలువ పెరుగుతుందని చాలా మంది భావిస్తున్నారు. అదే సమయంలో, సాంకేతికతను దృష్టిలో పెట్టుకుని అధునాతన ఫీచర్లు ఉండటం తప్పనిసరి అయింది. అలాంటి వాటిలో కొత్త 2025 టాటా ఆల్ట్రోజ్ (2025 Tata Altroz) ఒకటి.

కేవలం రూ. 9.42 లక్షలకే లభించే బసాల్ట్ X లాంచ్

సిట్రోయెన్ ఇండియా (Citroen India) పండుగ సీజన్‌లో వినియోగదారులను ఆకట్టుకోవడానికి మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ కావడమే లక్ష్యంగా కంపెనీ తన ప్రాచుర్యం పొందిన కూపే SUV మోడల్‌కు కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. అదే కొత్తగా ఆవిష్కరించిన బసాల్ట్ ఎక్స్ (basalt x). ఈ కొత్త వేరియంట్‌లో X అక్షరం జోడించడం ద్వారా దాని ప్రత్యేకతను హైలైట్ చేసింది సిట్రోయెన్. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, టాప్-స్పెక్ మాక్స్ ట్రిమ్ స్థాయి కంటే మరింత అప్‌గ్రేడ్‌లను అందిస్తోంది. అంటే, ఇప్పటికే ఉన్న బసాల్ట్ SUV సిరీస్‌లో కస్టమర్లకు అదనపు ఫీచర్లు, కొత్త లుక్, మెరుగైన ఫినిషింగ్ అందించేలా బసాల్ట్ Xను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
Advertisement

హ్యుందాయ్ నైట్ ఎడిషన్ కార్లు చూడండి.. రోడ్డు మీద వెళ్తుంటే మీరే స్పెషల్ !

కారు మార్కెట్‌లో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. కార్ల కంపెనీలు తమ పాపులర్ మోడళ్లను కంప్లీట్ బ్లాక్ కలర్‌లో, అదిరిపోయే లుక్‌తో విడుదల చేస్తున్నాయి. ఈ నైట్ ఎడిషన్ కార్లకు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు హ్యుందాయ్ కూడా తమ క్రెటా, ఐ20, అల్కాజర్, క్రెటా ఎలక్ట్రిక్ కార్లలో ఈ నైట్ ఎడిషన్ మోడళ్లను తీసుకొచ్చింది. ఈ కొత్త కార్ల ఫీచర్లు, ధరలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

భారతదేశంలో సక్సెస్‌ఫుల్‌గా మొదటి టెస్లా కారు డెలివరీ

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రముఖ కంపెనీ టెస్లా (tesla) ఇటీవల అధికారికంగా భారత మార్కెట్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఎలాన్ మస్క్ యాజమాన్యంలో నడుస్తున్న ఈ సంస్థ, తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ టెస్లా మోడల్ Yను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే భారత్‌లో టెస్లా షోరూమ్ ప్రారంభమై ఒక నెల దాటక ముందే, కంపెనీ తన తొలి వాహనాన్ని కస్టమర్‌కి డెలివరీ చేయడం విశేషం. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన ఆధునిక టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఈ చారిత్రాత్మక క్షణం చోటుచేసుకుంది. ఈ వేడుకలో మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ తన స్వంత టెస్లా మోడల్ Y కారును స్వీకరించారు. ఈ విషయాన్ని ఎక్స్‌ అకౌంట్లో ఆయన తెలిపారు.

ఎయిర్ పోర్టులో శోభితను దింపిన నాగ చైతన్య

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో నాగచైతన్య (Naga Chaitanya). ఏమాయ చేశావే, 100% లవ్ లాంటి సినిమాతో తన కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య, ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. 2017లో స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్న చైతూ, నాలుగేళ్ల తర్వాత విడిపోయి ఇప్పుడు హీరోయిన్ శోభిత ధూళిపాళ (Shobhita Dhulipala)తో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

డీజిల్ కార్ల కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్

సామాన్యుల బాధలను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు జాలి చూపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ సమావేశంలో పన్నుల్లో భారీ తగ్గింపును ప్రకటించారు. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రాబోతుంది. పాత 12శాతం, 28శాతం పన్ను రేట్లను తొలగించి వాటి స్థానంలో 5శాతం, 18శాతం శ్లాబులను మాత్రమే ఉంచారు. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి పన్నుల తగ్గింపు వల్ల ఏయే కార్ల ధరలు తగ్గబోతున్నాయో తెలుసుకుందాం.
Advertisement

సిటీ రైడ్స్‌కి, లాంగ్ రైడ్స్‌కి బెస్ట్ ఆప్షన్.. కొత్త TVS NTorq 150 పూర్తి రివ్యూ

Explore the TVS NTorq 150 review, highlighting its sporty design, smart features, specifications, and competitive price in India. | TVS NTorq 150 రివ్యూను అన్వేషించండి, దాని స్పోర్టీ డిజైన్, స్మార్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు మరియు భారతదేశంలో పోటీ ధరను హైలైట్ చేస్తుంది.

విన్‌ఫాస్ట్ VF6, VF7 లాంచ్‌తో భారత EV మార్కెట్లో కలకలం

వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ విన్‌ఫాస్ట్ (Vinfast) ఇప్పుడు తన దృష్టిని భారత మార్కెట్‌పై కేంద్రీకరించింది. మన దేశంలో ఆటోమొబైల్ రంగం వేగంగా ఎదుగుతోందని గమనించిన ఈ కంపెనీ, భారత వినియోగదారుల కోసం తన కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో, సెప్టెంబర్ 6న విన్‌ఫాస్ట్ VF6, VF7 అనే ఎలక్ట్రిక్ SUVలను ఘనంగా ఆవిష్కరించనుంది. ఈ రెండు కార్లు ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు ఆధునికతను ప్రతిబింబించే డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉండటం విశేషం. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో వీటిని ప్రదర్శించగా, సందర్శకుల నుండి మంచి స్పందన లభించింది. ఇప్పుడు అధికారిక లాంచ్ కోసం ముహూర్తం ఖరారు కావడంతో, భారత EV మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ అడుగుపెడుతోంది.

ఈ కార్లను ఆలోచించకుండా కొనేయండి

చాలామంది ప్రజలకు కొత్త కారు కొనాలనేది ఒక కల. ముఖ్యంగా కుటుంబంతో కలిసి ఎక్కువ దూరం ప్రయాణించే వారికి పెద్ద, విశాలమైన ఎంపీవీ (MPV) కావాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసం టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross), కియా కారెన్స్ క్లావిస్ (Kia Carens Clavis), మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) లాంటి కార్లు బెస్ట్ ఆప్షన్లు. ఈ కార్ల ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

సూర్యకుమార్ యాదవ్ వద్ద మినీ థియేటర్ ఉందా ?

సూర్యకుమార్ యాదవ్.. ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రపంచంలో సూర్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్​తో పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్, ఐపీఎల్​లో తన స్పెషల్ బ్యాటింగ్ స్టైల్​తో సూర్య అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆసియా కప్​లో భారత జట్టు కెప్టెన్​గా వ్యవహరించనున్న సూర్య.. ప్రస్తుతం ముంబై ఎయిర్‎పోర్టులో దర్శనమిచ్చాడు.
Advertisement

11 నెలలుగా దేశంలో జనాలు ఎక్కువగా కొంటున్న ఈవీ కారు

భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ కార్ల విభాగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఎంజీ మోటార్ (MG Motor) ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2019లో భారతదేశంలోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ, మొదటి నుంచీ ఆధునిక టెక్నాలజీతో కూడిన వాహనాలను పరిచయం చేస్తూ దృష్టిని ఆకర్షించింది. భారతదేశపు ప్రముఖ సంస్థ JSWతో విలీనం కావడం ద్వారా మరింత బలపడింది. ఈ భాగస్వామ్యం తర్వాత ఎంజీ మోటార్ తన దృష్టిని మరింతగా ఎలక్ట్రిక్ వాహనాలపైనే కేంద్రీకరించింది. ఎంజీ తొలి ఎలక్ట్రిక్ కారు కామెట్ EV. మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే కామెట్ EV భారతదేశంలో అత్యంత తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కారుగా పరిచయం అయింది.