పండుగ గిఫ్ట్ ఇచ్చేసిన టీవీఎస్.. అదిరిపోయే ఎన్‌టార్క్ 150

దేశీయ టూవీలర్ రంగంలో అగ్రగామిగా ఉన్న టీవీఎస్(Tvs) మోటార్ కంపెనీ పండుగ సీజన్‌కి అద్భుతమైన బహుమతిగా కొత్త స్కూటర్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈసారి టీవీఎస్ తీసుకొచ్చింది ఎన్‌టార్క్ 150 (TVS NTORQ 150) అనే శక్తివంతమైన స్కూటర్‌ను. ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఎన్‌టార్క్ 125కి ఇది పెద్ద తోబుట్టువుగా నిలుస్తోంది. అయితే, ఇది కేవలం ఇంజిన్ పరిమాణం పెంచిన వెర్షన్ మాత్రమే కాదు, కొత్త తరహా డిజైన్ అప్‌గ్రేడ్‌లు, అత్యాధునిక ఫీచర్లు, అలాగే విభాగంలో తొలిసారిగా అందించే ప్రత్యేక సౌకర్యాలతో కూడిన పూర్తి స్థాయి అప్‌గ్రేడ్ మోడల్‌గా నిలిచింది. ఎన్‌టార్క్ 150ను పరిశీలిస్తే, స్పోర్టీ అటిట్యూడ్‌తో పాటు ప్రీమియం లుక్‌ను కలగలిపినట్లు అనిపిస్తుంది.

కారు, బైక్ కొనేవారికి పండగ లాంటి వార్త

కేంద్ర ప్రభుత్వం ఇటీవల 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్నుల విధానంలో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల సామాన్య ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే హోండా యాక్టివా, హీరో స్ప్లెండర్ వంటి వాహనాల ధరలు భారీగా తగ్గబోతున్నాయి. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. మరి, ఏ వాహనాలపై ఎంత పన్ను తగ్గింది? కొత్త ధరలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

రైతులకు ఊరట.. ట్రాక్టర్లు & వ్యవసాయ యంత్రాలపై GST భారీగా తగ్గింపు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగిన జీఎస్టీ (GST) కౌన్సిల్ 56వ సమావేశంలో వస్తు-సేవల పన్ను వ్యవస్థలో ఒక పెద్ద మలుపు తిరిగింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న నాలుగు శ్లాబులను తగ్గించి, ఇకపై కేవలం రెండు శ్లాబులకే పరిమితం చేయాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అంటే, ప్రస్తుతం ఉన్న 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబుల బదులు, ఇకపై కేవలం 5 శాతం, 18 శాతం మాత్రమే అమలులో ఉంటాయి. ఈ నిర్ణయంతో 12 శాతం, 28 శాతం శ్రేణులు పూర్తిగా రద్దు కాబోతున్నాయి. దీని ప్రభావం అత్యధికంగా ఆటోమొబైల్ రంగంపై పడనుంది. ఇప్పటివరకు 28 శాతం పన్ను విధిస్తున్న కొన్ని రకాల కార్లు, ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని నేరుగా 18 శాతానికి తగ్గించారు.

త్రీ వీలర్లోనూ మహీంద్రాదే రాజ్యం.. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో రికార్డులు బద్దలు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఫోర్ వీలర్ సెగ్మెంట్లో తీవ్రమైన పోటీ నడుస్తోంది. అయితే త్రీ వీలర్ విభాగంలో మాత్రం మహీంద్రా (Mahindra) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ సెగ్మెంట్లో మిగతా కంపెనీల దరిదాపుల్లో కూడా లేదు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సెగ్మెంట్‌లో మహీంద్రా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇటీవల ఆగస్టు నెలలో కంపెనీ పది వేలకు పైగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ యూనిట్లను విక్రయించి, 75 శాతం వృద్ధిని నమోదు చేసింది.
Advertisement

మారుతి ఈకో మళ్లీ మ్యాజిక్.. ఆగస్టులోనే 10,785 యూనిట్ల సేల్స్!

మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) భారత మార్కెట్‌లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మల్టీపర్పస్ వాహనం. పేరు చెబుతున్నట్లుగానే ఇది కుటుంబ అవసరాలకే కాదు, వ్యాపార అవసరాలకు కూడా సమానంగా ఉపయోగపడుతుంది. విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన సీటింగ్ ఆప్షన్లు, ఎక్కువ లగేజ్ స్పేస్ కారణంగా ఇది చిన్న వ్యాపారాల నుంచి పెద్ద కుటుంబాల వరకు అందరికీ సరిపోయేలా ఉంటుంది. ఈకోకు ఉన్న ఫ్లెక్సిబుల్ డిజైన్ వల్ల దానిని ప్రయాణికుల వాహనంగా, కార్గో వాహనంగా, అంబులెన్స్‌గా లేదా స్కూల్ వాన్‌గా మార్చుకోవచ్చు. దీనివల్లే ఇది మల్టీపర్పస్ వెహికల్ అని పిలవబడుతుంది. తాజాగా కంపెనీ ఈ కారుకు సంబంధించిన అమ్మకాల వివరాలను విడుదల చేసింది. ఆ డేటా ఎలా ఉందో ఈ కథణంలో తెలుసుకుందాం.

ఇక ఈ కార్లకు 40 శాతం జీఎస్టీ.. కానీ ధరలు పెరగవు ?

భారతదేశంలో వాహనదారులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ పన్ను విధానంలో భారీ మార్పులు రాబోతున్నాయి. చిన్న కార్లు, బైక్‌ల ధరలు తగ్గే అవకాశం ఉండగా.. పెద్ద,లగ్జరీ కార్లపై 40 శాతం పన్ను విధించనున్నారు. అయితే, ఈ 40 శాతం పన్ను కూడా చాలామందికి లాభదాయకం కానుందని నిపుణులు చెబుతున్నారు. ఏ వాహనాలకు ఎంత పన్ను వర్తిస్తుంది, దీని వల్ల ధరలు ఎలా మారతాయో ఇప్పుడు చూద్దాం.

జీఎస్టీ విధానంలో మార్పులు.. కార్ల, బైకుల ధరలు తగ్గుతాయా ?

భారతదేశంలో జీఎస్టీ పన్ను విధానాన్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం 12 శాతం, 28 శాతం అనే రెండు స్లాబ్‌లను తొలగించారు. ఇకపై కేవలం 5 శాతం, 18 శాతం స్లాబ్‌లు మాత్రమే ఉండనున్నాయి. ఈ మార్పు వాహనాల ధరలను నేరుగా తగ్గించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు అందరికీ నచ్చిన కారు అమ్మకాలు నిలిపేసిన కంపెనీ

మారుతి సుజుకి ఓ వైపు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొస్తూనే.. మరో వైపు కొన్ని కార్ల ఉత్పత్తులను ఆపేస్తోంది. మార్కెట్లో ప్రజాదరణ పొందని కొన్ని కార్లను తన పోర్టుఫోలియో నుంచి తొలగిస్తోంది. ఈ జాబితాలోకి మరో సెడాన్ కారు చేరింది.
Advertisement

ఏకంగా 5.53 లక్షల మంది.. హీరో సునామీ సేల్స్

దేశీయ టూవీలర్ రంగంలో అగ్రస్థానంలో నిలిచిన హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన స్థిరమైన డిమాండ్‌ను మరోసారి నిర్ధారించింది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే బైక్స్, స్కూటర్లను సమయానికి, తక్కువ ధరలతో అందించడం ద్వారా ఎప్పుడూ ముందుండే కంపెనీ, తాజాగా అద్భుతమైన సేల్స్ రికార్డును సొంతం చేసుకుంది. సేల్స్ నివేదిక ప్రకారం, ఆగస్టు 2025లో హీరో మోటోకార్ప్ మొత్తం 5,53,727 మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను దేశవ్యాప్తంగా రవాణా చేసింది. ఇది గత సంవత్సరంలో, ఆగస్టు 2024లోని అమ్మకాలతో పోలిస్తే 8 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ అద్భుతమైన సేల్స్ రికార్డు కంపెనీని మాత్రమే, భారతీయ వినియోగదారుల టూవీలర్ వాహనాలపై పెరుగుతున్న ప్రేమను కూడా ప్రతిబింబిస్తుంది. సాధారణ ధరల్లో అందించే మోడళ్లు కలిగి ఉండటం కారణంగా ఎక్కువ మంది ఈ కంపెనీ వాహనాలను కొంటున్నారు.

5 స్టార్ సేఫ్టీతో మరెన్నో అద్భుత ఫీచర్లతో మారుతి నయా కార్

మారుతి సుజుకి విక్టోరియస్ త్వరలో విడుదల కానుంది. ధర, ఫీచర్లు, ఇంజిన్ ఎంపికలు మరియు విడుదల తేదీ గురించి తెలుసుకోండి.

భద్రతలో బుల్లెట్ ప్రూఫ్.. మారుతి విక్టోరిస్ కి భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్!

మారుతి సుజుకి తాజాగా విడుదల చేసిన కొత్త మిడ్-సైజ్ కాంపాక్ట్ SUV విక్టోరిస్ (victoris) భద్రతా ప్రమాణాలలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది. దేశ వాహన భద్రతా అంచనా కార్యక్రమం భారత్ NCAP (BNCAP) నిర్వహించిన అధికారిక పరీక్షల్లో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించడం గమనార్హం. ఇది మారుతి సుజుకి మోడళ్లలో రెండవ అత్యంత సురక్షితమైన కారు కావడం విశేషం. ఈ రేటింగ్‌తో పాటు కంపెనీ తన వాహనాలలో భద్రతపై చూపిస్తున్న పెరుగుతున్న నిబద్ధత మరింత స్పష్టమవుతోంది. BNCAP నివేదిక ప్రకారం, విక్టోరిస్ బరువు సుమారు 1,549 కిలోలు. ఈ SUV అన్ని విభాగాల్లోనూ అసాధారణమైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా వయోజన ప్రయాణీకుల రక్షణలో, ఇది 32 పాయింట్లలో 31.66 పాయింట్లు సాధించడం ద్వారా తన శక్తివంతమైన భద్రతా వ్యవస్థను నిరూపించింది.

కమర్షియల్ సెగ్మెంట్‌తో బలం చాటుకున్న మహీంద్రా

భారత ఆటోమొబైల్ రంగంలో ఎప్పుడూ తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న సంస్థల్లో మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ (M&M) ఒకటి. దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కంపెనీ, కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తన వాహనాల ద్వారా మంచి ప్రభావం చూపిస్తోంది. ప్రతి నెలా విడుదలయ్యే అమ్మకాల గణాంకాలు మార్కెట్లో ఈ కంపెనీ ప్రదర్శనను అద్దం పట్టిస్తాయి. తాజాగా ఆగస్టు 2025 నెలకు సంబంధించిన నివేదికను మహీంద్రా ప్రకటించింది. ఈ నెలలో కంపెనీ మొత్తం 75,901 వాహనాలను (ప్రయాణీకుల వాహనాలు + వాణిజ్య వాహనాలు కలిపి) విక్రయించింది. ఇందులో దేశీయ మార్కెట్ మాత్రమే కాకుండా ఎగుమతులు కూడా ఉన్నాయి.
Advertisement

భారీగా తగ్గనున్న చిన్న కార్లు, ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు ?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో నేటి నుంచి అంటే సెప్టెంబర్ 3నుంచి 58వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ కీలక సమావేశంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు, పన్ను విధానంలో సంస్కరణలపై చర్చించనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అనేక కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది.

పండుగ బహుమతిగా మారుతి సుజుకి కొత్త SUV విక్టోరిస్

మారుతి సుజుకి భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పుడూ అగ్రగామిగా నిలుస్తూ వినియోగదారుల అభిరుచులను బట్టి కొత్త మోడళ్లను విడుదల చేస్తూ వస్తుంది. తాజాగా, దేశంలోనే అతిపెద్ద ఆటోమేకర్‌గా పేరుగాంచిన ఈ కంపెనీ, విక్టోరిస్ (Victoris) అనే సరికొత్త కాంపాక్ట్ SUVను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ మోడల్ పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించబడింది. కొత్త కారు కొనాలనుకునే కస్టమర్లను ఆకట్టుకోవడమే కాకుండా, పోటీదారులకు గట్టి సవాలు విసరాలనే లక్ష్యంతో మారుతి ఈ వాహనాన్ని ప్రవేశపెట్టింది. విక్టోరిస్ SUVలో డిజైన్ నుండి సేఫ్టీ వరకు ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టబడింది. ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్, ఆకట్టుకునే లుక్స్, కస్టమర్లను కట్టిపడేసే రీతిలో తీర్చిదిద్దబడ్డాయి.

మరో కొత్త బైక్‌తో మార్కెట్‌లోకి హీరో.

భారతీయ మార్కెట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) కొత్త బైక్‌లను విడుదల చేస్తోంది. ప్రీమియం సెగ్మెంట్‌లో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే హీరో కంపెనీ కొద్ది రోజుల క్రితం సరికొత్త అడ్వెంచర్-స్టైల్ స్కూటర్ హీరో జూమ్ 160ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

టాటా మోటార్స్ బలమైన ఆయుధం ఇదే.. సేల్స్‌లో అదరగొట్టిన ఈవీలు

టాటా మోటార్స్ (tata motors) భారతదేశంలో ఎప్పుడూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఆటోమొబైల్ దిగ్గజం. అయితే, తాజాగా విడుదలైన ఆగస్టు 2025 అమ్మకాల గణాంకాలు కొంత ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టాయి. ప్యాసింజర్ కార్ల విభాగంలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. అయితే, కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగం మాత్రం తన వేగాన్ని నిలబెట్టుకుంది. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతులను కలుపుకుని చూస్తే, టాటా మోటార్స్ ఆగస్టు నెలలో మొత్తం 43,315 ప్యాసింజర్ కార్లను రవాణా చేసింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 44,486 యూనిట్లతో పోలిస్తే సుమారు 1,171 వాహనాలు తక్కువ.
Advertisement

ఇకపై ఈవీలను కొనాలంటే ఎక్స్‎ట్రా రూ.7లక్షలు పెట్టాల్సిందే

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అయితే, ఇప్పుడు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడం మరింత ఖరీదైనదిగా మారవచ్చు. ఒక నివేదిక ప్రకారం.. ఒక ట్యాక్స్ ప్యానెల్ రూ. 40 లక్షలు (సుమారు 46,000 డాలర్లు) కంటే ఎక్కువ ధర ఉన్న ఈవీలపై జీఎస్టీని పెంచాలని సూచించింది. ఇది టెస్లా, మెర్సిడెస్-బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, బీవైడీ వంటి విదేశీ కంపెనీల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు.

ఒకే ఏడాదిలో 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు.. తమిళనాడు టాప్‌లో!

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ప్రతి సంవత్సరం లక్షలాది కుటుంబాలను కబళిస్తున్నాయి. సంఖ్యల రూపంలో చూస్తే ఇవి కేవలం గణాంకాలు అనిపించవచ్చు, కానీ వాటి వెనుక వేల కుటుంబాల కలలు, ఆశలు, జీవితాలు చెదిరిపోతున్నాయి. అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం, హెల్మెట్ - సీట్‌బెల్ట్ వంటి ప్రాథమిక భద్రతా నియమాలను విస్మరించడం ఈ విషాదానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం పేపర్ తెరిస్తే రోడ్డు ప్రమాద వార్త తప్పక కనిపించడం సహజమైపోయింది. ఒక కుటుంబానికి ప్రధాన బలమైన వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే, అది ఆ కుటుంబానికి కోలుకోలేని విషాదాన్ని మిగుల్చుతుంది. చిన్న పిల్లల విద్య, వృద్ధుల సంరక్షణ, కుటుంబ భవిష్యత్తు అన్నీ ఒక్కసారిగా కూలిపోతాయి.

ఇక మార్కెట్‌లో ప్రత్యర్థులకు చుక్కలే.. టాటా పంచ్ రెడీ

టాటా మోటార్స్ ఎంట్రీ-లెవల్ మోడల్, చిన్న కారు అయిన టాటా పంచ్, దాని పేరుకు తగ్గట్టుగానే ప్రత్యర్థులకు ఒక అదిరిపోయే పంచ్ ఇచ్చింది. సిఎన్‌డి పవర్‌ట్రెయిన్‌తో వచ్చిన ఈ కారు నిజంగానే మిగతా కార్ల తయారీదారులకు ఒక సవాలు విసిరింది.

ఆగస్టులో మరోసారి దూసుకెళ్లిన మారుతి సుజుకి

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి (Maruti Suzuki) అనే పేరు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దశాబ్దాలుగా ఈ బ్రాండ్ సాధించిన విజయాలు, కస్టమర్ల విశ్వాసం, విస్తృతమైన మోడల్ లైనప్ అన్నీ కలిపి దీన్ని నంబర్ వన్ స్థానంలో నిలిపాయి. దేశంలోనే అతిపెద్ద ఆటోమేకర్‌గా మారుతి సుజుకి ఎప్పటికీ ఒక ప్రమాణంగా నిలుస్తోంది. ఆగస్టు 2025కి సంబంధించిన తాజా అమ్మకాల గణాంకాలు విడుదల కావడంతో మళ్లీ ఒకసారి కంపెనీ తన శక్తి ఎంత గొప్పదో చూపించింది. గత 31 రోజుల్లో ఈ బ్రాండ్ మొత్తం 1,80,683 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మిన 1,81,782 యూనిట్లతో పోలిస్తే స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, ఇది పెద్దగా ఆందోళన కలిగించే విషయం కాదు.
Advertisement

ఈ కారుతో రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్నే చూస్తారు

కొత్త కారు అనగానే మనలో చాలా మందికి దాని లుక్, ఇంజిన్, మైలేజ్ మీద మాత్రమే దృష్టి ఉంటుంది. అయితే, కొన్ని కార్లు మన అంచనాలకు మించి ఆశ్చర్యపరుస్తాయి. మార్కెట్లో విడుదలయ్యే చాలా కార్లు ఒకేలా అనిపించినా, ఎంజి మోటార్స్ నుండి వచ్చిన ఎంజీ ఆస్టర్ ఎస్యూవీ మాత్రం తన అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీన్ని ఎందుకు బ్లాక్‌బస్టర్ ఎస్‌యూవీ అని పిలుస్తున్నారో.. దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

మనతో ఎన్ని గొడవలున్నా చైనా కంపెనీ కార్లను తెగ కొనేస్తున్నారు

చైనాకు చెందిన BYD (Build Your Dreams) ఒక ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ. ఈ కంపెనీ దేశీయ మార్కెట్‌లో అనేక రకాల కార్లను విజయవంతంగా అమ్ముతోంది. ఈ కార్లు మంచి డిజైన్‌తో పాటు ఎన్నో ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. అందుకే కస్టమర్లు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా BYD కంపెనీ భారతదేశంలో ఒక కొత్త రికార్డును నెలకొల్పింది.

10 నెలలుగా టాప్ EVగా MG విండ్సర్.. ఆగస్టు 2025 సేల్స్ రిపోర్ట్

భారతదేశంలోని ఆటోమొబైల్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ కార్ల తయారీదారు JSW MG మోటార్ ఇండియా (Jsw Mg Motor India) మరోసారి తన అమ్మకాలతో హైలైట్ అవుతోంది. తాజాగా ఆగస్టు నెల ముగియగానే కంపెనీ అధికారికంగా తన విక్రయాల గణాంకాలను ప్రకటించింది. ఈ వివరాలు పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని కలిగించేలా ఉన్నాయి. నివేదికల ప్రకారం, MG మోటార్ ఆగస్టు 2025లో మొత్తం 6,578 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ సంఖ్య కేవలం గణాంకం మాత్రమే కాదు, గత సంవత్సరం ఇదే కాలంలో అమ్ముడైన 4,323 యూనిట్లతో పోలిస్తే దాదాపు 52.16 శాతం వృద్ధిని సూచిస్తుంది. అంటే, కేవలం ఒక సంవత్సర కాలంలోనే MG బ్రాండ్ దేశీయ మార్కెట్లో తన ప్రాచుర్యం, డిమాండ్ ఎంతగానో పెరిగిందని ఇది నిరూపిస్తోంది.

హ్యుందాయ్ 10వ వార్షికోత్సవ వేడుక.. ప్రజల కోసం ప్రత్యేక క్రెటా కింగ్ కార్స్

హ్యుందాయ్ (Hyundai) ఎప్పటి నుంచో భారతీయుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కార్ల బ్రాండ్. ముఖ్యంగా SUV విభాగంలో తన క్రెటా మోడల్‌తో ఒక చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఆ విజయాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో, క్రెటా 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హ్యూందాయ్ కొత్త ప్రత్యేక ఎడిషన్ మోడళ్లను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక సిరీస్‌లో క్రెటా కింగ్ (CRETA king), కింగ్ లిమిటెడ్ ఎడిషన్ (CRETA King Limited Edition), కింగ్ నైట్ ఎడిషన్ (CRETA King Knight) మోడళ్లను ప్రవేశపెట్టింది. వీటితో పాటు ఇప్పటికే ఉన్న వేరియంట్‌లకు మరింత విలువ చేకూరేలా కొత్త ఫీచర్ అప్‌గ్రేడ్‌లు కూడా చేసింది.
Advertisement

దేవుడిలా వచ్చి ప్రాణాలు కాపాడిన మహీంద్రా కారు

రోడ్డు ప్రయాణాలు ఇప్పుడు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అయితే రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. అందుకే కారు కొనేటప్పుడు దాని లుక్, మైలేజ్ మాత్రమే కాకుండా, సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.