హ్యుందాయ్ 10వ వార్షికోత్సవ వేడుక.. ప్రజల కోసం ప్రత్యేక క్రెటా కింగ్ కార్స్

హ్యుందాయ్ (Hyundai) ఎప్పటి నుంచో భారతీయుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కార్ల బ్రాండ్. ముఖ్యంగా SUV విభాగంలో తన క్రెటా మోడల్‌తో ఒక చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఆ విజయాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో, క్రెటా 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హ్యూందాయ్ కొత్త ప్రత్యేక ఎడిషన్ మోడళ్లను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక సిరీస్‌లో క్రెటా కింగ్ (CRETA king), కింగ్ లిమిటెడ్ ఎడిషన్ (CRETA King Limited Edition), కింగ్ నైట్ ఎడిషన్ (CRETA King Knight) మోడళ్లను ప్రవేశపెట్టింది. వీటితో పాటు ఇప్పటికే ఉన్న వేరియంట్‌లకు మరింత విలువ చేకూరేలా కొత్త ఫీచర్ అప్‌గ్రేడ్‌లు కూడా చేసింది.

దేవుడిలా వచ్చి ప్రాణాలు కాపాడిన మహీంద్రా కారు

రోడ్డు ప్రయాణాలు ఇప్పుడు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అయితే రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. అందుకే కారు కొనేటప్పుడు దాని లుక్, మైలేజ్ మాత్రమే కాకుండా, సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.

టెస్లా ఇండియాలో షాక్.. మోడల్ Yకి కేవలం 600 బుకింగ్స్ మాత్రమే!

భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం అతిపెద్ద గమ్యస్థానంగా మారిపోతోంది. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, పర్యావరణ కాలుష్యం అదుపులో ఉంచే అవసరం పెరిగిన నేపథ్యంలో, ఈవీలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. దేశీయ కంపెనీలు అయిన టాటా, మహీంద్రా మొదలైనవి ఇప్పటికే తమ ఫోకస్‌ను ఎలక్ట్రిక్ వాహనాలపైకి మళ్లించాయి. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈవీ కంపెనీలు కూడా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రత్యేకంగా టెస్లా కంపెనీపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రాచుర్యం పొందేలా చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఇప్పుడు భారత మార్కెట్‌పై దృష్టి సారించారు.

5 లక్షల కుటుంబాల కల నెరవేర్చిన టీవీఎస్

తమిళనాడుకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ (TVS Motor), ఇటీవల జరిగిన ఆగస్టు నెల అమ్మకాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే నెలలో ఏకంగా 5 లక్షల యూనిట్లకు పైగా వాహనాలను అమ్మి, తమ చరిత్రలోనే అత్యుత్తమ రికార్డును నమోదు చేసింది. దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా టీవీఎస్ మోటార్స్ చూపించిన ఈ అద్భుతమైన వృద్ధి, అందరినీ ఆశ్చర్యపరిచింది.
Advertisement

ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాలకు వస్తున్న వాహనాలపై అలర్ట్!

దేశంలో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా భారతదేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. వాయు కాలుష్యం విషయంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రభావితమైన నగరాల్లో ఢిల్లీ ఎప్పుడూ అగ్రస్థానంలోనే నిలుస్తోంది. దీంతో అక్కడ గాలి నాణ్యత మరింత దిగజారిపోతోంది. పలు ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అయితే అవి అనుకున్నంత ఫలితాలను ఇవ్వలేదు. అందుకే ప్రభుత్వం మరింత కఠినమైన నిర్ణయాలను తీసుకుంది. వాటిలో ముఖ్యంగా 15 ఏళ్లు దాటిన కార్లు, ట్యాక్సీలను పూర్తిగా రోడ్లపై నడవనీయకుండా నిషేధం విధించింది. ముఖ్యంగా డీజిల్‌ కార్లను ఢిల్లీలో పూర్తిగా బ్యాన్ చేశారు. కాలుష్యాన్ని తగ్గించే దిశగా సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ కార్లను ప్రోత్సహిస్తున్నారు.

ఒక్క నెలలోనే రికార్డు సేల్స్.. టెన్షన్ పడుతున్న టీవీఎస్, బజాజ్!

బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ (Ather Energy), ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (Two Wheeler) తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. దేశీయంగా అనేక ఈ-స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి చాలా చక్కటి డిజైన్, అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. కస్టమర్లు కూడా పోటీ పడి కొనుగోలు చేశారు. దానికి సాక్ష్యంగా ఈ 2025 ఆగస్టులో కంపెనీ స్కూటర్లు భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఆ వివరాలు ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.

అందరి కోసం సిద్ధమవుతున్న మారుతి న్యూ ఎస్కుడో

భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను అందిస్తూ, ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki). దేశంలో మధ్యతరగతి కుటుంబాల నుండి ప్రీమియం వర్గం వరకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే కార్లను అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు, మైలేజ్, డిజైన్ అప్‌డేట్‌లతో తన కార్లను రీఫ్రెష్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా, మారుతి సుజుకి మరో కొత్త అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో పెరుగుతున్న SUVల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, కొత్త మిడ్-సైజ్ కాంపాక్ట్ SUV ఎస్కుడో (Escudo)ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమాచారం ప్రకారం, ఈ కారు సెప్టెంబర్ 3, 2025న అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది.

31 రోజుల్లో 60,000 మంది ఈ కంపెనీ కారును కొనుగోలు చేశారు

హ్యుందాయ్ కంపెనీ గత ఆగస్టు నెలలో మొత్తం 60,501 వాహనాలను విక్రయించి భారీ వృద్ధిని సాధించింది. ఇందులో 44,001 వాహనాలు దేశంలో అమ్ముడయ్యాయి. 16,500 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
Advertisement

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ కంపెనీ కార్లే కావాలంటున్నారు

పండుగ సీజన్‌కు గేట్‌వే‎గా ఆగస్టు నెల నిలిచింది. పండుగ సీజన్ స్టార్ట్ కావడంతో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేసి లేదా బుక్ చేసి ఉంటారు. ఈ నేపథ్యంలో గత నెల అమ్మకాల గణాంకాలను తెలుసుకోవడానికి అందరికీ ఆసక్తి ఉంటుంది. టయోటా కిర్లోస్కార్ మోటార్ (TKM) 2025 ఆగస్టు నెల అమ్మకాల నివేదికను ఇప్పుడు విడుదల చేసింది.

ఎలక్ట్రిక్ కార్లపై జీఎస్టీ పెంపు? కంపెనీలలో ఆందోళన

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకు చాలా వేగంగా పెరుగుతోంది. అయితే, ఒక కొత్త ప్రతిపాదన మొత్తం ఆటో పరిశ్రమను ఆందోళనలోకి నెట్టింది. జీఎస్టీ రేట్లపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన మంత్రుల బృందం రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లపై జీఎస్టీని 5 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని సూచించింది. జీఎస్టీ కౌన్సిల్ ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ ఈ చర్చ ఇప్పటికే కంపెనీలు, వినియోగదారుల ఆలోచనపై ప్రభావం చూపడం మొదలుపెట్టింది.

సుప్రీంకోర్టు తీర్పు.. ప్రభుత్వ E20 ఇంధన విధానానికి గ్రీన్ సిగ్నల్!

ఇండియాలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలని ప్రభుత్వం తీసుకున్న E20 ఇంధన విధానంపై పెద్ద చర్చ కొనసాగుతోంది. ఈ విధానాన్ని సవాలు చేస్తూ అక్షయ్ మల్హోత్రా అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే E20 ఇంధన విధానంపై సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు తేలికగా కొట్టివేసింది. ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను నియంత్రించడం వంటి జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న చర్యలు సముచితమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం, ఈ విధానంలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదని తెలిపింది.

రేస్‌ట్రాక్‌కి పర్ఫెక్ట్‌గా, రోడ్‌పై స్టైల్‌గా.. కవాసకి నింజా ZX-6R స్పోర్ట్స్ మోడల్ లాంచ్!

కవాసకి (kawasaki) అనే పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ లవర్స్ మనసులో ప్రత్యేకమైన ఉత్సాహం కలుగుతుంది. రేసింగ్ ట్రాక్‌లపై దూసుకుపోయే స్పీడ్ బీష్ట్‌గా, రోడ్డుపై అందరినీ ఆకట్టుకునే లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్‌గా కవాసకి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. భారతదేశంలో కూడా ఈ కంపెనీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా యువత, స్పోర్ట్స్ బైక్‌లకు ఆసక్తి ఉన్నవారు కవాసకిని కలల బైక్‌గా భావిస్తారు. ఈ క్రమంలో తాజాగా కంపెనీ తన మరో సరికొత్త అద్భుతాన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే కొత్త కవాసకి నింజా జెడ్‌ఎక్స్-6ఆర్ (KAWASAKI NINJA Zx 6r). దీనిని చూసిన వెంటనే దాని డిజైన్, స్టైల్ మనసును దోచేస్తాయి. రేసింగ్ హార్ట్‌బీట్ ఉన్న వారందరికీ నచ్చేలా ఈ బైకును డిజైన్ చేశారు.
Advertisement

రూ.10లక్షల లోపు కీ-లెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ కార్లు ఇవే

కొన్నేళ్లుగా ఆధునిక కార్లలో తప్పనిసరిగా ఉన్న అనేక అంశాలు కనుమరుగై, వాటి స్థానంలో కొత్త ఫీచర్లు వచ్చాయి. గత కొన్నేళ్లుగా కార్లలో అందుబాటులో ఉన్న ఫీచర్లలో కీ-లెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ ముఖ్యమైనవి. కీ-లెస్ ఎంట్రీ వల్ల తాళం చెవితో డోర్ తెరవడానికి బదులుగా డిజిటల్ కీతో సులభంగా కారులోకి ఎంటర్ అవ్వొచ్చు. అదే సమయంలో పుష్-బటన్ స్టార్ట్ ఫీచర్ వల్ల ఇంజిన్‌ను ఒక బటన్ నొక్కడం ద్వారా స్టార్ట్ చేయవచ్చు. రూ. 10 లక్షల లోపు ధరలో ఈ రెండు ఫీచర్లను అందించే కార్లు ఏవో చూద్దాం.

హైబ్రిడ్ కార్లు ఎలా పనిచేస్తాయో తెలుసా? అయితే ఇది చదవండి

ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. పర్యావరణ సమస్యలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఈ రెండు కారణాల వల్ల చాలా మంది వినియోగదారులు ఇకపై సాధారణ ఇంజిన్ కార్లకంటే హైబ్రిడ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యల్లో కూడా హైబ్రిడ్ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.ఇప్పటికే టయోటా, హోండా వంటి కంపెనీలు భారత మార్కెట్‌లో హైబ్రిడ్ కార్లను ప్రవేశపెట్టాయి. వీటి అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. వినియోగదారులు ఫ్యూయల్ పొదుపు + భవిష్యత్ టెక్నాలజీ కలయికగా హైబ్రిడ్ కార్లను ఎంచుకుంటున్నారు. భారతదేశం లాంటి పెరుగుతున్న మార్కెట్‌లో, రాబోయే సంవత్సరాల్లో హైబ్రిడ్ కార్లే కీలకమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ కార్లు ఎలా పనిచేస్తాయో ఒకసారి తెలుసుకుందాం.

ఒక్క నిమిషంలో ఫాస్టాగ్ పాస్ యాక్టివేట్ చేస్కోండి

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఆగస్ట్ 15న ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass)ను ప్రారంభించింది. ఈ పాస్ ద్వారా ప్రైవేట్ వాహనాల యజమానులు కేవలం రూ.3,000తో 200 ట్రిప్పులు (టోల్ క్రాసింగ్) చేయవచ్చు. ఈ ఫాస్ట్‌ట్యాగ్ దేశంలోని అన్ని నేషనల్ హైవేలు, నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వేలపై పని చేస్తుంది.

తెల్లటి కారు తీసుకుంటే లాభమే గాని నష్టమేం ఉండదు

కొత్త కారు కొనే సమయంలో కలర్ ఎంచుకోవడం అనేది నిజంగా ఒక తలనొప్పిగా మారిపోతుంది. ఈ రోజుల్లో ఆటోమొబైల్ కంపెనీలు విభిన్నమైన కలర్ ఆప్షన్లు అందిస్తుండటంతో, ఏది ఎంచుకోవాలో అర్థం కాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కారు కలర్ అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో పలు సమస్యలతోనూ సంబంధం ఉంటుంది. సరైన కలర్ ఎంచుకోకపోతే పునఃవిక్రయం సమయంలో దాని విలువ తగ్గిపోవచ్చు. అలాగే కొన్ని కలర్ కార్లు నిర్వహణ ఖర్చులు ఎక్కువగా తీసుకోవచ్చు. చిన్న చిన్న గీతలు, మురికి ఎక్కువగా కనబడే రంగులు మీకు అదనపు ఇబ్బందులు కలిగించవచ్చు. అయితే మీకు ఇక్కడ ఆక్చర్యకర విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రజలు ఎంచుకునే రంగు తెలుపు.
Advertisement

ప్రపంచంలోని టాప్ 10 ఆటో బ్రాండ్ల జాబితా నుండి నిస్సాన్ అవుట్

ప్రపంచంలోని అత్యుత్తమ కార్ల తయారీ సంస్థల్లో నిస్సాన్ ఒకటి. జపాన్‌కు చెందిన ఈ కార్ల తయారీ సంస్థ ప్రస్తుతం భారతదేశంలో రెండు కార్లను మాత్రమే విక్రయిస్తున్నప్పటికీ గల్ఫ్‌ దేశాలలో నివసించే వారిని ఈ కంపెనీ గురించి అడిగితే వారికి నిస్సాన్ అంటే చాలా ఇష్టం.

ఒక్కసారి చార్జ్ చేస్తే 355 కి.మీ. వరకు ప్రయాణం

కియా సైరోస్ (Kia Syros) భారత ఆటోమొబైల్ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి వినియోగదారుల మన్ననలు పొందుతూ, అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలిచింది. గత ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ప్రస్తుతం ఐసీఈ ఇంజిన్‌ వెర్షన్‌లో మాత్రమే లభిస్తోంది. కానీ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, కియా తన అత్యంత విజయవంతమైన మోడల్‌ సైరోస్‌కి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కియా సైరోస్ EV గురించి ఇప్పటికే వినియోగదారుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రాకముందే, ఈ వాహనం భారతీయ మార్కెట్లో ప్రవేశిస్తుందన్న వార్తలు ఆటోమొబైల్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఈ కారు భారతీయ రోడ్లపై టెస్ట్‌ రన్‌ను ప్రారంభించినట్లు సమాచారం వెలువడింది.

కొత్త టయోటా ఫార్చ్యనర్ వచ్చేస్తోంది

టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) ఒక ఫుల్-సైజ్ ఎస్‌యూవీ. ఇది జనాల్లో భారీగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇది చాలా చక్కని డిజైన్, అనేక ఫీచర్లను కలిగి ఉంది. టయోటా కంపెనీ 2026 సెకండ్ ఆఫ్‎లో న్యూ జనరేషన్ ఫార్చ్యూనర్‎ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అసలు ఫార్చ్యునర్ అంటేనే పొలిటికల్ లీడర్స్ బండి అన్న పేరుంది. అలాంది దానిని ఇప్పుడు హిల్క్స్ పికప్ ట్రక్‌ను ఆధారం చేసుకుని రూపొందించబడుతుందని చెబుతున్నారు. కొత్త కారు అంచనా ధర, స్పెషాలిటీ ఏంటో చూద్దాం.

సెప్టెంబర్లో లాంచ్ కానున్న బైకులు, స్కూటర్లు ఇవే

ప్రతి నెలా కొత్త కార్లు (New Cars) మార్కెట్‌లోకి వచ్చినట్లే, ద్విచక్ర వాహనాల మార్కెట్‌లోకి కూడా కొత్త మోడళ్లు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ విభాగంలో అయితే టూ-వీలర్లు (Two Wheelers) పెద్ద సంఖ్యలో వస్తున్న కాలం ఇది. ఆగస్ట్ నెల ముగిసిపోయింది. 2025 సెప్టెంబర్‌లో కూడా భారతీయ ద్విచక్ర వాహనాల విభాగంలో అనేక లాంచ్‌లు జరగనున్నాయి. భారతదేశంలో అత్యధిక అమ్మకాలు జరిగే పండుగ సీజన్ మొదలవుతుండటంతో, రాబోయే ముప్పై రోజులలో విడుదల చేయడానికి అనేక వాహనాలు సిద్ధంగా ఉన్నాయి.
Advertisement

సీక్రెట్ వెపన్ దించబోతున్న మారుతి

భారత మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని ప్రముఖ బ్రాండ్లు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి. అయితే, దేశంలో నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి సొంతంగా ఒక ఈవీని అభివృద్ధి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంది. దీని లాంచ్ కూడా వాయిదా పడుతోంది. భారతీయ కస్టమర్లను, దేశ ప్రభుత్వ విధానాలను బాగా అర్థం చేసుకున్నందున లేటయినా లేటెస్టుగా రావాలనే ఆలోచనలో మారుతి సుజుకి ఉన్నట్లు అనిపిస్తుంది.

మీ దగ్గర జిక్సర్ 250 ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోవాలి

సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle) కంపెనీ భారతదేశంలో కొన్ని నిర్దిష్ట మోటార్‌సైకిళ్లను ఒక లోపం కారణంగా రీకాల్ చేసింది. అంటే, ఒక నిర్దిష్ట సమయంలో ఉత్పత్తి చేయబడిన బైకులలో లోపాలు కనుగొన్న తర్వాత, వాటిని సరిచేయడానికి సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ వాటిని తిరిగి షోరూమ్‌లకు పిలిపిస్తోంది.

తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు సెప్టెంబర్లో రాబోతున్నాయ్

ఆగస్ట్ నెల ఈరోజుతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఆటోమొబైల్ రంగానికి చాలా ముఖ్యమైన నెల కానుంది. సాధారణంగా చాలామంది దీపావళికి కార్లు కొనాలని ప్లాన్ చేస్తారు. వారిని ఆకర్షించడానికి, సెప్టెంబర్ నెలలో కొత్త కార్లు చాలా రిలీజ్ కానున్నాయి. ఈ సెప్టెంబర్ నెలలో 6 కొత్త కార్లు విడుదల కానున్నాయి. వాటి వివరాలు ఇక్కడ చూద్దాం.

త్వరలో మార్కెట్లోకి హైబ్రిడ్ కార్ల సునామీ

భారతీయ ఎస్‌యూవీ మార్కెట్ ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన హోండా, హ్యుందాయ్, కియా, రెనాల్ట్ 2026-2027 నాటికి కొత్త 7-సీటర్ హైబ్రిడ్ ఎస్‌యూవీలను విడుదల చేయబోతున్నాయి. ఈ కొత్త వాహనాలు పర్యావరణానికి మేలు చేస్తూనే, మంచి మైలేజీని అందిస్తాయి. ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Advertisement

రూ. 10 లక్షల లోపు లభించే 360-డిగ్రీ కెమెరా కార్లు!

కార్లలో చాలా మంది కోరుకునే ఒక ముఖ్యమైన ఫీచర్‌గా 360-డిగ్రీ కెమెరా (360-Degree Camera) మారింది. కారు చుట్టూ ఏమి జరుగుతుందో కారులో కూర్చున్న చోటు నుంచే చూడవచ్చు. ఇందుకోసం కారు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కారు చుట్టూ అమర్చిన కెమెరాలు కలిసి పనిచేస్తాయి. ఇటువంటి 360-డిగ్రీ కెమెరా ఫీచర్‌తో రూ.10 లక్షల లోపు లభించే కార్ల గురించి ఈ కథనంలో చూద్దాం. ఈ ఫీచర్ అన్ని వేరియంట్లలో లభించదు. కేవలం కొన్ని వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. అవి ఏవో కూడా ఇక్కడ తెలుసుకుందాం.