ఏథర్ నుంచి తక్కువ ధరకే కొత్త స్కూటర్లు!
ఆటోమొబైల్స్
- 1 year, 20 days ago
భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో అగ్రగామి స్థానం సంపాదించుకున్న ఏథర్ ఎనర్జీ(Ather Energy), 2025లో జరిగిన మూడవ Ather Community Day సందర్భంగా భవిష్యత్తు వైపు తీసుకెళ్లే పలు సరికొత్త ఆవిష్కరణలను పరిచయం చేసింది. ఈ ఈవెంట్లో కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే వాహనాలను రూపొందించడానికి ఒక వేదికను తీసుకొచ్చింది. తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆల్-న్యూ EL ప్లాట్ఫారమ్ ఆవిష్కరించింది. ఇది 450 సిరీస్ తర్వాత కంపెనీ రూపొందించిన తొలి వాహన ఆర్కిటెక్చర్. ఈ ప్లాట్ఫారమ్ను ప్రత్యేకంగా మల్టిపుత్ వినియోగం (Versatility), స్కేలబిలిటీ (Scalability), ఖర్చు ఆప్టిమైజేషన్ (Cost Optimisation) దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. ప్రకటించిన టెక్నాలజీలు, వాహన ప్లాట్ఫారమ్లు కేవలం ఏథర్కే కాదు, మొత్తం భారతీయ EV మార్కెట్కే ఒక మైలురాయి కానున్నాయి.