ఏథర్ నుంచి తక్కువ ధరకే కొత్త స్కూటర్లు!

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో అగ్రగామి స్థానం సంపాదించుకున్న ఏథర్ ఎనర్జీ(Ather Energy), 2025లో జరిగిన మూడవ Ather Community Day సందర్భంగా భవిష్యత్తు వైపు తీసుకెళ్లే పలు సరికొత్త ఆవిష్కరణలను పరిచయం చేసింది. ఈ ఈవెంట్‌లో కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే వాహనాలను రూపొందించడానికి ఒక వేదికను తీసుకొచ్చింది. తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆల్-న్యూ EL ప్లాట్‌ఫారమ్ ఆవిష్కరించింది. ఇది 450 సిరీస్ తర్వాత కంపెనీ రూపొందించిన తొలి వాహన ఆర్కిటెక్చర్. ఈ ప్లాట్‌ఫారమ్‌ను ప్రత్యేకంగా మల్టిపుత్ వినియోగం (Versatility), స్కేలబిలిటీ (Scalability), ఖర్చు ఆప్టిమైజేషన్ (Cost Optimisation) దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. ప్రకటించిన టెక్నాలజీలు, వాహన ప్లాట్‌ఫారమ్‌లు కేవలం ఏథర్‌కే కాదు, మొత్తం భారతీయ EV మార్కెట్‌కే ఒక మైలురాయి కానున్నాయి.

మళ్లీ సేల్స్‌లో దూసుకెళ్లిన హోండా యాక్టివా

గత రెండు దశాబ్దాలుగా భారతీయుల హృదయాలను గెలుచుకుంటూ వస్తున్న స్కూటర్ ఒకటుంటే అది హోండా యాక్టివానే (Honda Activa). ఒక కుటుంబానికి సరిపోయే సౌకర్యం, యువతకు కావాల్సిన స్టైల్, వృద్ధులకు ఉపయోగపడే సులభత, ఇవన్నీ కలిపి యాక్టివాను హౌస్‌హోల్డ్ నేమ్గా మార్చేశాయి. ప్రస్తుతం ఇది ఆరవ తరంలో ఉన్నప్పటికీ, దాని పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. దానికి నిదర్శనమే జూలై 2025లో నమోదైన అద్భుతమైన సేల్స్ ఫిగర్లు. ఆ నెలలో మాత్రమే యాక్టివా మొత్తం 2,37,413 యూనిట్లు విక్రయించబడింది. ఈ సంఖ్య గత సంవత్సరం అదే నెలలో అమ్ముడైన 1,95,604 యూనిట్లతో పోలిస్తే దాదాపు 21.37 శాతం పెరుగుదల సాధించింది. అంతేకాదు, గత నెలలో యాక్టివా భారతదేశంలో రెండవ అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా నిలిచింది.

తెలుగు నేలపైకి బుల్లెట్ రైళ్లు.. హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు

దేశంలో రైల్వే రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. ఇప్పటి వరకు మనం సాధారణ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, మెట్రో రైళ్లు చూసి అలవాటు పడ్డాం. కానీ ఇప్పుడు ఆ దశను దాటుకుని, అత్యాధునిక సాంకేతికతతో కూడిన బుల్లెట్‌ రైళ్లు మనకు మరింత దగ్గర కావడం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైలు కారిడార్లను నిర్మిస్తూ, ప్రధాన మెట్రో నగరాల మధ్య ఈ సౌకర్యాన్ని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు కూడా చారిత్రక ప్రాధాన్యత దక్కబోతోంది. ఇటీవల హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ రైలు కారిడార్ల నిర్మాణానికి ప్రాథమిక ఆమోదం లభించింది.

ఫ్యామిలీ ట్రావెల్‌కి సూపర్ హిట్! టాటా వింగర్ ప్లస్ 9 సీటర్ వ్యాన్

టాటా మోటార్స్ (Tata Motors) గురించి మాట్లాడితే, మనకు మొదట గుర్తొచ్చేది భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో అగ్రగామి అనే విషయం. కార్లతో పాటు వ్యాన్లు, బస్సులు, ట్రక్కులు వంటి అన్ని రకాల వాణిజ్య వాహనాలను తయారు చేసి, వాటిని ప్రపంచవ్యాప్తంగా విక్రయించే సంస్థగా టాటా మోటార్స్ పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఈ క్రమంలోనే, వాణిజ్య వాహనాల విభాగంలో తన స్థానం మరింత బలంగా నిలబెట్టుకునే ఉద్దేశంతో కంపెనీ తాజాగా ఒక కొత్త వాహనాన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే టాటా వింగర్ ప్లస్ (tata winger plus). ఈ కొత్త మోడల్ ప్రత్యేకత ఏంటంటే, ఇది 9 సీట్ల వాహనం. అంటే ఇది వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే కాకుండా, పర్యాటక ప్రయాణాలు, స్కూల్ లేదా ఆఫీస్ ట్రాన్స్‌పోర్ట్ అవసరాలకు కూడా సరైన ఎంపిక అవుతుంది.
Advertisement

80+ kmpl మైలేజీ ఇచ్చే అతి తక్కువ ధర బైక్‌లు ఇవే!

రోజువారీ పనుల కోసం కొత్త బైక్ కొనాలని అనుకునే పేద, మధ్యతరగతి ప్రజలకు మొదట గుర్తొచ్చేది, ఏ బైక్ మైలేజీ ఎక్కువ ఇస్తుంది? అది నిజంగా ఎంతకాలం నమ్మకంగా ఉంటుంది అన్న సందేహమే. ఎందుకంటే ఈ వర్గం ప్రజలకు బైక్ అనేది కేవలం ప్రయాణానికి ఉపయోగించే వాహనం మాత్రమే కాదు, కుటుంబ బడ్జెట్‌లో పెద్ద భాగం కూడా. ఒకసారి డబ్బు వెచ్చించి కొనుగోలు చేసిన తర్వాత, అది ఎక్కువ కాలం బాగా నడవాలి, అలాగే పెట్రోల్ తక్కువ తాగుతూ ప్రతిరోజూ ఖర్చు తగ్గించాలి. ఇలాంటి సందర్భంలో బజాజ్ ప్లాటినా 100, TVS రేడియన్, హీరో HF 100 వంటి బైక్‌లు ఎక్కువగా ప్రస్తావనలోకి వస్తాయి. వీటన్నీ సాదాసీదా లుక్ ఉన్నప్పటికీ, అందులోని అసలు బలం మైలేజీ, నమ్మకమైన ఇంజిన్. వాటి గురించి ఈ కథనంలో చూద్దాం.

సుజుకి నుండి మొదటి ఈవీ స్కూటర్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. ఓలా, ఏథర్ వంటి స్టార్టప్ కంపెనీలు సృష్టించిన ఈ మార్కెట్‌లో ఇప్పుడు బజాజ్, టీవీఎస్ వంటి పెద్ద బ్రాండ్లు కూడా దూసుకుపోతున్నాయి. ఈ పోటీలో తమకంటూ ఒక స్థానాన్ని పదిలం చేసుకోవడానికి జపాన్ దిగ్గజం సుజుకి కూడా సిద్ధమైంది. ఆటో ఎక్స్‌పో 2025లో సుజుకి ప్రదర్శించిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ-యాక్సెస్ త్వరలోనే భారత మార్కెట్లోకి రాబోతోంది. ఈ స్కూటర్ ఫీచర్లు, ధర, లాంచ్ తేదీ వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

కంపెనీ కూడా మీకు చెప్పని సన్‌రూఫ్ వల్ల కలిగే ప్రయోజనాలు

కార్లలో స్టైల్, లగ్జరీ అన్నీ కలగలిసిన ఫీచర్‌లలో ప్రత్యేకమైనది సన్‌రూఫ్(Sunroof). ఇది కేవలం కిటికీ కప్పు మాత్రమే కాదు, డ్రైవింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే టెక్నాలజీ. గతంలో లగ్జరీ కార్లలో మాత్రమే సన్‌రూఫ్ లభించేది. అంటే, బిఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్-బెంజ్ వంటి ఖరీదైన వాహనాల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్న మార్కెట్ ట్రెండ్, వినియోగదారుల డిమాండ్ కారణంగా మిడ్-రేంజ్ మరియు బడ్జెట్ కార్లలో కూడా సన్‌రూఫ్ అందుబాటులోకి వచ్చింది. చాలామంది దీన్ని కేవలం స్టైలిష్ లుక్ కోసం మాత్రమే అనుకుంటారు. నిజమే, సన్‌రూఫ్ ఉండటం వలన కారు బయటికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. క్యాబిన్‌లో కూడా ఓపెన్, ఎయిరీ ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ ఫీచర్ వెనుక కేవలం స్టైల్ మాత్రమే కాదు, అనేక ఉపయోగాలు, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిని ఒకసారి చూద్దాం.

త్వరలోనే ఇంటికో ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుదేమో..

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ఎన్ని వాహనాలు అమ్ముడయ్యాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి భారతదేశంలో 57 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. కాలుష్యాన్ని తగ్గించడంలో, ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడంలో ప్రభుత్వం విజయం సాధించిందనడానికి ఇదే సాక్ష్యం. 2025 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 11.49 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి.. ఇది గత సంవత్సరం కంటే 21 శాతం ఎక్కువ.
Advertisement

గుర్రంలా పరిగెత్తే సెడాన్ కార్లు.. బైక్ మైలేజ్‌తో సూపర్ సేఫ్టీ!

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, SUVలు, MPVలు ఇలా ప్రతి రకమైన కార్లూ వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రతి కేటగిరీకి ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉండగా, సెడాన్‌లు మాత్రం సౌకర్యం, స్టైల్, డ్రైవింగ్ అనుభవం విషయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. దూర ప్రయాణాల్లో సౌకర్యవంతమైన సీటింగ్, విశాలమైన కేబిన్ స్పేస్, మెరుగైన రైడ్ క్వాలిటీ కారణంగా చాలా మంది సెడాన్ కార్లను ఎంచుకుంటున్నారు. మీరు కూడా ఒక కొత్త సెడాన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ప్రస్తుత మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన మూడు మోడల్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి, అవే మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, టాటా టిగోర్. వీటి గురించి ఈ కథనంలో చూద్దాం.

త్వరలో భారత్‌లోకి కొత్త క్విడ్ ఫేస్‌లిఫ్ట్.. అంచనా ధర, ఫీచర్లు మీకోసం!

ఫ్రెంచ్ ఆటోమొబైల్ బ్రాండ్ రెనాల్ట్ (Renault) భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుండి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా యూరప్‌కి పరిమితమైన కారు తయారీదారుగా పేరుపొందిన ఈ సంస్థ, భారత్‌లో మాత్రం తన కార్లను ప్రజలకు మరింత చేరువ చేసింది. ముఖ్యంగా, రెనాల్ట్ డస్టర్ SUVతో ఒకప్పుడు విపరీతమైన పాపులారిటీని సంపాదించింది. డస్టర్ అనేది భారతీయ కస్టమర్లకు ఫ్రెంచ్ ఇంజనీరింగ్‌ని పరిచయం చేసిన మోడల్ అని చెప్పాలి. ఆ తర్వాతి కాలంలో కొన్ని క్లాసిక్ మోడళ్లతోనూ, ఎంట్రీ లెవల్ కార్లతోనూ మార్కెట్లో సొంత స్థానం సంపాదించింది. ప్రస్తుతం రెనాల్ట్ దేశంలో మూడు ముఖ్యమైన మోడళ్లను విక్రయిస్తోంది. అందులో ట్రైబర్ MPV, కైగర్ సబ్-కాంపాక్ట్ SUV ఇటీవలే అప్‌డేట్ అవుతూ కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మళ్లీ మార్కెట్లోకి వచ్చాయి.

రూ.10లక్షల లోపు లభించే 5-స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఇవే

మీరు ఒక కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మైలేజ్, ఫీచర్లు, డిజైన్ వంటి వాటితో పాటు కారు భద్రత గురించి కూడా తప్పకుండా ఆలోచించాలి. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి అంతర్జాతీయ సంస్థలు ఎన్సీఏపీ(NCAP) క్రాష్ టెస్ట్‌లను నిర్వహిస్తాయి.

కొత్త బీఎమ్‌డబ్ల్యూ X5 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు

లగ్జరీ కార్ల బ్రాండ్‌ అయిన బిఎమ్‌డబ్ల్యూ (BMW) తమ ప్రముఖ ఎస్‌యూవీ X5 కొత్త వెర్షన్‌ అంటే X5 M స్పోర్ట్ ప్రోను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కొత్త వేరియంట్‌ను స్టాండర్డ్ X5 కంటే మరింత స్టైలిష్‌గా, మరింత అట్రాక్టివ్‎గా రూపొందించారు. ఈ కారు ధర, ఫీచర్లు, ఇంజిన్ వివరాలను ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.
Advertisement

ఆస్ట్రేలియాలో సుజుకి జిమ్నీ XL డెలివరీలు తాత్కాలికంగా నిలిపివేత!

మారుతి సుజుకి జిమ్నీ (Maruti suzuki jimny) 5-డోర్ భారతదేశంలో ఆదరణ పొందిన కాంపాక్ట్ ఆఫ్-రోడ్ SUVల్లో ఒకటి. దేశీయ మార్కెట్లో మంచి పోటీని ఎదుర్కొంటూనే, నిరంతరం అమ్మకాల్లో తన స్థాయిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రత్యేకంగా ఆఫ్-రోడింగ్ అభిమానులకు, ఈ కారు ఒక చిన్న కానీ శక్తివంతమైన భాగస్వామిలా నిలుస్తోంది. భారతదేశంలో తయారు చేసే ఈ జిమ్నీ 5-డోర్ మోడల్‌కి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది. కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పలు దేశాలకు కూడా దీన్ని ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఇది సుజుకి జిమ్నీ XL అనే పేరుతో విక్రయానికి అందుబాటులో ఉంది. అక్కడి మార్కెట్లో కూడా ఈ కారు డిమాండ్ పొందింది.

క్రెటాకు షాక్ ఇవ్వనున్న మారుతి సుజుకి

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) కు గట్టి పోటీనిచ్చేందుకు సరికొత్త ఎస్‌యూవీని సిద్ధం చేసింది. సెప్టెంబర్ 3న ఈ కొత్త కారును మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

కొత్త రూపంలో రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్.. డ్రైవింగ్ అనుభవం ఎలా ఉందంటే?

Renault Kiger Facelift launched in India at ₹6.29 Lakhs. Stylish design, enhanced features, and improved performance in a compact SUV. ₹6.29 లక్షల వద్ద భారతదేశంలో విడుదలైన Renault Kiger Facelift.

టీవీఎస్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య తేడాలు

దిగ్గజ టూవీలర్, త్రీవీలర్ వాహనాల తయారీదారు టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS) ఎప్పటి నుంచో తన ఐసీఈ ఇంజిన్ ఆధారిత వాహనాలతో వినియోగదారుల మనసు గెలుచుకుంటూ వస్తోంది. స్కూటర్లు, బైకులు, ఆటో రిక్షాల వరకు విస్తరించిన మోడల్స్‌తో ఈ కంపెనీకి భారతీయ మార్కెట్లోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా విశేషమైన స్థానం ఏర్పడింది. అయితే కాలానుగుణంగా మారుతున్న ఆటోమొబైల్ రంగంలో, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న తరుణంలో, టీవీఎస్ కూడా తన దృష్టిని ఈవీ సెగ్మెంట్‌పై మరింత కేంద్రీకరించింది. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి రిస్పాన్స్‌ తెచ్చుకుంది. సిటీ రైడ్స్‌కి సరిపోయే రేంజ్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ డిజైన్, కనెక్టివిటీ ఫీచర్లతో ఇది మిలీనియల్స్‌ నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు అందరినీ ఆకట్టుకుంది.
Advertisement

సెప్టెంబర్ 6న మార్కెట్లో సునామీ ఖాయం

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్ (VinFast) ఇప్పుడు భారతదేశంలోకి అడుగుపెట్టనుంది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఈ సంస్థ తన తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కూడా ఇటీవలే ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు భారత మార్కెట్‌లో ఈవీ కార్లను విడుదల చేయడానికి విన్‌ఫాస్ట్ సిద్ధమవుతోంది. లాంచ్‌కు ముందే ఈ కార్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ కారు ధరలు, ఫీచర్లు, లాంచ్ వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

లాంచ్‌కు ముందే సూపర్ హిట్ అయిన చైనా కారు

చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ గీలీ (Geely) ఒక సంచలన వార్తను ప్రకటించింది. వారి ఫ్లాగ్‌షిప్ మోడల్ గెలాక్సీ ఎం9 పీహెచ్ఈవీ (Galaxy M9 PHEV) కోసం బుకింగ్స్ ప్రారంభించిన 24 గంటల్లోనే 40,000 కంటే ఎక్కువ ప్రీ-సేల్ ఆర్డర్లు వచ్చాయని ఆ సంస్థ తెలిపింది. ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

సచిన్ మోడిఫైడ్ కారు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు క్రికెట్‌తో పాటు లగ్జరీ కార్లంటే కూడా చాలా ఇష్టం. ఇటీవల, ఆయన రూ.4.2 కోట్ల విలువైన మోడిఫైడ్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్ (Lamborghini Urus S) కారును ముంబై రోడ్లపై నడుపుతూ కనిపించారు. ఈ కారుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం.

లగ్జరీని అందుబాటులోకి తెస్తూ.. లెక్సస్ ఇండియా కొత్త స్మార్ట్ ఓనర్‌షిప్ ప్లాన్!

లగ్జరీ కార్ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న లెక్సస్ (Lexus), భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తన ప్రయాణాన్ని ఆపకుండా కొనసాగిస్తోంది. 2017లో లెక్సస్ భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు, వినూత్నమైన డిజైన్, అద్భుతమైన పనితీరు, అత్యుత్తమ ఫీచర్లతో వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా హైబ్రిడ్ వాహనాల పరిచయంతో, పర్యావరణహిత సాంకేతికతను ప్రాధాన్యంగా తీసుకువచ్చి, కొత్త తరహా లగ్జరీకి మార్గం సుగమం చేసింది. 2020లో తన తొలి మోడల్ ES 300hను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడం ద్వారా లెక్సస్ తన ఉనికిని మరింత బలపరిచింది. ఈ అడుగు బ్రాండ్‌కు గణనీయమైన మైలురాయిగా నిలిచింది. లెక్సస్ ఎప్పటిలాగే వినియోగదారుల అంచనాలకు మించి అనుభవాన్ని అందించాలనే తపనతో కొత్త కొత్త ఆవిష్కరణలను మార్కెట్లోకి తీసుకువస్తోంది.
Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ లవర్స్‎కు ఊహించని షాకింగ్ న్యూస్

భారతదేశంలో ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గుతాయనే వార్తలు ఇటీవల వెలువడ్డాయి. అక్టోబర్ నాటికి ధరలను తగ్గించడానికి, వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ)ను సరళీకృతం చేయడానికి ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయం ఈ ధర తగ్గింపుకు కారణమవుతుంది. తక్కువ సామర్థ్యం గల ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ పన్ను సవరణ వల్ల వాటి ధరలు తగ్గుతాయి.

ఒకే ఛార్జ్‌తో 158 కి.మీ రేంజ్.. టీవీఎస్ ఆర్బిటర్ స్కూటర్ అద్భుత ఫీచర్లు!

టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS), ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా టూవీలర్, త్రీవీలర్ వాహనాల్లో అగ్రగామిగా నిలుస్తు ఒకవైపు పెట్రోల్ ఆధారిత వాహనాలతో దూసుకుపోతూ, అదే సమయంలో ఎలక్ట్రిక్ విభాగంలో కూడా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈవీ మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని టీవీఎస్ సంస్థ, తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్ (TVS Orbiter)ను లాంచ్ చేసింది. TVS ఇప్పటికే iQube అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. ఇప్పుడు, ఈ కొత్త ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ తక్కువ ధరకు విడుదల అయింది. దీని ధర వచ్చేసి రూ.99,000 ఎక్స్‌షోరూమ్. రోజువారీ ప్రయాణాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లేలా డిజైన్ చేయబడిన ఈ ఆర్బిటర్, తన సెగ్మెంట్‌లో మొదటిసారి అందిస్తున్న అనేక ఫీచర్లను కలిగి ఉంది.

జూలై సేల్స్‌లో సుజుకి యాక్సెస్ 125 సేల్స్ డౌన్

భారతీయ టూవీలర్ మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న స్కూటర్. స్టైల్, మైలేజ్, నమ్మకమైన పనితీరుతో వినియోగదారుల మనసును దోచుకున్న ఈ స్కూటర్, గత కొన్ని సంవత్సరాలుగా మంచి అమ్మకాలతో సుజుకి కంపెనీకి మద్దతుగా నిలుస్తోంది. దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది రవాణా ఖర్చులను తగ్గించడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, తాజాగా విడుదలైన జూలై నెల అమ్మకాల గణాంకాలు కొంత వెనుకంజలో ఉన్నట్లు సూచిస్తున్నాయి. జూలై 2025లో సుజుకి యాక్సెస్ 125 మొత్తం 68,172 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన 71,247 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే సుమారు -4.32% తగ్గుదలగా నిలిచింది. సేల్స్ తగ్గడం కంపెనీకి ఉహించని ట్విస్ట్.

వేసవిలో చల్లగా, చలిలో వేడిగా ఉండే కారు ఇదే

ఆధునిక కార్లలో చాలామంది కోరుకునే ఒక ఫీచర్ వెంటిలేటెడ్ సీట్లు. ఈ సీట్లు ఉన్న కార్ల గురించి తెలుసుకునే ముందు, వాటి ప్రత్యేకతలను చూద్దాం. ఈ సీట్ల ప్రధాన ప్రయోజనం ఏమిటంటే అవి అందులో కూర్చున్న వారికి ఎల్లప్పుడూ ఒకే విధమైన శరీర ఉష్ణోగ్రతను అందిస్తాయి. అంటే, వేసవిలో చల్లని గాలిని, చలికాలంలో వెచ్చని గాలిని అందిస్తాయి.
Advertisement

మారుతి సుజుకి ఇగ్నిస్ జూలై అమ్మకాలు నిరాశ కలిగించాయి

దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki), ప్రతి విభాగంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో కంపెనీ అందిస్తున్న ఇగ్నిస్‌ (Ignis) మోడల్ కూడా అదే తరహా ఆదరణ కలిగి ఉంది. ఈ కారు డిజైన్‌ విషయంలో ఆధునికతతో పాటు ప్రత్యేకమైన స్టైల్‌ను కలిగివుంది. కాంపాక్ట్‌ సైజ్‌లో ఉన్నప్పటికీ, రోడ్డుపై ఒక ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తుంది. అంతర్గతంగా కూడా సౌకర్యవంతమైన ఫీచర్లు, ఆధునిక సాంకేతికతతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, భద్రతా పరమైన విభిన్న ఆప్షన్లు లాంటి అనేక ఆకర్షణీయమైన అంశాలను ఈ మోడల్‌ అందిస్తుంది. అయితే, ఈ అన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ జూలై నెలలో ఇగ్నిస్‌ విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవు.