కియా కొత్త కార్లకు కస్టమర్ల ఫిదా! 8% అమ్మకాల పెరుగుదలతో జూలై హిట్

ఇటీవల జూలై నెల ముగిసిన నేపథ్యంలో వాహన తయారీదారులు వరుసగా తమ సేల్స్ వివరాలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణకొరియాలో పుట్టి ఇండియాలో సత్తా చాటుతున్న దిగ్గజ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) తాజాగా తన అమ్మకాల వివరాలను వెల్లడించింది. గణంకాల ప్రకారం, భారత మార్కెట్‌లో ప్రీమియం కార్ల విభాగంలో కియా ఇండియా తన స్థిరమైన ప్రదర్శనతో మరోసారి తన ప్రభావాన్ని చాటింది. జూలై 2025లో కంపెనీ 22,135 యూనిట్ల విక్రయాలతో మంచి గణాంకాలు నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 20,507 యూనిట్లతో పోలిస్తే 8 శాతం వృద్ధిగా నిలిచింది. ఈ సంఖ్యలు కియా బ్రాండ్‌పై వినియోగదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఏథర్ స్కూటర్లకు భారీ డిమాండ్! ఒక్క నెలలో 16 వేల యూనిట్లకు పైగా అమ్మకాలు

భారతదేశంలోని ఎలక్ట్రిక్ టూవీలర్ వాహన విభాగం ప్రస్తుతం గట్టి పోటీతో నిండిపోయిన ఒక రంగం. రోజుకొక కొత్త కంపెనీ, కొత్త మోడల్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న ఈ పరిస్థితుల్లో, స్థిరమైన పనితీరు చూపడం అంత సులువు కాదు. అయినప్పటికీ, బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ ఏథర్ ఎనర్జీ మాత్రం తన ప్రత్యేకతతో, విశ్వసనీయతతో ముందుకు సాగుతోంది. తాజాగా వెలువడిన జూలై 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం, ఏథర్ 16,231 యూనిట్లను డెలివరీ చేసింది. ఇది కంపెనీకి ఇప్పటివరకు వచ్చిన రెండవ అత్యుత్తమ నెలవారీ అమ్మకాల రికార్డుగా నిలవడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల సేల్స్, దీనికి ముందు గత అక్టోబర్ 2024 కంటే కేవలం 17 యూనిట్లు తక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు 17,430 యూనిట్లు అమ్ముడైన మార్చి 2024, ఏథర్ చరిత్రలో అత్యుత్తమ నెల.

భారీగా పెరిగిన టయోటా కార్ల అమ్మకాలు.. ఈ మోడల్స్‌కి ఫుల్ డిమాండ్!

ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన వాహన తయారీ సంస్థలలో ఒకటి టయోటా. కర్ణాటకలోని బిడదిలో ఉన్న టయోటా అతిపెద్ద ప్లాంట్‌లో తయారయ్యే కార్లకు ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా జులై నెలలో టయోటా కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. జులై 2025లో మొత్తం 32,575 యూనిట్లను టయోటా విక్రయించింది. గత సంవత్సరం ఇదే సమయంలో 31,656 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, అమ్మకాలు ఏకంగా 3% పెరిగాయి.

6 మంది కూర్చోగల బడ్జెట్ కార్.. అమ్మకాలతో అందరినీ షాక్‌కి గురి చేస్తోంది!

భారతీయ రోడ్లపై ప్రజలకు అందుబాటులో ఉంటూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న వాహనాల్లో మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) ఒక ప్రముఖమైన పేరు. వాణిజ్య అవసరాలు కావొచ్చు, కుటుంబ ప్రయాణాలు కావొచ్చు.. కారుకి ఉన్న బలమైన ప్రజాధారణే దాని విజయానికి బలమైన ఆధారం. ఇప్పుడు ఈ కారుకు సంబంధించి జూలై 2025 అమ్మకాల గణాంకాలు విడుదల అయ్యియి. మారుతి సుజుకి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఈ నెలలో మొత్తం 12,341 ఈకో యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో గత ఏడాది అంటే జూలై 2024లో ఈ సంఖ్య 11,916గా నమోదైంది. ఏడాది ప్రాతిపదికన ఈ రెండింటి మధ్య తేడా ఈసారి 425 యూనిట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.
Advertisement

ఇండియాలో లాంచ్ అయిన ఎంజీ సైబర్ స్టర్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే

MG Cyberster, కొత్త ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ భారతదేశంలో ప్రారంభమైంది. రూ. 75 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. ప్రత్యేకతలు, పనితీరు మరియు సాంకేతికత గురించి తెలుసుకోండి.

స్వదేశీ మార్కెట్‌లో తగ్గిన అమ్మకాలు.. అక్కడ మాత్రం మారుతి సేఫ్

భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి జూలై నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మారుతి కంపెనీకి ఈసారి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టగా, ఎగుమతులు ఊహించని స్థాయిలో పెరగడం సంస్థకు ఊరటనిచ్చింది. మొత్తం మీద, మారుతి సుజుకి జూలైలో అమ్మకాలను స్వల్పంగా పెంచుకుంది.

ఒక్కసారి కూర్చోండి.. మీకు బయటకే రావాలనిపించదు! కొత్త వోల్వో XC60 అదుర్స్!

భారతదేశంలో ఇటీవలి కాలంలో లగ్జరీ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మారుతున్న ప్రజల అభిరుచుల ధోరణి కారణంగా మార్కెట్లోకి కొత్త కొత్త మోడళ్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తజాగా వోల్వో (Volvo) తన లగ్జరీ మిడ్-సైజ్ SUV అయిన ఎక్స్‌సి60 ఫేస్‌లిఫ్ట్ (XC60 Facelift) మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. తాజా వెర్షన్‌ మరింత ప్రీమియం ఫీచర్లు, మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, కొత్త డిజైన్ అప్‌డేట్‌లు, టెక్నాలజీ సౌకర్యాలతో వస్తోంది. కంపెనీ ప్రకారం, ఈ SUV ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.71,90,000. పాత మోడల్‌తో పోలిస్తే ఇది సరికొత్తగా అనిపిస్తుంది. ఎక్స్‌టీయర్ పరంగా లేదా ఇంటీరియర్ పరంగా చూసిన కూడా ఇది అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది.

కొత్త టెక్నాలజీ, మత్తెక్కించే లుక్స్‌తో MT-15 V2 వచ్చేసింది!

జపాన్‌కు చెందిన ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ యమహా (yamaha), భారత మార్కెట్లో మరోసారి తన మార్క్ వేసింది. ఈసారి 2025 MT-15 Version 2.0 రూపంలో వచ్చింది. ఈ బైక్ అనేది కేవలం స్ట్రీట్ స్టైల్, పెర్ఫామెన్స్, యంగ్ యాటిట్యూడ్ అన్నీ కలిపిన ప్యాకేజీలా ఉంటుంది. ఎంటీ 15 వెర్షన్ 2.0 న్యూ మోడల్ ప్రధానంగా స్ట్రీట్ రైడింగ్ లవర్స్ కోసం రూపొందించబడింది. ఈ బైక్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 1,69,550 కాగా, ఇంకా లేటెస్ట్ ఫీచర్లు, స్పెషల్ కలర్ స్కీమ్ ఉన్న DLX వెర్షన్ ధర రూ. 1,80,500 గా ఉంది (ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు). ఈ రెండు కూడా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకత కలిగి ఉన్నాయి.
Advertisement

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హైవేల మీద కార్లు ఆపేవారు జాగ్రత్త

రోడ్డుపై వెళ్లేవారు తప్పుకుండా కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. జాతీయ రహదారుల పై కారును నిలిపేటప్పుడు సరైన సిగ్నల్స్ ఇవ్వకపోతే, అది నిర్లక్ష్యంతో వాహనం నడిపినట్లుగా భావించబడుతుందని సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక కీలక తీర్పు ఇచ్చింది. దాదాపు 8 ఏళ్ల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కేసులో ఈ తీర్పు వెలువడింది. ఈ తీర్పు ప్రకారం వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ తీర్పు వివరాలేంటో వివరంగా తెలుసుకుందాం.

రూ.74,959కే సూపర్ బైక్.. హోండా షైన్ 100 DX లాంచ్

పెట్రోల్ ధరలు నిత్యం పెరిగిపోతున్న వేళ, ప్రతి రూపాయికి విలువ చూసే వినియోగదారుల కోసం హోండా మరోసారి తన నమ్మకాన్ని నిలబెట్టడానికి కొత్త బైకును తెచ్చింది. మంచి మైలేజ్‌‌తో పాటు, మెరుగైన పనితీరు కలిగిన బైక్ కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా శుభవార్త చెప్పేసింది. హోండా తన కొత్త మోడల్ షైన్ 100 డిఎక్స్(Shine 100 DX) ను ఈరోజు అంటే ఆగస్టు 1న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఇది ఇప్పటికే ప్రజాదరణ పొందిన హోండా షైన్ 100 బైక్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ అనే చెప్పొచ్చు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ, కంఫర్ట్, డిజైన్.. అన్ని ఒకే దానిలో అందించేలా ఈ కొత్త వేరియంట్ రూపొందించారు. షైన్ 100 DX బైక్‌ను కంపెనీ రూ.74,959 ఎక్స్-షోరూమ్ (న్యూఢిల్లీ ధర) ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇన్నోవాలో కొత్త ట్రెండ్.. హైబ్రిడ్ మోడల్స్ మాత్రమే కావాలంటున్న కస్టమర్లు

కార్ల మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన టయోటా కిర్లోస్కర్ మోటార్ మళ్లీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. గత రెండు సంవత్సరాల నుంచి ఇండియాలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న టయోటా, ఆర్థిక సంవత్సరం 2026 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ 2025) భారీ వృద్ధి సాధించింది. ఈ సమయంలో కంపెనీ ఏకంగా 80,432 కార్లను అమ్మింది, ఇది గత ఏడాదితో పోలిస్తే 18% ఎక్కువ.

రూ.1.12 లక్షల బడ్జెట్‌లో ప్రీమియం లుక్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో B125 Hornet

ప్రముఖ టూవీలర్ వాహన తయారీ సంస్థ హోండా (Honda) తాజాగా తన లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ భారత మార్కెట్‌లోకి కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం మోటార్‌సైకిల్‌ను ప్రివ్యూలుగా చూపించిన హోండా, ఇప్పుడు అధికారికంగా సీబీ125 హార్నెట్ (CB125 Hornet)ను విడుదల చేసింది. స్పోర్టీ డిజైన్, ఆకర్షణీయమైన స్టైల్, శక్తివంతమైన ఇంజిన్‌తో వచ్చిన ఈ మోడల్ యువతను ప్రధానంగా ఆకట్టుకునేలా డిజైన్ అయింది. ఈ బైక్ ధరను కంపెనీ రూ.1.12 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. హోండా ఈ మోడల్‌ను రోజువారీ ప్రయాణాలు చేయే వారి కోసం మాత్రమే కాకుండా, యువకులు కూడా స్పోర్ట్స్ లుక్‌లో బైక్ తీసుకోవాలనుకునే యాంగిల్‌లో కూడా తీసుకొచ్చింది. లేటెస్ట్ డిజైన్‌తోపాటు హోండా బ్రాండ్ నమ్మకాన్ని కలిపితే, CB125 హార్నెట్ మార్కెట్‌లో మంచి హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Advertisement

రోజుకు 5900కార్లు అమ్ముతున్న మారుతి..90రోజుల్లో ఎన్ని అమ్మిందంటే ?

భారతదేశపు అతిపెద్ద కార్ల కంపెనీ అయిన మారుతి సుజుకి మళ్లీ తన సత్తా చాటుకుంది. కేవలం 90 రోజుల్లో అంటే ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికంలో 5.27 లక్షలకు పైగా కార్లను అమ్మింది. అంటే, సగటున రోజుకు 5,855 కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది.

ఎగుమతుల వల్లే బజాజ్ నిలబడి పోయింది బ్రదర్!

దేశీయ ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న బజాజ్ ఆటో లిమిటెడ్ (Bajaj Auto), మళ్లీ ఒకసారి మార్కెట్‌లో తన సత్తాను చాటింది. తీవ్రమైన పోటీ ఉన్నా, దిగ్గజ కంపెనీల మధ్య నుంచి తనకు ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటూ, బజాజ్ ఆటో జులై 2025లో గణనీయమైన విక్రయాలు నమోదు చేసింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం, బజాజ్ ఆటో గత నెలలో మొత్తం 3,66,000 (2 వీలర్+ కమర్షియల్) వాహనాలను విక్రయించింది. ఈ మొత్తంలో టూవీలర్స్‌తో పాటు వాణిజ్య వాహనాల దేశీయంగా అమ్మకాలతో పాటు ఎగుమతులు కూడా ఉన్నాయి. ఈ సేల్స్ ఇదే జూలై 2024తో పోలిస్తే 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే అప్పట్లో అమ్ముడైన వాహనాల సంఖ్య 3,54,169 యూనిట్లు కాగా, ఇప్పుడు అదికాస్తా మరింత పెరిగింది.

రూ.80 వేలలోపు బెస్ట్ మైలేజ్ బైక్‌లు.. మూడు మైలేజ్ చాంపియన్స్!

భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో, రోజువారీ ప్రయాణాల కోసం అధిక మైలేజీ ఇస్తున్న బైక్‌లపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. ప్రత్యేకంగా పల్లెటూరి నుంచి పట్టణ ప్రాంతాల వరకు చాలా మంది వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందే మోటార్‌సైకిళ్లను ఎంచుకుంటున్నారు. అటువంటి వినియోగదారుల కోసం మార్కెట్లో మూడు ప్రాముఖ్యమైన బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. ఈ మూడు కూడా మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేకూర్చేలా నిలుస్తాయి. 60 కి.మీల మైలేజ్ అందించడంతో పాటు పనితీరు పరంగా అన్ని వర్గాల వారిని మెప్పిస్తున్నాయి. ఇవి వేరు వేరు కంపెనీలకు చెందిన బైకులు అయినప్పటికి కూడా భారతదేశంలో చాలా మంది అభిమానులను కలిగి ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి సుజుకి కీలక నిర్ణయం.. కార్లతో పాటు డ్రోన్‌లు, ఈవీల్లోకి ఎంట్రీ!

భారతదేశంలో కార్ల తయారీలో నంబర్ 1 గా ఉన్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL), ఇప్పుడు తమ వ్యాపార పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించుకుంది. కార్ల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా, కొత్త కాలం అవసరాలకు తగ్గట్లుగా ఇతర రంగాల్లోకి కూడా అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
Advertisement

తక్కువ ధరలో ఏథర్ కొత్త స్కూటర్.. 161 కి.మీ. రేంజ్, ఓలాకు గట్టి పోటీ!

ఏథర్ ఎనర్జీ భారతీయ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఓలా ఎలక్ట్రిక్‌తో పోటీ పడుతూ, మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. తాజాగా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అన్న నినాదంతో కొత్త ఏథర్ 450S 3.7 kWh ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. అధిక రేంజ్, మెరుగైన పనితీరు, సరసమైన ధరతో వచ్చిన ఈ స్కూటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వెనుక నుంచి చూసినా వావ్ అనాల్సిందే.. వోల్వో XC60 ఫేస్‌లిఫ్ట్ రేపే విడుదల!

ప్రసిద్ధ కార్ల తయారీదారు అయినటువంటి వోల్వో (Volvo) తన మిడ్-సైజ్ లగ్జరీ SUV అయిన XC60 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ (Xc60 Facelift)ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1, 2025న ఈ కొత్త మోడల్ విడుదల కానుంది. ఇది ప్రస్తుతం అమ్ముడవుతున్న XC60కి రెండోసారి వచ్చిన ముఖ్యమైన అప్‌డేట్ కావడం విశేషం. XC60 ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ వోల్వో లగ్జరీ SUV శ్రేణిలో ఫ్లాగ్‌షిప్‌గా నిలుస్తుంది. కొత్తగా రానున్న మోడల్ పూర్తిగా డిజైన్‌ను మార్చకపోయినా, దాని డిజైన్ మరింత ఆధునీకరించడంలో వోల్వో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అతి ముఖ్యంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్, హెడ్‌ల్యాంప్‌ల రూపం, అలాగే బంపర్ డిజైన్ కొద్దిగా మారినట్లు సమాచారం. అంతే కాదు, అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా కొత్తగా కనిపించనుంది.

కొత్త బైక్ కొనాలనుకుంటున్నావా? ఇవే ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్

ప్రస్తుతం టూవీలర్ లేనిదే రోజులు గడవట్లేదు. మార్కెట్, ఉద్యోగాలు, పిల్లల స్కూల్ డ్రాప్ మొదలగు అన్ని అవసరాలకు కూడా తప్పనిసరిగా బైక్ లేదా స్కూటర్ ఇంట్లో ఉండాల్సిందే. ప్రధానంగా బైకులు ఎక్కువ మైలేజ్ అందించడం కారణంగా వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తయారీదారులో పోటా పోటీగా తమ అధునాతన ఫీచర్స్, డిజైన్‌తో కూడిన బైకులను విడుదల చేస్తున్నాయి. ప్రతి నెలా లక్షల బైక్‌లు అమ్ముడవుతుండగా, ముఖ్యంగా 100cc నుంచి 125cc స్లాట్‌లో గిరాకీ ఊహించదగిన స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో హోండా మోటార్‌సైకిల్ ఇండియా, హీరో మోటోకార్ప్ తీవ్రంగా పోటీ పడే ఈ మార్కెట్లో, కొత్త మోటార్‌సైకిళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాటి గురించి ఈ కథనంలో చూద్దాం.

ఆగస్ట్‌లో అదిరే కార్ల లాంచ్‌లు.. పండగ సీజన్ కోసం కొత్త మోడల్స్ రెడీ

నేటితో జూలై నెల ముగియనుంది. ఆగస్టు రాబోతోంది. జూలైలో లాగే ఆగస్టు నెలలో కూడా కొన్ని అదిరిపోయే కొత్త కార్లు రాబోతున్నాయి. వాస్తవానికి ఆగస్టు నెల అంటే భారతదేశంలో వాహనాల విక్రయాలు జోరుగా సాగే పండుగ సీజన్‌కు నాంది. అందుకే ఆగస్టు నుండి కొత్త వాహనాల లాంచ్‌లు వరుసగా మొదలవుతాయి. కాబట్టి రేపటి నుండి, అంటే 2025 ఆగస్టు నెలలో విడుదల కాబోయే కార్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement

వెయిటింగ్ అయిపోయింది.. టాటా హారియర్ EV మీకు డోర్ డెలివరీ!

టాటా మోటార్స్ (Tata Motors) దేశీయంగా నమ్మకానికి నిలయంగా పేరొందిన ఆటోమొబైల్ బ్రాండ్. ప్రయాణికుల సేఫ్టీకి ఇది అత్యంత ప్రాధాన్యత అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది. ఇంధన ఆధారిత వాహనాలను విడుదల చేస్తూనే, అదే సమయంలో ఎలక్ట్రిక్ విభాగంలో కూడా ఇండియాలోనే అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే పలు ఈవీ కార్లను విక్రయిస్తున్న కంపెనీ ఇటీవల టాటా హారియర్ ఈవీ (tata harrier Ev)ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పటిష్ట స్థానాన్ని పొందాలన్న టాటా లక్ష్యానికి ఇది బలమైన మెరుగుదల. వాగమోన్‌లోని ఏనుగు కొండను అధిరోహించిన తర్వాత, ఈ SUV దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ టెస్ట్ డ్రైవ్ విజయం టాటా హారియర్ EV సామర్థ్యాన్ని, ఎలక్ట్రిక్ కార్లలో కూడా కారు సత్తాను నిరూపించింది.

అదిరిపోయే ఫీచర్లతో కియా కారెన్స్ ఈవీ 6సీటర్ వచ్చేస్తోంది

భారతీయ వినియోగదారుల భారీ అంచనాల మధ్య, కియా కెరెన్స్ క్లావిస్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ఇటీవల మార్కెట్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ కారు 7 సీటర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, త్వరలోనే కియా కెరెన్స్ క్లావిస్ ఈవీ 6 సీటర్ ఆప్షన్ కూడా మార్కెట్‌లోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ 6 సీటర్ మోడల్ HTX+ ER వేరియంట్ ఆధారంగా రూపొందించబడే అవకాశం ఉంది.

దేశంలో 50 లక్షల యూనిట్లు అమ్ముడైన ఏకైక కారు.. అదే మారుతి ఆల్టో!

భారతదేశంలో సాధారణంగా మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. వీరంతా కోట్లు కోట్లు పెట్టి ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం కష్టం. కాబట్టి వారికి అందుబాటు ధరలో లభించే కార్లంటేనే చాలా ఇష్టం. మంచి మైలేజ్, తక్కువ ధర, మెరుగైన పెర్ఫామెన్స్ అందించేవి వారికి ఫేవరెట్ కార్లు. వాటిలో మారుతి కంపెనీకి చెందినవి ఎక్కువగా ఉంటాయి. స్విఫ్ట్, వ్యాగన్ఆర్, డిజైర్ వంటివి ఉంటయి. దేశంలో ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో కూడా ఇవి ఉన్నాయి. ఇవన్నీ భారత్ మార్కెట్‌లో గణనీయమైన విజయాన్ని సాధించిన మోడల్స్ అన్నది నిజమే. కానీ దేశంలోని అగ్రగామి, అత్యధికంగా అమ్ముడైన కారు మాత్రం వీటిలో ఏదీ కాదు! ఈ ఘనత సాధించింది ఒక లెజెండరీ మోడల్ మారుతి సుజుకి ఆల్టో (maruti suzuki Alto).

వర్షాకాలంలో కారు డ్రైవింగ్.. ఈ తప్పులు చేస్తే భారీ నష్టం!

వర్షాకాలం వచ్చిందంటే చాలు, వాతావరణం చల్లబడి ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. కానీ మరోవైపు రోడ్లన్నీ నీటితో నిండిపోయి, డ్రైవింగ్ చేయడం కష్టంగా మారుతుంది. వర్షంలో కారు నడిపేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోకపోతే, మీరు కష్టాల్లో పడవచ్చు. మీ కారు ఇంజిన్ పాడై, వేల రూపాయలు ఖర్చు చేయాల్సి రావచ్చు. వర్షాకాలంలో కారు నడిపేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన చిట్కాలు ఏమిటో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.
Advertisement

హెల్మెట్ పెట్టుకోలేకపోతే బైక్ నడవదు.. ఇందోర్‌లో న్యూ రూల్!

భారతదేశంలో రోడ్డుప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషాదకరంలో అత్యధికంగా ప్రాణనష్టం జరగడం టూవీలర్ వాహనదారులకే సంబంధించినది. ముఖ్యంగా హెల్మెట్‌ లేకుండా బైక్‌లు నడిపే వారు ప్రమాదంలో పడే అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాలు ఎన్ని సూచనలు ఇచ్చినా కొంతమంది మాత్రం హెల్మెట్ ధరించడాన్ని లైట్‌గా తీసుకుంటున్నారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఇప్పుడు మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందులో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ జిల్లా యంత్రాంగం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్‌ నిబంధనలపట్ల ప్రజల్లో బాధ్యతాభావం పెంపొందించాలన్న ఉద్దేశంతో, "హెల్మెట్ లేకుంటే పెట్రోలు లేదు (No helmet no petrol)" అనే వినూత్న విధానాన్ని అమలు చేయబోతున్నారు.