హీరో మావ్రిక్ 440 బైక్ ఎందుకు ఫెయిల్ అయింది? అసలు కారణాలు ఇవే!

భారతదేశంలో టూ-వీలర్ మార్కెట్‌లో హీరో మోటోకార్ప్ ఒక పెద్ద పేరు. తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లకు ఈ కంపెనీ పెట్టింది పేరు. కానీ, ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన మావ్రిక్ 440 బైక్ మాత్రం కంపెనీ ఆశలను నిరాశపరిచింది. ఈ బైక్‌ను విడుదల చేసిన కొద్ది కాలంలోనే, అమ్మకాలు లేక కంపెనీ దీని ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. ఇంతకీ ఈ బైక్ ఎందుకు ఫెయిల్ అయింది? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

హీరో కాదు.. హోండానే టాప్! జూలై నెల బైక్ అమ్మకాల లీడర్‌గా మారిన హోండా

భారతదేశ టూవీలర్ మార్కెట్‌కు జూలై 2025కు మంచి ఊపు వచ్చింది. కొనుగోలుదారుల నమ్మకంతోపాటు, పండుగ సీజన్ ముందస్తు ఆశలతో జూలై నెల మొత్తం అమ్మకాల్లో మంచి వృద్ధిని నమోదుచేసింది. దేశీయ దిగ్గజ తయారీదారుల మధ్య గత నెలలో విపరీతమైన పోటీ నెలకొంది. కొత్త మోడళ్ల రాకతో పాటు, పాత మోడళ్ల అమ్మకాలతో గత నెల ఎంతో ఆసక్తిగా గడిచిపోయింది. మొత్తం టూవీలర్ సేల్స్ పరంగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) సంస్థ అత్యధికంగా అమ్మకాలను నమోదు చేసి ఈ సెగ్మెంట్‌లో టాప్ పొజిషన్‌లో నిలిచింది. మరో దిగ్గజ కంపెనీ హీరో మోటోకార్ప్ తో పోల్చితే హోండా మెరుగైన ప్రదర్శనను కనబరిచింది. దేశీయ మార్కెట్‌గానీ, ఎగుమతుల గానీ చూసినప్పటికీ హోండా యొక్క అమ్మకాల ఊపు స్పష్టంగా కనిపించింది.

మారుతి సుజుకి ఎర్టిగా హవా.. 7-సీటర్ విభాగంలో మళ్లీ నెంబర్-1

జులై 2025లో భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. టాప్-10 జాబితాలో ఏకంగా ఏడు మోడళ్లు మారుతి సుజుకివే కావడం విశేషం. మిగిలిన మూడు స్థానాలను హ్యుందాయ్, మహింద్రా, టాటా కంపెనీలు పంచుకున్నాయి. ఈ జాబితాలోని కార్లు, వాటి అమ్మకాల సంఖ్యను బట్టి చూస్తే వినియోగదారులు ఇప్పటికీ మారుతి కార్ల పట్ల ఆసక్తి చూపుతున్నారని స్పష్టమవుతోంది.

ఒక్క నెలలో 20 వేలకు పైగా అమ్ముడైన మారుతి డిజైర్

ఇటీవలి కాలంలో ప్రపంచం SUVలవైపు మొగ్గుచూపుతున్న తరుణంలో... అందరికీ సరిపోయే డిజైన్, బడ్జెట్, మైలేజ్ వంటి అంశాలతో ఒక సెడాన్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire). దేశీయ కార్ల మార్కెట్‌లో SUVల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతున్నప్పటికీ, డిజైర్ సెడాన్ మోడల్ మాత్రం తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ ముందు వరుసలో కొనసాగుతోంది. SUVల హవాకే టఫ్ కాంపిటీషన్ ఇస్తూ, ఈ సెడాన్ మోడల్ వినియోగదారుల హృదయాల్లో తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంది. 2025 జూలై నెలలో దీనిపై ప్రజల్లో ఉన్న విశ్వాసం ఇంకా బలపడినట్లుగా అమ్మకాల సంఖ్య స్పష్టంగా సూచిస్తోంది. అసలు విషయానికొస్తే, జూలై 2025లో మారుతి డిజైర్ దేశవ్యాప్తంగా 20,895 యూనిట్లు అమ్ముడుపోయింది.
Advertisement

ఎన్ని చలాన్‌లు పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు?

ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జేబుకు చిల్లు పడడమే కాదు, మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు కావచ్చు. చాలామందికి ఈ విషయం గురించి తెలియదు. ఒకటికి మించి ఎక్కువ చలాన్‌లు పడినప్పుడు, పోలీసులు లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసే అధికారం కలిగి ఉంటారు. అసలు ఎన్ని చలాన్‌లు పడితే లైసెన్స్ రద్దవుతుంది? ఒకవేళ రద్దైతే తిరిగి కొత్త లైసెన్స్ ఎలా పొందాలి? లాంటి విషయాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

హోండా కార్లపై భారీ తగ్గింపులు! ఎలివేట్, సిటీ, అమేజ్‌పై ప్రత్యేక ఆఫర్లు

ప్రతి నెలా ప్రారంభం కాగానే కార్ల కంపెనీలు తమ విక్రయాలను పెంచుకునేందుకు డీలర్‌షిప్‌ల ద్వారా వివిధ రకాల ఆఫర్లు అందించడం సహజం. అయితే, ఈ ఆగస్టు 2025 మాత్రం హోండా కార్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎందుకంటే, ఈ నెలలో హోండా తన పాపులర్ కార్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. ఇప్పుడు హోండా కారు కొనాలంటే, ఇది నిజంగా సరైన సమయం అని చెప్పొచ్చు. వినియోగదారుల మధ్య మంచి క్రేజ్ ఉన్న Honda Elevate (హోండా ఎలివేట్), అలాగే సొగసైన డిజైన్, ప్రీమియం ఇంటీరియర్‌తో ఆకట్టుకునే Honda City(హోండా సిటీ), బడ్జెట్ సెగ్మెంట్‌లో నెంబర్ వన్ ఫ్యామిలీ కార్‌గా నిలిచిన Honda Amaze (హెండా అమేజ్) ఈ మూడింటిపైనే ప్రస్తుతం డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు లాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

రూ.5.79 లక్షలకే 34 కి.మీ మైలేజ్ కారు.. జూలై 2025 హ్యాచ్‌బ్యాక్ క్లాస్‌లో నంబర్ 1!

సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి మొదలుకొని, కొత్త డ్రైవర్లు, డేలీ ప్రయాణాలు చేసే వేరే వర్గాల అవసరాలను తీర్చగలిగిన వాహనంగా మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌ (Maruti Suzuki Wagon R)కు ఒక గొప్ప పేరుంది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అనేది భారతీయ కార్ మార్కెట్లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మోడల్. మొదటిసారిగా 1999లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ హ్యాచ్‌బ్యాక్, అప్పటి నుంచి మారుతి బ్రాండ్‌కి ఓ నమ్మకమైన గుర్తింపుగా నిలిచింది. సరళమైన స్టైలింగ్ ఉన్నప్పటికీ, ఈ కారులో అవసరమైన అన్ని లేటెస్ట్ ఫీచర్లను కాలానుగుణంగా అప్‌డేట్ చేస్తూ వచ్చింది. మారుతి సుజుకి కూడా ఈ కారుకి కొత్త తరం టచ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ కొత్త ఇంజిన్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యుయల్-టోన్ కలర్స్ వంటి ఎలిమెంట్లను అందిస్తూ వచ్చింది.

రూ.5 లక్షలకే హార్లీ-డేవిడ్‌సన్ కొత్త బైక్.. పండుగ షురూ

హార్లీ-డేవిడ్‌సన్.. ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఖరీదైన, లగ్జరీ బైక్‌లు. అయితే, ఇకపై హార్లీ-డేవిడ్‌సన్ అంటే అందరికీ అందుబాటులో ఉండే బైక్‌లు కూడా గుర్తుకు రాబోతున్నాయి. కంపెనీ ఇప్పుడు కొత్తగా, తక్కువ ధర బైక్‌ల సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఈ కొత్త మోడల్ ధర సుమారుగా 5 లక్షల రూపాయలలోపు ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ సీఈఓ ఒక సమావేశంలో ధృవీకరించారు.
Advertisement

హ్యుందాయ్ క్రెటా రికార్డు.. మారుతిని వెనక్కి నెట్టి నెంబర్ వన్ కారు ఇదే!

భారతదేశంలో ఎక్కువ కార్లను విక్రయించే కంపెనీ అంటే వెంటనే గుర్తొచ్చేది మారుతి సుజుకి. అయితే, అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఏది అంటే, ఇప్పుడు సమాధానం మారిపోయింది. మారుతి కార్లను వెనక్కి నెట్టి హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ సంవత్సరం కేవలం మొదటి ఏడు నెలల్లోనే ఏకంగా 1.17 లక్షల కార్లను విక్రయించి క్రెటా సంచలనం సృష్టించింది.

కారులో ఏసీ వాడకం వల్ల మైలేజీపై ప్రభావం ఇలా ఉంటుంది!

ఇంధన ధరలు చుక్కలు తాకుతున్న ఈ కాలంలో, ప్రతి లీటర్‌కి విలువ పెరిగిపోయింది. ఒకటిగా పెరిగిన ఖర్చులు, మైలేజ్ తగ్గితే వాహన యజమానులకు అర్థికంగా కొంత భారంగా మారుతుంది. ఇక ఇప్పటికే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కారులో ప్రయాణించేటప్పుడు లోపల చల్లగా ఉండటానికి AC ఆన్ చేయడం తప్పనిసరి అయింది. అయితే, అదే సమయంలో కారులో ఏసీ ఆన్ చేస్తే, మైలేజ్‌ తగ్గుతుందా? అనే ప్రశ్న చాలా మందిలో సందేహంగా ఉంటుంది. కాఫీషాప్‌కు వెళ్తూ, లేదా ఆఫీస్ ట్రాఫిక్‌లో కూరుకుపోయి ఉన్నా... మన మదిలో ఈ ప్రశ్న తేలికగా మర్చిపోలేం. అసలు విషయం ఏంటంటే, కారు ఏసీ పని చేయాలంటే, ఇంజిన్ శక్తిని వినియోగించే కంప్రెసర్ పని చేయాలి.

అదిరే ఫీచర్లతో త్వరలో మార్కెట్‌లోకి ఐదు కొత్త ఎలక్ట్రిక్ కార్లు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి టాటా, మారుతి, కియా, హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీలు తమ కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ ఎలక్ట్రిక్ కార్లలో అద్భుతమైన ఫీచర్లు, ఎక్కువ రేంజ్, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయి.

500cc బైక్ పవర్‌తో కొత్త హోండా EV… సెప్టెంబర్ 2న రోడ్డెక్కబోతోంది!

ఇంజిన్ సౌండ్ లేకుండా, కానీ శక్తిని తగ్గించకుండా అధునాతన ఫీచర్స్‌తో శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైకును విడుదల చేయడానికి ప్రముఖ టూవీలర్ తయారీదారు హోండా (Honda) సిద్ధమవుతోంది. ఇంత వరకు ఐసీఈ ఆధారిత వాహనాలను విడుదల చేస్తూ వస్తున్న కంపెనీ ఇప్పుడు తన మార్కెట్‌ను మరింత విస్తరించడానికి ఈవీ విభాగంలో 500 సీసీ బైక్ లాగే పనితీరును కలిగి ఉండే శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్‌తో రంగంలోకి దిగుతోంది. ఈ బైక్‌కి సంబంధించి కంపెనీ చెబుతున్న కథనాల ప్రకారం, ఇది సంప్రదాయ 500 సీసీ పెట్రోల్ బైక్‌ల మాదిరిగా పనిచేస్తుంది. అంటే పవర్‌లో తగ్గేదేమీ లేదు, కానీ కాలుష్యంలో మాత్రం పెద్ద తేడా. హోండా ఎలక్ట్రిక్ విభాగంలో అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్న ఈ కొత్త బైక్ భారత మార్కెట్లో కూడా తన సత్తాను చూపించే అవకాశం ఉంది.
Advertisement

తూత్తుకుడిలో నేడే ప్రారంభమైన విన్‎ఫాస్ట్ ప్లాంట్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఈ మార్కెట్లో వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ విన్ ఫాస్ట్ అడుగుపెట్టింది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఈ సంస్థ తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీనిని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ నిర్మాణం, ఉత్పత్తి లక్ష్యాలు, భారతదేశానికి ఈ ప్రాజెక్ట్ ఎలా లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మళ్లీ పుంజుకున్న హ్యుందాయ్.. మహీంద్రా మళ్లీ వెనక్కి!

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్, మహీంద్రా మధ్య సాగుతున్న ఆటో ఇండస్ట్రీలో రెండవ స్థానం పోటీ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. భారతదేశపు టాప్ కార్ మేకర్‌గా మారే పోరులో, గత కొన్ని నెలలుగా మహీంద్రా తన సుస్థిర SUV అమ్మకాలతో రెండవ స్థానాన్ని బలంగా దక్కించుకుంది. ముఖ్యంగా XUV700, స్కార్పియో-ఎన్, థార్ వంటివి మార్కెట్‌లో భారీ క్రేజ్‌ను సృష్టించాయి. అయితే, జూలై 2025 అమ్మకాల గణాంకాలు వెలుగులోకి వచ్చిన తర్వాత పరిస్థితి కాస్త షాకింగ్‌గా మారింది. ఎప్పుడో ముందు ఉన్న హ్యుందాయ్ తిరిగి తన పాత బలాన్ని చూపించింది. జూలైలో హ్యుందాయ్ కంపెనీ భారతదేశవ్యాప్తంగా 43,972 యూనిట్ల రిటైల్ అమ్మకాలను నమోదు చేసింది. ఇది మహీంద్రాపై స్పష్టమైన ఆధిక్యం చూపించింది.

కియా అమ్మకాలలో రికార్డు వృద్ధి.. రూ.14లక్షలకే కొత్త కారు

భారత మార్కెట్లో కార్ల అమ్మకాల విషయంలో కియా దూసుకుపోతోంది. 2025 జూలై నెలలో కియా అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాల్లో 8% వృద్ధి సాధించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఏకంగా 11.45% వృద్ధిని నమోదు చేసి తన సత్తా చాటింది.

జూన్ కంటే 849 కార్లు ఎక్కువ! MG మోటార్ జూలైలో నయా రికార్డు

ఇటీవలి కాలంలో JSW-MG మోటార్ బ్రాండ్ భారతీయ ఆటోమొబైల్ రంగంలో తనకు తానుగా నిలుస్తోంది. JSW గ్రూప్, బ్రిటన్‌కు చెందిన MG మోటార్ మధ్య జరిగిన భాగస్వామ్యంతో, కంపెనీ భారత మార్కెట్‌పై మరింత దృష్టి సారించింది. ఈ భాగస్వామ్యం తర్వాత MG బ్రాండ్ వేగాన్ని అందుకుంది. మార్కెట్‌లో తన ఉనికిని బలపరచడమే కాకుండా, అమ్మకాల పరంగా కూడా కొత్త మైలురాళ్లను చేరుకుంటోంది. దీనికి నిదర్శనంగా జూలై 2025లో MG మోటార్ అద్భుతమైన సేల్స్ గణాంకాలను నమోదు చేసింది. ఒక్క నెలలోనే 6,678 కార్లను విక్రయించి, భారత మార్కెట్‌లో తన శక్తిని మరింతగా చాటింది. ఇది MG మోటార్‌కు దేశవ్యాప్తంగా ఒక నెలలో నమోదైన అత్యధిక అమ్మకాలలో ఒకటి కావడం గమనార్హం.
Advertisement

ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న వాళ్లకు గుడ్ న్యూస్.. 15 ఏళ్ల తర్వాత కూడా వాటిని వాడొచ్చు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి, వాటి వినియోగాన్ని సాధారణం చేయడానికి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. వీటిలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు కొన్న వాళ్లకు గుడ్ న్యూస్. పాత వాహనాలను 15 ఏళ్ల తర్వాత స్క్రాప్ చేసే(End of Life) నిబంధన ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించదని ప్రభుత్వం త్వరలో స్పష్టం చేయనుంది. అంటే, ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు, ట్రక్కులు 15ఏళ్ల తర్వాత కూడా రోడ్లపై నడవవచ్చు.

మారుతి కార్లకు 6 ఎయిర్‌బ్యాగుల వల్ల బుకింగ్‌లు బంపర్ హిట్!

భారతదేశంలోని ఆటోమొబైల్ మార్కెట్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ధర, మైలేజ్ వంటి అంశాలు మాత్రమే కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తే, ఇప్పుడు భద్రత కూడా అంతే ముఖ్యమైన ప్రమాణంగా మారింది. వినియోగదారులు తమ కుటుంబం ప్రయాణించే కారులో అత్యంత రక్షణ ఉండాలని కోరుకోవడం వల్ల భద్రతా ఫీచర్లపై అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రయాణికుల రక్షణను మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కొన్ని సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసింది. ఇకపై కార్లలో 6 ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, ఇఎస్‌పి వంటి ముఖ్యమైన భద్రతా అంశాలు తప్పనిసరి కావడంతో ఆటోమొబైల్ రంగం కూడా తన దృష్టిని మార్చుకుంది.

హీరో విడా స్కూటర్లకు గత నెలలో భారీ డిమాండ్.. 11 వేలు అమ్మేసింది!

హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన విప్లవాత్మక విడా బ్రాండ్‌తో ఎలక్ట్రిక్ టూవీల్ రంగంలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంటోంది. ఈ బ్రాండ్ కింద విడుదలైన Vida V2, VX2 మార్కెట్లోకి వచ్చిన కొద్ది నెలల వ్యవధిలోనే వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్నాయి. ఈ స్కూటర్లు శక్తివంతమైన బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్, ఇంటెలిజెంట్ ఫీచర్లతో అందుబాటులో ఉండటం వల్ల యువత నుండి వృద్ధుల వరకు అందరిని బాగా ఆకర్షించాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, జూలై 2025లో ఈ హీరో విడా స్కూటర్లు భారీ స్థాయిలో అమ్ముడయ్యాయి. జూన్‌తో పోలిస్తే అమ్మకాలలో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఇది హిరో విడా స్కూటర్లపై ఉన్న పాజిటివ్ మౌత్‌టాక్‌ను, కస్టమర్ల సంతృప్తిని స్పష్టంగా సూచిస్తోంది.

హీరోను వెనక్కి నెట్టి నెం.1 స్థానానికి చేరిన హోండా

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంస్థ భారతీయ టూ-వీలర్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. దేశంలోనే అత్యంత నమ్మకమైన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా పేరు పొందిన హోండా, జులై నెలలో ఏకంగా 5,15,378 యూనిట్లను అమ్మింది. గతంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకుంది. ఇదే సమయంలో హీరో కేవలం 4,49,755 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.
Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ పుంజుకున్నాయి.. 31 శాతం పెరిగిన జూలై సేల్స్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) పేరు వినగానే బైక్ ప్రేమికుల్లో ఓ ప్రత్యేకమైన గౌరవం, ఓ రఫ్, రాయిడ్ ఇమేజ్ గుర్తుకు వస్తుంది. బుల్లెట్ బ్రాండ్ అనే బలం ఎప్పుడూ వెనకపడదు. అలాంటి రాయల్ ఎన్‌ఫీల్డ్, జూలై 2025లో కూడా మార్కెట్లో తన దూకుడు చూపింది. ఈ ఒక్క నెలలో కంపెనీ మొత్తం 88,045 మోటార్ సైకిళ్లు విక్రయించి మంచి గ్రోత్‌ను నమోదు చేసింది. గత సంవత్సరం జూలైతో పోలిస్తే ఈసారి అమ్మకాల్లో 31 శాతం పెరుగుదల కనిపించింది. ఇది సంస్థకు ఊపు ఇచ్చే విషయమే కాదు, మార్కెట్లో ఎలాంటి క్రేజ్ కొనసాగుతుందో కూడా చెప్తుంది. బుల్లెట్, క్లాసిక్, హిమాలయన్ వంటి మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఉండటం, కస్టమర్ల నమ్మకం రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌ను మరింత పటిష్టంగా నిలబెడుతోంది.

ఒక్క నెలలో 4.5 లక్షల వాహనాలను అమ్మిన హీరో..ఎగుమతుల్లోనూ రికార్డులు

హీరో మోటోకార్ప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ల తయారీ సంస్థ ఇది. ఈ కంపెనీ జులై నెలలో ఏకంగా 4.5 లక్షల వాహనాలను అమ్మేసి అదరగొట్టింది. ఇది గతంతో పోలిస్తే అమ్మకాల్లో భారీ పెరుగుదల. అసలు అంత భారీగా అమ్మకాలు పెరగడానికి కారణాలేంటి? వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

ఒక్క నెలలో లక్షకు పైగా సుజుకి బైకులు అమ్ముడయ్యాయి.. ఏం మాయ చేసిందో చూడు!

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SMIPL) ఇటీవల జూలై 2025 నెలకు గాను తమ అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. దేశీయ టూవీలర్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ సంస్థ, గత నెలలో మొత్తం 1,13,600 యూనిట్లను విక్రయించడం ద్వారా మార్కెట్‌లో మంచి ఉనికిని చూపించింది. ఈ మొత్తం అమ్మకాలలో 96,029 యూనిట్లు భారతీయ మార్కెట్‌లోనే అమ్ముడుపోయినవిగా సంస్థ ప్రకటించింది. దీనితోపాటు, 17,571 యూనిట్లు అంతర్జాతీయంగా విదేశీ మార్కెట్లకు ఎగుమతైనట్లు వెల్లడించింది. దేశీయ అమ్మకాలతో పాటు గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ మార్కెట్‌కి అందించిన వాహనాల వల్ల, కంపెనీ వృద్ధి దిశగా మైలురాయిగా నిలిచింది. ఈ గణాంకాలు చూస్తే, సుజుకి వాహనాలపై వినియోగదారులలో ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చెప్పొచ్చు.

మొత్తం కుటుంబానికి సరిపడే కారు.. ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్‌లోకి!

ప్రముఖ కార్ల తయారీదారు రెనాల్డ్ ఇండియా (Renault India) తనకు ఉన్నటువంటి కొన్ని మోడళ్లతోనే మార్కెట్లో సత్తా చూపిస్తుంది. గతంలో డస్టర్ ద్వారా తిరుగులేని కంపెనీగా అవతరించిన కంపెనీ ఇప్పుడు తన సేల్స్‌ను మరింత పెంచుకోవడానికి ప్రసిద్ధ మోడల్ అయినటువంటి ట్రైబర్ (Triber) ను మరింత కొత్తగ మార్చి 2025లో రీడిజైన్‌ చేసి ఫేస్‌లిఫ్ట్ MPVగా ఇప్పుడు మన ముందుకు తీసుకువచ్చింది. కొద్ది రోజుల క్రితం ఈ కారును మార్కెట్లో లాంచ్ చేయగా ఇప్పుడు రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ MPV డెలివరీలు దేశవ్యాప్తంగా ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే వివిధ నగరాల్లో డీలర్‌షిప్‌లకు ఈ కార్ల డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, డెలివరీలు త్వరలోనే వేగం పెంచనున్నట్లు సమాచారం.
Advertisement

టాటాకు పెద్ద షాక్.. జులై అమ్మకాలు భారీగా డౌన్!

భారతదేశంలో వాహన అమ్మకాలను చూస్తే, టాటా మోటార్స్ గత నెల కంటే ఈ జులైలో అమ్మకాలు పెంచుకున్నా, గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే మాత్రం గణనీయంగా తగ్గాయి. జులై నెలలో టాటా మోటార్స్ మొత్తం 39,521 కార్లను దేశీయ మార్కెట్లో విక్రయించింది. ఇది గతేడాది జులైలో అమ్ముడైన 44,725 కార్ల కంటే 11.64% తక్కువ. కానీ, గత జూన్ నెలలో అమ్ముడైన 37,083 కార్లతో పోలిస్తే, జులైలో అమ్మకాలు 6.57% పెరిగాయి. ఈ మిశ్రమ ఫలితాలు పరిశ్రమ నిపుణులను ఆలోచింపజేస్తున్నాయి.