మారుతి ప్లాట్‌ఫామ్‌పై టయోటా కొత్త ఎలక్ట్రిక్ కారు

జపాన్ వాహన తయారీ సంస్థలైన సుజుకి, టయోటా మధ్య జరుగుతున్న కార్ ఎక్స్చేంజ్ గురించి వాహన ప్రియులకు తెలుసు. భారత మార్కెట్‌లో సుజుకి, టయోటా ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారైన వాహనాలను వేర్వేరు పేర్లతో విక్రయిస్తున్నాయి. ఉదాహరణకు, మారుతి మోడల్స్ అయిన ఎర్టిగా, ఫ్రాంక్స్, బాలెనో లను టయోటా వరుసగా రూమియాన్, టైజర్, గ్లాంజా అనే పేర్లతో రీబ్యాడ్జ్ చేసి అమ్ముతోంది.

కొత్త గ్లామర్ 125లో అప్ డేటెడ్ ఫీచర్స్.. ఈ స్పెషల్ బటన్ ఏం చేస్తుందంటే

ఆటో రంగంలో దిగ్గజ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ తన నెక్ట్స్ జనరేషన్ హీరో గ్లామర్ 125ను రహస్యంగా పరీక్షిస్తోంది. సాధారణంగా తక్కువ ధర కమ్యూటర్ మోటార్‌సైకిళ్లలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు తక్కువగా ఉంటాయి. కానీ, హీరో ఇప్పుడు కొత్త దారిలో వెళ్తోంది. ఆశ్చర్యకరంగా, కంపెనీ తన ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో క్రూజ్ కంట్రోల్ ఫీచర్‌ను అందించబోతోంది.

టెక్నాలజీ, స్టైల్, మైలేజ్ అన్నీ ఒకే స్కూటర్‌లో.. టెన్నిస్ 1500 అదిరింది!

VLF కంపెనీ నుండి సరికొత్త శక్తివంతమైన అప్‌డేట్‌తో టెన్నిస్ 1500 ఎలక్ట్రిక్ స్కూటర్ (Tennis 1500) విడుదల అయింది. ఇప్పటికే మంచి సేల్స్ హైప్ అందుకున్న ఈ మోడల్‌ను కంపెనీ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మార్చింది. 2025 సంవత్సరానికి ప్రత్యేకంగా, స్టైలిష్ డిజైన్, కొత్త కలర్ ఆప్షన్లు, స్మార్ట్ ఫీచర్లతో ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. విభిన్న కలర్స్‌లలో విడుదలైన ఈ మోడల్, యూత్‌కు ప్రత్యేకంగా నచ్చేలా రూపొందించబడింది. స్కూటర్ ముందు భాగాన్ని శార్ప్‌గా డిజైన్ చేయగా, బాడీపై కొత్త గ్రాఫిక్స్, ప్రీమియం పేఇంట్ స్కీమ్‌ను ఉపయోగించడం వలన ఇది రోడ్డుపై స్పెషల్ లుక్ ఇస్తుంది.

రూ. 15 లక్షల లోపు టాప్-5 బెస్ట్ 7-సీటర్ కార్లు ఇవే

పెద్ద ఫ్యామిలీకి రూ. 15 లక్షల బడ్జెట్‌లో ఒక స్టైలిష్, సౌకర్యవంతమైన, దూర ప్రయాణాలకు అనుగుణంగా ఉండే 7-సీటర్ కారు కొనాలని చూస్తున్నారా? భారతదేశంలో ఈ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్పేస్, సౌలభ్యం, మంచి పర్ఫామెన్స్ లభిస్తాయి. ఈ జాబితాలో, ఎంపీవీ, ఎస్యూవీ రెండు రకాల కార్లు ఉన్నాయి. మరి, భారతదేశంలో లభించే అత్యంత సరసమైన టాప్-5 బెస్ట్ 7-సీటర్ కార్లు ఏంటో ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.
Advertisement

మూడు వేరియంట్లు, ఆరు కలర్‌లు.. విన్‌ఫాస్ట్ VF7 వచ్చేస్తుంది

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) ఇప్పుడు భారత ఎలక్ట్రిక్ వాహన రంగంపై తన దృష్టిని మరింతగా కేంద్రీకరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్కెట్లలో తన స్థానం సాధించిన ఈ బ్రాండ్, ఇప్పుడు భారతదేశంలో తన తొలి అడుగులు వేయబోతోంది. దేశంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసిన కంపెనీ, భారత మార్కెట్‌ను ఒక కీలక అవకాశంగా చూస్తూ దీన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలో, ఈ ఆగస్టులో భారత్‌లో రిలీజ్ కావాల్సిన రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలలో ఒకటి VinFast VF7. ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా VF6, VF7 మోడళ్లకు రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో ప్రీ-బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి.

నిస్సాన్ మాగ్నైట్ 2 స్టార్ నుంచి 5 స్టార్‌కు ఎలా మారింది?

ఒకప్పుడు కేవలం 2-స్టార్ రేటింగ్ పొంది డబ్బా కారు అని విమర్శలు ఎదుర్కొన్న నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఈ అద్భుతమైన మార్పు చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలలో నిస్సాన్ మాగ్నైట్‌లో భారీగా సేఫ్టీ అప్‌డేట్‌లను చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కొన్నేళ్ల క్రితం నిస్సాన్ మాగ్నైట్‌ను గ్లోబల్ NCAP పరీక్షించినప్పుడు, అది కేవలం 2-స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందింది. ఆ సమయంలో, కారులో ఎయిర్‌బ్యాగ్‌లు తక్కువ ఉండటం, ఇతర సేఫ్టీ ఫీచర్లు లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే, నిస్సాన్ కంపెనీ తన కారు సేఫ్టీని మెరుగుపరచాలని నిర్ణయించుకుంది.

కొత్త కార్ కోసం షోరూమ్‌కు వెళ్లే ముందు ఇది చదవండి.. తరువాత బడ్జెట్ రెడీ చేసుకోండి!

సామాన్య కుటుంబాల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇష్టపడే కారు జాబితాలో టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) పేరు ఎప్పుడు ఉంటుంది. ఇది ఒక బ్రాండ్ పేరు మాత్రమే కాదు, అది ఎన్నో భారతీయ కుటుంబాల విశ్వాసానికి నిదర్శనం. అందరూ ఈ కారును ఒక నమ్మకమైన MPVగా భావిస్తారు. విశాలమైన ఇంటీరియర్ ఏర్పాట్లు, మల్టీ పర్పస్ ఉపయోగాలు, నాణ్యతకు తగ్గ స్టైల్, మన్నిక, మైలేజ్, మెరుగైన సేఫ్టీ అంశాల కారణంగా ఇది ఫేవరెట్ మోడల్‌గా మారిపోయింది. ఇన్నోవా క్రిస్టా డిజైన్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. కేవలం ఎక్స్‌టీరియర్ ఆకృతితోనే కాకుండా, ఫీచర్ల పరంగా కూడా ఇది స్మార్ట్‌ SUVలను ఢీ కొట్టగలదు.

మైలేజ్ కింగ్ ప్లాటినా జూన్‌లో ఫామ్‌లో లేదు..! కారణం తెలుసా?

భారతీయుల మనస్సుల్లో ఎప్పుడూ ఓ స్థిరమైన స్థానం కలిగి ఉండే సెగ్మెంట్‌ అంటే ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్‌లు. తక్కువ బడ్జెట్, అధిక మైలేజ్, నిర్వహణలో తక్కువ ఖర్చుతో అనేక రకాల అవసరాలకు సరిపోయే బైక్ కావాలంటే, ఈ విభాగంలోనే ఎన్నుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ మంచి ఆదరణ పొందుతున్న బైక్‌లలో బజాజ్ ప్లాటినా ముందు వరుసలో ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలు తమ మొదటి బైక్ ఎంపికగా చాలా సందర్భాల్లో ప్లాటినాను ఎంచుకుంటాయి. రోజూ ఆఫీసుకు వెళ్లేవాళ్లు, కాలేజీ స్టూడెంట్లు, డెలివరీ ఏజెంట్లు వంటి నిరంతరం ప్రయాణించాల్సిన వారు ఎక్కువగా దీనిపైనే ఆధారపడతారు. బజాజ్ ప్లాటినా శక్తిని తక్కువ వ్యయంతో అందించగల బైక్‌గా పేరు తెచ్చుకుంది.
Advertisement

భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. విదేశీ కార్లు చౌకగా మారేనా ?

భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం బ్రిటన్ వెళ్లి, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ తో సమావేశమై ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాన్ని రెండు దేశాల మధ్య ఒక చారిత్రక మైలురాయిగా భావిస్తున్నారు. దీనివల్ల రెండు దేశాలకూ అనేక వస్తువుల దిగుమతులు చౌకగా మారతాయి.

టెస్లా మోడల్ వై బుకింగ్‌లు ప్రారంభం.. ఎంత చెల్లించాలంటే ?

కేవలం రూ. 22,220తో టెస్లా మోడల్ వై కారును భారతదేశంలో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి. బుకింగ్ నియమాలు, ధర, వేరియంట్లు, పనితీరుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. టెస్లా రాకతో భారత ఈవీ మార్కెట్‌లో కొత్త శకం ప్రారంభం అయింది.

ఒక్క ఛార్జ్‌తో బెంగళూరు నుంచి తమిళనాడుకు

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (GEML) భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగానికి పునాది వేసిన కంపెనీల్లో ఒకటి. ఎలక్ట్రిక్ సికిళ్లు, స్కూటర్లు, 3-వీలర్ ఆటో రిక్షాల వరకు పలు వాహనాలను ఇది మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రత్యేకించి ఆంపియర్ వంటి బ్రాండ్‌లతో ఈ సంస్థ దేశ వ్యాప్తంగా వినియోగదారులకు నమ్మకమైన, అనుకూలమైన ఎలక్ట్రిక్ రవాణాకు వాహనాలను అందిస్తోంది. ఇప్పుడీ కంపెనీ మరోసారి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షించింది. ఎల్ట్రా సిటీ ఎక్స్‌ట్రా (Eltra City Xtra) అనే తమ ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్యాసింజర్ వాహనంతో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, బెంగళూరులోని తమ ప్రధాన కేంద్రం నుంచి తమిళనాడులోని రాణిపేట వరకూ, ఒక్కసారి ఛార్జ్ చేసిన తరువాత 324 కిలోమీటర్లు ప్రయాణించి కొత్త రికార్డును నెలకొల్పింది.

25 నెలల్లోనే ప్రపంచాన్ని దుమ్ములేపిన మారుతి SUV.. పేరు ఫ్రాంక్స్!

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది మారుతి సుజుకి (Maruti Suzuki). కంపెనీ తన కాంపాక్ట్ SUV మోడల్ ఫ్రాంక్స్ (Fronx) అరుదైన ఘనతను సాధించింది. జూన్ 2023లో ఫ్రాంక్స్ గ్లోబల్ ఎగుమతి కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి, కేవలం 25 నెలల్లోనే ఇది ఒక లక్ష యూనిట్ల (1,00,000) ఎగుమతులు పూర్తి చేసింది. దేశీయంగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా భారత తయారీ నాణ్యతను చాటింది. అతి తక్కువ కాలంలోనే మారుతి లక్ష కార్లను ఎగుమతి చేయడం అంటే సాధారణ విషయం కాదు. ముఖ్యంగా జపాన్‌ దేశంలో కూడా Fronx కి గణనీయమైన ఆదరణ లభించడం గమనార్హం. ఇది సాధారణంగా అత్యధిక నాణ్యతను కోరుకునే మార్కెట్. ఈ దేశంలో కూడా భారతీయ తయారీ కారు నమ్మకాన్ని సంపాదించడం అనేది గర్వకారణం.
Advertisement

ఎలక్ట్రిక్ బైక్‌లకు పెరుగుతున్న మార్కెట్.. మేటర్ ఈవీ కొత్త అడుగు!

భారతదేశంలో కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్ కంపెనీలలో మేటర్ ఈవీ ఒకటి. ముఖ్యంగా, ఎలక్ట్రిక్ బైక్‌లను విక్రయించే కొన్ని కంపెనీలలో మేటర్ ఈవీ కూడా ఉంది. ఈ కంపెనీ అమెరికాకు చెందిన హెలేనా సంస్థ సహాయంతో పనిచేస్తుంది. క్యాపిటల్ 2బీ, జపాన్ ఎయిర్‌లైన్స్, కెనడాకు చెందిన ట్రాన్స్‌లింక్ ఇన్నోవేషన్ ఫండ్, ఎస్‌బీ ఇన్వెస్ట్ వంటి అంతర్జాతీయ కంపెనీలు మేటర్ ఈవీలో పెట్టుబడులు పెట్టాయి.

భద్రత పెరిగింది.. ధర కూడా! XL6లో కొత్తగా 6 ఎయిర్‌బ్యాగులు

ప్రస్తుత మార్కెట్లో వాహన తయారీదారులు భద్రతకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను రక్షించడానికి తమ కార్లలో మెరుగైన అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలను అందిస్తున్నారు. ఈ క్రమంలో తమ పాత మోడళ్లను మరింత కొత్తగా మారుస్తున్నారు. ఈ క్రమంలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా దీనిపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. తమ కస్టమర్లకు మెరుగైన సేఫ్టీ ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా తన ప్రసిద్ధ మోడల్ ప్రీమియం MPV అయిన XL6 మోడల్‌ను మరింత సురక్షితంగా మార్చే దిశగా కీలక అడుగు వేసింది. ఈ MPVలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ఇప్పుడు ప్రామాణికంగా అందించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన కియా కారును పట్టించుకోని జనం

భారతదేశంలో ఇప్పుడు చాలా మందికి ఇష్టమైన ఆటోమొబైల్ బ్రాండ్‌లలో ఒకటిగా కియా మారింది. సెల్టోస్ కారుతో మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుందని కంపెనీ కూడా ఊహించి ఉండదు. అప్పటివరకు వాహనాల్లో పెద్దగా చూడని డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన మిడ్-సైజ్ ఎస్‌యూవీని ప్రజలు వెంటనే ఆదరించారు.

మార్కెట్లో నిన్ను పడగొట్టె బండి ఇంకా పుట్టలేదు మామా!

నమ్మకమైన టూవీలర్‌కు మరో పేరు చెప్పాలంటే - అది హీరో స్ప్లెండర్‌ (Hero Splendor)నే. సంవత్సరాలుగా మార్కెట్‌లో కొనసాగుతున్న ఈ మోడల్‌కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఇది కేవలం ఒక బైక్‌ మాత్రమే కాదు.. లక్షలాది మందికి జీవిత భాగస్వామి లాంటిది. గ్రామాలలో పొలాల మధ్య తిరిగే రైతు దగ్గర నుంచి, ఢిల్లీ ట్రాఫిక్‌లో ఆఫీస్‌కు వెళ్తున్న ఉద్యోగి వరకూ, హీరో స్ప్లెండర్ ప్రతి ఒక్కరికీ నమ్మకంగా తోడుగా నిలుస్తోంది. దీని సరళమైన డిజైన్‌, సులభమైన నిర్వహణ, మెరుగైన మైలేజ్, బలమైన నిర్మాణం కలసి దీన్ని ఒక ఇండియా లవ్స్ బైక్‌గా నిలిపాయి.
Advertisement

భారతదేశంలో కార్ సబ్‌స్క్రిప్షన్ కోసం అవసరమైన పత్రాలు.. ఏం కావాలి?

మీరు కారు కొనాలని అనుకుంటున్నారా? కానీ ఓనర్‌షిప్‌తో వచ్చే తలనొప్పులు, మెయింటెనెన్స్ ఖర్చులు, ఇన్సురెన్స్, ట్యాక్స్ గురించి ఆలోచించి వెనకడుగు వేస్తున్నారా? అయితే, కార్ సబ్‌స్క్రిప్షన్ మీకు బెస్ట్ ఆప్షన్. ఇందులో మీరు ఒక నిర్దిష్ట మొత్తం లేదా డౌన్ పేమెంట్ చెల్లించి, మీకు నచ్చిన కారును ఎంచుకున్న సమయం వరకు నెలవారీ రుసుము చెల్లిస్తూ నడపవచ్చు.

వారాంతాల ట్రిప్స్‌కి బెస్ట్ కార్.. కానీ ఇప్పుడు కొంచెం ఖరీదైందే!

టయోటా రూమియన్ (Toyota Rumion) పేరే చాలు, పెద్ద ఫ్యామిలీ కార్ కోసం వెతుకుతున్నవారికి ఇది ముందే గుర్తొస్తుంది. విశ్వసనీయత, ప్రాక్టికాలిటీ, మరి ముఖ్యంగా టయోటా బ్రాండ్ నమ్మకం కలసి దీనిని మార్కెట్లో ఒక పాపులర్ ఎంపీవీగా నిలిపాయి. సంవత్సరాలుగా కొనుగోలుదారుల విశ్వాసాన్ని అందుకుంటున్న ఈ MPV, 2025 మొదటి ఆరు నెలల్లోనే 11,630 యూనిట్లు అమ్ముడై మళ్లీ తన డిమాండ్‌ను రుజువు చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం, టయోటా రూమియన్ ధర ఇప్పుడు కొంచెం పెరిగింది. మీడియా నివేదికల ప్రకారం, అన్ని వేరియంట్లపై దాదాపు రూ. 12,500 వరకూ ధర పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు రూమియన్‌ ధర రూ. 10.66 లక్షల నుండి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కి రూ. 13.95 లక్షల వరకు చేరుతోంది (ఎక్స్-షోరూమ్ ధరలు).

హీరో కరిజ్మా XMR బేస్ వేరియంట్ తొలగింపు

దేశీయ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన హీరో కరిజ్మా ఇప్పుడు సరికొత్త వార్తలతో మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. స్పోర్ట్స్ టూరింగ్ మోటార్‌సైకిల్ విభాగంలో ఒక గేమ్ ఛేంజర్‌గా పేరుగాంచిన కరిజ్మా, 2019లో అమ్మకాలు తగ్గడంతో తీవ్ర పోటీని తట్టుకోలేక మార్కెట్ నుండి నిష్క్రమించింది. అయితే, 2023లో కరిజ్మా XMR పేరుతో ఈ లెజెండరీ మోడల్‌ను హీరో తిరిగి మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

హోండా కొత్త బులెట్ వచ్చేసింది.. ఫీచర్లు, లుక్, పనితీరు అన్నీ మాములుగా లేవు!

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్‌లో 25 ఏళ్ల విజయయాత్రను పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని సెలబ్రేట్ చేస్తూ, హోండా దేశీయ విభాగంలో రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి Shine 100 DX తో పాటు, మరో మోడల్ కొత్త CB125 హార్నెట్ (CB125 Hornet). ఇది కొత్త తరహా ప్రయత్నంగా చెప్పవచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు Shine & SP125 వంటి మోడళ్లతో హోండా సాధారణ కమ్యూటర్ సెగ్మెంట్‌లో కొనసాగింది. కానీ ఇప్పుడు, స్పోర్టీ స్టైలింగ్, యంగ్ అటిట్యూడ్, ఎగ్జైట్‌మెంట్ కోసం యూత్ వెతుకుతున్న బైక్ ప్రీమియం లుక్‌తో రావాలన్నదే వారి లక్ష్యం. హోండా CB125 హార్నెట్ లాంచ్ ప్రధానంగా రెండు ప్రత్యక్ష పోటీదారులను TVS Raider 125, Hero Xtreme 125R దృష్టిలో పెట్టుకొని జరిగింది.
Advertisement

రోజువారీ అవసరాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే

ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ ఇప్పుడు చాలా విస్తరించింది. కొత్తగా ఎన్నో కంపెనీలు బరిలోకి దిగుతున్నాయి. వాటిలో కొన్ని చాలా తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నాయి. ధర తక్కువైనా, వీటిలో అత్యాధునిక టెక్నాలజీ, మంచి పనితీరు, ఆకర్షణీయమైన లుక్స్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా, ఇవి మంచి రేంజ్ కూడా అందిస్తున్నాయి. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

రోజువారీ ప్రయాణాలకు బాగా పనికొచ్చే బైక్ వచ్చేసింది

హోండా షైన్ (Honda Shine).. ఈ పేరు వినగానే ఎంతమందికో నమ్మకం, నాణ్యత, మంచి మైలేజ్ గుర్తుకు వస్తాయి. ఇప్పుడు అదే పేరు, అదే నమ్మకాన్ని కొత్త రూపంలో తీసుకొచ్చింది హోండా. ఈ రోజు దేశరాజధాని న్యూఢిల్లీ నగరంలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో, కంపెనీ కొత్తగా హోండా షైన్ 100 డీఎక్స్ (Honda Shine 100 DX) మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది కేవలం పాత షైన్‌కు కొనసాగింపుగా కాకుండా, యువతరాన్ని ఆకట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించబడింది. కొత్త Shine 100 DX మోడల్‌ను చూస్తేనే ఆకర్షణ మొదలవుతుంది. ఫ్రంట్‌లో ఉన్న కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్, దానికి తగ్గట్టే సైడ్ బాడీపై ఉల్లాసంగా మెరుస్తున్న గ్రాఫిక్స్.. వీటితో ఇది స్టైలిష్ లుక్‌ను పొందింది. హోండా బ్రాండింగ్ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ మెరిసిపోతుంటుంది. మొత్తం బైక్‌కి ప్రీమియం అట్టిట్యూడ్ కనిపిస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్ సరికొత్తగా లాంచ్.. 35+ డిజైన్, ఫీచర్ అప్‌డేట్‌లు!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో 7 సీటర్ కార్లలో బాగా పేరున్న రెనాల్ట్ ట్రైబర్ ఇప్పుడు సరికొత్త మోడల్‌లో విడుదలైంది. ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్ గ్రూప్ నుంచి వచ్చిన రెనాల్ట్ ఇండియా, ఈరోజు (జూలై 23, 2025) ఆల్-న్యూ రెనాల్ట్ ట్రైబర్‌ను లాంచ్ చేసింది.

రూ.73,550కే వచ్చిన కొత్త హీరో బైక్.. మైలేజ్‌తో పాటు స్టైల్ కూడా పెరిగింది!

హీరో మోటోకార్ప్ తాజాగా మార్కెట్‌లోకి మరో కొత్త మోడల్‌ను దింపింది. అదే హచ్‌ఎఫ్ డీలక్స్ ప్రో (Hf Deluxe Pro). ఇది సాధారణ బైక్‌లా కాకుండా, ఇది మరింత ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఈ మోడల్ ఎంట్రీ లెవల్ బైక్ సెగ్మెంట్‌ను పూర్తిగా ఊపేస్తుందనేలా కనిపిస్తోంది. ఈ బైక్‌ను నమ్మకాన్ని, స్టైల్‌ను, విలువను ప్రాధాన్యతగా పెట్టుకునే భారతీయ వినియోగదారుల దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. HF డీలక్స్ ప్రోను చూస్తే, అది ఒక బోల్డ్, స్టైలిష్ అప్దేట్‌ను అందించినట్లు తెలుస్తుంది. హీరో మోటోకార్ప్ పేరు చెబితేనే గుర్తొచ్చే విశ్వసనీయతను కొనసాగిస్తూ, ఈ మోడల్‌కి అదనంగా మరిన్ని కొత్త అంశాల జోడించారు. దీని డిజైన్ ప్రతి వయస్సు వారినీ ఆకట్టుకునేలా ఉంది. చూడటానికి సింపుల్‌గా ఉండేలా ఉన్నప్పటికీ, మోడరన్ టచ్‌ను మర్చిపోలేదు.
Advertisement

చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ అనిపించిన ఈ కారు ఎందుకు వెనుకబడుతోంది?

భారతీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki) నుంచి వచ్చినటువంటి ఇగ్నిస్ (ignis) ఒక స్టైలిష్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. అర్బన్ యూత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ కారు మొదట్లో మంచి రెస్పాన్స్‌ అందుకుంది. కానీ... ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలలో గణనీయంగా పడిపోయింది. జూన్ 2024లో 2,536 యూనిట్లు అమ్ముడవుతే, 2025 జూన్‌లో కేవలం 1,484 యూనిట్లే అమ్ముడయ్యాయి. అంటే ఏకంగా 41.48 శాతం అమ్మకాలలో తగ్గుదల నమోదైంది. అయితే ఈ సేల్స్ తగ్గుదల గత నెలకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ ఏడాది అంటే, 2025 మొదటి ఐదు నెలల్లో కూడా ఇగ్నిస్ అమ్మకాల్లో స్థిరత కనిపించలేదు. ఈ కాలంలో మొత్తం 11,865 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.