లీటర్ పెట్రోల్‌తో 90 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే బైక్! రూ.70 వేలకే వస్తుంది

భారతదేశంలో రోజూ స్కూటర్, బైక్ మీదే జీవితం సాగించే మిడిల్ క్లాస్ ప్రజలకు తక్కువ ధరలో లభిస్తూ, పెట్రోల్‌పై పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తూ మంచి మైలేజ్ అందించడంలో బజాజ్ ప్లాటినా (Bajaj Platina)కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది మాములు టూవీలర్ కాదు, అది నిత్య జీవన భాగస్వామి. ఏప్రిల్ 2006లో ప్లాటినా బైక్ తొలిసారిగా రోడ్డుపైకి వచ్చింది. అప్పటినుండి ఇప్పటివరకు రెండు దశాబ్దాలకు చేరుకుంటున్నా, దీని డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. రోజూ ప్రయాణించాల్సిన ఉద్యోగులు, కాలేజీ స్టూడెంట్లు, చిన్న వ్యాపారస్తులు.. ఇలా అనేక రకాల వర్గాలకు ఇది అందుబాటులో ఉండే ఆప్షన్‌గానే నిలుస్తోంది. ఎక్కువ ఖర్చు పెట్టకుండా బైక్ కొనాలనుకునే వ్యక్తికి ఇది ఒక పెద్ద ఊరట.

స్కార్పియో క్రేజ్.. యూత్‌లో సూపర్ హిట్, అమ్మకాల్లోనూ అదే జోరు!

భారతదేశంలో మహీంద్రా స్కార్పియో కారుకు పరిచయం అవసరం లేదు. ఇది ఒక స్టార్ హీరో రేంజ్‌లో జనంలోకి దూసుకెళ్లింది. అప్పట్లో ఫ్యాక్షన్ సినిమా అంటే స్కార్పియోలు గాల్లోకి ఎగరాల్సిందే. అవి ఎంత ఎగిరితే ఆ సినిమా అంత హిట్ అన్నంత పాపులారిటీ సంపాదించుకున్నాయి.

రూ.7 లక్షలలోపు బెస్ట్ SUVలు.. ఇవే మూడూ గిరాకీతో దూసుకుపోతున్నాయ్!

భారతదేశంలోని చాలా మంది మధ్యతరగతి కుటుంబాల కల.. ఓ నమ్మదగిన, బలమైన, ఇంకా స్టైలిష్ SUV కొనడం. ఎక్కువ డబ్బలు పెట్టి ఖరీదైన కారును కొనుగోలు చేయడానికి బదులుగా, తమకు అందుబాటులో లభించే suvలను ఎంపిక చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. దేశంలో చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ కేటగిరీకి చెందిన SUVలు బాగా డిమాండ్ పొందుతున్నాయి. కొత్తగా, అందుబాటు ధరలో లభించే కార్లను జనాలు ఆసక్తిగా కొంటారు. అలాంటి వారి కోసం మార్కెట్లో పలు మోడళ్లు కొనుగోలు చేయడానికి లభిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టార్, రెనాల్ట్ కిగర్.. లిస్టులో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ కార్ల గురించిన వివరాలను మీ కోసం ఈ కథనంలో అందిస్తున్నాం.

తొలిరోజు నుంచే హైప్.. ఇప్పుడైతే మూడు లక్షలు దాటి హిట్!

దేశీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra)కు చెందిన ప్రసిద్ద మోడల్ ఎక్స్‌యూవీ 700 (XUV700) కీలక మైలు రాయికి చేరుకుంది. అమ్మకాల పరంగా ఇది దూసుకుపోయి మహీంద్రాకు కీలకమైన మోడల్‌గా అవతరించింది. ఈ కారు లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలు నమోదు చేసి మహీంద్రా చరిత్రలో ఓ మైలురాయిని సాధించింది. 2021 ఆగస్టులో మార్కెట్‌లోకి ప్రవేశించిన XUV700 ప్రజల అభిమానాన్ని పొందుతూనే ఉంది. ఇటీవలి కాలంలో కంపెనీకి అత్యధిక విజయాలను తీసుకొచ్చిన SUV ఇదే. ఆకర్షణీయమైన రూపం, శక్తివంతమైన పనితీరు, లేటెస్ట్ ఫీచర్ల కలయిక వలన ఈ మోడల్‌కు ప్రజల్లో మంచి ఆదరణ లభించింది.
Advertisement

టాటా హారియర్ ఈవీ లాంచ్.. ధర, మైలేజ్, ఫీచర్లు పూర్తి వివరాలు!

9-0 EV యొక్క పూర్తి రివ్యూ, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మరియు ఛార్జింగ్ వివరాలు తెలుసుకోండి. తెలుగులో సమాచారం.

మారుతి డిజైర్‌కు మళ్ళీ జోరు... టాప్ 3 బెస్ట్ సెల్లర్ కార్లలో ఒకటి!

ఈ ఏడాది జనవరి నుండి జూన్ వరకు, భారత ఆటోమొబైల్ రంగంలో మరోసారి SUVలదే ప్రభుత్వం అని రుజువైంది. ఇటీవల విడుదలైన అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో SUVలు, హ్యాచ్‌బ్యాక్‌లు, MPVలు, సెడాన్‌లు కూడా చోటు దక్కించుకున్నాయి. అయితే, SUVల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. మొత్తం 6 SUVలు ఈ జాబితాలో స్థానం సంపాదించాయి. ఈ SUVలలో హ్యుందాయ్ క్రెటా తనదైన స్టైలిష్ డిజైన్, ఫీచర్లు, విశ్వసనీయతతో కొనుగోలుదారులను ఆకట్టుకుంది.

జూన్‌లో మహీంద్రా అమ్మకాల మెజారిటీ వీళ్లదే... SUVల శక్తి చూపారు!

ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలోని దేశీయ దిగ్గజ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలు, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో కార్లను విడుదల చేస్తుంది. అమ్మకాల పరంగా మహీంద్రా గత కొంత కాలంగా మెరుగైన గణంకాలను నమోదు చేస్తుంది. ఇటీవల జూన్ నెల ముగియానే తయారీదారులు తమ వాహనాల సేల్స్‌కు సంబంధించిన వివరాలను విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ కంపెనీ కూడా సేల్స్‌ను వెల్లడించగా, దానిలో ఆసక్తి కర విషయాలు తెలిశాయి. దేశీయ మార్కెట్లో ఈ సంస్థ జూన్ 2025లో 47,306 ప్యాసింజర్ వాహనాలను విక్రయించగలిగింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, ఇది గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 40,022 యూనిట్లతో పోలిస్తే దాదాపు 18.2 శాతం వృద్ధిని సూచిస్తుంది.

2027లో రానున్న కొత్త క్రెటా.. స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో సూపర్ మైలేజ్!

మీరు మైలేజ్ ఎక్కువ ఇచ్చే కారు కోసం చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. హ్యుందాయ్ కంపెనీ తమ పాపులర్ ఎస్‌యూవీ కారు క్రెటాలో కొత్త జనరేషన్ మోడల్‌ను 2027లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ కారు స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో రాబోతోంది. బైక్ లాంటి మైలేజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్త కారులో ఇంకా ఎలాంటి అప్‌డేట్స్ ఉండబోతున్నాయి. ఎందుకు ఇంత ముఖ్యమైనదో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Advertisement

విద్యుత్ వాహనాల ప్రభావంతో పెట్రోల్ కార్ల పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఇంధన ఆధారిత వాహనాలను తగ్గించుకుని ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ, పెట్రోల్, డీజిల్ కార్లు అంటే స్టేటస్, స్పీడ్, సౌండ్ అన్నీ కలగలసిన అనుభూతి. ఇంజిన్ స్టార్ట్ చేయగానే రయ్ మంటూ సౌండ్ చేసుకుంటూ దూసుకుపోయే కాలం, క్రమంగా కనమరుగు అయ్యే అవకాశం ఇప్పుడు ఏర్పడింది. ఎలాంటి సౌండ్ లేకుండా ఒక్క సారి ఛార్జ్ చేస్తే కొన్ని వందల కి.మీలు ఎక్కడా ఆగకుండా ప్రయాణించే వాహనాలు ప్రస్తుతం మార్కెట్లో విరివిగా లాంచ్ అవుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడేవారు. తమ ఆలోచన ధోరణిని మార్చుకుని ఈవీల వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రారంభంలో బ్యాటరీ సమస్యలు ఎక్కువగా వచ్చినప్పటికి ఇప్పుడు సాంకేతికత మరింత అభివృద్ది చెందడంతో అధునాతన, నాణ్యత కలిగిన బ్యాటరీలు వస్తున్నాయి.

సేఫ్టీకి ప్రసిద్ధి చెందిన వోల్వో XC60 ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది

వోల్వో కార్లు అంటేనే సేఫ్టీకి మారుపేరు. అవి సెడాన్ అయినా, ఎస్‌యూవీ అయినా, సేఫ్టీ విషయంలో వోల్వో ఏమాత్రం రాజీపడదు. బీఎండబ్ల్యూ ఎక్స్3, మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సి, ఆడి క్యూ5 వంటి మోడళ్లకు పోటీగా వోల్వో లైనప్‌లో ఉన్న మోడల్ XC60. ఇప్పుడు ఈ మోడల్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఆగస్ట్ 1న కంపెనీ అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కారు మొత్తం రూపురేఖలను మార్చకపోయినా, కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ రెండు కారు రేంజ్ చూస్తే.. ఇక పెట్రోల్ కార్లు మర్చిపోవచ్చు!

విన్‌ఫాస్ట్ (VinFast) అనే ప్రీమియం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఇప్పుడు భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. వాస్తవానికి, ఇది వియత్నాం కేంద్రంగా స్థాపితమైన కంపెనీ అయినా, గ్లోబల్‌గా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ, భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టడం ద్వారా మరో కీలక అడుగు వేసింది. ఈ సంస్థ ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రత్యేకతను కలిగి ఉండగా, మన్నికైన నిర్మాణ నాణ్యత, ఆధునిక డిజైన్, స్మార్ట్ టెక్నాలజీకి పేరుగాంచింది. విన్‌ఫాస్ట్ భారత్‌లో తన ఉత్పత్తిని వేగంగా ప్రారంభించేందుకు, తమిళనాడులోని తూత్తుకుడి (Thoothukudi)లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఫ్యాక్టరీ సంస్థకు దేశీయంగా గట్టి పునాదిని కల్పించడమే కాక, ప్రస్తుతానికి ఉద్యోగావకాశాలను కూడా సృష్టించబోతోంది. దీని ద్వారా కంపెనీ మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా తన ఉనికిని బలోపేతం చేస్తోంది.

ఫార్చ్యూనర్‌కు పోటీగా వచ్చి, రేసులో ఎందుకు వెనుకబడింది?

ఎంజి మోటార్స్ హెక్టర్ ఎస్‌యూవీ ద్వారా భారతీయులకు బాగా పరిచయమైన కంపెనీ. మొదట్లో తమ హెక్టర్ ఎస్‌యూవీతో మంచి అమ్మకాలు సాధించి, ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దేశంలో మొట్టమొదటి ఇంటర్నెట్ కనెక్టెడ్ ఎస్‌యూవీగా హెక్టర్ పేరు పొందింది. ఆ తర్వాత, డి-సెగ్మెంట్ ఎస్‌యూవీ శ్రేణిలో పట్టు సాధించడానికి ఎంజి, గ్లోస్టర్ అనే ఒక పెద్ద ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేసింది.
Advertisement

పెర్ఫార్మెన్స్, స్టైల్ రెండూ కావాలంటే SR 175 చూడాల్సిందే!

భారత మార్కెట్ ప్రస్తుతం ఆటో పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు వరుసగా కొత్త కొత్త వాహనాలను విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్న కంపెనీలు కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ట్రెండ్‌కు అనుగుణంగా వినియోగదారులను ఆకట్టుకోవడానికి అధునాతన ఫీచర్స్‌తో కూడిన టూవీలర్స్‌ను తెస్తున్నాయి. ఇలాంటి వాటిలో అప్రిలియా (Aprilia) కూడా ఒకటి. ఈ కంపెనీ చాలా కాలంగా మార్కెట్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో అప్రిలియా తన కొత్త స్కూటర్ SR 175 ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న SR 160కి ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకుంది. స్పోర్టీ లుక్స్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ కలిగిన ఈ స్కూటర్‌ రూపకల్పనలో ప్రసిద్ధ RS 457 బైక్‌కి చెందిన డిజైన్ హింట్స్ స్పష్టంగా కనిపిస్తాయి.

మారుతి బ్రెజా దే పైచేయి.. టాటా, హ్యుందాయ్, కియా ఎందుకు వెనుకబడ్డాయి?

ఒక ఎస్‌యూవీ కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీసెగ్మెంట్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇవి 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే చిన్న ఎస్‌యూవీలు. పరిమాణంలో చిన్నవి కావడం వల్లనే చాలా మంది ప్రజలు వీటిని ఇష్టపడి కొనుగోలు చేస్తారు. అయితే, ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం.. గత జూన్ 2025 నెలలో ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల అమ్మకాలు తగ్గాయి.

క్రెటా, డిజైర్, బ్రెజా, స్విఫ్ట్, ఎర్టిగా.. టాప్ 10లో మారుతి హవా!

భారత వాహన మార్కెట్‌లో ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్‎లో అద్భుతమైన సంఖ్యలో కార్లు అమ్ముడయ్యాయి. కస్టమర్లు కూడా పోటీ పడి మరీ కొనుగోలు చేశారు. ఇటీవల, జనవరి నుండి జూన్ మధ్య కాలంలో అత్యధిక సంఖ్యలో అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో మారుతి సుజుకి నుండి 6, టాటా నుండి 2, హ్యుందాయ్, మహీంద్రా నుండి ఒక్కొక్క కారు స్థానం సంపాదించుకున్నాయి.

ధర ఎక్కువ అయినా డిమాండ్ బాక్సాఫీస్ రేంజ్‌లోనే! టయోటా ఇన్నోవా హైక్రాస్ అదరగొట్టింది!

దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా కార్ల తయారీలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీగా పేరుగాంచిన టయోటా ఇటీవల తన అమ్మకాల వివరాలను క్రమంగా వెల్లడిస్తుంది. ఇప్పడు రెండు కుటుంబాలకు సరిపోయే అతిపెద్ద mpv అయినటువంటి ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) సేల్స్ గురించి పూర్తి డేటాను మన ముందుకు తెచ్చింది. ఇది ఒక పాపులర్ MPVగా వినియోగదారుల హృదయాల్లో స్థిరమైన స్థానం సంపాదించుకుంది. 2025 జూన్ నెలలో కూడా ఈ కారుకు వచ్చిన స్పందన చూస్తే, మార్కెట్‌లో ఎంతగానో రాణిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. నివేదికల ప్రకారం, జూన్ 2025లో ఇన్నోవా హైక్రాస్ మొత్తం 5,746 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే గత సంవత్సరం (జూన్ 2024)లో అమ్ముడుపోయిన 4,892 యూనిట్లతో పోల్చితే, ఈ సంవత్సరం 17.46 శాతం వృద్ధి నమోదవడం విశేషం.
Advertisement

రూ.10 లక్షల లోపు.. మరో షాకింగ్ ఎలక్ట్రిక్ కార్ ఫిబ్రవరిలో రాబోతుంది!

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (Vinfast) ప్రస్తుతం భారత మార్కెట్‌పై తన దృష్టిని పెడుతోంది. దేశంలో ఈవీలు మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో కంపెనీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడి మార్కెట్లో కూడా తన సత్తాచాటడానికి కీలకంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా తన ప్రసిద్ధ మోడళ్లను ఇండియాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో కూడా తన కార్లను ప్రదర్శించింది. విన్‌ఫాస్ట్ VF3, VF6, VF7 ఎలక్ట్రిక్ కార్లను భారతీయ ప్రజల కోసం ఇక్కడ పరిచయం చేసింది. వీటిలో ఇప్పటికే VF6, VF7 ఎలక్ట్రిక్ SUV మోడళ్ల కోసం కంపెనీ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ కార్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు రూ.21,000 అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది.

షోరూమ్‌కు వచ్చే ప్రతి 10 మందిలో 6 గురు ఈ కార్లనే కొంటున్నారు!

భారతీయ ఆటోమొబైల్ రంగంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యంత నమ్మకమైన కార్ల తయారీదారుగా నిలిచిన టాటా మోటార్స్ (Tata Motors), జూన్ 2025లో ఒక కీలక మలుపు తిరిగింది. ఇటీవల విడుదలైన సేల్స్ డేటా ప్రకారం, మొదటిసారిగా టాటా నెలవారీ అమ్మకాలు 40,000 యూనిట్లకు దిగువగా పడిపోవడం గమనార్హం. గత ఆరు నెలల కాలంలో ఇదే అత్యల్ప అమ్మకాలను నమోదు చేయడం కంపెనీకి ఒక హెచ్చరికగానే నిలిచింది. ఒకానొక సమయంలో టాటా మోటార్స్‌కి వెనుకబడిన మహీంద్రా, ఇప్పుడు తన విక్రయాలను బలపరచుకొని మారుతి తర్వాత రెండవ స్థానాన్ని ఆక్రమించడం కూడా ఆటోమొబైల్ రంగంలో కొత్త చర్చకు దారి తీస్తోంది. అయితే, ఈ పడిపోయిన గణాంకాల్లోనూ టాటా నెక్సాన్, పంచ్ అనే SUV మోడళ్లపై మాత్రం వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ వచ్చింది.

టెస్లా కారు కొంటున్నారా? కలర్‌ను బట్టి ధర మారుతుంది!

టెస్లా కంపెనీ భారతదేశంలో తమ మొదటి కారును విడుదల చేసింది. అయితే, ఈ కారులో కలర్ ఆప్షన్లను ఎంచుకునేటప్పుడు కారు ధర పెరుగుతుందని తెలిసింది. మీరు ఎంచుకునే రంగును బట్టి కారు ధర మారుతుంది. దీని గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

బిల్డింగ్ కంటే ఖరీదైన కారు.. అయినా 10 లక్షల మంది దీన్నే ఎందుకు కొనారు?

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు పోర్స్చే (porsche) తన కార్ల లైనప్‌లో మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లలో ఒకటైన పోర్స్చే మకాన్ (Porsche Macan) ఇప్పుడు బ్రాండ్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. అత్యున్నత విలాసం, శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ కారు, ధర పరంగా మామూలు వినియోగదారులకు అందుబాటులో లేకపోయినా, గ్లోబల్ మార్కెట్‌లో అమ్మకాల పరంగా విపరీతంగా ఆకట్టుకుంది. మకాన్‌ను పోర్స్చే 12 సంవత్సరాల క్రితం పరిచయం చేసింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ ఒక్క మోడల్‌నే 10 లక్షల యూనిట్లు (1 మిలియన్ కార్లు) ప్రపంచవ్యాప్తంగా విక్రయించగలిగింది. ఒక్క కారును ఏకంగా 10 లక్షల మంది కొన్నారంటే ఈ కారులో ఎదో తెలియని ప్రత్యేకత ఉండే ఉంటుంది.
Advertisement

548 కి.మీ. రేంజ్, అద్భుతమైన ఫీచర్లు.. జులై 21న ఎంజీ ఎమ్‌9 ఈవీ లాంచ్!

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో ఎంజీ మోటార్స్ అద్భుతాలు సృష్టిస్తూ దూసుకుపోతోంది. జెడ్‌ఎస్ ఈవీతో మొదలైనప్పటికీ, కామెట్, విండ్సర్ వచ్చిన తర్వాతే బ్రాండ్ పేరు బాగా తెలిసింది. అప్పటివరకు టాటా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే చూసిన మధ్యతరగతి వారికి ఎంజీ ఈవీలు నిజంగా ఒక మ్యాజిక్‎లా అనిపించాయి. మంచి సర్వీస్, ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ అన్నీ కలిపి అందించిన వాహనాలను భారతీయులు బాగా ఇష్టపడుతున్నారు.

బడ్జెట్ ధరలో స్వేపబుల్ బ్యాటరీతో హోండా షైన్ ఈవీ బైక్!

హోండా కంపెనీ ఇప్పటికే భారతదేశంలో క్యూసీ 1, యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి అమ్ముతోంది. ఇప్పుడు, కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్‌ను తయారు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి స్కూటర్ కాకుండా, ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

రూ.89 లక్షల లగ్జరీ మాస్టర్ పీస్! కొత్త రేంజ్ రోవర్ వెలార్ ఆటోబయోగ్రఫీ లాంచ్!

భారత మార్కెట్లో మరో విలాసవంతమైన కారు అడుగుపెట్టింది. లగ్జరీ కార్లకు పేరుగాంచిన రేంజ్ రోవర్ (Range Rover) తన అత్యంత స్టైలిష్, అధునాతన ఫీచర్లతో కూడిన వెలార్ ఆటోబయోగ్రఫీ (Velar Autobiography)ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ లగ్జరీ SUV ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది, డిజైన్ పరంగా ఆకట్టుకునేలా ఉండడమే కాకుండా, ఆధునిక టెక్నాలజీతో నిండిపోయి ఉంది. కారు ఎక్స్‌టీరియర్ నుంచి మొదలుకుని ఇంటీరియర్ వరకు అత్యాధునిక అంశాలు ఇవ్వబడ్డాయి. దీని ధర విషయానికి వస్తే, ఈ కొత్త ఆటోబయోగ్రఫీ వేరియంట్ రూ.89.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతోంది. ఇదే సమయంలో, వెలార్ డైనమిక్ SE వేరియంట్‌ను కూడా మార్కెట్‌లోకి విడుదల చేయగా, దాని ప్రారంభ ధర రూ.84.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది.

500 కి.మీ. రేంజ్, 10 ఏళ్ల వారంటీ.. మారుతి ఈ-విటారా ఫీచర్లు, ధర వివరాలు!

మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా ఎస్‌యూవీ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈ కారు లాంచ్ డేట్ ఖరారైంది. కంపెనీ తమ మొదటి ఎలక్ట్రిక్ కారును సెప్టెంబర్ 3న భారతదేశంలో విడుదల చేయనుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. భారతదేశంతో పాటు యూరోపియన్ మార్కెట్లలో కూడా దీన్ని లాంచ్ చేయనున్నారు. కంపెనీ మొదట యూకే, నెదర్లాండ్స్ వంటి కొన్ని దేశాలలో ఈ-విటారాను విక్రయించనుంది.
Advertisement

మధ్యతరగతి హ్యాచ్‌బ్యాక్‌కు డిమాండ్ తగ్గిందా? సెలెరియో అమ్మకాల అప్‌డేట్ ఇది!

దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతి సుజుకి (Maruti Suzuki)కి చెందిన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ మోడల్ సెలెరియో (Celerio) పేద, మధ్య తరగతి వినియోగదారులకు అందుబాటులో ధరలో లభిస్తూ కారు కలిగి ఉండాలనే ప్రతి ఒక్కరి కలను నెరవేరుస్తుంది. దేశంలోని చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో ఇది అందరికి ఫేవరెట్ మోడల్. నగర ప్రాంతాల ట్రాఫిక్‌కు అనుకూలంగా, ఆధునిక డిజైన్‌, ఉపయోగకరమైన సౌకర్యాలతో ఇది రూపొందించబడింది. కానీ, అమ్మకాల పరంగా చూస్తే, జూన్ 2025లో సెలెరియోకి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. మారుతి నుంచి విడుదలైన సేల్స్ డేటా ప్రకారం, ఈ నెలలో కేవలం 2,038 యూనిట్లే అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే సమయంలో అమ్ముడైన 2,985 యూనిట్లతో పోలిస్తే దాదాపు 31.73 శాతం తగ్గుదలగా నమోదైంది.