టీవీఎస్ ఐక్యూబ్ 2025 కొత్త వెర్షన్ వచ్చేసింది.. ప్రత్యేకమైన బ్యాటరీ ఆప్షన్, సూపర్ ఫీచర్లు

టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి విడుదలైన ప్రముఖ వాహనాల్లో ఐక్యూబ్ (iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి. ఇప్పటికే దీనిని వేలాది మంది వినియోగదారులు ఎటువంటి పెద్ద ఫిర్యాదులు లేకుండా దీన్ని రోజువారి అవసరాల కోసం ఉపయోగిస్తుండటం గమనార్హం. సాధారణ టూవీలర్ల మాదిరిగాకుండా, ఇది సౌకర్యం, సాంకేతికత, సామర్థ్యం, అన్నింటిని సమానంగా కలగలిపి మార్కెట్లో మంచి ఆదరణ సంపాదిస్తుంది. అయితే టీవీఎస్ దీన్ని మరింత మంది వినియోగదారులకు చేరువచేయడానికి తాజాగా 2025 ఎడిషన్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో పరిచయం చేసింది. పాత దానితో పోలిస్తే, ఈ కొత్త మోడల్‌లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ప్రధానంగా ఈ స్కూటర్‌లో 3.1 kWh బ్యాటరీ ప్యాక్‌‌ను అందించి విడుదల చేశారు. మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండే ధరలో రూ.1.05 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు దీన్ని తీసుకొచ్చింది.

ఏథర్ కొత్త ప్లాన్: స్కూటర్ ధర సగానికి సగం తగ్గబోతుంది!

ఏథర్ కంపెనీ భారతదేశంలో బ్యాటరీని సర్వీస్ పద్ధతిలో అందించే కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. దీనివల్ల వాహనం ధర 40 శాతం కంటే ఎక్కువ తగ్గుతుందని తెలుస్తోంది. ఇది ఎలా సాధ్యం? బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏమిటి? దీని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జూన్‌లో టాటా మోటార్స్‌కు షాక్.. ప్యాసింజర్ సెగ్మెంట్‌లో భారీ తగ్గుదల

ప్రయాణికుల సేఫ్టీ కోసం అత్యున్నత సేఫ్టీ నాణ్యత ప్రమాణాలతో కార్లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా జూన్ నెలకు సంబంధించిన అమ్మకాల వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, ఈ నెలలో కంపెనీ 37,237 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గడిచిన ఏడాది ఇదే కాలంలో ఉన్న 43,624 యూనిట్లతో పోలిస్తే సుమారుగా 15 శాతం తగ్గుదలను సూచిస్తోంది. మార్కెట్‌లో సాధారణంగా ఉన్న వాణిజ్య ప్రతికూల పరిస్థితులు, మార్పులు కారణంగా కొనుగోలు ధోరణులు ఈ తగ్గుదలకు కారణమయ్యాయని మార్కెట్ వర్గాల వారు భావిస్తున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్ వాహనాల అమ్మకాల్లో వెనకడుగు కనిపించగా, ఎలక్ట్రిక్ విభాగం మాత్రం నిరంతర వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ మొత్తంలో 5,228 యూనిట్ల ఈవీలు అమ్ముడుపోయాయి.

ఈ స్కూటర్ కొంటే 10 ఏళ్లు టెన్షన్ ఉండదు.. యమహా రే జెడ్ఆర్ హైబ్రిడ్ ఆఫర్

జపనీస్ వాహన తయారీ సంస్థ యమహా స్కూటర్లకు భారతదేశంలో చాలా మంచి పేరుంది. మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించే హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన స్కూటర్లను యమహా విడుదల చేస్తోంది. ఇప్పుడు కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. యమహా మోటార్ ఇండియా రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ స్కూటర్ శ్రేణిపై లిమిటెడ్ టైం ఆఫర్లను ప్రకటించింది.
Advertisement

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో టయోటా సత్తా.. జూన్ అమ్మకాలలో వృద్ధి

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) క్రమంగా వినియోగదారుల నమ్మకాన్ని పెంచుకుంటూ, భారతీయ ఆటోమొబైల్ రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. మారుతున్న ప్రజల ఇష్టాలకు అనుగుణంగా తన మోడళ్లలో కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ, అదే సమయంలో కొత్త కార్లను విడుదల చేస్తుంది. అమ్మకాల పరంగా క్రమంగా పుంజుకుంటుంది. తాజాగా జూన్ 2025 నెలకు సంబంధించిన సేల్స్ వివరాలను కంపెనీ వెల్లడించింది. దీని ప్రకారం, టయోటా గత నెలలో మొత్తం 28,869 యూనిట్ల అమ్మకాలను ను నమోదు చేసింది. ఇది 2024 జూన్‌లో నమోదైన 27,474 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే సుమారుగా 5 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ వృద్ధి కంపెనీ ఉత్పత్తులపై కొనసాగుతున్న డిమాండ్‌కు, స్థిరమైన బ్రాండ్ ఇమేజ్‌కి నిదర్శనం.

పెట్రోల్/డీజిల్ కారును ఈవీగా మార్చాలా? లేదా కొత్త ఈవీ కొనాలా?.. ఏది లాభం?

భారత మార్కెట్‌లో ప్రస్తుతం పెట్రోల్-డీజిల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ కూడా రోజురోజుకూ చాలా వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు చాలా మంది ప్రజలు పెట్రోల్-డీజిల్ కార్ల కాలం పోయిందని, ఎలక్ట్రిక్ కార్లే భవిష్యత్తు అని ఆలోచిస్తున్నారు.

3.60 లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించిన బజాజ్ ఆటో.. జూన్‌లో 1% వృద్ధి

దేశీయ దిగ్గజ వాహన తయారీదారు అయినటువంటి బజాజ్ (Bajaj) టూవీలర్స్, వాణిజ్య వాహన విభాగాల్లో నిలకడగా తన స్థానాన్ని నిలుపుకుంటుంది. మార్కెట్లో ఇతర కంపెనీల నుంచి బలమైన పోటీ వస్తున్నప్పటికి వాటిని ఎదుర్కొని బలమైన అమ్మకాలను సాధిస్తుంది. తాజాగా జూన్ నెల ముగిసిన నేపథ్యంలో బజాజ్ ఆటో తన నెలవారీ సేల్స్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, జూన్, 2025లో మొత్తం 3,60,806 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది 2024 జూన్‌లో నమోదైన 3,58,477 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే సుమారుగా 1 శాతం వృద్ధి మాత్రమే. ఇటివలి కాలంలో కంపెనీ కొత్త మోడళ్ల విడుదలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో తరువాతి నెలలో ఈ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

కారు వైబ్రేట్ అవుతుందా? మైలేజ్ తగ్గిందా?..వీల్ బ్యాలెన్సింగ్ చెక్ చేసుకోండి

మీరు కారు సర్వీసింగ్ చేయిస్తే సరిపోదు, వీల్ బ్యాలెన్సింగ్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన సమయంలో బ్యాలెన్సింగ్ చేయించకపోతే, మీ కారులో మూడు పెద్ద సమస్యలు రావచ్చు. ఈ రోజు మనం ఈ మూడు సమస్యల గురించి వివరంగా తెలుసుకుందాం. అలాగే మీ కారుకు ఎన్ని కిలోమీటర్ల తర్వాత వీల్ బ్యాలెన్సింగ్ చేయించాలి అనే దాని గురించి కూడా చూద్దాం.
Advertisement

ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో కొత్త రికార్డు.. రివర్ ఇండి 10,000 యూనిట్లు పూర్తి

భారతదేశంలోని వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంపెనీల్లో బెంగళూరుకు చెందిన రివర్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి. ఇది బెంగళూరు సమీపంలోని హోస్కోట్ ప్రాంతంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని సంవత్సరానికి లక్ష స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో నెలకొల్పింది. ఈ యూనిట్ నుంచి 2023 ఆగస్టు 25న తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రోడ్డెక్కించింది. ఇండి పేరుతో పరిచయం చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభం నుంచే వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. మొదటి స్కూటర్ నుండి ఈ రోజు వరకు, కేవలం 22 నెలల్లోనే రివర్ ఒక ప్రత్యేకమైన ఘనతను సాధించింది. తాజాగా, 10,000వ స్కూటర్ తయారీ కేంద్రం నుంచి పూర్తిగా రూపొందింపబడి, దేశంలోని వినియోగదారుల కోసం షోరూమ్‌కి బయలుదేరింది.

భారత మార్కెట్‌లో సంచలనం..టయోటా అక్వా హైబ్రిడ్ రాబోతుందా?

టయోటా కంపెనీ తమ అక్వా హైబ్రిడ్ కార్లను భారతదేశంలో టెస్ట్ చేస్తోంది. ఈ కారు 35.8 కి.మీ. మైలేజీని ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కారు భారత మార్కెట్‌లో ఒక పెద్ద విప్లవాన్నే సృష్టిస్తుందని భావిస్తున్నారు. అసలు ఈ కారు భారతదేశంలో విడుదల కాబోతుందా, లేక వేరే కారణాల వల్ల టెస్ట్ చేస్తున్నారా? పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

మేలో దుమ్మురేపిన హీరో విడా V2.. రికార్డు స్థాయిలో అమ్మకాలు!

హీరో మోటోకార్ప్ (Hero Motocorp), దేశంలోనే అత్యంత నమ్మకమైన టూవీలర్ తయారీ సంస్థగా తన స్థానాన్ని బలపరుచుకుంటుంది. ఐసీఈ ఇంజిన్ ఆధారిత మోడళ్ల విభాగంలో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న హీరో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టి వాటిని ప్రజల్లోకి తీసుకుపోవడానికి కృషి చేస్తుంది. హీరో నుంచి వచ్చిన విడా బ్రాండ్ కింద అందిస్తున్న వాటికి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో విస్తరిస్తూ విడా V2 ఇ-స్కూటర్‌కు వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ పొందుతుంది. ఈ స్కూటర్ అందించే సాంకేతికత, స్టైలిష్ డిజైన్, తక్కువ నిర్వహణ ఖర్చులు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలతోపాటు, ప్రజల్లో సుస్థిరమైన వాహనాలపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది.

మారుతి సీఎన్‌జీ అమ్మకాలలో రికార్డు.. ఎందుకు అంత డిమాండ్?

మారుతి కంపెనీ గత 2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత ఎక్కువ సంఖ్యలో సీఎన్‌జీ వాహనాలను తయారు చేసింది. ఈ కంపెనీ తయారు చేసిన మొత్తం వాహనాల్లో 33.6 శాతం సీఎన్‌జీ వాహనాలే ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు వివరంగా తెలుసుకుందాం.
Advertisement

వర్షాకాలంలో బైక్ సూపర్ ఫిట్‌గా ఉంచే 6 సీక్రెట్ టిప్స్!

దేశంలో వర్షాకాలం వచ్చేసింది. రుతుపవనాల ప్రభావంతో క్రమంగా వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది. ఈ కాలంలో వాహనాలపై ప్రయాణం చేయడం, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతో సవాలుతో కూడుకున్న అంశం. ముఖ్యంగా బైకులు కలిగిన ఉన్న వారికి చాలా సవాళ్లు ఉంటాయి. తడిచే భాగాలు, బ్రేక్స్ ఇవన్నీ జాగ్రత్తగా గమనించకపోతే పెద్ద సమస్యలు అవుతాయి. అందుకే వర్షాకాలంలో బైక్‌ని కాపాడుకోవడం, మెయింటెన్ చేయడం చాలా ముఖ్యం. ఉద్యోగాలు చేసేవారు, కాలేజ్‌లకు వెళ్లేవారు, ఇంటి అవసరాల కోసం ఇప్పుడు బైకులు లేనిదే ఏ పని పూర్తి చేయలేము. ఇవి మన నిత్య జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగం అయ్యాయి. ఈ నేపథ్యంలో బైకులు కలిగి ఉన్న యజమానులు తప్పనిసరిగా ఈ వర్షాకాలంలో కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాటిని మరింత ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు. అవెంటో ఈ కింది కథనంలో తెలుసుకుందాం.

నిస్సాన్ ప్యాట్రోల్ నిస్మో.. పవర్, స్టైల్, క్లాస్ కలిసిన అద్భుతం!

నిస్సాన్ తమ లెజెండరీ ఎస్‌యూవీ ప్యాట్రోల్‎లో ఇప్పటివరకు వచ్చిన వాటిలోకెల్లా అత్యంత పవర్ ఫుల్ వెర్షన్ పరిచయం చేసింది. దీని పేరు 2026 నిస్సాన్ ప్యాట్రోల్ నిస్మో. ఈ ఎస్‌యూవీని ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ మార్కెట్ కోసం తయారు చేశారు. దీన్ని చూస్తే ఒకే మాట చెప్పొచ్చు.. ఇది కేవలం ఒక ఫ్యామిలీ ఎస్‌యూవీ కాదు, రేసింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా ఇస్తుంది.

చిన్నది కానీ శక్తివంతం.. జిమ్నీకి పోలీస్ వాహన హోదా!

భారత్‌లో తయారైన కార్లకు ఇటివలీ కాలంలో విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇంతకుముందు పలు మోడళ్లు జపాన్ వంటి దేశాల్లో బాగా అమ్ముడుపోయాయి. ఇప్పుడు తాజాగా జిమ్నీ (jimny) కారు కూడా ఈ జాబితాలో చేరింది. మహీంద్రా థార్‌కు పోటీగా ఇది ఇండియాలో అంతగా ఆదరణ సంపాదించలేదు. రఫ్ అండ్ టఫ్ బాడీ, బలమైన లెగసీ, ఆఫ్-రోడ్ సామర్థ్యం కలిగిన జిమ్నీ భారత్‌లో ఎక్కువ ధర కారణంగా సేల్స్ తగ్గాయి. అందులోనూ, మహీంద్రా థార్ ROXX వంటి బలమైన ప్రత్యర్థులు వచ్చే సరికి, జిమ్నీకి ఆ విభాగంలో నిలబడటం మరింత కష్టమయ్యింది. తక్కువ సమయంలోనే దీని అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, భారతీయుల కలలకు జిమ్నీ ఇచ్చిన జవాబు కొంచెం నిరాశ కలిగించేదే.

ఈవీ బైక్ ఉన్నవారు జాగ్రత్త.. వర్షాకాలంలో వీటిని అస్సలు వదలకండి

వానాకాలంలో మన వెహికల్స్ మీద మరింత శ్రద్ధ చూపిస్తుంటాం. ఈ మధ్యకాలంలో మన దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ల సంఖ్య బాగా పెరిగింది. పెట్రోల్ టూవీలర్ల లాగే, వానాకాలంలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు కూడా ప్రత్యేక శ్రద్ధ, సంరక్షణ అవసరం.
Advertisement

టయోటా ఇన్నోవా హైక్రాస్‌కి BNcapలో 5-స్టార్ భద్రత రేటింగ్

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM)కు చెందిన ప్రసిద్ధ మోడల్ ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో లభిస్తూ ఎంతటి దూరం అయినా, లక్షల కిలోమీటర్లు అయినా ఎటువంటి సమస్య లేకుండా ప్రయాణించే సామర్థ్యంతో మార్కెట్లో ఇతర మోడళ్లకు బలమైన పోటీ ఇస్తుంది. మంచి కంఫర్ట్, మైలేజ్ వంటి అంశాలతో నిలుస్తున్న ఈ మోడల్ తాజాగా ఇప్పుడు మరో ఘనతను సాధించింది. ఇటీవల ఈ కారును భారత NCAP క్రాష్ టెస్ట్‌‌కు గురిచేయగా, దీనిలో అద్భుతమైన ఫలితాలను సాధించింది. టయోటా తన మూడవ తరం ఇన్నోవా హైక్రాస్‌ను ఈ క్రాష్ టెస్ట్‌లో పలు విధాలుగా పరీక్షలు నిర్వహించింది. ఇది అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలను కూడా ఎలాంటి వెనుకడుగు లేకుండా తట్టుకుని నిలిచింది.

ఎలక్ట్రిక్ కారు కొన్నారా? రూ.1,50,000 పన్ను తగ్గించుకోండి!

ప్రస్తుతం ప్రభుత్వం భారతదేశంలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయమని ప్రజలకు సూచించింది. చాలామంది తమ ఆదాయపు పన్నును దాఖలు చేసే ప్రక్రియలో ఉన్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన చాలామందికి, ఆ వాహనానికి తీసుకున్న లోన్ వడ్డీ మొత్తాన్ని తమ ఆదాయం నుంచి మినహాయించుకునే అవకాశం ఉంది. ఇది చాలామందికి తెలియని సదుపాయం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ కఠినంగా.. పాత కార్ల సీజ్ ప్రక్రియ మొదలు!

దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. వాతావరణ నాణ్యత మరింత దిగజారకూడదని నిర్ణయించిన అధికారులు, రేపటి నుంచే (జులై 1) పాత వాహనాలపై నియంత్రణలు అమలు చేయనున్నారు. జులై 1 నుండి 10 ఏళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు, అలాగే 15 ఏళ్ల కంటే పాత పెట్రోల్ కార్లను అధికారులు సీజ్ చేయడం ప్రారంభిస్తారు. ఇప్పటికే పెద్దఎత్తున వాయు కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలను రోడ్లమీద నడవనీయడం సరి కాదన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే CNG వాహనాల విషయంలో కొంత సడలింపు ఇచ్చారు. 15 ఏళ్ల వయస్సు గల CNG కార్లను కూడా నిషేధించాలనే యోచన ఉన్నప్పటికి, ప్రస్తుతానికి వాటి యజమానులకు ఉపశమనం లభించింది.

అడ్వెంచర్ బైక్ ప్రియులకు అలర్ట్.. KTM 390 అడ్వెంచర్ X బంద్

ఇండియాలో ఒకప్పుడు ఉన్న పేరు ప్రఖ్యాతులు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ఆస్ట్రియన్ టూ వీలర్ తయారీ సంస్థ కేటీఎం. తమ డ్యూక్ సిరీస్ ద్వారా నిర్మించుకున్న సామ్రాజ్యం నెమ్మదిగా కేటీఎం చేజారిపోతోంది. లేటెస్ట్ బైక్‌లు పెరిగిపోవడంతో బ్రాండ్ అమ్మకాలు కొద్దిగా తగ్గాయి. కానీ ఇప్పుడు, కొత్త తరం మోడల్స్‌తో కేటీఎం పూర్వ వైభవానికి వస్తోంది. ఇటీవల విడుదలైన అడ్వెంచర్ మోడల్స్ హిట్ అవ్వడంతో, షోరూమ్‌లకు జనం మళ్లీ రావడం మొదలుపెట్టారు.
Advertisement

2025లో మహీంద్రా డీజిల్ కార్ల దూకుడు.. పెట్రోల్ కార్లకు చేదు అనుభవం!

భారతదేశంలో రెండవ అతిపెద్ద దేశీయ కార్ల తయారీ సంస్థగా మహీంద్రా కొత్త చరిత్ర సృష్టించింది. దేశీయంగా అత్యాధునిక ఫీచర్స్ కలిగిన కార్లను విడుదల చేస్తూ అమ్మకాల పరంగా సరికొత్త గణంకాలను నమోదు చేస్తుంది. కొంతకాలం క్రితం వరకు మహీంద్రా నాల్గవ స్థానంలోనే స్థిరమై ఉండేది. కానీ గత కొన్ని నెలలుగా, ఈ సంస్థ వేగంగా ఎదుగుతూ హ్యుందాయ్, టాటా మోటార్స్‌లను అధిగమించింది. ఈ స్థాయికి రావడానికి కంపెనీ ఇటీవల కాలంలో కొత్తగా తీసుకొచ్చిన మోడళ్లు ప్రధాన కారణం. ముఖ్యంగా థార్, స్కార్పియో-N, XUV700 వంటి మోడళ్లకు వినియోగదారుల్లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇవన్నీ మహీంద్రా వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది.

లిస్టు పెద్దదే.. జూలైలో రాబోయే కొత్త కార్లు ఇవే!

మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, జూన్ నెల ముగియబోతోంది, జూలైలో మార్కెట్‌లోకి చాలా కొత్త కార్లు రాబోతున్నాయి. వీటిలో కొన్ని ఎలక్ట్రిక్ కార్లు కాగా మరికొన్ని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు, ఇంకొన్ని లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. జూలైలో విడుదల కాబోయే ఆ ఆసక్తికరమైన కార్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలో టెస్లా కొత్త అధ్యాయం.. ఇంటికొచ్చిన ఆటోనమస్ కారు!

ప్రపంచంలోని ఆటోమొబైల్ రంగంలో ఒక ఆశ్చర్యకర సంఘటన ఇటీవల చోటు చేసుకుంది. సాధారణంగా కస్టమర్లు కారును కొనుగోలు చేసిన తరువాత దాన్ని డెలివరీ తీసుకోవడానికి షోరూమ్‌కు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంతో అట్టహసంగా షోరూమ్‌లో నిర్వహిస్తారు. కానీ కానీ అమెరికాలో టెస్లా ఆ విధానాలన్నింటినీ పూర్తిగా మార్చేసింది. ఇటీవల అక్కడ ఒక వినియోగదారు డీలర్‌షిప్‌కి వెళ్లకుండా, ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో కారును బుక్ చేసుకున్నాడు. ఆ కారు అతని దగ్గరికి స్వయంగా వచ్చి చేరింది. ఇది ఎటువంటి డ్రైవర్ సాయంలేకుండా, ఆటోమెటిక్‌గా గేట్‌దాటింది, రోడ్ల మీదుగా అతని ఇంటివరకు ప్రయాణించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.

అదరగొట్టిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్.. రూ. 60 వేలకే 70 కి.మీ. మైలేజ్!

భారత మార్కెట్‌లో అత్యంత తక్కువ ధరలో లభించే బైక్‌లకు కస్టమర్ల నుంచి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అలాంటి బైక్‌లలో ఒకటి హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్. కస్టమర్లు పెట్టే డబ్బుకు తగ్గ విలువైన ఉత్పత్తి కాబట్టి, ఈ బైక్ ప్రతీ నెలా అద్భుతమైన అమ్మకాల సంఖ్యను నమోదు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత మే నెలలో కూడా హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసి సత్తా చాటింది.
Advertisement

మే 2025లో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్లకు షాక్.. పడిపోయిన సేల్స్

ఇండియాలో ప్రసిద్ధ టూవీలర్ తయారీదారు అయినటువంటి హోండా స్కూటర్ & మోటార్ సైకిల్ యాక్టివా వంటి స్కూటర్‌తో దేశవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు సంపాదించుకుంది. ఇది దేశంలోనే నెం.1 స్కూటర్. దీంతో దీనికి కొనసాగింపుగా ఈవీ మార్కెట్‌ను సైతం కైవసం చేసుకోవడానికి ఈ ఏడాది జనవరిలో రెండు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను QC1, యాక్టివా E ప్రవేశపెట్టింది. విభిన్నంగా ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక సాంకేతికతతో పాటు సౌకర్యవంతమైన ధరలతో ఇవి మార్కెట్‌లోకి అడుగుపెట్టాయి. మొదటిగా, వినియోగదారుల నుండి కొంత ఆసక్తికరమైన స్పందన లభించినప్పటికీ, వీటికి సంబంధించిన అమ్మకాలు నెలలకొద్దీ క్రమంగా తగ్గుముఖం పట్టాయి.