డీజిల్ కార్లలో యూరియా ఎందుకు పోస్తారు? దీని కథే వేరు!

ఈ మధ్యకాలంలో కొత్త డీజిల్ కార్లలో యూరియా పోస్తున్నారని తరచుగా వింటూ ఉంటాం. చాలామందికి అది వ్యవసాయంలో వాడే యూరియానే అనుకుంటారు. కానీ, నిజానికి ఆటోమొబైల్స్‌లో వాడే యూరియా కాస్త వేరుగా ప్రత్యేకంగా ఉంటుంది. అసలు డీజిల్ కార్లలో యూరియా ఎందుకు పోస్తారు, దాని పని ఏంటి అనేది ఈ వార్తలో తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ తర్వాత హైబ్రిడ్.. టాటా మోటార్స్ సంచలన ప్రణాళిక

ప్రపంచంలోనే ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమ కార్లను తయారు చేయడంలో టాటా మోటార్స్ (Tata Motors) ఎప్పుడు ముందు ఉంటుంది. రతన్ టాటా ఆశయాలకు ప్రతినిధిగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తన ఉత్పత్తులను అందిస్తుంది. ఆయన దూరమైన తర్వాత కూడా టాటా మోటార్స్ అదే విలువలతో ముందుకు వెళ్తోంది. సాధారణ మనిషి అవసరాలను గుర్తించి, సాధ్యమైనంతవరకు అందుబాటులో వాహనాలను తీసుకురావడం ఈ సంస్థకు ఎప్పటి నుంచో మంచి గుర్తింపు ఉంది. ఇదిలా ఉంటే టాటా ఎలక్ట్రిక్ వాహనాల సక్సెస్ తరువాత, దేశీయ మార్కెట్‌లో హైబ్రిడ్ ఇంజిన్లకు కూడా ఉన్న గణనీయమైన గిరాకీపై దృష్టి పెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల కన్నా కొంతమంది వినియోగదారులు హైబ్రిడ్ వాహనాలను ఎక్కువగా ఇష్టపడతారని ఈ సెగ్మెంట్‌లోనూ సత్తా చాటాలని చూస్తుంది.

RX100 రాకపై ఫుల్ స్టాప్! యమహా 300cc పైగా బైక్స్‌నే తీసుకొస్తుంది

యమహా (Yamaha) టూవీలర్ ఉత్పత్తిలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సంస్థ. ఈ కంపెనీకి చెందిన ప్రసిద్ధ మోడల్ ఆర్‌ఎక్స్ 100 (RX 100) గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సంవత్సరాలు లక్షలాది మంది బైక్ ప్రియుల గుండెల్లో స్థానం ఏర్పరచుకున్న మోడల్. యమహా RX 100 అంటే ఒకప్పటి యువతకు బాగా గుర్తుకొచ్చే పేరు. 1985లో భారత్‌లో ప్రవేశించిన RX 100, అప్పట్లో మోటార్‌సైకిల్ మార్కెట్‌కి కొత్త ఊపు తీసుకొచ్చింది. తక్కువ బరువు, శక్తివంతమైన 98సీసీ 2-స్ట్రోక్ ఇంజన్, సులువైన హ్యాండ్లింగ్‌తో దేశంలో ఒక సెన్షెసన్ సృష్టించిన మోడల్. ఆ రోజుల్లో ఈ బైక్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలామంది యువకులు తమ కలల బైక్‌గా దీన్ని కొనుగోలు చేసేవారు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125కి పోటీగా వచ్చిన 3 స్కూటర్లు ఇవే

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 అనేది యూత్ ఫేవరేట్ స్కూటర్. దీని ధర రూ.93,927 నుండి రూ.1.10 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 124.8 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 47 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.
Advertisement

షోరూమ్ అక్కర్లేదు, మనిషి అక్కర్లేదు.. టెస్లా కార్లు ఆటోమేటిక్‌గా ఇంటికి వచ్చేస్తున్నాయి!

ప్రపంచవ్యాప్తంగా వాహనాల తయారీ కంపెనీలు షౌరూమ్‌లు పెట్టి, కస్టమర్లను అక్కడికి రప్పించి కార్లు కొనేలా ప్రయత్నిస్తాయి. కానీ అమెరికాలో టెస్లా కంపెనీ ఒక అడుగు ముందుకేసి, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి, మనిషి లేకుండానే ఆటోమేటిక్‌గా కారును డెలివరీ చేసింది. ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వింత సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

డీలర్‌షిప్‌లకు చేరుకున్న హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్

ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయినటువంటి హోండా (Honda) తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ అయిన హోండా సిటీకి ఇటీవల స్పోర్ట్ ఎడిషన్ రూపంలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఎంతో ఆడంబరంగా వచ్చిన ఈ కారు సుమారు 14.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్ (Honda city Sport Edition) ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకుందని తెలుస్తుంది. స్పోర్టీ టచ్‌, ఆకర్షణీయమైన కలర్స్‌తో కారును ప్రీమియమ్ అనుభూతిని అందించేలా రూపొందించారు. హోండా భారత్‌ ఆటోమొబైల్ రంగంలో తన స్థానం నిలుపుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తుంది. కొత్త తరం అమేజ్‌తో తన అమ్మకాలను పెంచుకోవాలని చూస్తుంది. ఇప్పుడు దీనికి అదనపు బలంగా ఈ సిటీ స్పోర్ట్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది.

రూ.28.50 లక్షలకే షియోమీ ఎలక్ట్రిక్ కారు..కార్ల మార్కెట్లోకి ఎంట్రీ

సాధారణంగా ఎంఐ అని పిలిచే షియోమీ కంపెనీ మనలో చాలామందికి మొబైల్ ఫోన్ల కంపెనీగానే తెలుసు. కానీ, ఈ కంపెనీ చిన్నపాటి చేతి గడియారం నుండి పెద్దపెద్ద ఆటోమొబైల్ వాహనాల వరకు తయారు చేసి అమ్ముతోంది.

మంగళూరులో సంచలనం.. కోట్ల రూపాయల కారుకు నకిలీ రిజిస్ట్రేషన్

భారతదేశంలో మోటారు వాహన చట్టం ప్రకారం, కారు కొనుగోలుదారులు వాహనంపై పన్నులు చెల్లించడం తప్పనిసరి. ముఖ్యంగా ఖరీదైన కార్లకు మరింత అధిక పన్ను విధించడం సాధారణం. ఈ పరిస్థితుల్లో కొందరు వినియోగదారులు చట్టం నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ మోసపూరిత ఉదంతం వెలుగులోకి వచ్చింది. డైజివరల్డ్‌లో వచ్చిన కథనం ప్రకారం, నిహాల్ అహ్మద్ అనే వ్యక్తి, కర్ణాటకలోని మంగళూరుకు చెందినవాడు. 2017లో అతను మెర్సిడెస్ AMG G63 అనే విలాసవంతమైన కారును కొనుగోలు చేశాడు. ఈ కారును దాదాపు రూ. 2.5 కోట్లకు అమ్ముతున్నారు. సాధారణంగా ఇంత ఖరీదైన కారు రిజిస్ట్రేషన్ కోసం లక్షల్లో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, నిహాల్ అహ్మద్ తన AMG G63కి కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్‌నే తీసుకున్నాడు.
Advertisement

ముఖ్యమంత్రి కాన్వాయ్‌కే నీళ్ల డీజిల్.. పెట్రోల్ బంకులో భారీ మోసం

భారతదేశంలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌లో నీళ్లు కలిపి మోసపూరితంగా అమ్ముతున్నారని వాహనదారుల నుంచి ఎప్పటినుంచో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, కొన్ని పెట్రోల్ బంకుల మోసాలను ఆపలేకపోతున్నామని చెప్పాలి.

రూ.28.99 లక్షలకే 627 కి.మీ రేంజ్, 5-స్టార్ సేఫ్టీ.. టాటా హారియర్ ఈవీ AWD అదుర్స్

ఎలక్ట్రిక్ వెహికల్ ప్రపంచంలో రారాజులా వెలుగొందుతున్న టాటా ఫ్యామిలీలో పెద్దన్న స్థానాన్ని పొందిన టాటా హారియర్ ఈవీ అందరి మనసుల్లో స్థానం సంపాదించుకుంది. ఈ మధ్య కాలంలో కొండలు ఎక్కుతున్న దాని వీడియో బయటకు రావడంతో ఆఫ్-రోడ్ అభిమానుల గుండెల్లో కూడా ఈ కారు కరెంటు షాక్ ఇచ్చినంత పని చేసింది.

తగ్గిన TVS XL 100 సేల్స్ – కొత్త పోటీ, ఫీచర్ల లోపమే కారణమా?

దశాబ్దాలుగా భారతీయ టూవీలర్ మార్కెట్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వాటిలో TVS XL 100 ఎప్పుడు ముందు ఉంటుంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ పోలాల పనులకు, చిన్న వ్యాపారాలకు ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సింపుల్ డిజైన్‌, పటిష్టమైన నిర్మాణం, తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా కోట్లాది భారతీయుల జీవనశైలిలో భాగమైపోయిన నమ్మకమైన మోడల్ ఇది. ఇది చూడటానికి సాధారణ మోడల్ లాగా కనిపించినా, దాని సామర్థ్యం అసాధారణం. సౌకర్యవంతమైన సీటు, పెద్ద బిగ్‌రాక్ క్యారియర్, తక్కువ ఇంధన వినియోగం, నమ్మకమైన పెట్రోల్ ఇంజిన్.. ఇవన్నీ దీనికి వేర్వేరు స్థానం కల్పించాయి. ఏ పరిస్థితుల్లోనైనా పనిచేయగల సామర్థ్యం XL 100 కు మరో ప్రధాన బలంగా నిలుస్తుంది. తక్కువ బరువు ఉన్నప్పటికీ, ఇది మిల్క్ క్యాన్లు, కిరాణా బస్తాలు, లేదా ఇతర సరుకులు ఈజీగా మోసేలా నిర్మించబడింది.

కొత్త డ్యూయల్ ఛానల్ ABSతో 2025 అపాచీ RTR 160 విడుదల

భారతదేశంలోని ప్రముఖ టూవీలర్ వాహన బ్రాండ్ అయిన టీవీఎస్ మోటార్ (Tvs Motor) నుంచి వచ్చిన ప్రసిద్ధ బైక్ అపాచీ అంటే ఎంతో ఫేమస్. స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన సౌండ్‌తో ఈ సిరీస్ బైక్‌ప్రియుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. టీవీఎస్ మోటార్ తరచూ అపాచీ సిరీస్‌కి కొత్తదనాన్ని తీసుకొస్తూ, అత్యాధునిక సాంకేతికతను పరిచయం చేస్తోంది. తాజాగా, ఈ కంపెనీ 2025 అపాచీ ఆర్‌టిఆర్ 160 (Apache Rtr 160) మోడల్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధర వచ్చేసి రూ. 1,34,320 (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్, పాత మోడల్‌ లోని టాప్-ఎండ్ రేసింగ్ ఎడిషన్ కంటే సుమారు నాలుగు వేల రూపాయలు ఎక్కువ ధర కలిగి ఉంది. అయితే, ఈ పెరిగిన ప్రతి రూపాయికి సమర్థమైన పనితీరును అందిస్తుందని చెప్పవచ్చు.
Advertisement

ప్రపంచంలోనే సన్నటి కారు.. సోషల్ మీడియాలో వైరల్!

కార్లను వివిధ కారులుగా మోడీఫై చేసిన వీడియోలు, ఫోటోలు చూసే ఉంటారు. చాలామంది వాహనాల సైజు పెంచాలని చూస్తుంటే, ఇటలీకి చెందిన ఓ యువకుడు మాత్రం ఫియట్ పాండా కారు సైజును తగ్గించి, ప్రపంచంలోనే అత్యంత సన్నటి కారుగా మార్చేశాడు. ఇందులో ఒక్కరు మాత్రమే కూర్చోగలరు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

లెవెల్ 2 ADASతో మహీంద్రా స్కార్పియో N లాంచ్

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra)కు చెందిన ప్రసిద్ధ మోడల్ స్కార్పియో (Scorpio) ఎప్పటి నుంచో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. రెండు తరాలుగా ఈ కార్లు ప్రజల అభిమానాలను పొందుతున్నాయి. suv విభాగంలో దీనిదే పై చేయి. కాలం మారినా, ట్రెండ్ మారినా, ఈ suvకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అదే కారణంగా ఇది హాట్ కేక్‌లా అమ్ముడవుతూ, ప్రతి ఇంటికి చేరింది. ఇప్పుడు ఈ అనుభవాన్ని మరింత ఆధునీకరించడానికి మహీంద్రా మరో అడుగు ముందుకు వేసింది. సరికొత్త టెక్నాలజీతో, లెవెల్ 2 ADAS భద్రతా ఫీచర్లతో కొత్త స్కార్పియో N (Scorpio N)ను అలాగే, కొత్త Z8T వేరియంట్‌ను కూడా మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌కి ఉన్న భద్రతా, సౌకర్యం లక్షణాలు స్కార్పియో అభిమానులను మరింత ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

ఐఫిల్ టవర్ కింద నిలిచిన స్వప్న బైక్ – ఇది భారత్ గర్వం!

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన (EV) స్టార్టప్ అల్ట్రావయోలెట్ (ultraviolette) ఇటీవల కాలంలో వరుసగా కొత్త లాంచ్‌లు చేస్తుంది. ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకుని భారీగా ప్రయోజనాలు పొందడానికి అత్యాధునిక ఫీచర్స్‌తో కొత్త మోడళ్లను దింపుతుంది. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా తన సత్తాను నిరూపించుకుంటుంది. భారతదేశ సాఫ్ట్‌వేర్ రాజధానిగా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో, అనేక కొత్త సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు పుట్టుకొచ్చాయి. అలాంటి వాటిలో అల్ట్రావయోలెట్ కూడా ఒక విశేషమైన పేరుగా నిలిచింది. ఈ సంస్థ భారతదేశపు మొట్టమొదటి ఖరీదైన సూపర్ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించిన ఘనతను సాధించింది. F77 పేరుతో ఈ సూపర్ ఎలక్ట్రిక్ బైక్ మొదట లాంచ్ అవుతూ, తన శక్తివంతమైన పనితీరు, స్పోర్టీ రూపకల్పన, అత్యాధునిక టెక్నాలజీతో దేశవ్యాప్తంగా EV ప్రియుల దృష్టిని ఆకర్షించింది.

హార్లీ-డేవిడ్‌సన్ కంటే ఖరీదైన ఇండియన్ బైకులు.. ఫీచర్లు ఇవే

ఇండియన్ మోటార్‌సైకిల్.. పేరు చూస్తే 'ఇండియన్' అని ఉంది కానీ, ఇది పక్కా అమెరికన్ బైక్ కంపెనీ. అసలు ఈ కంపెనీకి 'ఇండియన్' అనే పేరు ఎలా వచ్చిందనేది ఒక ఆసక్తికరమైన కథ. యూరప్‌లో పుట్టిన మోటార్‌సైకిళ్లను మొట్టమొదటగా అమెరికాలో తయారు చేసి, అమ్మడం మొదలుపెట్టినప్పుడు పెట్టిన పేరే ఇండియన్ మోటార్‌సైకిల్.
Advertisement

సరికొత్త రికార్డకు సిద్ధమైన మహీంద్రా.. ఆగస్టు 15న ఆవిష్కరణ!

మహీంద్రా ఆటో కంపెనీ రాబోయే ఆగస్టు 15న తమ సరికొత్త కార్ల తయారీ ప్లాట్‌ఫారమ్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌పై భవిష్యత్తులో వచ్చే మహీంద్రా కార్లన్నీ తయారవుతాయి. అసలు ఈ ప్లాట్‌ఫారమ్ ఏంటి, దాని విశేషాలు ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం.

టూవీలర్ యజమానులకు ఊరట.. టోల్ మినహాయింపు కొనసాగుతుంది

సాధారణంగా దేశంలో టూవీలర్ వాహనాలపై ఎలాంటి టోల్ ఛార్జీలు ఉండవు. అయితే కొన్ని మీడియా సంస్థలు ఇటీవల టూవీలర్స్‌పై కూడా టోల్ ఛార్జీలు విధించారని కథనాలను ప్రచురించాయి. ఈ వార్తలు టూవీలర్స్‌ను వాడే కోట్లాది మంది వినియోగదారుల మధ్య గందరగోళాన్ని సృష్టించాయి. తాజాగా ఈ వార్తలను భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) స్పష్టంగా ఖండించింది. టూవీలర్ వాహనాలపై టోల్ ఛార్జీలకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదని, ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను మినహాయింపు పూర్తిగా అమలులో కొనసాగుతుందని NHAI ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మీడియా కథనాల ద్వారా ప్రజల్లో అపోహలు ఏర్పడుతున్నాయని, అలాంటి వాదనలకు ఎలాంటి నిజమైన ఆధారం లేదని వివరించింది.

కియా మార్కెట్‎ని ఊడ్చేయబోతుంది.. 16 లక్షలకే 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు

భారతీయ కస్టమర్ల మధ్య భారీ అంచనాలను రేకెత్తించిన కియా కేరెన్స్ క్లావిస్ కారు గత మే నెల చివరిలో మార్కెట్‌లోకి వచ్చింది. ఇది ఐసీ ఇంజిన్ మోడల్. దీన్ని అనుసరించి, దీని ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోంది.

మధ్యతరగతికి సరిగ్గా సరిపడే మైలేజ్ కింగ్ మారుతీ కార్లు

కొత్త కారును కొని, ఇంటి ముందు నిలిపి, కుటుంబంతో కలిసి సంతోషంగా ఆ ఫోటోలు దిగడం... ఇది ఎందరో మధ్యతరగతి కుటుంబాల కల. అయితే ఆ కలను నిజం చేయాలంటే, బడ్జెట్‌కి తగ్గ ధరలో, మంచి మైలేజ్ అందించగల మోడల్‌ ఏది అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ప్రధానంగా మారుతీ సుజుకీ కార్లు ఇలాంటి విభాగానికి చెందినవే. ఈ కంపెనీ కార్లు అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో, మంచి మైలేజ్ ఇవ్వగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న పలు మారుతీ కార్లు బడ్జెట్‌ వినియోగదారులకు సరిగ్గా సరిపోతాయి. ఇవి దేశంలో పేద, మిడిల్ క్లాస్ వినియోగదారులు సైతం కొనుగోలు చేయగలిగే బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా మారుతీ సుజుకీ స్విఫ్ట్, వ్యాగన్ఆర్, సెలెరియో కార్ల గురించి తెలుసుకుందాం.
Advertisement

హిస్టరీ క్రియేట్ చేసిన టాటా మోటార్స్.. 8 కార్లకు 5-స్టార్ సేఫ్టీ!

భారతదేశ మార్కెట్‌లో అత్యధిక కార్లను విక్రయించే కంపెనీలలో టాటా మోటార్స్ ఒకటి. ఇప్పుడు ఈ కంపెనీ కార్ల సేఫ్టీ విషయంలో ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లలో టాటా కంపెనీకి చెందిన 8 కార్లు పాల్గొన్నాయి. గొప్ప విషయం ఏంటంటే.. ఈ 8 కార్లకు కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

పెట్రోల్ ఖర్చులకి గుడ్‌బై చెప్పే స్కూటర్.. హీరో విడా VX2

హీరో మోటోకార్ప్ (Hero Motocorp) నుంచి ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ఒక కొత్త మోడల్ విడా వీఎక్స్2 (Vida Vx2) ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుంది. ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోడల్ ఎట్టకేలకు జులై 1న మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న VX స్టైల్‌ను కొనసాగిస్తూ, కానీ ధర పరంగా మరింత అందుబాటులో ఉండేలా తీసుకురావడం గమనార్హం. ఈ విడా VX2 మోడల్‌ను కంపెనీ మధ్యతరగతి వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది పూర్తిగా అందుబాటులో ఉండే ధర పరిధిలోనే ఉంటుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 65,000 నుండి రూ. 70,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరకు తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. అంటే,తక్కువ ధరలో పెద్దఎత్తున భారతీయ ప్రజల రోజువారి ప్రయాణ అవసరాలను తీర్చడానికి ఇది రాబోతుంది.

627 కి.మీ రేంజ్, 6 టెర్రైన్ మోడ్‌లు.. టాటా హారియర్ ఈవీ AWD ధర రేపే!

టాటా మోటార్స్ జూన్ మొదటి వారంలోనే తమ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన టాటా హారియర్ ఈవీని భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. లాంచ్ ఈవెంట్‌లో ప్రారంభ ధరను ప్రకటించిన కంపెనీ, కొన్ని రోజుల క్రితం రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్‌ల ధరలను కూడా చెప్పేసింది. కానీ, ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వెర్షన్ ధరను మాత్రం ఇప్పటికీ బయటపెట్టలేదు.

ఓ మై గాడ్.. పట్టాలపై కారు నడిపి రైళ్లను నిలిపేసింది!

ఇటీవలి కాలంలో దేశంలో పలు చోట్ల రైలు పట్టాలపై బైకులు, కార్లను నడుపుతున్న ఘటనలు తరుచుగా వింటున్నాం. అలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలో చోటుచేసుకుంది. తాజాగా ఓ యువతి, తన కారును సాదారణ రోడ్డుపై కాకుండా నేరుగా రైలు పట్టాలపై నడిపిస్తూ వెళ్లింది. దీంతో ఈ రూట్లో ప్రయాణించాల్సిన రైళ్లను గంటల తరబడి నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన, స్థానికులను, రైల్వే అధికారులను, ప్రయాణికులను ఒకింత ఆందోళనకు గురిచేసింది. నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి దిశగా ప్రయాణిస్తున్న ఓ యువతి తన కారును రైలు పట్టాలపై నడిపింది. ఇది చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఇది గమనించిన వారు వెంటనే ఆమెను ఆపడానికి యత్నించారు.
Advertisement

తక్కువ ధరలో అద్భుతమైన సేఫ్టీతో స్టీల్‌బర్డ్ టొర్నాడో హెల్మెట్!

భారతదేశంలో పేరున్న హెల్మెట్ తయారీదారుల్లో ఒకటైన స్టీల్‌బర్డ్ హెల్మెట్స్ కంపెనీ, కొత్త మోడల్‌గా టొర్నాడో అనే హెల్మెట్‌ను విడుదల చేసింది. ఇది సేఫ్టీకి, సౌకర్యానికి, రోజువారీ వాడకానికి అనుగుణంగా డిజైన్ చేశారు. ఈ హెల్మెట్ DOT, ISIప్రమాణాలను అందుకుంది. అంటే, ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని అర్థం. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారట. భారతీయ, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను పాటిస్తుందని కంపెనీ చెబుతోంది.