బొలెరో ఫ్యాన్స్‌కి బంపర్ గిఫ్ట్.. కొత్త CNG HD పికప్ లాంచ్!

భారతదేశపు నంబర్ 1 పికప్ వాహన బ్రాండ్‌గా పేరుగాంచిన మహీంద్రా (Mahindra), మరోసారి తన శక్తివంతమైన కొత్త వాహనంతో మార్కెట్‌లో అడుగుపెట్టింది. వ్యాపార, ఇతర అవసరాలకు అనుగుణంగా ఉండేలా కొత్తగా బొలెరో మాక్స్ పికప్ హెచ్‌డీ సీఎన్‌‌జీ (Bolero MaXX Pik-Up HD CNG)ని విడుదల చేసింది. ఈ కొత్త బొలెరో పికప్ ట్రక్ డిజైన్ పూర్తిగా ప్రాక్టికల్ అవసరాలకు అనుగుణంగా ఉంది. వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉండేలా దీని ఫీచర్లు, సామర్థ్యం రూపొందించబడ్డాయి. ఇది గరిష్టంగా 1.85 టన్నుల పేలోడ్‌ను మోయగలదు, అంటే, పెద్ద పరిమాణంలో సరుకులను తరలించాల్సిన చిన్న వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లకు ఇది నిజంగా సూపర్ ఎంపిక అవుతుంది. దీని ధర వచ్చేసి రూ.11.19 లక్షల ఎక్స్-షోరూమ్

బైకర్లకు షాకింగ్ న్యూస్.. జూలై 15 నుంచి బైకులకు టోల్ ఫీజు

భారతదేశంలో బైక్‌లపై ప్రయాణించే వారికి నిజంగా షాకింగ్ న్యూస్. హైవేలపై టూ వీలర్లకు ఇక మీదట టోల్ చెల్లించాలని వార్తలు వినిపిస్తున్నాయి. జూలై 15, 2025 నుంచి బైక్‌లు కూడా టోల్ చెల్లించాల్సి ఉంటుందని చాలా నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటివరకు బైక్‌లకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కానీ, అది త్వరలో ముగిసిపోవచ్చు అంటున్నారు.

కస్టమర్ల నమ్మకాన్ని నెరపుతున్న హోండా షైన్.. మే అమ్మకాలతో మరోసారి రుజువు!

భారతీయ టూవీలర్ మార్కెట్లో హోండా షైన్ (Honda Shine) తన స్థానాన్ని మరోసారి బలోపేతం చేసుకుంది. చాలా కాలంగా మధ్యతరగతి వినియోగదారుల ఆదరణను పొందుతూ వస్తున్న ఈ మోడల్, తన అద్భుతమైన పనితీరు, మైలేజ్, విశ్వసనీయతతో లక్షలాది మందిని ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన *మే 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం, హోండా షైన్ దేశంలోని టాప్ 10 మోటార్‌సైకిళ్ల జాబితాలో రెండవ స్థానాన్ని సంపాదించింది. ఇది కంపెనీ ఊహించిన స్థాయిని మించి వచ్చిన ఘనతగా చెప్పవచ్చు. వినియోగదారుల నమ్మకాన్ని పొందిన ఈ బైక్, సాధారణ ప్రయాణం కోసం కాకుండా, రోజువారీ అవసరాలకు తగ్గట్టు బాగా ఉపయోగపడుతుంది. ఇది దేశీయ ఫ్యామిలీ వినియోగదారుల బైక్. దీనిపై పెట్టిన ప్రతి రూపాయికి లాభం చేకూర్చేలా ఇది తన పెర్ఫామెన్స్‌ను అందిస్తుంది.

పైసా ఖర్చు లేకుండా రోజూ 80 కి.మీ. ప్రయాణం.. సైకిల్ ధరకే ఎలక్ట్రిక్ మొపెడ్!

ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ అయిన కొమాకి ఎలక్ట్రిక్, స్మార్ట్ రైడింగ్‌ను ఇంకా సులువు చేయడానికి తమ కొత్త XR1 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ అధునాతన మొపెడ్ రీజనరేటివ్ కైనటిక్ ఎనర్జీతో నడుస్తుంది. అంటే, బ్యాటరీ ఖాళీ అయినా కూడా దీన్ని నడపొచ్చు.
Advertisement

ఇకపై పాత ధరలతో MG కారు కలే.. జులై నుంచి ధరల పెంపు!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఎంజీ మోటార్స్ (MG Motors) మరోసారి వార్తల్లోకెక్కింది. మొదటగా హెక్టర్, గ్లోస్టర్, ఆస్టర్ వంటి ఐసీఈ ఇంజిన్ కార్లతో దేశంలోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ, తర్వాతి దశలో ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించి ఇప్పుడు దేశంలో మంచి డిమాండ్ ఉన్న కంపెనీగా గుర్తింపును సంపాదించుకుంది. ZS EVతో ప్రారంభమైన ఈ ప్రయాణం, తరువాత వచ్చిన Comet EV, Windsor EVల ద్వారా ఊహించని స్థాయిలో ప్రజాదరణను అందుకుంది. MG షోరూమ్‌లు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల కోసం వచ్చే కస్టమర్లతో నిండిపోయి ఉండటాన్ని కూడా గమనించవచ్చు. కొత్తగా ఈవీ కారును కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారు ఎంజీ వైపు చూస్తున్నారు.

స్కార్పియో ఎన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ తో కొత్త ఎస్‌యూవీ!

మహీంద్రా స్కార్పియో ఎన్ ఇండియాలో చాలా పాపులర్ అయిన ఎస్‌యూవీ. 2022లో ఈ కారును గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఇది చాలా కొత్త ఫీచర్లతో, అడ్వాన్స్‌డ్ డిజైన్, టెక్నాలజీతో దూసుకుపోతోంది. ఇప్పుడు కంపెనీ అప్‌డేట్ చేసిన 'స్కార్పియో ఎన్' ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకురావడానికి రెడీగా ఉంది. దీనికి సంబంధించిన ఒక టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది.

చిన్న వ్యాపారాల కోసం మెరుపులా వచ్చే స్కూటర్

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీదారుల్లో ఒకటైన జెలియో(Zelio E-Mobility) మార్కెట్లో ఉనికిని పెంచుకోవడానికి కీలకంగా ప్రయత్నాలు చేస్తుంది. పెద్ద బ్రాండ్‌లు వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ ఆటో పరిశ్రమలో విపరీతమైన పోటీని పెంచుతున్న నేపథ్యంలో వీటి మధ్య తాను కూడా సత్తా చాటడానికి కంపెనీ పలు కొత్త మోడళ్లను తీసుకురావాలని చూస్తుంది. అందులో భాగంగా జెలియో తక్కువ వేగంతో నడిచే కార్గో స్కూటర్ లాజిక్స్ ఫేస్‌లిఫ్ట్ (Logix facelift)ను విడుదల చేయడానికి సిద్ధం అయింది. ఈ అప్‌డేట్ చేసిన మోడల్ జులై 2025లో మార్కెట్లోకి అమ్మకానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది డెలివరీ సర్వీసులు, సూపర్‌ మార్కెట్ల డెలివరీ బాయ్‌ల కోసం రూపొందించిన ఈ మోడల్, పలు ప్రాంతాల్లో సరుకుల రవాణాలో కీలక పాత్ర పోషించనుంది.

చైనా నుంచి మెక్సికో వెళ్తుండగా షిప్ ప్రమాదం.. అగ్ని ప్రమాదం, 3000 కార్లు జలసమాధి!

ప్రపంచవ్యాప్తంగా కార్ల షిప్పింగ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మీడియా రిపోర్టుల ప్రకారం.. మార్నింగ్ మిడాస్ అనే ఒక పెద్ద కార్గో షిప్లో 3,000కు పైగా కొత్త కార్లు లోడ్ చేసి ఉన్నాయి. ఈ షిప్ మెక్సికోకు వెళ్తుండగా అకస్మాత్తుగా పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది.
Advertisement

బైక్‌తో పాటు సమాన మైలేజ్ ఇచ్చే మారుతీ కారు.. ఇదే మీ ఫస్ట్ ఛాయిస్ కావాలి!

భారతదేశంలో పేద, మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వీరంతా కూడా కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, కుటుంబ అవసరాల కోసం బస్సులు, ఆటోలు, రైళ్లు వంటి వాటిల్లో ప్రయాణించడానికి బదులుగా అందరు కలిసి ఒకే కారులో హాయిగా వెళ్లడానికి ఇష్టపడటం వంటి పలు కారణాల వలన దేశంలో ఇప్పుడు కార్ల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, శక్తివంతమైన పనితీరు అందించగల కార్లు ఇప్పుడు మార్కెట్లో చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతీ సుజుకీ (Maruti Suzuki)కి చెందిన ప్రసిద్ద ఆల్టో K10 ఒకటి.

ఆటోమెటిక్ కారులో బ్రేక్ ఫెయిల్ అయితే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి?

మీరు కారులో చాలా స్పీడ్‌గా వెళ్తున్నారు. అప్పుడే అనుకోకుండా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కారును ఆపాలి అంటే, చాలామంది క్లచ్ తొక్కి, గేర్‌ను డౌన్ చేసి, కారు స్పీడ్‌ను తగ్గించాలి అని చెబుతుంటారు. కానీ, అసలు మ్యాన్యువల్ గేర్‌ లేని ఆటోమెటిక్ గేర్ కార్లలో ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? వివరంగా తెలుసుకుందాం.

ఈ స్కూటర్ వస్తే స్ట్రీట్ స్టైల్ మారిపోతుంది.. స్కూపీ ప్రత్యేకతలు ఇవే!

భారతదేశంలో గేర్‌లెస్ స్కూటర్ల మార్కెట్‌ను కైవసం చేసుకున్న బ్రాండ్ అంటే, మొదట గుర్తుకొచ్చేది హోండా (Honda)నే. హోండా యాక్టివా (Activa), డియో (Dio) వంటి మోడళ్లతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల నమ్మకాన్ని సాధించిందీ సంస్థ. హోండా ఇక్కడితో ఆగకుండా, మరింత ఆకర్షణీయమైన, ప్రత్యేకత కలిగిన మోడళ్లను తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అలాంటి యత్నాల్లో భాగంగా, ఇటీవల హోండా స్కూపీ (Honda Scoopy) అనే స్కూటర్‌కి భారతదేశంలో పేటెంట్ దాఖలు చేయడం జరిగింది. ఈ స్కూటర్‌ను 2017లోనే భారత రోడ్లపై విజయవంతంగా పరీక్షించారు. కానీ పలు వ్యాపారపరమైన కారణాల వల్ల దాని లాంచ్ ఆమోదం పొందలేదు. ఇప్పుడు తిరిగి, ఇది కొత్త అవతారంలో ఇండోనేషియా వంటి దేశాల్లో విజయవంతంగా అమ్ముడవుతోంది.

గగన్‌యాన్ హీరో శుభాంషు శుక్లా..నేడు ఐఎస్ఎస్ మిషన్‌కు బయలుదేరిన మన పైలట్!

అంతరిక్ష ప్రయాణం అంటేనే ఒక కల. అలాంటి కలను సాకారం చేసుకుంటూ మన దేశం గర్వపడేలా భారత వైమానిక దళం నుండి ఓ యువకుడు ఇవాళ అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఆయనే గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. మన దేశ ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రోగ్రామ్ కోసం సెలక్ట్ చేసిన వ్యోమగాములలో ఈయన ఒకరు.
Advertisement

జపాన్‌లో 2025 సుజుకీ ఆల్టో విడుదల..! భద్రతా ఫీచర్లతో రారాజు

ఇండియాలో మారుతీ సుజకీకి చెందిన ఆల్టో అంటే తెలియని వారు ఉండరు. దేశంలో పేద, మధ్య తరగతి వారికి బాగా ఇష్టమైన మోడల్. ఢిల్లీ నుంచి మొదలుకుని గల్లీ వరకు ఇది కనిపిస్తుంది. ఇక్కడ మాదిరిగానే మారుతీ సుజుకీ మాతృసంస్థ అయిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ జపాన్‌లో ఇదే కారును విక్రయిస్తుంది. అక్కడి మార్కెట్లో ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్‌కి ఉన్న గిరాకీకి మాములుగా ఉండదు. అక్కడి ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా మరింత ఆధునికంగా, ఆకర్షణీయంగా మార్చి కంపెనీ విక్రయిస్తుంది. ఇప్పటికే 9వ తరం ఆల్టో 2021 చివరిలో మార్కెట్లోకి వచ్చిన తర్వాత మంచి స్పందనను పొందింది. దీంతో దీనికి కొనసాగింపుగా కంపెనీ 2025 సుజుకి ఆల్టో‌ను మరింత కొత్తగా అప్‌డేట్ చేసి తాజాగా విడుదల చేసింది.

చైనా నుంచి వచ్చి ఇండియాలో దుమ్మురేపుతున్న Atto 3

కార్ల ప్రపంచంలో ఒక కొత్త సెన్సేషన్ BYD కంపెనీకి చెందిన అట్టో 3 కారు. ఇది ఇప్పటి వరకు ఏకంగా 10 లక్షల యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించింది. ప్రజలు ఈ కారును ఎందుకు ఇంతలా ఇష్టపడుతున్నారు? అసలు ఈ కారులో ఏముంది? వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

వర్షాకాలానికి BMW సర్వీస్ క్యాంపెయిన్ రెడీ! ఉచిత చెకింగ్‌తో అదిరే ఆఫర్లు!

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ (BMW) భారతదేశంలో వర్షాకాలానికి సిద్ధమవుతోంది. తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి BMW మాన్‌సూన్ సర్వీస్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఇది జూన్ 15 నుండి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా ఉన్న తన అన్ని అధీకృత డీలర్ వర్క్‌షాప్‌లలో అందుబాటులో ఉంటుంది. వర్షాకాలంలో మరింత సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా దీన్ని తీసుకొచ్చింది. ఈ మాన్‌సూన్ సర్వీస్ ప్రచారం కేవలం ఒక రొటీన్ సర్వీసింగ్ కార్యక్రమం మాత్రమే కాదు. కారు నిర్వహణ, నిరంతర సేవల అవసరం, వర్షాకాల ప్రమాదాలు, వాటి పరిష్కారాలపై వినియోగదారులకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఇది ఒక మంచి అవకాశం.

రోల్స్ రాయిస్ లో వెనక నుంచి తెరుచుకునే డోర్స్.. వాటిని 'సూసైడ్ డోర్స్' అని ఎందుకంటారు?

కార్ల డిజైన్ కాలానికనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పాత కాలం నాటి ఒక అదిరిపోయే ఫీచర్ మళ్లీ కొత్తగా, బోల్డ్ స్టేట్‌మెంట్‌లా తిరిగి ఎంట్రీ ఇస్తోంది. అవే సూసైడ్ డోర్స్. ఈ డోర్స్ మామూలు కార్ డోర్స్ మాదిరి ముందు నుంచి కాకుండా వెనుక నుంచి తెరుచుకుంటాయి. ఈ డిజైన్ కొత్తదేమీ కాకపోయినా ఇప్పుడు కార్ల కంపెనీలు పాత స్టైల్‌కు కొత్త మెరుగులు దిద్దుతుండడంతో దీనిపై మళ్లీ దృష్టి పడుతోంది.
Advertisement

టాప్ 3 స్కూటర్‌గా యాక్సెస్ 125 దూసుకొచ్చింది.. గత సంవత్సరం కన్నా 17% వృద్ధి

దిగ్గజ టూవీలర్ తయారీదారు సుజుకీ (suzuki)కి చెందిన యాక్సెస్ 125 (Access 125) అనే స్కూటర్ పేరు వినగానే, చాలా మంది వినియోగదారుల మనసులో నమ్మకమైన, రోజువారీ ప్రయాణాలకు అనుకూలమైన ఒక స్కూటర్ కనబడుతుంది. ఇది ఒక మంచి పనితీరు, మైలేజ్, కంఫర్ట్‌కి కలయికగా మారింది. అందుకే, దేశవ్యాప్తంగా ఇది అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీ నుంచి మొదలుకుని గల్లీ వరకు ఈ స్కూటర్ కనిపిస్తుంది. తాజాగా విడుదలైన మే 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం, యాక్సెస్ 125 స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 10 మోడళ్లలో మూడవ స్థానాన్ని అధిరోహించింది. మార్కెట్లో ఎంతో పోటీ ఉన్నప్పటికి కూడా ఇతర మెడళ్లను దాటుకుని ఇది మెరుగైన స్థానం పొందడం గమనార్హం.

సెలబ్రిటీల ఫేవరెట్ మిని కూపర్ S: హిషమ్ అబ్దుల్ వహాబ్ కూడా కొనేశాడు!

ఎప్పటికప్పుడు గొప్ప గాయకులను ఐడియా స్టార్ సింగర్ అనే రియాలిటీ షో ద్వారా ఇండస్ట్రీకి ఒక పెద్ద గిఫ్ట్, ఓ అద్భుతమైన టాలెంట్ దొరికారు. 2007లో ఐడియా స్టార్ సింగర్‌కు గెస్ట్‌గా వచ్చిన హీరో జయసూర్య, అతడి పాట విని మీరు పాటతోనే బతుకుతారు అని అన్నారు. ఆ తర్వాత వినీత్ శ్రీనివాసన్ తీసిన 'హృదయం' సినిమాతో వచ్చిన అవకాశం అతని మ్యూజిక్ కెరీర్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్.

ఓ అద్భుత కారు అమ్మకాల్లో పడిపోయింది! టాటా ఆల్ట్రోజ్‌కు ఏమైంది?

భారతదేశపు ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors)కు చెందిన టాటా ఆల్ట్రోజ్ (Altroz) భారత మార్కెట్లో ఎంతో గుర్తింపు పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. అయితే, మే 2025 అమ్మకాల దృష్టిలో చూస్తే ఈ మోడల్ కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, టాటా మోటార్స్ మే 2025లో కేవలం 2,779 ఆల్ట్రోజ్ యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 4,983 కార్ల అమ్మకాలతో పోల్చుకుంటే 2,204 యూనిట్లు తక్కువ. ఈ మేరకు ఆల్ట్రోజ్ అమ్మకాల్లో దాదాపు 44 శాతం తగ్గుదల కనిపించింది. ప్రస్తుతానికి అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికి రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు.

XUV700 Vs కియా కారెన్స్ క్లావిస్.. ఏ కారులో ఎక్కువ దమ్ముంది?

భవిష్యతులో మీ ఫ్యామిలీ కోసం ఒక కంఫోర్టబుల్, సేఫ్, ప్రీమియం కారు కొనాలని చూస్తున్నారా.. అయితే మహీంద్రా XUV700, కియా కొత్తగా తెస్తున్న కారెన్స్ క్లావిస్ మంచి ఆప్షన్లు కావచ్చు. ఈ రెండు కార్లు కూడా ఫీచర్లు, డిజైన్, పర్ఫామెన్స్ విషయంలో అద్భుతంగా ఉన్నాయి. దాదాపు ఈ రెండు మోడల్స్ కూడా రూ.25లక్షల బడ్జెట్లోనే వస్తాయి.
Advertisement

భారత రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ ధరలు పెంపు వివరాలు ఇవే

భారతీయ రైల్వేల ద్వారా దేశంలో కోట్లాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. తక్కువ ధరలో, ఎక్కువ దూరం ప్రయాణించే పేద, మిడిల్ క్లాస్ వారికి రైల్వేలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. బస్సులు, విమానాల్లో అయ్యే ఖర్చులతో దీని ద్వారా తక్కువ ఖర్చలో ప్రయాణం చేయవచ్చు. అయితే తాజాగా రైల్వే ధరల గురించి ఒక కీలక సమాచారం వచ్చింది. భారతీయ రైల్వే ఛార్జీలను పెంచేందుకు సిద్ధమవుతోందని తెలుస్తుంది. ఈ కొత్త ధరలు వచ్చే నెల అంటే జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. రైల్వేలో టికెట్ ధరల పెంపుదల అనేది చాలా ఏళ్ల తరువాత జరుగుతున్న ప్రక్రియ. మధ్యతరగతి, పేదల అభిమానం రైళ్లపై ఎంతో ఎక్కువగా ఉంటుంది. కానీ ధరల పెరుగుదలతో రైలులో ప్రయాణించడం కొంచెం ఖరీదైనదిగా మారబోతోంది.

బజాజ్ పల్సర్ అమ్మకాలు డౌన్.. కారణం ధరనా? పోటీనా?

బజాజ్ పల్సర్ బైకును యూత్‎ను దృష్టిలో పెట్టుకొని తయారుచేశారు. బైక్ డిజైన్, పనితీరు, ఫీచర్లు అందరికీ నచ్చుతాయి. ఇటీవల 'మే' నెలలో అత్యధిక సంఖ్యలో అమ్ముడైన టాప్ 10 మోటార్‌సైకిళ్ల జాబితా విడుదలైంది. అందులో 'పల్సర్' 3వ స్థానంలో ఉంది. అయినా, అమ్మకాల సంఖ్య తగ్గింది. ఇదే జాబితాలో హీరో స్ప్లెండర్ మొదటి స్థానంలో ఉండగా, హోండా షైన్ రెండవ స్థానంలో ఉంది.

బెస్ట్ స్కూటర్.. టీవీఎస్ జూపిటరా? హోండా యాక్టివా 6జీనా? ఎవరికి ఏది పర్ఫెక్ట్?

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్, హోండా యాక్టివా 6జీ ముందుంటాయి. అమ్మకాల విషయానికి విషయంలో కూడా అవి టాప్ ప్లేసులో ఉంటాయి. ఈ రెండు స్కూటర్లు చాలా కాలంగా ఒకదానికొకటి పోటీ ఇస్తూనే ఉన్నాయి.

వంటల వీడియోలతో మొదలైంది.. ఇప్పుడు VIP నంబర్‌తో స్కార్పియో N

ఈ రోజుల్లో సోషల్ మీడియా సాధారణ జీవితాలను గడుపుతున్న వారిని కూడా ఒక్కసారిగా సెలబ్రిటీలుగా మార్చి వేస్తుంది. ఇలాంటి వారి గురించి ఇటీవలి కాలంలో వింటూనే ఉన్నాం. అలాంటి కోవకే చెందిన వారు, రాజేష్ రావణి. రెండు దశాబ్దాల పాటు లారీ డ్రైవర్‌గా జీవితం గడిపిన ఆయన, ఒక్క యూట్యూబ్ ఛానెల్‌తో సెలబ్రిటీగా మారిపోయారు. ఆయన సాధారణంగా లారీ డ్రైవింగ్ చేసేవారు. రాజేష్‌కు వంట మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఈ క్రమంలో యూట్యూబ్‌ ఛానల్ ప్రారంభించాడు. మొదట్లో తన ట్రక్ ప్రయాణాల్లో వంట చేసుకుంటూ, దాన్నంతా కూడా వీడియోలుగా చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. అవి ఎంతో సహజత్వంతో ఉండేవి. అతని మాటలు, నడక, వంట విధానంతో చాలా మందిని అట్రాక్ట్ చేశారు. దీంతో ఆయన ఛానెల్‌కి సబ్‌స్క్రైబ్ చేయడం క్రమంగా పెరిగిపోయింది.
Advertisement

వర్షాకాలంలో మీ కారుకు 'హ్యుందాయ్' ట్రీట్‌మెంట్!

ప్రస్తుతం వానాకాలం మొదలైంది. అడపాదడపా వర్షాలు పడుతుంటాయి కాబట్టి బయటకి వెళ్లాలంటే అందరూ ఎక్కువగా కార్లనే ఉపయోగిస్తారు. ఈ సమయంలో కార్ల కండిషన్ చూసుకోవడం ప్రతి యజమాని బాధ్యత. ఈ మధ్య కాలంలో చాలా వాహన తయారీ కంపెనీలు తమ కస్టమర్ల కోసం మాన్‌సూన్ క్యాంపులను ప్రకటించాయి.