7 మందికి కంఫర్ట్.. ఫీచర్లతో నిండిన విన్‌ఫాస్ట్ EV

ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్న కంపెనీలలో ఒకటిగా నిలుస్తున్న విన్‌ఫాస్ట్ (VinFast), ఇప్పుడు భారత మార్కెట్లో కూడా తన ప్రభావాన్ని విస్తరించేందుకు దూసుకెళ్తోంది. వియత్నాంకు చెందిన ఈ సంస్థ ఇటీవలే భారతదేశంలో అడుగుపెట్టినప్పటికీ, తక్కువ సమయంలోనే వినియోగదారుల దృష్టిని ఆకర్షించగలిగింది. ఇప్పటికే కంపెనీ తన లైనప్‌లో భాగంగా VinFast VF 6, VinFast VF 7 వంటి ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ రెండు మోడళ్లతో SUV సెగ్మెంట్‌లో స్థిరపడే ప్రయత్నం చేసిన విన్‌ఫాస్ట్, ఇప్పుడు కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మరో కీలక మోడల్‌ను పరిచయం చేసింది. అదే విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 (VinFast VF MPV 7).

ఒక్కసారి ఛార్జింగ్ పెడితే వారమంతా ప్రయాణం

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. తన పాపులర్ ఎలక్ట్రిక్ సెడాన్ ఈక్యూఎస్ (EQS)ను సరికొత్త హంగులతో, అదిరిపోయే రేంజ్‌తో అప్‌డేట్ చేసి ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 926 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రూపొందించారు. గాలి వేగంతో దూసుకెళ్లడమే కాకుండా, విలాసవంతమైన ఇంటీరియర్, అత్యాధునిక సాంకేతికతతో ఈ కారు ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది.

ఫ్యామిలీ + బిజినెస్‌కు బెస్ట్ ఆప్షన్.. ఈకో సేల్స్ పెరుగుదల

భారతదేశంలో తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించడానికి అనువైన వాహనం అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చే మోడల్ మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco). వాణిజ్య అవసరాలు కావచ్చు, కుటుంబ వినియోగం కావచ్చు, రెండింటికీ సరిపోయే ప్రాక్టికల్ ఎంపికగా ఈ కారు ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో, 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY2026) మారుతి సుజుకి నమోదు చేసిన అమ్మకాల గణాంకాలు ఈకోపై ఉన్న డిమాండ్‌ను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ కాలంలో మొత్తం 1,39,769 యూనిట్ల ఈకో వాహనాలు అమ్ముడవడం, ఈ మోడల్‌పై వినియోగదారుల నమ్మకం ఇంకా బలంగానే ఉందని సూచిస్తోంది.

అదిరిపోయే ఫీచర్లున్నా ఈ కారును మార్చిలో ముగ్గురే కొన్నారు

లగ్జరీ ఫీచర్లు, అద్భుతమైన స్పీడ్, టాప్ క్లాస్ సేఫ్టీ.. ఇవన్నీ ఉన్నా కూడా ఒక కారును కొనడానికి జనం ఆసక్తి చూపడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది. జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) నుంచి వచ్చిన ఐకానిక్ మోడల్ గోల్ఫ్ జీటీఐ (Golf GTI) పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. 2026 మార్చి నెలలో ఈ కారును దేశవ్యాప్తంగా కేవలం ముగ్గురు మాత్రమే కొనుగోలు చేశారు. అంతకుముందు ఫిబ్రవరిలో అయితే కేవలం ఒకే ఒక్క యూనిట్ అమ్ముడైంది. ఇంతకీ ఈ కారులో ఏముంది? ఎందుకు దీనికి డిమాండ్ తక్కువగా ఉంది? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Advertisement

చిన్న కుటుంబానికి చింత లేని కారు

భారతదేశంలో తక్కువ ధరలో కొత్త కారు కొనాలనుకునే వారి కోసం ఎప్పటికప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే పేరు మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10). సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధర, తక్కువ నిర్వహణ ఖర్చులు, మంచి మైలేజ్ ఇవి కలిపి ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్‌ను దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలబెట్టాయి. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో, 2025-26 ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు) సంబంధించిన అమ్మకాల గణాంకాలు బయటకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కాలంలో మొత్తం 93,740 యూనిట్ల మారుతి సుజుకి ఆల్టో కె10 కార్లు అమ్ముడయ్యాయి.

మహీంద్రా ఖాతాలో బంగారు గుడ్లు పెట్టే బాతు ఈ బుజ్జి ఈవీ

భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. ముఖ్యంగా మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే కంపెనీకి బంగారు గుడ్లు పెట్టే బాతులా మారిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు సాధించిన అమ్మకాలు చూస్తుంటే, భారతీయ వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది. కేవలం లుక్ మాత్రమే కాదు, అదిరిపోయే రేంజ్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో ఈ కారు ఎలక్ట్రిక్ వాహన రంగంలో రారాజుగా దూసుకుపోతోంది.

నెలలో 893 కార్లు మాత్రమే.. హ్యుందాయ్ 7-సీటర్‌కు భారీ షాక్

భారతదేశంలో 5-సీటర్ SUV సెగ్మెంట్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు హ్యూందాయ్ క్రెటా (Hyundai Creta). విడుదలైనప్పటి నుంచే ఈ మోడల్ మార్కెట్లో తనదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, అమ్మకాల జాబితాలో ఎప్పటికప్పుడు అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, మంచి మైలేజ్ కలిసి క్రెటాను సాధారణ వినియోగదారులకే కాదు, SUV ప్రేమికులకూ మొదటి ఎంపికగా మార్చాయి. ఇదే విజయాన్ని మరింత విస్తరించాలని భావించిన దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం Hyundai Motor Company, క్రెటా ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఒక 7-సీటర్ మోడల్‌ను కూడా రూపొందించింది. అదే హ్యూందాయ్ అల్కాజర్ (Hyundai Alcazar). అల్కాజర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చినప్పుడు కంపెనీకి భారీ ఆశలే ఉన్నాయి.

ఎలక్ట్రిక్ కార్ల పై ఏకంగా రూ.3.45 లక్షల డిస్కౌంట్

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌ను ఏలుతున్న టాటా మోటార్స్ (Tata Motors) కస్టమర్లకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. సామాన్యుడి ఈవీ కలని నిజం చేస్తూ, తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలోని దాదాపు అన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు నుంచి తప్పించుకోవాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. టాటా టిగోర్ ఈవీ మినహా మిగిలిన అన్ని ఎలక్ట్రిక్ కార్లపై నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టాటా కర్వ్ ఈవీపై ఏకంగా రూ.3.45 లక్షల వరకు ఆదా చేసే అవకాశం ఉంది. ఈ ఆఫర్లు ఏప్రిల్ నెలాఖరు వరకు మాత్రమే వర్తిస్తాయి.
Advertisement

ఇంజనీర్లు, డాక్టర్లు ఇష్టపడి కొంటున్న కారు

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అంటే తెలియని వారు ఉండరు. 1999లో లాంచ్ అయినప్పటి నుంచి నేటి వరకు ఇది మధ్యతరగతి ప్రజల డ్రీమ్ కారుగా నిలుస్తూనే ఉంది. 2019లో వచ్చిన ఈ బిగ్ న్యూ వ్యాగన్ఆర్ మోడల్, అంతకుముందు వెర్షన్లతో పోలిస్తే ఎంతో మారిపోయింది. అప్పట్లో కేవలం 1.0 లీటర్ ఇంజన్‌కే పరిమితమైన ఈ కారు, తొలిసారిగా 1.2 లీటర్ పవర్‌ఫుల్ ఇంజన్‌తో వచ్చి మార్కెట్‌ను ఊపేసింది. నేటికీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

కారు కొంటే డబ్బులు తిరిగి వస్తాయా?

జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన పాపులర్ ఎస్‌యూవీ టైగన్ (Taigun)లో సరికొత్త మార్పులు చేసి భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం ఫీచర్లు మాత్రమే కాకుండా, ఈసారి కస్టమర్లకు నమ్మకాన్ని కలిగించేలా ఒక అదిరిపోయే బైబ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. అంటే కారు కొన్న మూడేళ్ల తర్వాత తిరిగి అమ్మేయాలనుకుంటే, షోరూమ్ ధరలో 75 శాతం డబ్బులు వెనక్కి ఇచ్చేలా కంపెనీ గ్యారెంటీ ఇస్తోంది. అసలు ఈ కొత్త టైగన్‌లో ఏయే మార్పులు వచ్చాయో, ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

ఒక్కసారిగా కుప్పకూలిన టాటా కారు అమ్మకాలు

భారతీయ ఆటోమొబైల్ రంగంలో విశ్వసనీయత, నాణ్యత, ఇన్నోవేషన్‌కు ప్రతీకగా నిలిచిన సంస్థ టాటా మోటార్స్ (Tata Motors). ఈ కంపెనీకి చెందిన Tata Curvv (టాటా కర్వ్) భారతీయ మార్కెట్లో కొత్త డిజైన్ ట్రెండ్‌ను తీసుకొచ్చిన మోడల్‌గా చెప్పుకోవచ్చు. సాధారణ SUVల కంటే భిన్నంగా, కూపే-స్టైల్ సిల్హౌట్‌తో ఈ కారు ప్రత్యేకంగా కనిపిస్తుంది. స్లీక్ రూఫ్‌లైన్, బోల్డ్ ఫ్రంట్ డిజైన్, ఆధునిక లైటింగ్ ఎలిమెంట్స్ కలిపి ఈ కారుకు ప్రీమియం, ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తాయి. తాజాగా ఈ కారుకు సంబంధించిన సేల్స్ వివరాలను చూసినట్లయితే టాటా కర్వ్ గణాంకాలు మాత్రం కొంత మందగమనాన్ని సూచిస్తున్నాయి. 2026 మార్చి నెలలో ఈ మోడల్ కేవలం 1,602 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేయడం గమనించదగ్గ విషయం.

సాఫ్ట్‎వేర్ ఉద్యోగులంతా ఈ కారే కావాలంటున్నారు

భారతీయ రోడ్ల మీద ఎలక్ట్రిక్ వాహనాల (EV) జోరు పెరిగింది. ముఖ్యంగా స్వదేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో మార్కెట్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. మహీంద్రా నుంచి వచ్చిన ఫ్యూచరిస్టిక్ మోడల్ మహింద్రా XEV 9e ఇప్పుడు హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 682 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం, దానికి తోడు అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఉండటంతో కస్టమర్లు ఈ కారు కోసం క్యూ కడుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు సాధించిన అమ్మకాలు చూస్తుంటే, ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో మహీంద్రా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
Advertisement

టాటా EV గేమ్ చేంజర్.. హారియర్‌తో మార్కెట్ షేక్!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ రన్నింగ్ ఖర్చు, పర్యావరణానికి మేలు చేసే టెక్నాలజీ కలిసి ఈవీలను ఎక్కువగా ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. ఈ ట్రెండ్‌ను బలంగా వినియోగించుకుంటున్న కంపెనీల్లో టాటా మోటార్స్ (Tata Motors) ఒకటి. ఈ సంస్థ ఇప్పటికే ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని, వరుసగా మంచి సేల్స్ నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో టాటా హారియర్ ఈవీ (Tata Harrier EV) కూడా మార్కెట్లో మంచి స్పందనను అందుకుంటోంది. ముఖ్యంగా ప్రీమియం SUV సెగ్మెంట్‌లో ఈ మోడల్‌కు వస్తున్న డిమాండ్ గమనించదగ్గది.

రేపే ఇండియాలో విన్ఫాస్ట్ VF MPV 7 లాంచ్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ రోజురోజుకీ వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు కలిసి వినియోగదారులను ఈవీల వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన తయారీ సంస్థల మధ్య పోటీ కూడా గట్టిగా మారింది. ప్రతి కంపెనీ తమదైన స్ట్రాటజీతో కొత్త మోడళ్లను ప్రవేశపెడుతూ మార్కెట్లో తమ స్థానాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పోటీలో ఇప్పుడు విదేశీ కంపెనీలు కూడా సీరియస్‌గా అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ (VinFast) సంస్థ భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో తన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టిన ఈ కంపెనీ, ఇప్పుడు భారత్‌లో కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

కేవలం రూ. 3వేలే తేడా.. పల్సర్ 180cc vs అపాచీ 180ccలో ఏది బెస్ట్

భారతీయ రోడ్ల మీద పల్సర్, అపాచీ బైకుల మధ్య పోటీ అంటే అది కేవలం రెండు బైకుల మధ్య వార్ కాదు.. రెండు వేర్వేరు ఫ్యాన్ బేస్ ల మధ్య జరిగే యుద్ధం. 2022లో ఆగిపోయిన పల్సర్ 180 మళ్ళీ కొత్త అవతారంలో మార్కెట్లోకి రావడంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. దాదాపు రూ.1.25 లక్షల బడ్జెట్‌లో ఒక పవర్‌ఫుల్ బైక్ కొనాలనుకునే కుర్రాళ్లకు ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ బైక్ కొంటే పైసా వసూల్? అనే విషయాలను ఈ కథనంలో చూద్దాం.

కైగర్ సేల్స్‌లో భారీ బూస్ట్.. మార్చిలో 55% గ్రోత్ రికార్డ్!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ ప్రస్తుతం అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగంగా మారింది. మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ తరహా కార్లు అందుబాటు ధర, మంచి మైలేజ్, స్టైలిష్ డిజైన్ ఈ మూడు ముఖ్య అంశాల కలయికతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కేటగిరీలోనే రెనాల్ట్ (Renault) కంపెనీకి చెందిన కైగర్ (Kiger) తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటూ ముందుకు సాగుతోంది. రెనాల్ట్ కైగర్‌ను ఒకసారి గమనిస్తే, దీని డిజైన్ మొదటనే ఆకట్టుకునేలా ఉంటుంది. ఫ్రంట్‌లో ఉన్న బోల్డ్ గ్రిల్, స్లీక్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ లుక్స్ ఈ కారుకు యూత్‌ఫుల్ అప్పీల్‌ను తీసుకువస్తాయి.
Advertisement

రూ.15 లక్షల లోపు బడ్జెట్లో ఈ ఏడాది లాంచ్ కానున్న బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే

భారతదేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎస్‌యూవీల (SUV) హవానే నడుస్తోంది. రోడ్డుపై గంభీరంగా కనిపించే లుక్, అదిరిపోయే గ్రౌండ్ క్లియరెన్స్, ఫ్యామిలీ అంతా సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుండటంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా వీటికే ఓటేస్తున్నారు. మీరు కూడా ఒక మంచి ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీ బడ్జెట్ 15 లక్షల లోపే ఉందా? అయితే కొద్ది రోజులు ఆగండి. మార్కెట్లోకి టాప్ బ్రాండ్ల నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త కార్లు రాబోతున్నాయి. కేవలం 8 లక్షల నుంచే వీటి ధరలు ఉండబోతున్నాయి.

తక్కువ ధర.. ఎక్కువ డిమాండ్.. గ్రావైట్ మార్చిలో సూపర్ హిట్!

భారతీయ కార్ మార్కెట్లో తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చే SUVలకి ఎప్పటికీ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. అలాంటి సెగ్మెంట్‌లోనే నిస్సాన్ (Nissan) కంపెనీకి చెందిన గ్రావైట్‌ (Gravite)మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఫిబ్రవరి 17న ఈ కారును అధికారికంగా మార్కెట్లోకి తీసుకువచ్చినప్పటి నుంచి, ఇది కొనుగోలుదారుల దృష్టిని గట్టిగా ఆకర్షిస్తోంది. ప్రత్యేకంగా బడ్జెట్‌లో 7-సీటర్ లుక్, SUV స్టైల్, అలాగే అందుబాటు ధర కలయికతో ఈ కారు చాలా మందికి మొదటి ఎంపికగా మారుతోంది. ఈ కారులో ఉన్న డిజైన్ కూడా దాని విజయానికి ఒక ప్రధాన కారణం. స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్స్, బోల్డ్ బాడీ లైన్స్‌తో ఇది ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. అంతేకాదు, ఇంటీరియర్‌లో కూడా వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫీచర్లను అమర్చారు.

రూ.1.29 లక్షలకే 320 కి.మీ రేంజ్ ఇచ్చే కొత్త స్కూటర్ లాంచ్

దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మరోసారి తన మార్కును చూపించింది. రేంజ్ విషయంలో భయపడే వారికి భరోసా ఇస్తూ ఏకంగా 320 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే సరికొత్త స్కూటర్‌ను రంగంలోకి దించింది. అదే ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ 5.2 kWh (Ola S1 X+ 5.2 kWh) వేరియంట్. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక అద్భుతమైన కానుక అని చెప్పవచ్చు. ఈ కొత్త స్కూటర్ ప్రత్యేకతలు, ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

మధ్య తరగతి బడ్జెట్‌లో ప్రాణాలకు రక్షణనిచ్చే టాప్-5 బైకులు ఇవే

మనదేశంలో టూ వీలర్ ప్రయాణం ఎంత సరదాగా ఉంటుందో అంతే రిస్క్‌తో కూడుకుంది. ముఖ్యంగా వానాకాలంలో లేదా ఇసుక రోడ్ల మీద సడన్ బ్రేక్ వేస్తే బైక్ స్కిడ్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. ఇలాంటి సమయాల్లో ప్రాణాలను కాపాడే సంజీవని లాంటి టెక్నాలజీనే'ABS' (Anti-lock Braking System). బండి స్పీడుగా వెళ్తున్నప్పుడు బ్రేక్ నొక్కినా వీల్స్ లాక్ అవ్వకుండా చూస్తూ, బైక్ అదుపు తప్పకుండా ఆపేందుకు ఇది సాయపడుతుంది. సాధారణంగా ఖరీదైన బైకుల్లో మాత్రమే కనిపించే ఈ ఫీచర్, ఇప్పుడు బడ్జెట్ బైకుల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. అతి తక్కువ ధరలో ఏబీఎస్ ఫీచర్‌తో లభిస్తున్న టాప్-5 బైకుల వివరాలు చూద్దాం.
Advertisement

ఇన్నాళ్ల నిరీక్షణకు తెర దించనున్న మారుతి

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన రూటు మారుస్తోంది. ఇప్పటివరకు పెట్రోల్, సిఎన్‌జీ కార్లతో మార్కెట్‌ను ఏలిన మారుతి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) సెగ్మెంట్‌లో కూడా జెండా పాతేందుకు సిద్ధమైంది. 2031 నాటికి వరుసగా కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎంపీవీ, ఒక బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాంక్స్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఉన్నాయి. మారుతి సుజుకి నుంచి రాబోతున్న ఆ మూడు అద్భుతమైన కార్ల వివరాలు చూద్దాం.

కియా సెల్టోస్ మరోసారి ఫామ్‌లో.. 11 వేలకుపైగా యూనిట్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ SUV విభాగాన్ని కొత్త దిశగా తీసుకెళ్లిన మోడళ్లలో కియా సెల్టోస్ (Kia Seltos) ఒకటి. మార్కెట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఈ SUV తన ప్రత్యేకమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో, Kia బ్రాండ్‌కు భారతదేశంలో ఒక బలమైన గుర్తింపును తీసుకురావడంలో సెల్టోస్ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ ఈ SUV తన క్రేజ్‌ను కొనసాగిస్తూ, అమ్మకాల పరంగా మంచి ప్రదర్శనను చూపుతోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, మార్చి 2026లో సెల్టోస్ మొత్తం 11,041 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్యను గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, దీని పెరుగుదల మరింత స్పష్టంగా తెలుస్తుంది. మార్చి 2025లో ఈ SUV 6,525 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది.

రూ.20 లక్షల్లో అదిరిపోయే రోడ్ ప్రెజెన్స్ ఇచ్చే టాప్-3 ఎస్‌యూవీలు

భారతీయ రోడ్లపై ఎస్‌యూవీల (SUV) హవా నడుస్తోంది. ఒకప్పుడు కేవలం ప్రయాణం కోసం కార్లను కొనేవారు, కానీ ఇప్పుడు రోడ్ ప్రెజెన్స్ (Road Presence) చూసి కొంటున్నారు. అంటే కారు రోడ్డు మీద వెళ్తుంటే అందరూ తిరిగి చూడాలి, పక్కన ఉన్న వాహనాలు దారి ఇవ్వాలి.. అదే అసలైన ఎస్‌యూవీ దర్పం. మీ బడ్జెట్ 20 లక్షల రూపాయల లోపు ఉండి, అదిరిపోయే లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్ ఉన్న కారు కావాలంటే.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్-3 ఎస్‌యూవీల గురించి వివరంగా తెలుసుకుందాం.

మారుతి ఫ్రాంక్స్‌కు పెరుగుతున్న క్రేజ్.. మార్చిలో భారీ సంఖ్యలు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ దూసుకుపోతోంది. ప్రారంభం నుంచే ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, కంపెనీపై ఉన్న వినియోగదారుల నమ్మకం కలిసి ఈ SUVకు భారీ క్రేజ్ తీసుకువచ్చాయి. రోడ్డుపై ఈ కారు కనిపిస్తేనే ఒక ప్రీమియం ఫీల్ కలిగించగలిగేలా డిజైన్ చేయబడటం దీని ప్రధాన బలం. అందుకే, మధ్యతరగతి కుటుంబాల నుంచి యువత వరకు ప్రతి వర్గం కూడా ఈ మోడల్‌పై ప్రత్యేక ఆసక్తి చూపుతోంది. ఈ పెరుగుతున్న ఆదరణ కేవలం మాటల్లోనే కాదు, అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 2026లో ఫ్రాంక్స్ మరోసారి తన సేల్స్‌తో దృష్టిని ఆకర్షించింది.
Advertisement

రోజూ ఆఫీస్‌కు వెళ్లే వారికి బెస్ట్ 5 బైక్స్ ఇవే

ప్రస్తుత కాలంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త బైక్ మార్కెట్లోకి వస్తూనే ఉంది. ఇన్ని ఆప్షన్ల మధ్య సామాన్య వాహనదారుడు అయోమయానికి గురికావడం సహజం. మనం తరచుగా బైక్ లుక్స్, స్పీడ్, ఫీచర్ల మోజులో పడి దాని రిలయబిలిటీ, మెయింటెనెన్స్‌ని మర్చిపోతుంటాం. కానీ, ప్రతిరోజూ ఆఫీసుకో లేదా వ్యాపార పనులకో వెళ్లే వారికి కావాల్సింది దారి మధ్యలో హ్యాండ్ ఇవ్వని, తక్కువ ఖర్చుతో నడిచే బైక్. అలాంటి టాప్ 5 బైకుల గురించి తెలుసుకుందాం.