ఉద్యోగస్తులకు బెస్ట్ ఆప్షన్ ఈ కారు

జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారత మార్కెట్లో తన స్థాయిని మరింత బలపరచుకునే దిశగా మరో కీలక అడుగు వేసింది. మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun)ను ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో మరింత ఆకర్షణీయంగా తీసుకొచ్చింది. కొత్తగా పరిచయం చేసిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్, గత మోడల్‌కు ఉన్న బలాలను కొనసాగిస్తూ, మరింత ప్రీమియం లుక్, ఆధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఇప్పటికే భారతీయ వినియోగదారులలో నమ్మకాన్ని పొందిన టైగన్, డ్రైవింగ్ డైనమిక్స్, సేఫ్టీ స్టాండర్డ్స్, బిల్డ్ క్వాలిటీ పరంగా మంచి పేరును తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావడం ద్వారా కంపెనీ తన విజయాన్ని కొనసాగించాలనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది.

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో వెళ్లొచ్చు..చుట్టాలను కూడా ఎక్కించుకోవచ్చు

పెద్ద కుటుంబం ఉండి, అందరూ కలిసి ఒకే కారులో విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారికి 2026 సంవత్సరం ఒక వరమనే చెప్పాలి. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి ఈ ఏడాది అదిరిపోయే ఫీచర్లు, అదిరిపోయే మైలేజీతో కూడిన 5 కొత్త 7-సీటర్ ఎస్‌యూవీలు (SUVs) అడుగుపెట్టబోతున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉండటం విశేషం. టాటా, మహీంద్రా, టయోటా వంటి దిగ్గజ కంపెనీలు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి.

ఎలక్ట్రిక్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మ్యాజిక్.. ఫ్లయింగ్ ఫ్లీ C6 రివ్యూ

2024లో జరిగిన EICMA 2024లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ కాన్సెప్ట్‌ను మొదటిసారి ప్రదర్శించినప్పుడు, భారత మోటార్‌సైకిల్ ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. పెట్రోల్ ఇంజిన్ సౌండ్‌తో గుర్తింపు పొందిన బ్రాండ్ అకస్మాత్తుగా ఎలక్ట్రిక్ బైక్ వైపు అడుగులు వేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక సంవత్సరం తర్వాత EICMA 2025లో దాదాపు ప్రొడక్షన్‌కు సిద్ధమైన ఫ్లయింగ్ ఫ్లీ C6 (Royal Enfield Flying Flea C6) ను చూపించడంతో ఆ ఆశ్చర్యం మరింత నిజమైంది.

కొనుగోలుదారుల ఫేవరెట్‌గా హైరైడర్.. ఏడాదిలోనే భారీ రికార్డ్

2022లో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ (Toyota Urban Cruiser Hyryder) భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పుడు, దీనిపై చాలా మందికి కొంత సందేహం ఉండేది. కారణం కూడా ఉంది. అప్పటికే కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యూందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి బలమైన మోడళ్లు స్థిరపడిపోయాయి. ఈ పోటీ మధ్యలో కొత్తగా వచ్చిన హైరైడర్‌కు ఎంతమాత్రం ఆదరణ లభిస్తుందో అనే ప్రశ్న సహజంగానే అందరిలోనూ కనిపించింది. అయితే, మార్కెట్ స్పందన మాత్రం ఈ అంచనాలను పూర్తిగా మార్చేసింది. మొదట్లో కొంచెం జాగ్రత్తగా చూసిన కొనుగోలుదారులు, క్రమంగా హైరైడర్ వైపు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా దీని హైబ్రిడ్ టెక్నాలజీ, మెరుగైన మైలేజ్, అలాగే టయోటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కలిసి ఈ SUVకు మంచి స్థానం తీసుకువచ్చాయి.
Advertisement

గ్యారెంటీగా 15 ఏళ్లు గ్యారేజీకి వెళ్లకుండా నడిచే కార్లు ఇవే

కారు కొనడం అనేది ఈ రోజుల్లో సామాన్యుడికి ఒక జీవితకాల కల. లక్షలు పోసి కొన్న కారు కనీసం పది, పదిహేనేళ్లయినా గట్టిగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ, మార్కెట్లో ఉన్న అన్ని కార్లు ఆ గ్యారెంటీని ఇవ్వలేవు. ఇంజిన్ లైఫ్, బాడీ స్ట్రెంత్, మెయింటెనెన్స్.. ఇలా అన్ని విషయాల్లో తోపు అనిపించుకునే వెహికల్స్ మార్కెట్లో కొన్ని మాత్రమే ఉంటాయి. మీరు గనుక ఒకసారి కొంటే మరో 15 ఏళ్ల వరకు కొత్త కారు వైపు చూడాల్సిన అవసరం లేని 5 బెస్ట్ ఎస్‌యూవీల (SUVs) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలోనే చౌకైన కారు.. భారీగా మైలేజీ ఇచ్చే కారు

భారతదేశంలో కార్ల అమ్మకాల గురించి మాట్లాడాల్సి వస్తే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు మారుతి సుజుకి. సామాన్యుడి బడ్జెట్ కారు దగ్గర నుంచి విలాసవంతమైన మోడళ్ల వరకు మారుతి హవా కొనసాగుతుంటుంది. కానీ, అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మారుతి సుజుకి గ్యారేజీలో ఉన్న ఒక కారు మాత్రం ప్రస్తుతం ఐసీయూలో ఉన్న రోగిలా విలవిలలాడుతుంది. అదే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso). ఒకప్పుడు మార్కెట్లోకి ఎంతో ఆశలతో అడుగుపెట్టిన ఈ మోడల్ ఇప్పుడు కస్టమర్లు లేక వెలవెలబోతోంది.

జూబ్లీహిల్స్‌లో జేమ్స్ బాండ్ కారు.. బటన్ నొక్కితే నంబర్ ప్లేట్ మాయం

హైదరాబాద్‌లోని ఖరీదైన జూబ్లీహిల్స్ రోడ్ల మీద అర్థరాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఓవర్ స్పీడ్ వంటివి చూడటం పోలీసులకు మామూలే. కానీ, ఆ రాత్రి వారు చూసిన దృశ్యం వారిని నివ్వెరపోయేలా చేసింది. హాలీవుడ్ యాక్షన్ హీరో జేమ్స్ బాండ్ సినిమాల్లో కార్లకు నంబర్ ప్లేట్లు రివర్స్ అవ్వడం చూస్తుంటాం. సరిగ్గా అలాంటి నెంబర్ ప్లేట్ ఫ్లిప్పింగ్ (Number Plate Flipping) టెక్నాలజీతో కూడిన ఒక లగ్జరీ బీఎండబ్ల్యూ (BMW) కారు హైదరాబాద్ పోలీసులకు చిక్కింది. సిటీ చరిత్రలోనే ఇలాంటి హైటెక్ మోసం బయటపడటం ఇదే మొదటిసారి.

మీ స్కూటర్ దొంగిలించే ముందే ఫోన్ కు మెసేజ్ ఇచ్చే టాప్ 5 స్కూటర్లు ఇవే

ఇప్పటి రోజుల్లో వాహనం కొనడం ఎంత ముఖ్యమో, దాని భద్రతను చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లను దొంగలు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. అయితే, టెక్నాలజీ పెరిగే కొద్దీ దొంగల కంటే ఒక అడుగు ముందే ఉండేలా కంపెనీలు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. కేవలం స్కూటర్ ఎక్కడుందో చెప్పడమే కాకుండా, ఎవరైనా దాన్ని తాకినా లేదా దొంగిలించడానికి ప్రయత్నించినా వెంటనే మీ మొబైల్‌కు అలర్ట్ పంపే యాంటీ థెఫ్ట్ (Anti-theft), జియో ఫెన్సింగ్ (Geo-fencing) ఫీచర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
Advertisement

రాబోతున్న 3 ఎస్‌యూవీలు మార్కెట్‎ను మార్చేయడం ఖాయం

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో జపాన్ దిగ్గజం హోండా (Honda) మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం కేవలం సిటీ, అమేజ్, ఎలివేట్ వంటి పరిమిత మోడళ్లతోనే నెట్టుకొస్తున్న హోండా, ఇప్పుడు రూట్ మార్చింది. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ కార్లదే అని అందరూ అంటున్నా, హోండా మాత్రం హైబ్రిడ్ టెక్నాలజీ (Hybrid Technology) వైపు మొగ్గు చూపుతోంది. ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ ఆందోళన (Range Anxiety) లేకుండా, సాధారణ పెట్రోల్ కార్ల కంటే రెట్టింపు మైలేజీని ఇచ్చే 3 కొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీలను (Hybrid SUVs) హోండా త్వరలో లాంచ్ చేయబోతోంది.

ఈ కారు కావాలంటే 7 నెలలు ఆగాలి.. ఇప్పటికే 25,000 మంది కొన్నారు

టాటా మోటార్స్ తన ఐకానిక్ బ్రాండ్‎తో ఇండియా రోడ్ల మీద మళ్లీ పంజా విసిరింది. ఒకప్పుడు ఎస్‌యూవీ (SUV) ప్రియుల కలల కారుగా వెలుగొందిన టాటా సియెర్రా (Tata Sierra), ఇప్పుడు సరికొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చి రికార్డులు క్రియేట్ చేస్తోంది. జనాలు దీనికి ఎంతలా ఫిదా అయిపోయారంటే, అమ్మకాల్లో ఇది టాటా సొంత కార్లు అయినటువంటి హారియర్, సఫారి, కర్వ్‌లను కూడా వెనక్కి నెట్టేసింది. కేవలం మూడు నాలుగు నెలల్లోనే 25,000 యూనిట్ల మార్కును దాటేసి, టాటా మోటార్స్ పాలిట టైటానిక్ లాంటి బలమైన నౌకగా నిలిచింది. టాటా సియెర్రా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఊహించని విజయాన్ని అందుకుంది. కంపెనీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. సియెర్రా అమ్మకాలు 25,000 యూనిట్ల మైలురాయిని అధిగమించాయి. కేవలం డిసెంబర్ 2025లో కేవలం 291 యూనిట్లు అమ్ముడైన ఈ కారు, జనవరి 2026 నాటికి 7,003 యూనిట్లకు చేరుకుంది. మార్చి 2026లో ఏకంగా 9,003 యూనిట్లు అమ్ముడై, టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలోని టియాగో, ఆల్ట్రోజ్, టిగోర్ వంటి పాపులర్ మోడళ్లను కూడా దాటేసింది. ఈ భారీ డిమాండ్ కారణంగా ప్రస్తుతం ఈ కారు కొనాలంటే కనీసం 7 నెలల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సరికొత్త సియెర్రాను టాటా మోటార్స్ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో తీర్చిదిద్దింది. పవర్ ఫుల్ రైడ్ కోరుకునే వారి కోసం 1.5-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 158bhp పవర్, 255Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మైలేజీని కోరుకునే వారి కోసం 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (105bhp), డీజిల్ ప్రియుల కోసం 1.5-లీటర్ ఫోర్-పాట్ డీజిల్ ఇంజిన్ (116bhp) అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. సియెర్రా లోపలి భాగం (Interior) అత్యంత లగ్జరీగా ఉంటుంది. టాటా కర్వ్ తరహాలోనే ఇందులో ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్ ఉంది. మ్యూజిక్ లవర్స్ కోసం 12-స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్‌ను సౌండ్ బార్‎తో కలిపి ఇచ్చారు. అలాగే హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు దీని సొంతం. ఈ కారులోని ప్రధాన ఆకర్షణ అల్పైన్ రూఫ్ (Alpine Roof). పాత కాలపు సియెర్రా గుర్తుగా పైన ఫ్లాట్ గ్లాస్ రూఫ్ ఇచ్చారు, ఇది సన్‌రూఫ్‌తో కలిసి కారు లోపల విశాలమైన అనుభూతిని కలిగిస్తుంది. టాటా అంటేనే సేఫ్టీ.. సియెర్రా ఆ నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ కారులో స్టాండర్డ్ ఫీచర్లుగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS తో కూడిన EBD, స్టెబిలిటీ ప్రోగ్రామ్, పిల్లల సేఫ్టీ కోసం ISOFIX మౌంట్‌లు ఇచ్చారు. అంతేకాకుండా, ఇందులో లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్ ఉంది, ఇది ప్రమాదాలను ముందే పసిగట్టి డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. 360-డిగ్రీ కెమెరా ద్వారా కారు చుట్టూ ఉన్న దృశ్యాలను స్క్రీన్‌పై స్పష్టంగా చూడవచ్చు. 4.6 మీటర్ల పొడవు, 2.7 మీటర్ల వీల్‌బేస్‌తో ఈ కారు రోడ్డుపై చాలా గంభీరంగా కనిపిస్తుంది. టాటా సియెర్రాను కంపెనీ మొత్తం 24 వేర్వేరు వేరియంట్లలో విక్రయిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమై రూ.21.29 లక్షల వరకు ఉంటుంది. ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ వంటి గట్టి పోటీదారులను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, దీని ఐకానిక్ డిజైన్, టాటా బ్రాండ్ వాల్యూ వల్ల జనం దీని వైపు మొగ్గు చూపుతున్నారు. టాటా మోటార్స్ కూడా ఈ కారు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని (Production Capacity) పెంచుతోంది.

టాటా ఆల్ట్రోజ్ మరోసారి సత్తా చాటింది.. మార్చిలో భారీ అమ్మకాలు!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ ఎప్పటికప్పుడు తీవ్ర పోటీతో నిండినదే. ఈ విభాగంలో అనేక కంపెనీలు తమ మోడళ్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) మాత్రం తన ప్రత్యేకతతో నిలకడగా ముందుకు సాగుతోంది. డిజైన్, భద్రత, ధర, ఫీచర్లు కలిపి ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక విశ్వసనీయ ఎంపికగా నిలబెట్టాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే, టాటా మోటార్స్ ఈ మోడల్‌ను రూపొందించిన తీరు, భారతీయ వినియోగదారుల అవసరాలను ఎంత బాగా అర్థం చేసుకుందో చూపిస్తుంది. బలమైన బిల్డ్ క్వాలిటీ, 5-స్టార్ భద్రతా రేటింగ్, ప్రాక్టికల్ ఫీచర్లు కలిసి ఆల్ట్రోజ్‌పై కస్టమర్లలో నమ్మకాన్ని పెంచాయి. అందుకే ఈ కారు గత కొంతకాలంగా మార్కెట్లో స్థిరమైన అమ్మకాల ప్రదర్శనను కొనసాగిస్తోంది.

పెట్రోల్ కార్లకు షాక్.. EVలకు పూర్తి రోడ్ టాక్స్ మాఫీ!

దేశ రాజధాని ఢీల్లీలో (Delhi)లో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించేందుకు పలు ప్రోత్సాహకాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం 2026-2030 కాలానికి సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ముసాయిదా పాలసీని విడుదల చేసింది. ఈ పాలసీ లక్ష్యం స్పష్టంగా ఒకటే, రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడం, అలాగే క్లీన్ మొబిలిటీని ప్రోత్సహించడం. ఈ ముసాయిదా ప్రకారం, ఢిల్లీలో రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లపై పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఎక్స్-షోరూమ్ ధర రూ.30 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% మినహాయింపు ఇవ్వబడుతుంది.
Advertisement

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పల్సర్ బైక్ వచ్చేసింది!

భారతీయ టూ-వీలర్ మార్కెట్లో యువతకు ఎప్పటికీ ఫేవరెట్‌గా నిలిచిన పల్సర్ సిరీస్‌లో ఒక ప్రత్యేక స్థానం కలిగిన బజాజ్ పల్సర్ 180 (Bajaj Pulsar 180) మళ్లీ రంగంలోకి అడుగుపెట్టింది. దాదాపు మూడు సంవత్సరాలకుపైగా విరామం తర్వాత, బజాజ్ ఆటో (Bajaj Auto) ఈ బైక్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకురావడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒకప్పుడు స్ట్రీట్‌పై యువత స్టైల్‌ను నిర్వచించిన ఈ మోడల్ రీ-ఎంట్రీ ఇవ్వడం ఆటోమొబైల్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ బైక్ తిరిగి రావడానికి మరో ముఖ్య కారణం దాని ఆకర్షణీయమైన ధర. కేవలం రూ. 1.22 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి రావడం వల్ల, ఇది మళ్లీ బడ్జెట్ స్పోర్టీ బైక్ సెగ్మెంట్‌లో గట్టి పోటీని సృష్టించే అవకాశం ఉంది.

లగ్జరీ EV మార్కెట్‌లో BMW iX1 దుమ్మురేపుతోంది

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ (BMW)కు 2026 సంవత్సరం నిజంగా గ్రాండ్ స్టార్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఇప్పటికే లగ్జరీ కార్ల మార్కెట్‌లో తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో కూడా, ఈ బ్రాండ్ తన ప్రదర్శనతో ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అయితే, BMW పూర్తిగా ఆధిపత్యం చాటుతూ ఇతర కంపెనీలకు గట్టి సవాల్ విసురుతోంది. 2026 మొదటి త్రైమాసికం (జనవరి నుంచి మార్చి వరకు)లో కంపెనీ మొత్తం 1,185 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం గమనార్హం. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 83 శాతం పెరుగుదల సాధించడం నిజంగా పెద్ద విజయంగా చెప్పుకోవాలి. ఈ గణాంకాలు చూసినప్పుడు, భారతదేశంలో ఎలక్ట్రిక్ లగ్జరీ కార్లపై డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతుందో స్పష్టమవుతోంది.

ఇంత మంచి కారును ఒక్కరూ కొనడం లేదు

ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్లో తన ఉనికిని పెంచుకునేందుకు క్రమంగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా 2026 మార్చి నెలలో కంపెనీ మొత్తంగా చూస్తే మంచి అమ్మకాలను నమోదు చేయడం ఒక పాజిటివ్ సిగ్నల్‌గా చెప్పుకోవచ్చు. సుమారు 758 నుంచి 950 యూనిట్ల వరకు వాహనాలను విక్రయించిన ఈ సంస్థకు, దాని ఎంట్రీ-లెవల్, మిడ్-రేంజ్ మోడళ్లైన Citroen C3 వంటి కార్లు ప్రధానంగా సపోర్ట్ చేశాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్, సింపుల్ డిజైన్, మరియు నగర వినియోగానికి అనుకూలమైన లక్షణాలు ఉండటం వల్ల ఈ మోడళ్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, కంపెనీకి ఒక పెద్ద నిరాశగా మారింది దాని ఫ్లాగ్‌షిప్ SUV అయిన సీ5 ఎయిర్‌క్రాస్ (C5 Aircross).

పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్.. బడ్జెట్‌లో 7 సీటర్ కార్లు ఇవే!

భారతదేశంలో కుటుంబ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యం కారణంగా, పెద్ద కుటుంబాలకు సరిపోయే వాహనాలపై ఎప్పుడూ ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా 7-సీటర్ కార్లు ఈ విభాగంలో అత్యంత ప్రాధాన్యం పొందుతున్నాయి. ఒకే కారులో మొత్తం కుటుంబం సౌకర్యంగా ప్రయాణించగలగడం, లాంగ్ డ్రైవ్‌లకు అనువుగా ఉండటం, అలాగే స్పేస్ పరంగా మెరుగ్గా ఉండటం వంటి కారణాలతో ఇవి చాలా మంది మొదటి ఎంపికగా మారాయి. అయితే చాలామందిలో ఒక అపోహ ఉంది, 7-సీటర్ కార్లు అంటే ఖరీదైనవే, సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండవని. కానీ వాస్తవానికి ఇది పూర్తిగా నిజం కాదు. ప్రస్తుతం అనేక కంపెనీలు తక్కువ ధరలోనే 7-సీటర్ కార్లను అందిస్తున్నాయి. కొన్ని మోడళ్ల ధరలు మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కంటే కూడా తక్కువగా ఉండటం. ఈ కథణంలో కొన్ని కార్లను చూద్దాం.
Advertisement

కొత్తగా కారు కొనే ప్రతి వాళ్లు ఈ మోడల్ కారే కావాలంటున్నారు

భారతదేశంలో ఎస్‌యూవీ (SUV)ల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతుకుల రోడ్లు అయినా, గంభీరమైన లుక్ అయినా మనోళ్లకు ఎస్‌యూవీలే ఫస్ట్ ఛాయిస్. అయితే, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం 2026 (FY2026) సేల్స్ రిపోర్ట్స్ చూస్తుంటే మార్కెట్లో ఒక రేంజ్ లో యుద్ధం జరిగినట్లు కనిపిస్తోంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజా, టాటా పంచ్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి టాటా నెక్సాన్ (Tata Nexon) మరోసారి ఇండియాస్ నంబర్ 1 ఎస్‌యూవీగా నిలిచింది.

ఒకేసారి రెండు సర్‌ప్రైజులు.. డిస్కౌంట్ + కొత్త వైబ్ ఎడిషన్!

భారత మార్కెట్లో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మంచి గుర్తింపు పొందిన మోడళ్లలో హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios) ఒకటి. సరసమైన ధర, స్టైలిష్ డిజైన్‌తో ఈ కారు చాలా మంది కొనుగోలుదారుల మొదటి ఎంపికగా మారింది. ముఖ్యంగా, హ్యుందాయ్ బ్రాండ్‌పై ఉన్న నమ్మకం మరియు తక్కువ నిర్వహణ ఖర్చులు కూడా ఈ కారుకు మంచి డిమాండ్ తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అమ్మకాలను మరింత పెంచేందుకు కంపెనీ ఈ ఏప్రిల్ నెలలో ఈ మోడల్‌పై ప్రత్యేక ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మరింత సరసమైన డీల్‌గా మారింది. ఇప్పటికే బడ్జెట్ సెగ్మెంట్‌లో బలమైన స్థానాన్ని సంపాదించిన ఈ కారు, ఇప్పుడు ఈ ఆఫర్ల వల్ల మరింత మంది దృష్టిని ఆకర్షిస్తోంది.

కొత్తగా కొనేవారికి బెస్ట్! ప్రస్తుతం చాలా మంది ఇదే కావాలంటున్నారు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ SUVల విభాగం రోజురోజుకూ మరింత పోటీగా మారుతోంది. ఈ సెగ్మెంట్‌లో వినియోగదారుల ఆకర్షణను గెలుచుకున్న మోడళ్లలో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (Mahindra XUV 3XO) ఒకటి. 4 మీటర్ల లోపు సైజ్‌తో నగర డ్రైవింగ్‌కు అనువుగా ఉండటంతో పాటు, ఫీచర్లు, పనితీరు పరంగా కూడా ఈ SUV మంచి పేరు సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, 2026 మార్చి నెలలో Mahindra & Mahindra ఈ మోడల్‌ను ఏకంగా 9,199 యూనిట్లుగా విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం వృద్ధి కావడం గమనార్హం. అంటే, కేవలం ఒక ఏడాదిలోనే ఈ SUVపై డిమాండ్ ఎంతగా పెరిగిందో ఈ సంఖ్యలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

స్టాక్ క్లియర్ చేయలేక తలపట్టుకుంటున్న ఉద్యోగులు

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో హ్యుందాయ్ అంటే ఒక తిరుగులేని బ్రాండ్. ముఖ్యంగా క్రెటా, వెన్యూ వంటి మోడళ్లతో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ కంపెనీ రారాజుగా వెలుగుతోంది. అయితే అదే హ్యుందాయ్ నుంచి వచ్చిన ఒక అత్యంత ఖరీదైన, అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు మాత్రం ఇప్పుడు కస్టమర్లు లేక వెలవెలబోతుంది. టెక్నాలజీ పరంగా ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఆ కారును కొనేందుకు ప్రస్తుతం ఎవరూ ముందుకు రాకపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
Advertisement

లగ్జరీ కార్లలో ఎవరికీ అందని స్థాయి.. మెర్సిడెస్ టాప్‌లో

ప్రస్తుతం భారతదేశంలో కార్ల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇంటికి ఒక బైకు ఉంటే సరిపోతుందని భావించిన రోజులు క్రమంగా కనుమరుగైపోయాయి. ఇప్పుడు మాత్రం ప్రతి కుటుంబంలో కనీసం ఒక కారు ఉండాలనే ఆలోచన బలంగా పెరిగింది. జీవనశైలిలో వచ్చిన మార్పులు, పెరుగుతున్న ఆదాయ వనరులు, సౌకర్యాలపై ప్రజల ఆసక్తి కలిసి ఆటోమొబైల్ మార్కెట్‌ను పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా మధ్యతరగతి నుంచి పై స్థాయికి ఎదుగుతున్న వినియోగదారులు ఇప్పుడు కేవలం అవసరానికి మాత్రమే కాదు, సౌకర్యం, ప్రతిష్ట కోసం కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ మార్పు ప్రభావం కేవలం బడ్జెట్ కార్లపైనే కాకుండా, లగ్జరీ కార్ల మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో లగ్జరీ కార్లు చాలా మందికి అందని ద్రాక్షలుగా కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

బడ్జెట్‌లో అదిరిపోయే టాప్ 5 ఎస్‌యూవీలను ట్రై చేయండి

మీరు చాలా కాలంగా పాత హ్యాచ్‌బ్యాక్ కారును వాడుతున్నారా? ఆ చిన్న కారులో ఇరుగ్గా కూర్చోలేక, ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతూ.. ఎప్పుడెప్పుడు ఒక మంచి ఎస్‌యూవీ (SUV)కి అప్‌గ్రేడ్ అవుదామా అని ఎదురుచూస్తున్నారా?.. సాధారణంగా మొదటి కారుగా హ్యాచ్‌బ్యాక్ కొన్నవారు, తమ నెక్ట్స్ కారు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మైలేజీ తగ్గుతుందేమో, మెయింటెనెన్స్ భారమవుతుందేమో, అసలు సిటీ ట్రాఫిక్‌లో పెద్ద కారును తిప్పగలమా? ఇలాంటి ఎన్నో సందేహాలు వారిని వేధిస్తుంటాయి. పాత హ్యాచ్‌బ్యాక్ యజమానుల కోసం అత్యంత అనువైన 5 బెస్ట్ ఎస్యూవీలు ఇవే. ఈ కార్లు మీ బడ్జెట్‌లో ఉండటమే కాకుండా, మీకు ఒక లగ్జరీ అనుభూతిని కూడా అందిస్తాయి.

406 టన్నుల రైలును లాగిన SUV.. MG మెజెస్టర్ ప్రపంచ రికార్డ్!

జెస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India)కు చెందిన ఒక SUV ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సాధారణంగా కార్ల గురించి మాట్లాడేటప్పుడు మైలేజ్, ఫీచర్లు లేదా ధరల గురించి చర్చ జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన కారణంతో ఈ బ్రాండ్ వార్తల్లో నిలిచింది. అదే, తన బలాన్ని ప్రపంచానికి నిరూపించిన ఓ అసాధారణ ఘనత. ఎంజీ మెజెస్టర్ (MG Majestor) పేరుతో వచ్చిన ఈ SUV తాజాగా ఒక అద్భుతమైన సాహసం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. రైల్వే పట్టాలపై నిలిచి ఉన్న భారీ రైలును లాగడం జరిగింది. ఇది సాధారణ విషయం కాదు. ఇలాంటి ప్రయత్నాలు సాధారణంగా ప్రత్యేక యంత్రాలతోనే సాధ్యమవుతాయి. కానీ ఈసారి ఒక SUV ఈ సవాల్‌ను స్వీకరించి, విజయవంతంగా పూర్తి చేయడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ప్రతి 3 SUVల్లో ఒకటి టాటాదే.. నెక్సాన్, పంచ్ సేల్స్ రికార్డ్!

గత ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ (Tata Motors) అమ్మకాలలో అత్యంత కీలక పాత్ర పోషించిన మోడళ్లలో టాటా నెక్సాన్ (Tata Nexon),టాటా పంచ్ (Tata Punch) అగ్రస్థానంలో నిలిచాయి. కాంపాక్ట్ SUV విభాగంలో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ రెండు వాహనాలు వరుసగా మొదటి, రెండో స్థానాలను దక్కించుకోవడం విశేషం. నగర అవసరాలకు సరిపోయే డిజైన్, మంచి మైలేజ్, సేఫ్టీ ఫీచర్లు, సరసమైన ధరల కలయికతో ఈ మోడళ్లు విస్తృతంగా ఆదరణ పొందాయి. ప్రత్యేకంగా చూసుకుంటే, ఈ రెండు మోడళ్లు కలిసి అమ్మకాల పరంగా ఒక పెద్ద మైలురాయిని చేరుకున్నాయి. ఏడాది మొత్తం గణాంకాలను పరిశీలిస్తే, 4 లక్షల యూనిట్ల మార్కును ఎంతో సులభంగా దాటుతూ, మొత్తం 4,00,034 యూనిట్ల అమ్మకాలతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించాయి.
Advertisement

ఈ బైక్ ఒక్కసారి ఎక్కారంటే దిగాలనిపించదు

బ్రిటిష్ క్లాసిక్ బైక్ తయారీదారు ట్రయంఫ్ (Triumph), భారతీయ దిగ్గజం బజాజ్ భాగస్వామ్యంతో విడుదల చేసిన స్క్రాంబ్లర్ 400 X ఒక సెన్సేషన్. అయితే, తాజాగా 2026 మోడల్‌లో ఒక అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. 400సీసీ కేటగిరీలో ఉండాల్సిన ఈ బైక్, ఇప్పుడు 350సీసీ ఇంజిన్‌తో మన ముందుకు వచ్చింది. ఇంజిన్ తగ్గినా, మజా మాత్రం తగ్గలేదనేది ఈ బైక్ రైడ్ చేసిన వారి మాట. మరి ఈ మార్పు ఎందుకు జరిగింది? పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అన్న ఆసక్తికర విషయాలు రివ్యూలో చూద్దాం. ఈ మార్పుకు అసలు కారణం ఏంటి?భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో అమల్లోకి తెచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు వాహన రంగాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ముఖ్యంగా మోటార్ సైకిళ్ల విషయానికి వస్తే.. 350సీసీ లోపు ఉన్న బైక్‌లపై 18 శాతం పన్ను విధిస్తుండగా, ఆ మార్క్ దాటిన బైక్‌లపై ఏకంగా 40 శాతం పన్ను విధిస్తున్నారు. ట్రయంఫ్ 400 సిరీస్ బైక్స్ అన్నీ 398సీసీ ఇంజిన్‌తో ఉండటంతో వాటి ధర విపరీతంగా పెరిగే అవకాశం ఏర్పడింది. కస్టమర్లపై ఆ భారం పడకుండా ఉండాలని, బజాజ్-ట్రయంఫ్ కలిసి ఇంజిన్ కెపాసిటీని 349సీసీకి తగ్గించాలని నిర్ణయించాయి. అలా పుట్టుకొచ్చిందే ఈ 2026 ఎడిషన్ ట్రయంఫ్ రేంజ్.