ఈ బైక్ ఒక్కసారి ఎక్కారంటే దిగాలనిపించదు

బ్రిటిష్ క్లాసిక్ బైక్ తయారీదారు ట్రయంఫ్ (Triumph), భారతీయ దిగ్గజం బజాజ్ భాగస్వామ్యంతో విడుదల చేసిన స్క్రాంబ్లర్ 400 X ఒక సెన్సేషన్. అయితే, తాజాగా 2026 మోడల్‌లో ఒక అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. 400సీసీ కేటగిరీలో ఉండాల్సిన ఈ బైక్, ఇప్పుడు 350సీసీ ఇంజిన్‌తో మన ముందుకు వచ్చింది. ఇంజిన్ తగ్గినా, మజా మాత్రం తగ్గలేదనేది ఈ బైక్ రైడ్ చేసిన వారి మాట. మరి ఈ మార్పు ఎందుకు జరిగింది? పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అన్న ఆసక్తికర విషయాలు రివ్యూలో చూద్దాం. ఈ మార్పుకు అసలు కారణం ఏంటి?భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో అమల్లోకి తెచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు వాహన రంగాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ముఖ్యంగా మోటార్ సైకిళ్ల విషయానికి వస్తే.. 350సీసీ లోపు ఉన్న బైక్‌లపై 18 శాతం పన్ను విధిస్తుండగా, ఆ మార్క్ దాటిన బైక్‌లపై ఏకంగా 40 శాతం పన్ను విధిస్తున్నారు. ట్రయంఫ్ 400 సిరీస్ బైక్స్ అన్నీ 398సీసీ ఇంజిన్‌తో ఉండటంతో వాటి ధర విపరీతంగా పెరిగే అవకాశం ఏర్పడింది. కస్టమర్లపై ఆ భారం పడకుండా ఉండాలని, బజాజ్-ట్రయంఫ్ కలిసి ఇంజిన్ కెపాసిటీని 349సీసీకి తగ్గించాలని నిర్ణయించాయి. అలా పుట్టుకొచ్చిందే ఈ 2026 ఎడిషన్ ట్రయంఫ్ రేంజ్.

పెద్ద ఫ్యామిలీలు దర్జాగా ప్రయాణించేందుకు పర్ఫెక్ట్ కారు

భారతీయ ఆటోమొబైల్ రంగంలో టయోటా పేరు వింటేనే ఒక నమ్మకం, ఒక బ్రాండ్ వాల్యూ గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఎంపీవీ(MPV) సెగ్మెంట్‌లో టయోటాకు ఎదురులేదని మరోసారి రుజువైంది. ఆ సంస్థ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) సరికొత్త రికార్డును సృష్టించింది. విడుదలైన అతి తక్కువ కాలంలోనే 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటి, భారతీయ రోడ్లపై తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నవంబర్ 2022లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఇన్నోవా హైక్రాస్, కేవలం మూడున్నరేళ్ల లోపే (ఏప్రిల్ 2026 నాటికి) 2 లక్షల క్యుములేటివ్ సేల్స్ మార్కును దాటింది. భారతీయ కస్టమర్లు హైబ్రిడ్ టెక్నాలజీ వైపు ఎంత వేగంగా మళ్లుతున్నారో ఈ గణాంకాలే నిదర్శనం. టయోటా గ్లోబల్ ప్లాట్‌ఫామ్ అయిన TNGA మీద ఆధారపడి తయారైన ఈ కారు, అటు ఎస్‌యూవీ (SUV) లాంటి పవర్, ఇటు ఎంపీవీ లాంటి సౌకర్యాన్ని కలగలిపి అందిస్తోంది. హైక్రాస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది దాని 5th జనరేషన్ సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్. ఇందులో 2.0 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 186 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ లోపల డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా దూరం వరకు ఈ కారు ఈవీ (EV) మోడ్‌లోనే నడుస్తుంది. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గి, మైలేజ్ భారీగా పెరుగుతుంది.

ఫోన్ ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టే 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

నేటి కాలంలో డెలివరీ బాయ్స్, ఫీల్డ్ వర్క్ చేసే వారికి బైక్ ఎంత ముఖ్యమో, వారి స్మార్ట్‌ఫోన్ కూడా అంతే ముఖ్యం. గూగుల్ మ్యాప్స్ చూడాలన్నా, ఆర్డర్స్ తీసుకోవాలన్నా ఫోన్ ఎప్పుడూ ఆన్‌లో ఉండాలి. కానీ రోజంతా బయట తిరిగేవారికి ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం ఒక పెద్ద తలనొప్పి. పవర్ బ్యాంకులు మోయడం, ఎక్కడైనా హోటల్ దగ్గర ఛార్జింగ్ కోసం బతిమిలాడటం కంటే.. బైక్‌లోనే ఛార్జింగ్ సదుపాయం ఉంటే ఆ కిక్కే వేరు. అందుకే, డెలివరీ పనుల కోసం ప్రత్యేకంగా మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీతో వస్తున్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు తెలుసుకుందాం.

ఒక్క ఛార్జ్‌తో 154 కి.మీ.. Flying Flea C6 మార్కెట్‌లో హల్‌చల్!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పుడూ తన ప్రత్యేక శైలితో ముందుండే రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఇప్పుడు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కూడా తన అడుగును బలంగా ముద్రించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను కంపెనీ అధికారికంగా భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త బైక్‌ను కంపెనీ తన కొత్త సబ్-బ్రాండ్ అయిన Flying Flea కింద తీసుకొచ్చింది. ఈ బ్రాండ్‌లో వచ్చిన తొలి మోడల్‌గా ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) నిలవడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ విషయంలో చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఉన్న క్లాసిక్ DNA ను కొనసాగిస్తూ, ఆధునిక ఎలక్ట్రిక్ టచ్‌ను అందించారు. సిటీ రైడింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బైక్, లైట్‌వెయిట్ బాడీతో పాటు ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది.
Advertisement

ఓలాను వెనక్కి నెట్టి నంబర్ 1 సీటెక్కిన టీవీఎస్

భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో పెను సంచలనం నమోదైంది. నిన్న మొన్నటి వరకు ఈవీ (EV) రంగం అంటే కేవలం కొత్త స్టార్టప్ కంపెనీలదే హవా అనుకున్న వారందరికీ షాక్ ఇస్తూ, ఒక వెటరన్ కంపెనీ రాకెట్ వేగంతో దూసుకొచ్చింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విక్రయాల గణాంకాలు పరిశీలిస్తే, టీవీఎస్ మోటార్స్ (TVS Motors) టాప్ ప్లేస్ కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఓలా, ఏథర్ వంటి కంపెనీలు మార్కెటును ఓ ఊపు ఊపగా, ఇప్పుడు టీవీఎస్ తన నమ్మకమైన సర్వీస్, అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్ల మనసు గెలుచుకుంది. కేవలం 365 రోజుల్లో 3.41 లక్షల స్కూటర్లను విక్రయించి, ఈ సెగ్మెంట్‌లో 3 లక్షల మార్కును దాటిన ఏకైక కంపెనీగా రికార్డు క్రియేట్ చేసింది.

ఒక్క ఏడాదిలో డబుల్ అయ్యిన సేల్స్.. హరియర్ మార్కెట్‌లో మళ్లీ రాజు!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న టాటా మోటార్స్‌ (tata motors) లైనప్‌లో హారియర్ (harrier) ఎప్పటినుంచో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బలమైన బిల్డ్ క్వాలిటీ, అగ్రెసివ్ డిజైన్, ప్రీమియం రోడ్ ప్రెజెన్స్ కలిపి ఈ SUVను వినియోగదారుల ఫేవరెట్‌గా నిలబెట్టాయి. నగర రోడ్లపై గానీ, హైవేలపై గానీ ఈ వాహనం కనిపిస్తే ప్రత్యేకంగా కనిపించే స్టైల్ దీనికి ఉంది. ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న ఈ SUVపై క్రేజ్ తగ్గేలా కనిపించలేదు. దీనికి నిదర్శనంగా ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు నిలుస్తున్నాయి. 2026 మార్చి నెలలో Tata Harrier మొత్తం 2,826 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం గమనార్హం.

దేశంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లు

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి కుటుంబం తమ నెలవారీ ఖర్చులను తగ్గించుకునే మార్గాలను వెతుకుతోంది. ఈ పరిస్థితుల్లో, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లపై ఆసక్తి సహజంగానే పెరుగుతోంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వినియోగదారులకు ఇంధన వ్యయం తగ్గించడం ఇప్పుడు ప్రధాన లక్ష్యంగా మారింది. అదృష్టవశాత్తూ, 2026లో భారత మార్కెట్లో ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉండే పలు కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లు కేవలం మైలేజ్ పరంగానే కాకుండా, పనితీరు, నమ్మకంలో కూడా మంచి స్థాయిని అందిస్తున్నాయి. ముఖ్యంగా సీఎన్‌జీ (CNG) ఆప్షన్ ఉన్న మోడల్స్ వినియోగదారులకు భారీ ఆదా కలిగిస్తున్నాయి.ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన మోడల్స్‌లో మారుతి సెలెరియో, వ్యాగన్ ఆర్, ఆల్టో K10, స్విఫ్ట్ కార్లు బెస్ట్. వీటి గురించి ఈ కథనంలో చూద్దాం.

స్కూటర్ కొనే రేటులోనే కారుకు డౌన్ పేమెంట్

భారతీయ రోడ్లపై రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మధ్యకాలంలో ఎస్‌యూవీల మధ్య పోటీ పెరిగినప్పటికీ, తన క్రేజ్‌ను ఏమాత్రం తగ్గించుకోకుండా సరికొత్త హంగులతో సమ్మర్ ఎడిషన్‎ను (Hyundai Creta Summer Edition 2026) మార్కెట్లోకి తీసుకువచ్చింది. కేవలం ధర మాత్రమే కాదు, కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఇందులో అందించిన టెక్నాలజీ ఫీచర్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కొత్త ఎడిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ధరలు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Advertisement

కొత్త లుక్‌లో అదిరిపోయే టైగన్ ఫేస్‌లిఫ్ట్

జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజమైన ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen), భారతీయ మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో తన ప్రాధాన్యతను మరింత బలపరిచే దిశగా కొత్త అడుగు వేసింది. ఈ నేపథ్యంలో, టైగన్ ఫేస్‌లిఫ్ట్ (Taigun Facelift) వెర్షన్‌ను తాజాగా పరిచయం చేసింది. ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన ఈ SUV, ఇప్పుడు మరింత ప్రీమియం లుక్, ఆధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా అప్‌డేట్ చేయబడింది. కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో డిజైన్ పరంగా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ముందు భాగంలో రిఫ్రెష్డ్ గ్రిల్, కొత్త స్టైల్ LED లైటింగ్, అప్‌డేటెడ్ బంపర్ డిజైన్ కలిసి కారుకు మరింత ఆకర్షణీయమైన, ప్రీమియం ఫీలింగ్‌ను అందిస్తున్నాయి. ఎక్స్‌టీరియర్‌తో పాటు, ఇంటీరియర్‌లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి.

ఆఫీసుకెళ్లినా, అంగడికెళ్లినా హోండానే

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత ఆటోమొబైల్ చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. దేశంలోని తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కలిపి హోండా కంపెనీ ఏకంగా కోటి (10 మిలియన్లు) వాహనాల విక్రయాలను పూర్తి చేసింది. ఈ ప్రాంతాల్లోని సామాన్యుడి రవాణా అవసరాలను తీర్చడంలో హోండా బ్రాండ్ ఎంతలా మమేకమైందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం నగరాలే కాకుండా మారుమూల పల్లెల్లో కూడా హోండా వాహనాల హవా నడుస్తోంది. ఏ ఏ మోడల్స్ ఎంతలా క్లిక్ అయ్యాయో వివరంగా చూద్దాం.

49,089 కార్లు అమ్మిన Skoda Kylaq.. స్కోడాకు బిగ్ హిట్!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న స్కోడా ఆటో (Skoda Auto) సంస్థకు చెందిన స్కోడా కైలాక్ (Skoda Kylaq) ప్రస్తుతం వినియోగదారుల మధ్య విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా, స్కోడా బ్రాండ్ నుంచి అత్యంత సరసమైన ధరలో లభిస్తున్న కారుగా నిలవడం దీనికి పెద్ద ప్లస్‌గా మారింది. ఈ అందుబాటు ధర, యూరోపియన్ బిల్డ్ క్వాలిటీ, స్టైలిష్ డిజైన్ కలిపి ఈ కారును మధ్యతరగతి కొనుగోలుదారులకు మరింత దగ్గర చేసింది. ఫలితంగా, భారత మార్కెట్లో ఈ మోడల్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. షోరూమ్‌లకు వెళ్లే వినియోగదారుల్లో చాలామంది ఈ కారుపైనే ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా వచ్చిన ఈ కారు అమ్మకాలు మెరుగ్గా ఉండటం విశేషం.

ఐదు బైకులను తొక్కిపారేసి నంబర్ 2 స్థానానికి

బజాజ్ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలైంది. ఒకప్పుడు కేవలం స్కూటర్లకే పరిమితమైన బజాజ్, ఆ తర్వాత మోటార్ సైకిళ్లతో ప్రపంచాన్ని ఏలింది. కానీ ఇప్పుడు మళ్ళీ కాలం వెనక్కి తిరిగినట్లు కనిపిస్తోంది. బజాజ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్, తన సొంత కంపెనీకి చెందిన ఐదు పాపులర్ మోటార్ సైకిళ్లను వెనక్కి నెట్టి సేల్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఫిబ్రవరి 2026 సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే, బజాజ్ పోర్ట్‌ఫోలియోలో చేతక్ ఒక సంచలనంగా మారింది.
Advertisement

మీరు ఈ 3 ఎలక్ట్రిక్ స్కూటర్లను సగం ధరకే కొనవచ్చు

ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఖర్చు ఒక పెద్ద అడ్డంకిగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన వినూత్న విధానమే BaaS (Battery as a Service). ఈ స్కీమ్‌లో వాహనం ధరలో అత్యంత ఖరీదైన భాగమైన బ్యాటరీని వేరు చేస్తారు. దాంతో, కస్టమర్లు స్కూటర్‌ను చాలా తక్కువ ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. బ్యాటరీ కోసం మాత్రం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక విధంగా చూస్తే "pay-as-you-use" మోడల్‌లా పని చేస్తుంది. అవసరానికి అనుగుణంగా ప్లాన్‌ను మార్చుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా స్కూటర్ మొత్తం ధరలో దాదాపుగా సగానికి తగ్గుతుంది. ప్రస్తుతం ఈ విధానంలో లభిస్తున్న కొన్ని స్కూటర్లను చూద్దాం.

ప్రపంచాన్ని ఏలుతున్న కార్లకు ఇండియాలో కోలుకోలేని దెబ్బ

ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారత మార్కెట్లో తొలి అడుగులు అంత ఆశాజనకంగా లేవు. ఎంతో హంగు ఆర్భాటాలతో ఎంట్రీ ఇచ్చిన అమెరికన్ దిగ్గజం, దేశీయ మార్కెట్లోని గట్టి పోటీని తట్టుకోవడంలో ప్రస్తుతం వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా 2026 ఆర్థిక సంవత్సరానికి (FY26) సంబంధించిన అమ్మకాల లెక్కలు పరిశీలిస్తే, టెస్లా కేవలం 342 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. టాటా మోటార్స్, మహీంద్రా వంటి స్వదేశీ కంపెనీలు ఈవీ మార్కెట్లో దూసుకుపోతుంటే, ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా మాత్రం నామమాత్రపు అమ్మకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఒక్క నెలలోనే 1400 యూనిట్లు అవుట్.. డస్టర్ మేనియా మొదలైంది

ఒకప్పుడు భారత రోడ్లపై డస్టర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మధ్యతరగతి ప్రజలకు ఎస్‌యూవీ (SUV) రుచి చూపించిన అసలైన బండి అది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, సరికొత్త అవతారంలో వచ్చిన రెనాల్ట్‎ డస్టర్ 2026 (Renault Duster 2026) ఇప్పుడు మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇస్తూనే రికార్డులు సృష్టిస్తోంది. సేల్స్ మొదలైన తొలి నెలలోనే వెయ్యి యూనిట్ల మార్కును దాటేసి, ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మార్చి 2026 నెలలో ఈ కారు సాధించిన విజయాలు, దీనిలోని అద్భుతమైన ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఒక్కసారిగా డబుల్ జోరు.. హైరైడర్ సేల్స్ 93% పెరిగాయి!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా (Toyota) ప్రస్తుతం మంచి ఫామ్‌లో కొనసాగుతోంది. కంపెనీకి చెందిన మోడళ్లు వరుసగా మంచి అమ్మకాలు సాధిస్తూ, మార్కెట్లో తన బలాన్ని మరింత పెంచుకుంటున్నాయి. ఈ విజయాల్లో ముఖ్యంగా నిలుస్తోంది టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder). ఈ SUV దేశవ్యాప్తంగా భారీ ఆదరణను సంపాదించుకుంటూ, టయోటా లైనప్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. మార్చి 2026 నెల ముగియగానే బయటకు వచ్చిన అమ్మకాల గణాంకాలు ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ కాలంలో హైరైడర్ మొత్తం 10,206 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం గమనార్హం. గత ఏడాది ఇదే మార్చి నెలలో ఈ కారు కేవలం 5,286 యూనిట్లకే పరిమితమై ఉండగా, ఈసారి అమ్మకాలు దాదాపు రెట్టింపు కావడం నిజంగా విశేషం.
Advertisement

దేశంలో అతితక్కువలో లభిస్తున్న 7 సీటర్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తక్కువ ధరలో ఎక్కువ ఉపయోగం అందించే కార్లలో రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఫ్యామిలీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ MPV, ముఖ్యంగా 7 సీట్ల ఎంపికను తక్కువ ధరలో అందించడం వల్ల ఎంతోమంది వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. నగరాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ పెద్ద కుటుంబాలతో ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక ప్రాక్టికల్, సరసమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ కారుకు ఉన్న డిమాండ్ అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 2026లో ట్రైబర్ మొత్తం 2,011 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య కేవలం 1,552 యూనిట్లుగా మాత్రమే ఉండేది. అంటే ఏడాది ప్రాతిపదికన చూస్తే దాదాపు 30 శాతం వృద్ధిని సాధించడం నిజంగా విశేషం.

ఈ మూడు కార్లు వస్తే ప్రత్యర్థుల దుకాణం బందే

భారతీయ రోడ్లపై మారుతి సుజుకి హవా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మధ్యతరగతి ప్రజల నాడి తెలిసిన ఈ దిగ్గజ కార్ల తయారీ సంస్థ, ఇప్పుడు తన మోస్ట్ పాపులర్ కార్లను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకుని వచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కొద్దిరోజులు ఆగండి. ఎందుకంటే మారుతి సుజుకి నుంచి రాబోతున్న మూడు బ్లాక్ బస్టర్ కార్లు మీ ప్రయాణ అనుభవాన్ని మార్చేయనున్నాయి. ముఖ్యంగా బ్రెజ్జాలో రాబోతున్న 6-గేర్ల ఆప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

9 మంది ఒకే కారులో వెళ్లాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో గ్రామీణ రోడ్ల నుంచి చిన్న పట్టణాల వరకు తనదైన ముద్ర వేసుకున్న SUVలలో మహీంద్రా బొలెరో (Mahindra Bolero) ఒకటి. దశాబ్దాలుగా మార్కెట్లో కొనసాగుతున్న ఈ మోడల్, గ్లామర్ కంటే గట్టి పనితీరు, నమ్మకాన్ని ప్రాధాన్యంగా చూసే వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో, కఠినమైన రోడ్లపై కూడా సులభంగా నడిచే సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చు, మెకానికల్ సింప్లిసిటీ బొలెరోను ఒక "నమ్మకమైన భాగస్వామి"గా నిలబెట్టాయి. ఈ విశ్వాసమే ఇప్పుడు అమ్మకాల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 2026లో బొలెరో 9,788 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 8,031 యూనిట్లుగా ఉంది. అంటే ఏడాది ప్రాతిపదికన చూస్తే దాదాపు 22 శాతం వృద్ధి సాధించడం నిజంగా గమనార్హం.

ఏంటి బాబూ ఈ రేంజ్ క్రేజ్.. 12 నెలల్లో 1.80 లక్షల మంది ఫిదా

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు అందరికీ నచ్చేలా కార్లను రూపొందించడంలో ఈ కంపెనీ దిట్ట. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (FY2026) గణాంకాలను పరిశీలిస్తే, మారుతి సుజుకికి చెందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజ్జా (Brezza) మరోసారి తన సత్తా చాటింది. ఏడాది పొడవునా లక్షలాది మంది కస్టమర్లను ఆకట్టుకుంటూ అమ్మకాల్లో దూసుకుపోతోంది.
Advertisement

Royal Enfield C6 ఎలక్ట్రిక్ బైక్ పూర్తి వివరాలు!

భారతదేశంలో క్లాసిక్ బైక్స్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). ఇప్పుడు అదే కంపెనీ తన చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. తన 125 ఏళ్ల ఘన చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేపేందుకు పెట్రోల్ బైక్స్‌తో దశాబ్దాలుగా అభిమానులను అలరించిన ఈ బ్రాండ్, తొలిసారి ఎలక్ట్రిక్ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఈ ప్రయాణానికి ఆరంభం కానున్న బైక్ పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Royal Enfield Flying Flea C6). ఈ బైక్ కేవలం కొత్త మోడల్ మాత్రమే కాదు, రాయల్ ఎన్‌ఫీల్డ్ భవిష్యత్తు దిశను చూపించే కీలక అడుగు. ఇది ఏప్రిల్ 10, 2026న అధికారికంగా విడుదల కానుంది. పట్టణ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్, రోజువారీ కమ్యూటింగ్‌కు అనువుగా ఉండేలా డిజైన్ చేయబడింది.

డ్రైవర్లకు నోట్ల వర్షం కురిపించే ట్రక్.. టాటా ఇచ్చిన గొప్ప వరం

భారతీయ రోడ్ల మీద టాటా మోటార్స్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ప్యాసింజర్ కార్ల విభాగంలో నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీలతో ఎలక్ట్రిక్ విప్లవం తెచ్చిన టాటా, ఇప్పుడు కమర్షియల్ వెహికల్ రంగంలో తన జెండా పాతేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఏస్ ఈవీ (Ace EV) సక్సెస్ తర్వాత, మరింత పవర్ఫుల్, ఎక్కువ బరువు మోయగల టాటా ఇంట్రా ఈవీ (Tata Intra EV) పిక్-అప్ ట్రక్కును తాజాగా మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కేవలం రూ.11.95 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇంత మంచి కారును పట్టించుకోవడం లేదు

భారతీయ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో ఒకప్పుడు అగ్రస్థానాన్ని దక్కించుకుని, "రాజు"గా పేరు తెచ్చుకున్న మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) ఇప్పుడు కొంత వెనకడుగు వేసినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దశాబ్దాలుగా భారతీయ కుటుంబాల విశ్వాసాన్ని గెలుచుకుని, స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, సరసమైన ధరలతో ప్రతి తరానికి దగ్గరైన ఈ కారు అమ్మకాలలో వచ్చిన తగ్గుదల నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మార్చి 2026 అమ్మకాల నివేదికను పరిశీలిస్తే, ఒకప్పుడు షోరూమ్‌ల వద్ద క్యూలు పెట్టించిన ఈ మోడల్ ఇప్పుడు కొంత మందగమనాన్ని ఎదుర్కొంటోంది. గత సంవత్సరం ఇదే సమయంలో ఉన్న డిమాండ్‌తో పోలిస్తే, ఈసారి అమ్మకాలలో గణనీయమైన పడిపోవడం కనిపిస్తోంది.

బడ్జెట్‎లో బెంజ్ లాంటి ఫీచర్లు.. మైలేజీలో స్కూటర్ కి గట్టి పోటీ

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ మధ్యకాలంలో మారుతి నుంచి వచ్చిన ఒక మోడల్ మాత్రం అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అదే మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx). అదిరిపోయే డిజైన్, అద్భుతమైన ఫీచర్లు, అన్నిటికీ మించి సగటు మధ్యతరగతి భారతీయుడు కోరుకునే మైలేజీ.. ఈ మూడు కలగలిసి ఈ కారును ఒక సూపర్ హిట్ ఎస్‌యూవీగా నిలబెట్టాయి. తాజాగా ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు విక్రయాలు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. కేవలం ఒకే ఏడాదిలో ఏకంగా 1.72 లక్షల మంది ఈ కారును తమ ఇంటికి తీసుకెళ్లారు. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో 4 శాతం వృద్ధిని నమోదు చేస్తూ ఫ్రాంక్స్ దూసుకుపోతోంది.
Advertisement

టాటా ఎలక్ట్రిక్ కార్ల కోసం క్యూ కట్టిన కోట్లాది మంది భారతీయులు

భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్లో టాటా మోటార్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మహీంద్రా, హ్యుందాయ్ లేదా ఎంజీ వంటి దిగ్గజ కంపెనీలు రేసులో ఉన్నప్పటికీ, మెజారిటీ భారతీయులు మాత్రం టాటా ఈవీలకే పట్టం కట్టారు. తాజాగా ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో (FY2026) టాటా మోటార్స్ ఏకంగా 92,120 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతకుముందు ఏడాది అంటే 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కేవలం 64,276 యూనిట్లను మాత్రమే విక్రయించగా, ఈ ఏడాది ఏకంగా 43 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఇది టాటా మోటార్స్ చరిత్రలోనే అత్యుత్తమ వార్షిక విక్రయాల రికార్డుగా నిలిచిపోయింది.