ఈ బైక్ ఒక్కసారి ఎక్కారంటే దిగాలనిపించదు
ఆటోమొబైల్స్
- 2 month, 9 days ago
బ్రిటిష్ క్లాసిక్ బైక్ తయారీదారు ట్రయంఫ్ (Triumph), భారతీయ దిగ్గజం బజాజ్ భాగస్వామ్యంతో విడుదల చేసిన స్క్రాంబ్లర్ 400 X ఒక సెన్సేషన్. అయితే, తాజాగా 2026 మోడల్లో ఒక అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. 400సీసీ కేటగిరీలో ఉండాల్సిన ఈ బైక్, ఇప్పుడు 350సీసీ ఇంజిన్తో మన ముందుకు వచ్చింది. ఇంజిన్ తగ్గినా, మజా మాత్రం తగ్గలేదనేది ఈ బైక్ రైడ్ చేసిన వారి మాట. మరి ఈ మార్పు ఎందుకు జరిగింది? పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అన్న ఆసక్తికర విషయాలు రివ్యూలో చూద్దాం. ఈ మార్పుకు అసలు కారణం ఏంటి?భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో అమల్లోకి తెచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు వాహన రంగాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ముఖ్యంగా మోటార్ సైకిళ్ల విషయానికి వస్తే.. 350సీసీ లోపు ఉన్న బైక్లపై 18 శాతం పన్ను విధిస్తుండగా, ఆ మార్క్ దాటిన బైక్లపై ఏకంగా 40 శాతం పన్ను విధిస్తున్నారు. ట్రయంఫ్ 400 సిరీస్ బైక్స్ అన్నీ 398సీసీ ఇంజిన్తో ఉండటంతో వాటి ధర విపరీతంగా పెరిగే అవకాశం ఏర్పడింది. కస్టమర్లపై ఆ భారం పడకుండా ఉండాలని, బజాజ్-ట్రయంఫ్ కలిసి ఇంజిన్ కెపాసిటీని 349సీసీకి తగ్గించాలని నిర్ణయించాయి. అలా పుట్టుకొచ్చిందే ఈ 2026 ఎడిషన్ ట్రయంఫ్ రేంజ్.