కొత్త లుక్‌తో వస్తున్న టైగన్.. ఫీచర్లు, డిజైన్ వివరాలు ఇవే

భారతదేశంలోని మధ్య తరహా SUV మార్కెట్‌లో పోటీ రోజురోజుకు పెరుగుతున్న వేళ, ఆ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని మరింత బలపరచుకోవడానికి ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) సిద్ధమవుతోంది. ఇప్పటికే తక్కువ ధర, బలమైన నిర్మాణం, అద్భుతమైన డ్రైవింగ్ అనుభవంతో మంచి పేరు తెచ్చుకున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Taigun) ఇప్పుడు కొత్త రూపంతో మరోసారి మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అధికారికంగా విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏప్రిల్ 9న లాంచ్‌కు సిద్ధమవుతున్న ఈ మోడల్ కోసం కంపెనీ ఇప్పటికే తన చాకన్ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించడం గమనించదగ్గ విషయం. దీని ద్వారా, ఈ కొత్త మోడల్‌పై కంపెనీకి ఉన్న నమ్మకం, అలాగే మార్కెట్‌లో దాని కోసం ఉన్న డిమాండ్ స్పష్టమవుతోంది.

పేదలు కూడా ఈ కారును ఈజీగా కొనగలరు

భారతదేశంలో సామాన్యుల కారు కలను నిజం చేసిన మోడళ్లలో మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10) ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. తక్కువ ధర, తక్కువ నిర్వహణ ఖర్చు, సులభమైన డ్రైవింగ్ ఈ మూడు లక్షణాల వల్లే ఈ కారు సంవత్సరాలుగా మధ్యతరగతి కుటుంబాల మొదటి ఎంపికగా నిలుస్తోంది. నగరాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ సమానంగా ప్రాచుర్యం పొందిన ఈ మోడల్, భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. మార్కెట్లో కొత్త కార్లు ఎంత వచ్చినా, ఆల్టోకు ఉన్న డిమాండ్ మాత్రం ఇంకా తగ్గలేదు. తాజాగా విడుదలైన సేల్స్ గణాంకాలు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. 2026 మార్చి నెలలో ఆల్టో మొత్తం 11,515 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది ఫిబ్రవరి నెలలో నమోదైన 9,787 యూనిట్లతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల.

మార్కెట్లో కియా ప్రభంజనం.. ఒక్క నెలలోనే 12 వేల కార్లు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సౌత్ కొరియా కార్ల దిగ్గజం కియా (Kia) తన విజయయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. ముఖ్యంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కియా సోనెట్ (Kia Sonet) సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2026 మార్చి నెలలో కియా మోటార్స్ విడుదల చేసిన విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, సోనెట్ కారు అగ్రస్థానంలో నిలిచింది.

అమ్మకాల్లో తగ్గుదల.. అయినా టియాగో క్రేజ్ తగ్గలేదు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ ధర, మంచి మైలేజ్, సులభమైన నిర్వహణ వంటి లక్షణాల వల్ల ఈ విభాగాన్ని ఎక్కువ మంది వినియోగదారులు నమ్మకంగా ఎంచుకుంటున్నారు. అలాంటి కార్లలో టాటా టియాగో (Tata Tiago) ఒక ముఖ్యమైన పేరు. ముఖ్యంగా మొదటిసారి కారు కొనాలనుకునే వారికి ఇది అందుబాటులో ఉండే ఎంట్రీ-లెవల్ కారుగా మంచి గుర్తింపు పొందింది. ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలు ఈ మోడల్ పనితీరును స్పష్టంగా చూపిస్తున్నాయి. 2026 మార్చి నెలలో టాటా టియాగో మొత్తం 7,119 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో పెట్రోల్ వేరియంట్లతో పాటు ఎలక్ట్రిక్ మోడల్ కూడా ఉండటం గమనించదగ్గ విషయం. అంటే, ఒక్క మోడల్‌తోనే రెండు విభాగాల్లో వినియోగదారులను ఆకర్షించే సామర్థ్యం టియాగోకు ఉందని చెప్పవచ్చు.
Advertisement

90 రోజులు దాటింది మామ ఈ కారును ఒక్కరంటే ఒక్కరు కూడా కొనలేదు

భారతదేశపు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు ప్రస్తుతం మార్కెట్లో తిరుగులేదు. థార్, స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 వంటి మోడల్స్‌తో సేల్స్ పరంగా దూసుకుపోతోంది. అయితే, అదే మహీంద్రా పోర్ట్‌ఫోలియోలో ఒక కారు మాత్రం ఇప్పుడు ఐసీయూలో ఉన్న రోగిలా మారిపోయింది. అదే మహీంద్రా మరాజో (Mahindra Marazzo). ఒకప్పుడు ఇన్నోవాకు గట్టి పోటీ ఇస్తుందని భావించిన ఈ 7-సీటర్ కారును కొనేందుకు ఇప్పుడు ఒక్క కస్టమర్ కూడా ముందుకు రావడం లేదు. తాజా మార్చి 2026 విక్రయాల గణాంకాలు చూస్తుంటే ఈ కారు ప్రస్థానం ముగిసిపోయిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పెట్రోల్ ధరల ఎఫెక్ట్.. సీఎన్‌జీ కార్లకు బంపర్ డిమాండ్

భారతదేశ ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో ఒక కీలక మార్పు నెమ్మదిగా కానీ స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో, కొత్తగా వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు ఖర్చు పరంగా లాభదాయకమైన ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు సీఎన్‌జీ వాహనాలపై కూడా ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. ఇది కేవలం ఒక భావన మాత్రమే కాదు, గణాంకాల ద్వారా కూడా స్పష్టమవుతోంది. గత ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే, ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలలో సీఎన్‌జీ వాహనాల వాటా గణనీయంగా పెరిగింది. FY25లో 19.60 శాతంగా ఉన్న ఈ వాటా, FY 2025-26 నాటికి 21.98 శాతానికి చేరుకుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2026 మార్చి నెలలో ఈ వాటా 23.76 శాతానికి పెరగడం.

విదేశాల నుంచి వచ్చినా మనోళ్లు గుండెల్లో పెట్టుకున్నారు

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో సౌత్ కొరియా దిగ్గజం హ్యుందాయ్ తన పట్టును నిలబెట్టుకుంటూనే ఉంది. ఈ ఏడాది మార్చి నెల విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో ఎప్పటిలాగే ఒక కారు మాత్రం తన హవాను చాటుతోంది. వెన్యూ, ఆరా, ఎక్స్‌టర్ వంటి మోడల్స్ మార్కెట్లో ఉన్నప్పటికీ, కస్టమర్ల మొదటి ఛాయిస్ మాత్రం క్రెటాగానే నిలిచింది. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ అమ్మకాల్లో తన తోటి మోడల్స్ అయిన i10, i20లను దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు.

4 నెలల్లోనే 20 వేల డెలివరీలు.. ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ సూపర్ హిట్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) మరోసారి తన సత్తా చాటుకుంది. భారతీయ వినియోగదారుల అభిరుచిని అర్థం చేసుకుని, వారి అవసరాలకు తగ్గట్లుగా వాహనాలను రూపొందించే కంపెనీగా మహీంద్రా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అదే కారణంగా, ఈ బ్రాండ్‌కు చెందిన SUVలను సొంతం చేసుకోవాలని ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. బొలెరో వంటి బలమైన గ్రామీణ వాహనం నుంచి ఆధునిక ఫీచర్లతో కూడిన Mahindra XUV700 వరకు విస్తరించిన మోడల్ లైనప్‌ను చూస్తే, ప్రతి వర్గానికి సరిపోయే వాహనం అందుబాటులో ఉందనే భావన కలుగుతుంది.
Advertisement

కేవలం రూ.6.25 లక్షలకే బైకులాగా మైలేజీ ఇచ్చే కారు

భారత ఆటోమొబైల్ రంగంలో గత నెల మార్చి 2026 విక్రయాలు చూస్తుంటే కారు కొనాలనుకునే వారి అభిరుచులు మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం చిన్న కార్లకే పరిమితమైన జనం, ఇప్పుడు సెడాన్, ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. గత నెలలో జరిగిన కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన ఈ కారు ఏకంగా 21,224 యూనిట్ల అమ్మకాలతో నంబర్ వన్ సీటును దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈ కారు విక్రయాల్లో 37 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం.

600 కిమీ రేంజ్ ఇచ్చే కారుపై ఏకంగా రూ. 1.71 లక్షల భారీ తగ్గింపు

భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్ (Tata Motors), కొత్త కారు కొనాలనుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తన మోస్ట్ స్టైలిష్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూపే టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV) పై ఏప్రిల్ 2026 నెలలో కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. సుమారు 600 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కారుపై ఇప్పుడు ఏకంగా రూ.1.71 లక్షల వరకు ఆదా చేసుకునే సువర్ణావకాశం ఉంది. ఈ ఆఫర్ కేవలం ఏప్రిల్ 30 వరకే అందుబాటులో ఉంటుంది. ఈ కారు ధర, ఫీచర్లు, ఆఫర్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం. టాటా మోటార్స్ ఈ ఏప్రిల్ నెలలో తన ఈవీ లైనప్‌పై భారీ ఎత్తున రాయితీలను అందిస్తోంది. ఇందులో భాగంగా టాటా కర్వ్ ఈవీ కొనుగోలుదారులకు గరిష్టంగా రూ.1.71 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ మొత్తంలో నగదు తగ్గింపు (Cash Discount) తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు, ఇతర బెనిఫిట్స్ కలిసి ఉన్నాయి. పాత కారును మార్చి కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. టాటా కర్వ్ ఈవీ చూడటానికి చాలా భిన్నంగా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. సాధారణ ఎస్‌యూవీలలా కాకుండా, ఇది ఎస్‌యూవీ కూపే డిజైన్‌తో వస్తుంది. అంటే కారు వెనుక భాగం ఏటవాలుగా ఉండి స్పోర్టీ లుక్ ఇస్తుంది. దీని ఎల్‌ఈడీ లైట్ బార్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18 అంగుళాల అలాయ్ వీల్స్ కారుకు ఒక ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తాయి. నగరాల్లోనూ, హైవేలపై ప్రయాణించేటప్పుడు ఈ కారు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఫార్చ్యూనర్‌కు ఛాలెంజ్… ఎంజీ మేజెస్టర్ లాంచ్ డేట్ ఫిక్స్!

భారత ఆటోమొబైల్ రంగంలో తనదైన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించిన ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India), చాలా తక్కువ కాలంలోనే విశ్వసనీయతతో పాటు ఆధునిక టెక్నాలజీకి ప్రతీకగా నిలిచింది. బ్రిటిష్ వారసత్వాన్ని కలిగి ఉన్న ఈ బ్రాండ్, భారత మార్కెట్ అవసరాలను లోతుగా అర్థం చేసుకుని, స్టైల్, సేఫ్టీ, ఫీచర్ల మధ్య సమతుల్యతను కాపాడుతూ వినియోగదారుల మనసును గెలుచుకుంటోంది. ఈ ప్రయాణంలో మరో కీలక అడుగుగా, కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన ఎంజీ మేజెస్టర్‌ (MG Majestor) ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ మోడల్, డిజైన్, పనితీరు, మరియు ఫీచర్ల పరంగా కొత్త ప్రమాణాలను సెట్ చేయాలనే లక్ష్యంతో వస్తోంది.

సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్… సియెర్రా సేల్స్ అదిరిపోయాయి!

భారత ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్న టాటా మోటార్స్ (Tata Motors) మరోసారి తన లెజెండరీ వారసత్వాన్ని గుర్తు చేస్తూ టాటా సియోర్రా (Tata Sierra)ను కొత్త రూపంలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2025 నవంబర్ 25న విడుదలైన ఈ ఎస్‌యూవీ, కేవలం ఒక కొత్త మోడల్‌గా మాత్రమే కాకుండా, ఒక కాలంలో రోడ్లపై ప్రత్యేక గుర్తింపును సంపాదించిన సియెర్రా పేరు తిరిగి జీవం పొందినట్టుగా భావించబడుతోంది. గతంలో తన ప్రత్యేక డిజైన్, బలమైన ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్న ఈ మోడల్, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ, స్టైలిష్ ఎలిమెంట్స్‌తో కొత్త తరం వినియోగదారులను ఆకర్షిస్తోంది. కొత్త సియెర్రా రూపకల్పనలో క్లాసిక్ టచ్‌ను కొనసాగిస్తూ, సమకాలీన ట్రెండ్‌లను చక్కగా మిళితం చేశారు.
Advertisement

బడ్జెట్ రెడీ చేసుకుని ఈ 6 ఎలక్ట్రిక్ కార్లు వచ్చేదాకా వెయిట్ చేయండి

భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా మొదలైంది. ముఖ్యంగా స్వదేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మధ్య ఈవీ పోరు రసవత్తరంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవాలనుకునే వారికోసం, అదిరిపోయే రేంజ్, హైటెక్ ఫీచర్లతో ఈ రెండు కంపెనీలు త్వరలోనే 6 సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను (SUVs) మార్కెట్లోకి తీసుకురానున్నాయి. మీరు కూడా కొత్త ఈవీ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, రాబోతున్న ఈ ఆరు మోడళ్ల వివరాలు చూద్దాం.

ట్రయంఫ్ కొత్త బైక్ వచ్చేసింది… ట్రాకర్ 400 ఫీచర్స్ చూసారా?

బ్రిటిష్ మోటార్‌సైకిల్ దిగ్గజం ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ (Triumph Motorcycles) భారత మార్కెట్‌పై తన దృష్టిని మరింతగా కేంద్రీకరిస్తూ, యువ రైడర్లను ఆకట్టుకునే కొత్త మోడళ్లతో ముందుకు వస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా కంపెనీ తాజాగా Triumph Speed 400 ఆధారంగా రూపొందించిన స్పీడ్ ట్రాకర్ 400 (Speed tracker 400)ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. రూ. 2.46 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసిన ఈ బైక్, ప్రీమియం సెగ్మెంట్‌లో స్టైల్, పనితీరు రెండింటినీ సమతుల్యం చేసేలా రూపొందించబడింది. ఈ బైక్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని డిజైన్. ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ స్ఫూర్తితో రూపొందించిన ఈ మోడల్, ఒకవైపు ఆధునిక క్లాసిక్ రెట్రో లుక్‌ను కొనసాగిస్తూనే, మరోవైపు స్పోర్టీ రోడ్-ఫోకస్డ్ సెటప్‌ను అందిస్తుంది. ఈ కలయిక వల్ల బైక్‌కు ఒక ప్రత్యేకమైన స్ట్రీట్ ప్రెజెన్స్ లభిస్తుంది.

భారత్‌లో ఈవీ స్కూటర్ల జాతర.. టాప్ 5లో నిలిచిన కంపెనీలు ఇవే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా మామూలుగా లేదు. ముఖ్యంగా టూ-వీలర్ విభాగంలో పెట్రోల్ బండ్లకు పోటీగా ఈవీ స్కూటర్లు దూసుకుపోతున్నాయి. 2026 మార్చి నెల భారత ఎలక్ట్రిక్ వాహన రంగ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక విక్రయాలతో ఈ నెల రికార్డు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం ఈ-డ్రైవ్ (PM E-DRIVE) పథకం గడువు ముగుస్తుందన్న వార్తలతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. అయితే, సామాన్యులకు ఊరటనిస్తూ ప్రభుత్వం ఈ పథకాన్ని జూలై 2026 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో మార్చి 2026లో అత్యధికంగా అమ్ముడైన టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ల వివరాలు చూద్దాం.

టాటా ముందే ఉంది.. కానీ మిగతావాళ్లు దగ్గరపడుతున్నారు!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ గత కొన్నేళ్లుగా స్థిరంగా ఎదుగుతూ వచ్చినప్పటికీ, ఇప్పుడు అది స్పష్టంగా వేగం పెంచుకున్న దశలోకి ప్రవేశించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల విషయంలో వినియోగదారుల ఆలోచనల్లో వచ్చిన మార్పు, పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కలిసొచ్చి ఈ సెగ్మెంట్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాయి. ఈ మార్పు ఎంత వేగంగా జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే తాజా అమ్మకాల గణాంకాలు చాలానే చెప్పేస్తాయి. ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా 14,712 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవ్వగా, కేవలం ఒక నెల వ్యవధిలోనే అంటే మార్చిలో ఈ సంఖ్య ఒక్కసారిగా 22,315కి పెరగడం గమనించదగ్గ విషయం. అంటే, ఒక్క నెలలోనే భారీగా డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కథణంలో గత నెలలో ఎక్కువగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల గురించి చూద్దాం.
Advertisement

ఇక పెద్ద ఫ్యామిలీలు ఉన్న వాళ్లు డబ్బుల రెడీ చేస్కోండి

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా బిగ్ కార్ల హవానే నడుస్తోంది. మునుపటిలా చిన్న కార్ల కంటే, ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రయాణించే 7-సీటర్ కార్లకే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు మారుతి సుజుకి, మహీంద్రా, ఎంజీ వంటి దిగ్గజ సంస్థలు 2026లో తమ కొత్త మోడళ్లను రంగంలోకి దించుతున్నాయి. మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, రాబోయే ఈ 10 అద్భుతమైన 7-సీటర్ కార్ల వివరాలు తెలుసుకుందాం.

యూత్ కోసం స్పెషల్‌గా రెడీ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అభిమానులకు ఎంతో ఇష్టమైన హంటర్ 350 (Hunter 350) ఇప్పుడు 2026 అవతారంలో మరింత ఆకర్షణీయంగా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే నగర యువతలో మంచి క్రేజ్ సంపాదించిన ఈ బైక్, కొత్త మార్పులతో మరింత స్టైలిష్‌గా, ఫీచర్ల పరంగా మెరుగ్గా కనిపిస్తోంది. కంపెనీ ఈసారి కేవలం చిన్న అప్డేట్స్‌తో ఆగకుండా, పూర్తిగా లైనప్‌ను విస్తరించేలా కొత్త వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. ఈ కొత్త హంటర్ 350లో ముఖ్యమైన ఆకర్షణ 'బేస్ ప్రీమియం' వేరియంట్. ఇది బేస్ వేరియంట్‌కు కాస్త పైస్థాయిలో ఉండేలా రూపొందించారు. పేరు వినగానే అర్థమయ్యేలా, ఈ వేరియంట్ ప్రాథమిక హంటర్ డిఎన్‌ఎను కొనసాగిస్తూ, మరికొన్ని అదనపు ఫీచర్లను అందిస్తుంది.

ఏంటి ఆఫర్ ఇస్తున్నారా ? లేక కారే ఫ్రీగా ఇస్తున్నారా ?

కార్ల ప్రేమికులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటర్ ఇండియా (MG Motor India) ఏప్రిల్ 2026 నెలకు సంబంధించి అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. కొత్త కారు కొనాలనే ప్లాన్‌లో ఉన్నవారికి ఇది సరైన సమయం. ఎలక్ట్రిక్ కార్ల నుంచి పవర్‌ఫుల్ ఎస్‌యూవీల వరకు దాదాపు అన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మోడళ్లపై ఏకంగా రూ.3.5 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

35 కిమీ మైలేజీతో మారుతి హైబ్రిడ్ సునామీ

మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా టాటా నెక్సాన్ మీ ఫేవరెట్ లిస్ట్‌లో ఉందా? అయితే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మార్కెట్లోకి నెక్సాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అదిరిపోయే కాంపాక్ట్ ఎస్‌యూవీలు (SUVs) వరుసగా అడుగుపెట్టబోతున్నాయి. స్కోడా నుంచి స్టైలిష్ కారు, మారుతి నుంచి అదిరిపోయే మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ మోడళ్లు ఇలా ఒక్కటేమిటి.. రాబోయే రోజుల్లో ఆప్షన్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
Advertisement

ఇక సెలవు.. ఇన్నాళ్లు ఆదరించినందుకు కృతజ్ఞతలు

భారతీయ రోడ్ల మీద రారాజుగా వెలుగుతున్న టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రయాణం త్వరలోనే ముగియబోతోంది. దశాబ్ద కాలంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి రాజకీయ నాయకుల వరకు, ట్రావెల్ ఆపరేటర్ల నుంచి బిజినెస్ మెన్ల వరకు అందరి మనసు గెలుచుకున్న ఈ కారుకు టయోటా గుడ్ బై చెప్పబోతోంది. టయోటా తీసుకున్న ఈ నిర్ణయం వాహన ప్రేమికులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

మీల్స్ ధరకే ధమ్ బిర్యానీ దొరికినట్టు.. చిన్న కారు ధరలో పెద్ద ఎస్‌యూవీ

భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కలల కారుగా మారిన టాటా పంచ్ (Tata Punch) ఇప్పుడు మార్కెట్లో తిరుగులేని రారాజుగా నిలిచింది. 2026 మార్చి నెలలో విడుదలైన అమ్మకాల నివేదికలు చూస్తుంటే, ఇతర దిగ్గజ కంపెనీలకు చెమటలు పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు మారుతి ఆల్టో లాంటి కార్లు ఏలుతున్న ధరల పరిధిలోకి టాటా పంచ్ తన మైక్రో ఎస్‌యూవీ ఫీచర్లతో దూసుకొచ్చి, అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది.

600 రూపాయల కోసం యమహా ఇంత ప్లాన్ వేసిందా?

భారత టూవీలర్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యమహా కంపెనీ, ఏప్రిల్ 2026 నుంచి తన స్కూటర్ల ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. యువతను విపరీతంగా ఆకర్షించే రే జెడ్ఆర్ 125 (RayZR 125), పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఏరోక్స్ 155 (Aerox 155) మోడళ్ల ధరలను కంపెనీ పెంచింది. సాధారణంగా ఏటా చేసే ధరల సవరణలో భాగంగానే ఈ పెంపు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ధరల పెంపు కస్టమర్లపై పెద్దగా భారం పడకుండా స్వల్పంగానే ఉండటం గమనార్హం. యమహా రే జెడ్ఆర్ 125యమహా రే జెడ్ఆర్ 125 సిరీస్‌లోని అన్ని వేరియంట్లపై దాదాపు 660 రూపాయల ధర పెరిగింది. ఇందులో డ్రమ్, డిస్క్, డిస్క్ డీలక్స్, స్ట్రీట్ ర్యాలీ మోడల్స్ ఉన్నాయి. ఈ పెంపుతో రేజెడ్ఆర్ 125 హైబ్రిడ్ మోడల్ ధర ఇప్పుడు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 74,960 నుంచి రూ. 82,460 వరకు పలుకుతోంది. ఇక స్ట్రీట్ ర్యాలీ మోడల్ కావాలనుకుంటే రూ. 87,560 చెల్లించాల్సి ఉంటుంది. ధర పెరిగినప్పటికీ స్కూటర్ డిజైన్ లేదా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. అదే 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్, హైబ్రిడ్ సిస్టమ్ పవర్ అసిస్ట్‌తో ఇది కస్టమర్లను పలకరించనుంది.

మారుతి కారుపై ఏకంగా రూ.3.65లక్షల డిస్కౌంట్

మారుతి సుజుకి కార్లు అంటేనే మన భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు ఒక నమ్మకం. తక్కువ ఖర్చు, ఎక్కువ మైలేజీ, రీసేల్ వాల్యూలో వీటికి సాటి మరొకటి లేదు. అయితే ఇప్పుడు లగ్జరీ విభాగంలో కూడా మారుతి తన సత్తా చాటుతోంది. మారుతి సుజుకి నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన, లగ్జరీ 7-సీటర్ కారు ఇన్విక్టో (Maruti Suzuki Invicto) పై ఇప్పుడు కళ్లు చెదిరే ఆఫర్లు నడుస్తున్నాయి. ఏప్రిల్ 2026 నాటికి ఈ కారుపై ఏకంగా లక్షల రూపాయల డిస్కౌంట్ ప్రకటించి కంపెనీ అందరినీ ఆశ్చర్యపరిచింది.
Advertisement

మార్కెట్లో అల్లకల్లోలం.. దీంతో పెద్ద ఎస్‌యూవీల పని ఖతం

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. సాధారణంగా మారుతి అంటే స్విఫ్ట్, డిజైర్, బ్రెజా వంటి మోడళ్లే మనకు గుర్తొస్తాయి. కానీ, ఇప్పుడు సీన్ మారింది. కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris) ఎస్‌యూవీ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం కొద్ది నెలల క్రితమే లాంచ్ అయిన ఈ కారు, అమ్మకాల్లో దూసుకుపోతూ టాప్-10 కార్ల జాబితాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మార్చి 2026 నెలలో ఏకంగా 11,062 మంది కస్టమర్లు ఈ కారును సొంతం చేసుకున్నారంటే దీని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.