గతుకుల రోడ్లలో అతుకులు లేని ప్రయాణాలకు ఈ కార్లే బెస్ట్

వేసవి హాలీడేస్ వచ్చాయంటే చాలు.. అందరూ పట్టణాలు వదిలి పల్లెటూరికో లేదా చల్లని కొండ ప్రాంతాలకో చలోమని వెళ్తుంటారు. అయితే హైవేలు ఉన్నంత సేపు కారు సాఫీగానే సాగుతుంది. కానీ పల్లెటూరి కచ్చా రోడ్లు, గుంతలు, రాళ్లు రప్పలతో కూడిన దారుల్లోనే కారు అసలుసిసలు పరీక్ష మొదలవుతుంది. మండే ఎండలో కారు ఏసీ మొరాయించినా లేదా గుంతల దెబ్బకు సస్పెన్షన్ విరిగిపోయినా మీ ట్రిప్ మొత్తం పాడవుతుంది. అందుకే ఇలాంటి కఠినమైన రోడ్లకు సరిపోయే, కొండల్లాంటి గుంతలను కూడా ఈజీగా దాటేసే 5 పవర్‌ఫుల్ ఎస్‌యూవీల (SUVs) గురించి వివరంగా తెలుసుకుందాం.

దేశంలో అందరూ కొంటున్న బెస్ట్ 7 సీటర్ కారు ఇదే

భారతదేశంలో 7-సీటర్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కుటుంబ అవసరాలకు పూర్తిగా సరిపోయేలా రూపొందించిన ఈ MPV, అందుబాటు ధర, విశాలమైన అంతర్గత స్థలం, మంచి మైలేజ్ వంటి ముఖ్యమైన అంశాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. పెద్ద కుటుంబాలకు సరిపోయే సౌకర్యవంతమైన సీటింగ్, లాంగ్ డ్రైవ్స్‌లో కూడా కంఫర్ట్‌ను అందించే సస్పెన్షన్, అలాగే తక్కువ నిర్వహణ ఖర్చులు కలిపి ఎర్టిగాను చాలా మంది ఫ్యామిలీల మొదటి ఎంపికగా మార్చాయి. నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ సమానంగా డిమాండ్ ఉండటం దీని విజయానికి ప్రధాన కారణం. తాజాగా ఈ కారుకు సంబంధించిన అమ్మకాలు విడుదలయ్యాయి. ఆ వివరాలు ఈ కథణంలో చూద్దాం.

మిడిల్‌క్లాస్ ఫేవరెట్ బాలెనో.. సేల్స్‌లో మరోసారి టాప్ గేర్!

భారతీయ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ కుటుంబాల నుంచి యువత వరకు అందరికీ అందుబాటులో ఉండే కార్లతో ఈ బ్రాండ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లోకి వస్తే, వెంటనే గుర్తుకు వచ్చే పేరు బాలెనో (Maruti Suzuki Baleno). బాలెనో చాలా కాలంగా మార్కెట్‌లో ఉన్నప్పటికీ, తన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అందుబాటు ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు, విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం, మంచి పనితీరు, మెరుగైన మైలేజ్ ఈ అన్ని అంశాలు కలిసి ఈ కారును వినియోగదారుల ఫేవరెట్‌గా మార్చాయి. అందుకే ప్రతి నెలా అమ్మకాల పరంగా బాలెనో స్థిరంగా మంచి గణాంకాలను నమోదు చేస్తూ వస్తోంది.

టీవీఎస్ మోటార్ షాక్.. ఒక్క నెలలో 5 లక్షలకు పైగా అమ్మకాలు!

టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) భారతదేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సంస్థ, నాణ్యత, నూతన సాంకేతికత, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన వాహనాలతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్‌లు వంటి విభిన్న విభాగాల్లో టీవీఎస్ తన ఉత్పత్తులను అందిస్తూ, గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు విస్తరించిన వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. ముఖ్యంగా మైలేజ్, పనితీరు, ధరల మధ్య సమతూకాన్ని కలిగిన మోడళ్లతో టీవీఎస్ మార్కెట్‌లో బలమైన పోటీని ఇస్తోంది. తాజాగా ఈ కంపెనీ తన అమ్మకాల వివరాలను వెల్లడించింది.
Advertisement

గ్రామీణం నుంచి నగరాల వరకు హీరో హవా.. సేల్స్ జోరు ఇదే!

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందిన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) మరోసారి తన సేల్స్ శక్తిని నిరూపించింది. 2026 మార్చి నెలలో కంపెనీ నమోదు చేసిన అమ్మకాల గణాంకాలు చూస్తే, మార్కెట్‌లో దాని ఆధిపత్యం ఎంత బలంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈసారి హీరో మోటోకార్ప్ మరింత వేగంతో ముందుకు దూసుకెళ్లింది. 2025 మార్చిలో 5,49,604 యూనిట్లు విక్రయించిన కంపెనీ, 2026 మార్చిలో 5,98,198 యూనిట్లను అమ్ముతూ గణనీయమైన పెరుగుదల సాధించింది. ఈ పెరుగుదల కేవలం సంఖ్యల పరంగా మాత్రమే కాకుండా, బ్రాండ్‌పై వినియోగదారుల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోందనే విషయాన్ని కూడా తెలియజేస్తోంది.

4 కార్లతో చదరంగం ఆడుతున్న కంపెనీ

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు బలమైన స్థానం కలిగిన హోండా కార్స్ ఇండియా (Honda Cars India), గత కొన్ని సంవత్సరాలుగా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది. కొత్త మోడళ్ల కొరత, పెరుగుతున్న పోటీ, ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో ఇతర కంపెనీలు వేగంగా ఎదగడం వంటి కారణాలతో హోండా తన పాత జోరును కొనసాగించలేకపోయింది. అయినప్పటికీ, బ్రాండ్‌పై ఉన్న నమ్మకం పూర్తిగా తగ్గిపోలేదు. ప్రస్తుతం హోండా భారతదేశంలో పరిమిత మోడల్ లైన్‌ప్‌తోనే కొనసాగుతోంది. ముఖ్యంగా హోండా సిటీ (Honda City), హోండా అమేజ్ (Honda Amaze) వంటి కార్లు ఇప్పటికీ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వీటి నాణ్యత, కంఫర్ట్, విశ్వసనీయత కారణంగా ఒక స్థిరమైన కస్టమర్ బేస్‌ను నిలబెట్టుకున్నాయి.

నిస్సాన్ దూకుడు.. 10,338 యూనిట్లు సేల్, 98% భారీ వృద్ధి!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా (Nissan Motor India) భారత మార్కెట్లో తన స్థానం బలపరచుకోవడానికి ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తోంది. ప్రారంభంలో ఊహించినంత స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయినప్పటికీ, ఇటీవల కాలంలో కంపెనీ పనితీరు గణనీయంగా మెరుగుపడుతోంది. ముఖ్యంగా 2026 మార్చి నెల అమ్మకాల గణాంకాలు చూస్తే, నిస్సాన్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్చి 2026లో నిస్సాన్ మొత్తం 10,388 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం ఒక పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇందులో 4,408 కార్లు భారతదేశంలోనే డెలివరీ చేయబడగా, మిగిలిన వాహనాలు విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయబడ్డాయి.

37 ఇంచుల టైర్లతో ఇది భూమిపై తిరిగే రాక్షస వాహనం

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) నుంచి మరో అద్భుతం ఆవిష్కృతమైంది. న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షో 2026 వేదికగా హ్యుందాయ్ తన పవర్‌ఫుల్ అడ్వెంచర్ కాన్సెప్ట్ SUV బౌల్డర్ (Boulder)ను ప్రపంచానికి పరిచయం చేసింది. కొండలు, గుట్టలు, బురద దారులు.. ఇలా ఎలాంటి కష్టతరమైన రోడ్డుపైనైనా సాఫీగా దూసుకుపోయేలా ఈ రాక్షస వాహనాన్ని తీర్చిదిద్దారు. ఆటోమొబైల్ ప్రియులను ఫిదా చేస్తున్న ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
Advertisement

ఈ కారు అందం చూస్తే.. పక్కింటోడు అసూయ పడాల్సిందే

జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) తన పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ టైగూన్ (Taigun)ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఎంతో కాలంగా కస్టమర్లు ఎదురుచూస్తున్న టైగూన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కు సంబంధించి కంపెనీ తాజాగా ఒక ఆసక్తికరమైన టీజర్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 9, 2026న ఈ కారు ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా లాంచ్ కానుంది.

తక్కువ బడ్జెట్ ఉన్నవారు ఈ రెండు కార్లనే కొంటున్నారు

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki), మార్చి 2026తో పాటు మొత్తం ఎఫ్‌వై 2026 ఆర్థిక సంవత్సరాన్ని కూడా ఆకట్టుకునే అమ్మకాల గణాంకాలతో ముగించింది. ఈ కాలంలో కంపెనీ ప్రదర్శించిన పనితీరు, మార్కెట్‌లో తన స్థిరమైన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. మార్చి 2026లో దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి మొత్తం 2.25 లక్షల యూనిట్లను అధిగమించడం గమనార్హం. ఇది ఒకే నెలలో సాధించిన పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో, మొత్తం FY2026లో కంపెనీ విక్రయాలు 2.4 మిలియన్ యూనిట్లకు పైగా చేరడం, మారుతి సుజుకి దూకుడు ఎంత బలంగా కొనసాగుతుందో తెలియజేస్తోంది. ఈ సంఖ్యలు కేవలం అమ్మకాల పరంగా మాత్రమే కాకుండా, వినియోగదారుల నమ్మకం, బ్రాండ్ స్ట్రెంగ్త్, విస్తృతమైన ఉత్పత్తి శ్రేణికి నిదర్శనం.

ఇ-విటారా తొలి నెలలో 2,205 యూనిట్లు సేల్!

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki), ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే పరిశ్రమలో ఒక కొత్త చర్చకు దారి తీసింది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వాహనాలతో మార్కెట్‌ను ఏలిన ఈ సంస్థ, ఇప్పుడు భవిష్యత్తు మొబిలిటీ వైపు తన దృష్టిని మళ్లిస్తూ, ఎలక్ట్రిక్ వాహనాల యుగంలోకి ప్రవేశించింది. ఈ మార్పుకు ప్రతీకగా నిలిచింది సంస్థ తీసుకొచ్చిన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మారుతి సుజుకి ఇ-విటారా (Maruti Suzuki e Vitara). ఎంతోకాలంగా వినియోగదారులు ఎదురుచూస్తున్న ఈ మోడల్, మొదట గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో ప్రపంచానికి పరిచయం చేయబడింది. అప్పుడే దీని డిజైన్, టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఆటోప్రియులను ఆకట్టుకుంది.

12 లక్షల మందిని ఫిదా చేసిన డుగ్ డుగ్ బండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తూ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 12,38,659 యూనిట్లను విక్రయించి, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 23 శాతం వృద్ధిని సాధించింది. 2024-25లో ఈ సంఖ్య 10,09,900గా ఉండేది. కేవలం ఏడాది కాలంలోనే అదనంగా రెండు లక్షలకు పైగా బైకులను రోడ్లపైకి తెచ్చి తన సత్తా చాటింది.
Advertisement

టయోటా ఇండియా సేల్స్ దూకుడు.. 4 లక్షలు దాటి కొత్త రికార్డ్!

ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత, నాణ్యతకు ప్రతీకగా నిలిచిన జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటార్ కార్పోరేషన్ (Toyota Motor Corporation) భారత కార్ల మార్కెట్‌లో దాదాపు 25 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. అయితే ఈ ప్రయాణం మొదట్లో అంత సులభం కాదు. భారతీయ వినియోగదారుల అభిరుచులు, ధరలపై సున్నితత్వం, స్థానిక పోటీదారుల బలమైన స్థానం కారణంగా టయోటా తన స్థిరమైన పట్టు సాధించడానికి కొంత సమయం తీసుకుంది. కానీ కాలక్రమేణా వ్యూహాలను మార్చుకుంటూ మెల్లగా తన స్థాయిని బలోపేతం చేసుకుంది. ఈ విజయానికి కీలక పాత్ర పోషించినది టీకెంఎమ్ (Toyota Kirloskar Motor). జపాన్‌కు చెందిన టయోటా మోటార్, భారతదేశానికి చెందిన కిర్లోస్కర్ సిస్టమ్స్ మధ్య ఏర్పడిన సంయుక్త సంస్థ, భారత మార్కెట్‌కు సరిపోయే విధంగా ఉత్పత్తులు, వ్యూహాలను అమలు చేసింది.

మనోళ్లే కాదు విదేశీయులు కూడా ఈ కార్లంటే పిచ్చెక్కి పోతున్నారు

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి దేశీ మార్కెట్లోనే కాదు, విదేశీ గడ్డపై కూడా జెండా పాతేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి కంపెనీ కళ్లు చెదిరే అమ్మకాల గణాంకాలను నమోదు చేసింది. ముఖ్యంగా విదేశీయులు మారుతి కార్ల ఫీచర్లు, మైలేజీకి ఫిదా అయిపోతున్నారు. ఏకంగా 4.47 లక్షల మంది విదేశీయులు మారుతి కార్లను కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుతమైన విజయం వెనుక ఉన్న అసలు కారణాలు తెలుసుకుందాం.

రెనాల్ట్ కంబ్యాక్ స్ట్రాంగ్‌గా.. అమ్మకాలలో భారీ జంప్!

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault) భారత మార్కెట్‌లో మరోసారి తన సత్తాను చాటుకుంది. మార్చి 2026 అమ్మకాల గణాంకాలు బయటకు వచ్చిన తర్వాత, కంపెనీ నిజంగా ఒక బలమైన కంబ్యాక్ చేసినట్టు స్పష్టమైంది. గత కొంతకాలంగా అమ్మకాల విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రెనాల్ట్, ఈసారి మాత్రం అంచనాలకు మించి ప్రదర్శన చూపించింది. కంపెనీ విడుదల చేసిన వివరాల ప్రకారం, మార్చి 2026లో మొత్తం 5,046 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, బ్రాండ్‌పై తిరిగి పెరుగుతున్న వినియోగదారుల నమ్మకానికి నిదర్శనం. గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ 2,846 యూనిట్లు మాత్రమే విక్రయించగా, ఇప్పుడు 77.30 శాతం వార్షిక వృద్ధి నమోదు కావడం నిజంగా గమనించదగ్గ విషయం.

1.98 లక్షల కుటుంబాల నమ్మకం గెలిచిన కారు

మధ్యతరగతి భారతీయుడికి కారు అంటే కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్‌ను ఒడిసిపట్టుకోవడంలో మారుతి సుజుకి ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదలైన కార్ల విక్రయాల గణాంకాలు చూస్తుంటే, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Wagon R) మరోసారి తన హవా చాటుకుంది. లక్షలాది మంది మనసు గెలుచుకుని, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది.
Advertisement

టాటా ఆధిపత్యానికి బ్రేక్.. మహీంద్రా ఈవీలు 50K సేల్స్‌తో సెన్సేషన్!

భారత ఆటోమోటివ్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల పోటీ రోజు రోజుకీ ఉత్కంఠభరితంగా మారుతున్న ఈ సమయంలో, మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో అద్భుతమైన మైలురాయిని సాధించింది. విడుదలైన కేవలం 12 నెలల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలను దాటడం సాధారణ విషయం కాదు, ఇది మార్కెట్‌లో వినియోగదారుల నమ్మకం, బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం, ఉత్పత్తుల నాణ్యతకు ప్రతిబింబం. ఇప్పటివరకు భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో గట్టి పట్టు సాధించిన టాటా మోటార్స్ ఆధిపత్యాన్ని సవాలు చేయాలనే లక్ష్యంతో మహీంద్రా తన కొత్త తరం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను రంగంలోకి దింపింది. ముఖ్యంగా XEV 9e, XEV 9S, BE 6 వంటి మోడళ్లు కేవలం వాహనాలు మాత్రమే కాకుండా, భవిష్యత్తు మొబిలిటీకి ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చాయి.

భారత్ లో ప్రతి ఐదు నిమిషాలకు ఒక కార్ సేల్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్ని కొత్త కార్లు వచ్చినా, హ్యుందాయ్ క్రెటా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో ఈ కారు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరం (FY26) గణాంకాలను పరిశీలిస్తే, క్రెటా తన హవాను మరోసారి చాటుకుంది. గడిచిన 12 నెలల్లో ఏకంగా 1,84,083 యూనిట్లు అమ్ముడై, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో మారుతి డిజైర్ (2.07 లక్షల యూనిట్లు) మొదటి స్థానంలో ఉండగా, టాటా నెక్సాన్ (1.96 లక్షల యూనిట్లు) రెండో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ, తన సొంత సెగ్మెంట్ (Mid-size SUV)లో మాత్రం క్రెటానే నెంబర్ వన్.

దేశం గర్వించే టెక్నాలజీతో సుజుకి లేటెస్ట్ సెన్సేషన్

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా నుంచి సరికొత్త బర్గ్‌మాన్ స్ట్రీట్ సెకండ్ జనరేషన్ స్కూటర్ లాంచ్ అయ్యింది. గురుగ్రామ్ వేదికగా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన ఐకానిక్ స్కూటర్ బర్గ్‌మాన్ స్ట్రీట్ (Burgman Street)లో సెకండ్ జనరేషన్ మోడల్‌ను ఘనంగా విడుదల చేసింది. 2018లో తొలిసారి భారత్‌లోకి అడుగుపెట్టిన ఈ మ్యాక్సీ స్టైల్ స్కూటర్, అతి తక్కువ కాలంలోనే 125cc సెగ్మెంట్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వన్‌ అండ్ ఓన్లీ (ONE & ONLY) అనే కాన్సెప్ట్‌తో మరింత పవర్‌ఫుల్ గా, స్టైలిష్ గా మన ముందుకు వచ్చింది. కేవలం మూడు ఏళ్లలోనే దీని అమ్మకాలు రెట్టింపు అయ్యాయంటే ఈ స్కూటర్ కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

మార్కెట్‌లో నెక్సాన్ హవా.. SUV సెగ్మెంట్‌లో టాప్ ప్లేస్!

భారత ఆటోమొబైల్ రంగంలో విశ్వసనీయత, భద్రత, పనితీరు ఈ మూడు అంశాలను సమతుల్యం చేస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న టాటా మోటార్స్ (Tata Motors)కు చెందిన టాటా నెక్సాన్(Tata Nexon) మరోసారి తన సత్తాను ఘనంగా చాటుకుంది. దేశంలో SUVల డిమాండ్ పెరుగుతున్న ఈ సమయంలో, నెక్సాన్ నిరంతరంగా బలమైన ప్రదర్శనతో మార్కెట్‌లో ముందంజలో కొనసాగుతోంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వెలువడే అమ్మకాల గణాంకాలు మార్కెట్ ట్రెండ్స్‌ను స్పష్టంగా చూపిస్తాయి. ఈ నేపథ్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటా చూసినప్పుడు, నెక్సాన్ ప్రదర్శన నిజంగా విశేషంగా నిలుస్తోంది. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు మొత్తం 1,96,244 యూనిట్ల అమ్మకాలతో, ఈ SUV దేశంలో నెంబర్ వన్ SUVగా అవతరించింది.
Advertisement

దేశంలో నెంబర్ 1.. SUVలను కూడా దాటేసిన సెడాన్!

దేశంలో పేద, మధ్యతరగతి ప్రజల కారు కలను నిజం చేసిన కంపెనీల్లో మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తుంది. తక్కువ ధరలో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ కలిపి సామాన్య వినియోగదారుడికి సరిపోయే కార్లను అందిస్తూ, ఈ సంస్థ కోట్ల మంది మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే కార్లను తయారు చేయడం ద్వారా, మారుతి సుజుకి భారత ఆటోమొబైల్ రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇలాంటి బలమైన నేపథ్యంతో ముందుకు సాగుతున్న ఈ సంస్థకు చెందిన ప్రసిద్ధ సెడాన్ మారుతి సుజకి డిజైర్ (Maruti Suzuki Dzire) మరోసారి తన సత్తాను చాటుకుంది.

ఈ రెండు బైకులకు ప్రొడక్షన్ ఖర్చులు కూడా రాలేదు

భారతీయ రోడ్లపై రివ్వున దూసుకుపోయే స్పోర్ట్స్ బైక్ ప్రియులకు హోండా షాకిచ్చింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన పోర్ట్‌ఫోలియో నుంచి రెండు పాపులర్ ప్రీమియం మోడళ్లకు స్వస్తి పలికింది. గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో కస్టమర్లు దొరకకపోవడం, అమ్మకాలు సున్నాకి పడిపోవడంతో కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన లైనప్ నుంచి CB650R, CBR650R మోడళ్లను అధికారికంగా తొలగించింది. 2025 ప్రారంభంలోనే ఈ బైకులను అప్‌డేట్ చేసిన వెర్షన్లతో కంపెనీ మళ్ళీ లాంచ్ చేసింది. ఇన్-లైన్ 4 సిలిండర్, 650cc ఇంజిన్‌తో వచ్చే ఈ బైకులు రైడింగ్ అంటే పిచ్చి ఉన్నవారికి ఫేవరెట్. అయితే, గత కొన్ని నెలలుగా ఈ రెండు మోడళ్ల అమ్మకాలు అస్సలు జరగలేదు. రిపోర్టుల ప్రకారం, వీటి సేల్స్ 0(సున్నా) యూనిట్లుగా నమోదయ్యాయి. ఒక భారీ బ్రాండ్‌కు ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. అందుకే వేచి చూడటం కంటే, వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టడమే మేలని హోండా భావించింది.

స్కోడా ఇండియా దూసుకుపోతోంది.. కైలాక్‌తో భారీ సేల్స్ జంప్!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో నెమ్మదిగా కానీ స్థిరంగా తన స్థానం బలపరుచుకుంటూ వచ్చిన స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India), 2026 తొలి త్రైమాసికంలో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మకాలలో గరిష్ట స్థాయిని అందుకోవడం ద్వారా, బ్రాండ్ తన ఎదుగుదల వేగాన్ని మరింత పెంచుకుంది. 2026 జనవరి నుంచి మార్చి వరకు గల మూడు నెలల్లో, స్కోడా ఆటో ఇండియా దేశీయ మార్కెట్లో మొత్తం 20,028 వాహనాలను విక్రయించడం గమనార్హం. ఈ సంఖ్యలు కేవలం వృద్ధిని మాత్రమే కాకుండా, కంపెనీ తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలు ఎంత ఫలితాన్నిస్తాయో కూడా తెలియజేస్తున్నాయి. 2025 ఇదే కాలంతో పోలిస్తే 17% వృద్ధి నమోదు కావడం, మార్కెట్‌లో స్కోడా కార్లపై పెరుగుతున్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

ఈవీ మార్కెట్లో ఓలా సరికొత్త రికార్డ్

ఓలా ఎలక్ట్రిక్ మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చేసింది. ఒకానొక దశలో సర్వీస్ ఇబ్బందులు, కస్టమర్ల ఫిర్యాదులతో సతమతమైన ఈ కంపెనీ, 2026 మార్చి నెలలో ఊహించని రేంజ్‌లో పుంజుకుంది. కేవలం ఒక్క నెలలోనే రిజిస్ట్రేషన్ల పరంగా 150 శాతం వృద్ధిని సాధించి ఆటోమొబైల్ రంగాన్ని విస్మయానికి గురిచేసింది. ఫిబ్రవరిలో డీలా పడిన అమ్మకాలు, మార్చి వచ్చేసరికి రాకెట్‌లా దూసుకెళ్లాయి.
Advertisement

మార్కెట్‌లో టాటా హవా.. అమ్మకాలలో రికార్డు గ్రోత్!

భారత ఆటోమొబైల్ రంగంలో విశ్వసనీయత, భద్రతకు ప్రతీకగా నిలిచిన టాటా మోటార్స్ (Tata Motors) దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుంది. టాటా గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ, సాధారణ ప్రజల అవసరాల నుంచి ప్రీమియం సెగ్మెంట్ల వరకు విస్తరించిన విభిన్న వాహనాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇలాంటి బలమైన బ్రాండ్ ఇమేజ్‌తో ముందుకు సాగుతున్న టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన సేల్స్ గణాంకాలు కూడా అదే దూకుడును ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాల (PV) విభాగంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. మారుతి తర్వాత స్థానంలో నిలిచింది. 2026 మార్చి నెలలో టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో మొత్తం 66,192 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది.