మారుతి నుంచి తక్కువ ధరకే 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు!
ఆటోమొబైల్స్
- 2 month, 26 days ago
ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉండటం, పర్యావరణంపై అవగాహన పెరగడం, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవి కలిసి ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ను తీసుకువచ్చాయి. ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్ని కూడా ఈ సెగ్మెంట్లోకి దూసుకెళ్లాయి. ప్రస్తుతం టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ముందంజలో నిలుస్తున్నాయి. విభిన్న మోడళ్లతో, విభిన్న ధరల శ్రేణిలో కార్లను అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ కంపెనీలు ఇప్పటికే మంచి అమ్మకాలను నమోదు చేస్తూ, ఈ విభాగంలో తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి.