కేవలం 4.1 సెకన్లలో 100కి.మీ వేగం.. భారత రోడ్లపై ఆడి 'వజ్రాయుధం'

జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి (Audi) భారత మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త ఆడి SQ8 (Audi SQ8) పర్ఫార్మెన్స్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.1,77,72,000 (సుమారు రూ.1.78 కోట్లు)గా నిర్ణయించింది. ఆడి తన పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఉన్న క్యూ8 (Q8), అత్యంత వేగవంతమైన ఆర్ఎస్ క్యూ8 (RS Q8) మోడళ్ల మధ్య ఈ సరికొత్త SQ8ని నిలిపింది. అంటే, అటు లగ్జరీని, ఇటు అదిరిపోయే పర్ఫార్మెన్స్‌ను రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనుకునే ధనవంతుల కోసం ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఈ బైకులు రిపేర్లు రావడం చాలా తక్కువ..

రేపు (మార్చి 19న) జరగబోయే ఉగాది (Ugadi) పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, కొత్త ప్రారంభాల సూచికగా భావిస్తారు. ఈ ప్రత్యేక రోజున కొత్త వాహనం కొనడం శుభప్రదంగా భావించే వారు కూడా చాలా మంది ఉంటారు. మీరు కూడా ఈ ఉగాది సందర్భంగా కొత్త మోటార్‌సైకిల్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, బడ్జెట్‌లో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ కలిగిన కొన్ని మోడళ్లు మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. రోజువారీ వినియోగానికి సరిపోయే కమ్యూటర్ బైక్‌లలో బజాజ్ ప్లాటినా 100, హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ రేడియన్, హోండా షైన్ 100, హీరో గ్లామర్ బైకులు స్టైలిష్ లుక్‌తో పాటు మెరుగైన పనితీరు కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. మీరు కొత్త బైక్ కొనాలని భావిస్తే, ఈ మోడళ్లు తగిన విధంగా మంచి ఎంపికలుగా నిలుస్తాయి. వీటి గురించి ఈ కథణంలో.

దేశంలో డిమాండ్ ఎక్కువ ఉన్న కారు.. షోరూమ్‌లలో బుకింగ్ సందడి

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారులు వేగంగా మళ్లుతున్న నేపథ్యంలో, ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వరుసగా కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మార్కెట్లో తమ స్థానాన్ని బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పోటీ వాతావరణంలో Tata Motors మరోసారి ముందడుగు వేసింది. తనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎలక్ట్రిక్ SUVను మరింత ఆకర్షణీయంగా మార్చుతూ, కంపెనీ టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch EV Facelift) మోడల్‌ను 2026 ఫిబ్రవరిలో అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే నగర డ్రైవింగ్‌కు అనుకూలంగా, కాంపాక్ట్ డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న పంచ్ EV, ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మరింత ఆధునికంగా మారింది.

చిన్న ఫ్యామిలీ కోసం టాప్ బుల్లి కార్లు ఇవే

భారతదేశంలో ఎస్‌యూవీ (SUV) కార్ల ట్రెండ్ ఎంత నడుస్తున్నా, సామాన్యుడికి మాత్రం హ్యాచ్‌బ్యాక్ (Hatchback) కార్ల మీద ఉండే మక్కువ వేరు. దీనికి ప్రధాన కారణం తక్కువ బడ్జెట్, పార్కింగ్ సౌలభ్యం, అద్భుతమైన మైలేజీ. 2026 మార్చి నెల నాటికి మార్కెట్లో రూ.5 లక్షల లోపు ధరకే లభిస్తున్న అత్యుత్తమ కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
Advertisement

డస్టర్ కొనాలనుకుంటున్నారా? R-Pass తీసుకుంటే ఈ లాభాలు మీవే!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మళ్లీ తన ప్రభావాన్ని చూపేందుకు రెనాల్ట్ డస్టర్ (Renault Duster) కొత్త తరం అవతారంలో గ్రాండ్‌గా తిరిగి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు నాలుగు సంవత్సరాల విరామం తర్వాత రూ. 10.49 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఎస్‌యూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకప్పుడు భారత రోడ్లపై తనదైన స్టైల్, దృఢత్వంతో ప్రత్యేక గుర్తింపును సంపాదించిన డస్టర్, ఇప్పుడు మరింత ఆధునిక డిజైన్, టెక్నాలజీతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. భారతదేశంలో SUV సెగ్మెంట్ వేగంగా పెరుగుతున్న సమయంలో, డస్టర్‌కు ఉన్న క్రేజ్ కూడా అదే రీతిలో పెరిగింది. ఒక దశలో ఇది రెనాల్ట్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. అయితే కాలక్రమేణా అమ్మకాలు తగ్గడంతో 2022లో కంపెనీ ఈ కారును నిలిపివేసింది.

కాలేజీ కుర్రాళ్ల కోసం స్టైలిష్ స్కూటర్

కాలేజీకి వెళ్లే విద్యార్థులకు లేదా రోజూ ఆఫీసులకు అప్ అండ్ డౌన్ చేసే వారికి ఒక నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన వాహనం అవసరం. సరిగ్గా ఇలాంటి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకునే టీవీఎస్ మోటార్ కంపెనీ తన పాపులర్ స్కూటర్ జూపిటర్ 110ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ కేవలం చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, పెట్రోల్ ఖర్చును గణనీయంగా తగ్గించే మైలేజీని కూడా అందిస్తోంది. ప్రస్తుత మార్కెట్లో హోండా యాక్టివా వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తూ, మధ్యతరగతి జేబుకు భారమవ్వని ధరలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.

ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు.. 567 కి.మీలు పరుగులు

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ (BYD) ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. 'బిల్డ్ యువర్ డ్రీమ్స్' అనే పేరుతో ప్రారంభమైన ఈ కంపెనీ, నేడు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. ముఖ్యంగా భారత మార్కెట్లో కూడా BYD క్రమంగా తన స్థానాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. భారతదేశంలో ఇప్పటికే BYD Atto 3, BYD eMAX 7, BYD Seal వంటి ఆకట్టుకునే ఈవీలను ప్రవేశపెట్టి, వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. ఆధునిక డిజైన్, అధునాతన టెక్నాలజీ, మంచి రేంజ్ వంటి అంశాలు BYD కార్లను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ విజయాల పరంపరలో భాగంగా, గత సంవత్సరం కంపెనీ BYD Sealion 7 అనే స్మార్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

రూ.4లక్షల కంటే తక్కువ ధరకే కారు

భారతదేశంలో కార్ల మార్కెట్ అంటేనే మారుతి సుజుకి (Maruti Suzuki) అన్నట్లుగా ఉంటుంది. దశాబ్దాలుగా మిడిల్ క్లాస్ ప్రజల నాడిని పట్టుకోవడంలో ఈ కంపెనీకి మించింది లేదు. ప్రస్తుతం దేశంలో అత్యధిక మోడళ్లు కలిగిన కంపెనీగా మారుతి సుస్థిర స్థానంలో ఉంది. హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీల వరకు ప్రతి సెగ్మెంట్‌లోనూ తనదైన ముద్ర వేసింది. అయితే గత కొన్నేళ్లుగా కార్ల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కారు కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మారుతి సుజుకి తన పాత అఫార్డబిలిటీ మంత్రాన్ని మళ్ళీ పఠిస్తోంది. మొదటిసారి కారు కొనేవారిని ఆకర్షించేందుకు కేవలం రూ.4 లక్షల కంటే తక్కువ ప్రారంభ ధరతో ఒక సరికొత్త ఎంట్రీ లెవల్ కారును సిద్ధం చేస్తోంది.
Advertisement

క్రాష్ టెస్ట్‌లో అదరగొట్టిన టాటా సియెర్రా.. SUV కొనాలంటే ఇదే బెస్ట్

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మరోసారి తన ప్రత్యేకతను చూపిస్తూ టాటా సియోర్రా (Tata Sierra) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2025 నవంబర్ 25న విడుదలైన ఈ ఎస్‌యూవీ, కేవలం ఒక కొత్త కారు మాత్రమే కాకుండా, టాటా బ్రాండ్‌కు చెందిన ఒక ఐకానిక్ మోడల్‌కు తిరిగి వచ్చిన జీవం లాంటిది. ఒకప్పుడు రోడ్లపై ప్రత్యేక గుర్తింపును పొందిన సియెర్రా పేరు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్‌తో కొత్త తరానికి చేరువైంది. ఈ కొత్త సియెర్రా చూసే వారికి మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంటుంది. బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, స్లీక్ LED హెడ్‌లైట్స్, మస్కులర్ బాడీ లైన్స్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

పొలిటీషియన్లు ఇది లేనిదే అడుగు బయటపెట్టరు

భారతదేశంలో ఇన్నోవా అంటే కేవలం ఒక కారు మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. 8 నుంచి 9 మంది ప్రయాణికులు ఎంతో విలాసవంతంగా ప్రయాణించగలిగే ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఆటోమొబైల్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ లెజెండరీ డీజిల్ ఎమ్‌పివి ఉత్పత్తిని మార్చి 2027 నాటికి టయోటా నిలిపివేసే అవకాశం ఉందని తాజా రిపోర్టులు సూచిస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత రోడ్లపై రారాజుగా వెలుగొందిన ఇన్నోవా ప్రయాణంలో ఇది ఒక కీలక మలుపు కానుంది.

వెనుక కూర్చుంటే కారే మసాజ్ చేస్తుంది

భారతీయ రోడ్లపై జర్మన్ టెక్నాలజీతో, చెక్ రిపబ్లిక్ డిజైన్ తో సంచలనం సృష్టించిన స్కోడా కుషాక్ (Skoda Kushaq) ఇప్పుడు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. 2021లో మొదటిసారిగా లాంచ్ అయిన ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ, ఐదేళ్ల తర్వాత భారీ మార్పులతో మన ముందుకు వస్తోంది. ఈ కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ధరలను మార్చి 21, 2026న అధికారికంగా వెల్లడించనున్నట్లు స్కోడా ఇండియా ధృవీకరించింది. జనవరిలో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో దీని ప్రోటోటైప్‌ను ప్రదర్శించినప్పటి నుంచి వాహన ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కారు కోసం ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, కేవలం రూ.15,000 చెల్లించి ఈ సరికొత్త వాహనాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు.

రూ.5.65 లక్షలకే 7 సీటర్ కారు

నిస్సాన్ (Nissan) కంపెనీ భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా విడుదల చేసిన 7-సీటర్ 'నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite)' తక్కువ ధరలో ఎక్కువ విలువ అందించే కారుగా నిలుస్తోంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాల కోసం సరసమైన ధరలో విశాలమైన SUV కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారింది. ఈ కారు రూపకల్పనలోనే వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. లోపలి క్యాబిన్ విస్తారంగా ఉండటం వల్ల ప్రయాణికులు సౌకర్యంగా కూర్చొని ప్రయాణించవచ్చు. మూడు వరుసల సీటింగ్ ఏర్పాటుతో మొత్తం 7 మంది సులభంగా ప్రయాణించగలుగుతారు. లెదరెట్ క్విల్టెడ్ సీట్లు ఉండటం వల్ల ప్రయాణంలో మరింత కంఫర్ట్ ఫీలింగ్ కలుగుతుంది.
Advertisement

టాటా, మహీంద్రాకు పోటీగా హోండా EV.. టెస్టింగ్ ఫేజ్‌లోకి ఎంట్రీ!

భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్పు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మారుతి సుజుకి వంటి కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తుండగా, ఇప్పుడు మరో దిగ్గజ సంస్థ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) కూడా ఈవీ విప్లవానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వినియోగదారులకు గుడ్ న్యూస్ అందిస్తూ, హోండా తన మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ SUV (BEV)ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి కీలక దశలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా పాన్-ఇండియా టెస్ట్ రన్‌ను అధికారికంగా ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. రాజస్థాన్‌లోని Tapukaraలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పబ్లిక్ రోడ్ వెరిఫికేషన్ టెస్టింగ్ ప్రారంభమైంది.

ఇది ఇంటి ముందుంటే పక్కింటి వాళ్లు అసూయపడాల్సిందే

ప్రస్తుత కాలంలో టూ వీలర్ మార్కెట్లో 125cc స్కూటర్ల హవా నడుస్తోంది. ఒకప్పుడు 100cc లేదా 110cc స్కూటర్ల వైపు మొగ్గు చూపిన కస్టమర్లు ఇప్పుడు మెరుగైన పవర్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, స్టైలిష్ లుక్స్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా 80 వేల నుంచి లక్ష రూపాయల బడ్జెట్ లో మైలేజ్ తో పాటు మెయింటెనెన్స్ తక్కువగా ఉండే స్కూటర్ల కోసం జనం వెతుకుతున్నారు. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ 125cc స్కూటర్ల గురించి, వాటి ప్రత్యేకతలు, ధరల వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

డస్టర్ రీఎంట్రీ.. ఈ ధరకు ఇంత ఫీచర్లు అంటే నమ్మలేరు!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త తరం రెనాల్ట్ డస్టర్ (Renault Duster) ఎట్టకేలకు ఘనంగా విడుదలైంది. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన అద్భుతమైన కార్యక్రమంలో 2026 మోడల్ డస్టర్‌ను అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ఇదే కారును జనవరి 26న చెన్నైలో మొదటిసారి ప్రదర్శించగా, ఇప్పుడు అధికారిక లాంచ్‌తో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న వారు సమీప డీలర్‌షిప్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ.21,000 అడ్వాన్స్ చెల్లించి ఈ SUVని బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి ఎంపిక చేసిన వేరియంట్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

హైవేపై వెళ్తున్నారా? ఫాస్టాగ్ ఉంటే సరిపోదు

భారతదేశంలో నేషనల్ హైవేలపై ప్రయాణం ఇప్పుడు పూర్తిగా హైటెక్‌గా మారిపోయింది. ఒకప్పుడు టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడాల్సి వచ్చేది, కానీ ఫాస్టాగ్ (FASTag) పుణ్యమా అని ఇప్పుడు చిటికెలో టోల్ చెల్లించి ముందుకు కదులుతున్నాం. అయితే, 2026 సంవత్సరానికి గానూ ఫాస్టాగ్ నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు వచ్చాయి. చాలా మంది వాహనదారులకు ఈ నియమాలు తెలియక టోల్ ప్లాజాల వద్ద అనవసరంగా భారీ జరిమానాలు కడుతున్నారు. మీరు కూడా హైవేలపై తరచుగా ప్రయాణించే వారైతే, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 అతి ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకుందాం.
Advertisement

పెద్ద ఫ్యామిలీకి పర్ఫెక్ట్ కార్లు, ఏది కొనాలి?

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎంవీపీలకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద కుటుంబాలు, సౌకర్యవంతమైన ప్రయాణం, మెరుగైన స్పేస్ కలిపి ఈ సెగ్మెంట్‌ను మరింత బలంగా నిలబెట్టాయి. ఈ నేపథ్యంలోనే టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross), మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) వంటి రెండు ఆధునిక ఎంవీపీలు మార్కెట్లోకి వచ్చి వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇప్పటికే భారత మార్కెట్లో మంచి పేరు సంపాదించిన ఇన్నోవా బ్రాండ్‌కు చెందిన తాజా రూపం. మరోవైపు, మారుతి సుజుకి ఇన్విక్టో కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది.ఈ రెండు కార్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి మధ్య ఉన్న తేడాలను ఇక్కడ చూద్దాం.

ఈ 5 యాక్సెసరీస్ లేకపోతే మీ పని గోవిందా

భారతదేశంలో వేసవి కాలం ఇప్పటికే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఉదయం 10 గంటలకే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బైక్ మీద బయటకు వెళ్లడమంటే ఒక సాహసమనే చెప్పాలి. ముఖ్యంగా లాంగ్ రైడ్స్ వెళ్లేవారు, ప్రతిరోజూ ఆఫీసులకు బైక్ పై వెళ్లేవారు ఎండ దెబ్బకు విలవిల్లాడుతున్నారు. అయితే, మారుతున్న టెక్నాలజీతో పాటు రైడర్ల సౌకర్యం కోసం మార్కెట్లోకి అనేక అద్భుతమైన యాక్సెసరీస్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి మిమ్మల్ని ఎండ నుంచి కాపాడటమే కాకుండా మీ ప్రయాణాన్ని చాలా సుఖవంతం చేస్తాయి. ఆ టాప్ 5 యాక్సెసరీస్ గురించి వివరంగా తెలుసుకుందాం.

దిగ్భ్రాంతికి గురిచేసిన కారు అమ్మకాలు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా 4 మీటర్ల లోపు ఉండే ఎస్‌యూవీలు మధ్యతరగతి వినియోగదారులకు ఎంతో ఆకర్షణీయంగా మారాయి. ఈ సెగ్మెంట్‌లో తనదైన స్టైల్, ఫీచర్లు, ధరతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోడల్ నిస్సాన్ మాగ్నైట్ (nissan magnite). ప్రారంభం నుంచే ఇది మంచి స్పందనను అందుకుంది, చాలా మంది కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది. అయితే తాజా అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, నిస్సాన్ మాగ్నైట్‌కు స్వల్పంగా డిమాండ్ తగ్గినట్లు కనిపిస్తోంది. 2026 ఫిబ్రవరి నెలలో మొత్తం 2,230 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో గత ఏడాది ఫిబ్రవరి 2025లో 2,328 యూనిట్లు విక్రయించబడ్డాయి. అంటే ఈసారి 98 కార్లు తక్కువగా అమ్ముడైనట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.

దారి ఎలా ఉన్నా ఉన్నా గాడిదలా దూసుకెళ్లాల్సిందే

భారతదేశపు రోడ్లపై, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ ఏదైనా ఉందంటే అది టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 (TVS XL100). ఇది కేవలం ఒక మోపెడ్ మాత్రమే కాదు, లక్షలాది మంది సామాన్యుల ఉపాధికి మూలాధారం. కష్టపడి పని చేసే తత్వం, ఎంతటి భారాన్నైనా మోసే శక్తి దీని సొంతం. మారుతున్న కాలానికి అనుగుణంగా టీవీఎస్ సంస్థ ఈ లెజెండరీ మోపెడ్‌లో అనేక ఆధునిక మార్పులను తీసుకువచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ వర్క్ హార్స్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
Advertisement

100 కోట్ల మంది ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది

భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌కు ప్రాణం పోసిన కారు ఏదైనా ఉందంటే అది రెనాల్ట్ డస్టర్ మాత్రమే. 2012లో విడుదలై తన రగ్గడ్ డిజైన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. కొన్నేళ్లుగా మార్కెట్ కు దూరమైన ఈ లెజెండరీ కారు, ఇప్పుడు సరికొత్త రూపంలో, అత్యాధునిక టెక్నాలజీతో మళ్ళీ భారత గడ్డపై కాలు మోపబోతోంది. రేపు, అంటే మార్చి 17, 2026న ఈ న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్ అధికారికంగా లాంచ్ కానుంది. ఈసారి రెనాల్ట్ కేవలం ఒక కారును మాత్రమే కాకుండా, మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను శాసించే ఒక పవర్ఫుల్ వెపన్ తీసుకువస్తోంది.

డాక్టర్లు, ఇంజనీర్లు ఎక్కువగా కొనేది ఇదే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో కార్లు వచ్చి వెళ్లినా, కొన్ని మోడళ్లు మాత్రం సంవత్సరాల తరబడి తమ స్థానాన్ని నిలబెట్టుకుంటాయి. అలాంటి విజయవంతమైన మోడళ్లలో ఒకటి మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ (Maruti Suzuki WagonR). ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) గత రెండున్నర దశాబ్దాలుగా ఈ కారును భారత మార్కెట్లో విజయవంతంగా విక్రయిస్తోంది. 1999లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. తక్కువ ధర, మంచి మైలేజ్, కుటుంబ అవసరాలకు సరిపోయే ప్రాక్టికల్ డిజైన్ వల్ల ఈ కారు ఇప్పటికీ వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూనే ఉంది.

ఆఫ్-రోడింగ్ లవర్స్ కోసం అదిరిపోయే బైక్

ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ సూపర్ బైక్ తయారీ సంస్థ డ్యుకాటీ (Ducati), భారతీయ ఆఫ్-రోడ్ రేసింగ్ లవర్స్ కోసం ఒక అద్భుతమైన వార్తను మోసుకొచ్చింది. తన మొట్టమొదటి మోటోక్రాస్ బైక్ డ్యుకాటీ డెస్మో450 MX (Ducati Desmo450 MX)ను అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. సాధారణంగా స్పోర్ట్స్ బైక్‌లు మరియు లగ్జరీ రోడ్ బైక్‌లకు పేరుగాంచిన డ్యుకాటీ, మొదటిసారిగా మట్టి రోడ్లపై, కొండ కోనల్లో దూసుకుపోయే రేసింగ్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 17.23 లక్షలుగా నిర్ణయించారు. ఇది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ఒక సరికొత్త విప్లవమని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. డ్యుకాటీ డెస్మో450 MX సాధారణ రోడ్లపై నడపడానికి ఉద్దేశించినది కాదు. దీనిని ప్యూర్ ఆఫ్-రోడ్ రేసింగ్, మోటోక్రాస్ ట్రాక్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ బైక్‌ను అభివృద్ధి చేసే క్రమంలో అంతర్జాతీయ MXGP వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కఠినమైన పరీక్షలకు గురిచేశారు. అంటే, ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్‌లపై గెలిచిన టెక్నాలజీని ఇప్పుడు భారతీయ రైడర్లకు అందుబాటులోకి తెచ్చారన్నమాట. గతంలో జరిగిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ ఫైనల్స్‌లో దీనిని ప్రదర్శించినప్పుడే బైక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ బైక్ గుండెకాయ వంటి ఇంజన్ గురించి చెప్పుకోవాలంటే.. ఇందులో 449.6cc సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ అమర్చారు. ఇది సుమారు 62 bhp పవర్, 54 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఏకంగా 12,000 rpm వరకు వెళ్లగలదు. డ్యుకాటీ తన హై-పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ బైక్‌లలో వాడే ప్రఖ్యాత డెస్మోడ్రోమిక్ వాల్వ్ టెక్నాలజీని ఈ మోటోక్రాస్ బైక్‌లో కూడా వాడటం విశేషం. దీనివల్ల ఇంజన్ నుంచి పవర్ డెలివరీ చాలా వేగంగా, పటిష్టంగా ఉంటుంది. ఆఫ్-రోడింగ్‌లో బైక్ బరువు చాలా కీలకం. అందుకే డ్యుకాటీ దీనిని అత్యంత తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌తో తయారు చేసింది. దీనివల్ల బైక్‌ను గాల్లోకి ఎగిరేటప్పుడు లేదా మలుపుల్లో తిప్పేటప్పుడు రైడర్‌కు పూర్తి నియంత్రణ ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు వైపు 49mm షోవా (Showa) ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపు పూర్తిగా అడ్జస్ట్ చేసుకోగలిగే మోనోషాక్ సస్పెన్షన్‌ను ఇచ్చారు. ఎంతటి కఠినమైన రాళ్ల దారిలోనైనా ప్రయాణం సుఖవంతంగా ఉండేలా ఈ సెటప్ సహాయపడుతుంది. బ్రేకింగ్ కోసం వరల్డ్ క్లాస్ బ్రెంబో సిస్టమ్‌ను వాడారు. సాధారణంగా మోటోక్రాస్ బైక్‌లలో ఎలక్ట్రానిక్ ఫీచర్లు తక్కువగా ఉంటాయి. కానీ డ్యుకాటీ ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. బురదలో లేదా ఇసుకలో వెనుక చక్రం స్లిప్ అవ్వకుండా ఈ సిస్టమ్ నిరంతరం పర్యవేక్షిస్తుంది. దీనివల్ల రైడర్ పడిపోయే ప్రమాదం తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో వేగంగా వెళ్లవచ్చు. వివిధ రకాల రైడింగ్ మోడ్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. డ్యుకాటీ ఇండియా ఇప్పటికే ఈ బైక్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. మార్చి 2026 నాటికి ఈ బైక్‌ల డెలివరీ ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది. కేవలం ప్రొఫెషనల్ రేసర్లు మాత్రమే కాకుండా, ఆఫ్-రోడింగ్‌ను ఒక హాబీగా మార్చుకున్న సంపన్న వర్గాల వారు కూడా ఈ బైక్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. భారత్‌లో కేటీఎం, హోండా వంటి సంస్థలకు మోటోక్రాస్ సెగ్మెంట్‌లో ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

రూ.87 వేలకే EV స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీలు

పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా నగర ప్రయాణాల్లో తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా పరిశీలిస్తున్నారు. ఈ కారణంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక కంపెనీలు ఈ విభాగంలో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పోటీ మధ్యలోనే బజాజ్ ఆటో (Bajaj Auto) తన ప్రసిద్ధ స్కూటర్‌ను మళ్లీ కొత్త రూపంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒకప్పుడు భారతీయ రోడ్లపై ఎంతో ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్‌గా తిరిగి వచ్చి వినియోగదారుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది.
Advertisement

డిజైర్ తర్వాత అందరూ కొంటున్న కారు ఇదే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-కాంపాక్ట్ సెడాన్ విభాగం వినియోగదారులలో మంచి ప్రజాదరణ పొందుతోంది. ఈ విభాగంలో ప్రధానంగా పోటీ పడుతున్న మోడళ్లలో హ్యూందాయ్ ఆరా (Hyundai Aura) ఒకటి. ముఖ్యంగా Hyundai Motor India కంపెనీకి చెందిన ఈ సెడాన్, మార్కెట్లో బలమైన పోటీదారుగా నిలుస్తూ మారుతి డిజైర్‌కు ప్రత్యక్షంగా పోటీ ఇస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, సరసమైన ధర, ఉపయోగకరమైన ఫీచర్లు వంటి అంశాల వల్ల ఆరా క్రమంగా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించింది. ఈ కారు మొదటిసారిగా 2020లో భారత మార్కెట్లో ప్రవేశించింది. ఆ తర్వాత నుంచి దీని అమ్మకాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.