డిజైర్ తర్వాత అందరూ కొంటున్న కారు ఇదే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-కాంపాక్ట్ సెడాన్ విభాగం వినియోగదారులలో మంచి ప్రజాదరణ పొందుతోంది. ఈ విభాగంలో ప్రధానంగా పోటీ పడుతున్న మోడళ్లలో హ్యూందాయ్ ఆరా (Hyundai Aura) ఒకటి. ముఖ్యంగా Hyundai Motor India కంపెనీకి చెందిన ఈ సెడాన్, మార్కెట్లో బలమైన పోటీదారుగా నిలుస్తూ మారుతి డిజైర్‌కు ప్రత్యక్షంగా పోటీ ఇస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, సరసమైన ధర, ఉపయోగకరమైన ఫీచర్లు వంటి అంశాల వల్ల ఆరా క్రమంగా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించింది. ఈ కారు మొదటిసారిగా 2020లో భారత మార్కెట్లో ప్రవేశించింది. ఆ తర్వాత నుంచి దీని అమ్మకాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

చుక్క పెట్రోల్ లేకుండా ప్రపంచమంతా తిరగొచ్చు

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య సాగుతున్న ఈ పోరు వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గిపోతాయేమో, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతాయేమో అన్న భయం సామాన్యుల్లో మొదలైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు క్యూలు కట్టి పెట్రోల్ నిల్వ చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో పెట్రోల్ ఖర్చు లేని ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడటం తెలివైన పని. ముఖ్యంగా చిన్న చిన్న దూరాలకు ప్రయాణించే వారు, విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు 'ఎలెక్ట్రిక్ సైకిళ్ల' (E-Bikes) వైపు మొగ్గు చూపుతున్నారు. రూ. 50,000 లోపు బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిళ్ల వివరాలు మీకోసం..

7 సీట్ల కారు కోసం ఇదే బెస్ట్ ఆప్షన్!

రెనాల్ట్ (Renault) కంపెనీకి చెందిన ట్రైబర్ (Triber) భారతీయ మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన కార్లలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా తక్కువ ధరలో 7 సీట్ల కారును కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా మారింది. అందుకే ఈ MPVకి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ కనిపిస్తోంది. సరసమైన ధర, ఉపయోగకరమైన డిజైన్, కుటుంబ ప్రయాణాలకు అనువైన సీటింగ్ ఏర్పాటు వంటి కారణాలతో చాలా మంది కొనుగోలుదారులు ఈ కారువైపు ఆకర్షితులవుతున్నారు. ఈ కారణంగానే భారత మార్కెట్లో ట్రైబర్ అమ్మకాలు ప్రతి నెలా మంచి స్థాయిలో కొనసాగుతున్నాయి. 2026 ఫిబ్రవరి నెలలో కూడా ఈ కారు అద్భుతమైన అమ్మకాల గణాంకాలను నమోదు చేసింది.

లగ్జరీ కారు కొని 15 ఏళ్ల తరబడి ఏడ్చాడు

ఒక సామాన్య వినియోగదారుడు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కారు కొనుక్కుంటే, అది అతనికి సంతోషాన్ని ఇవ్వాలి. కానీ, కేరళకు చెందిన ఒక వ్యక్తికి మాత్రం తాను కొన్న లగ్జరీ ఎస్‌యూవీ (SUV) ఏకంగా 15 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగేలా చేసింది. చిట్టచివరకు న్యాయం గెలిచింది. కారు కొన్న 15 ఏళ్ల తర్వాత సదరు కంపెనీకి షాక్ ఇస్తూ, కస్టమర్‌కు రూ.28 లక్షలు తిరిగి చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆ వినియోగదారుడు పడ్డ ఇబ్బందులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Advertisement

బ్రెజ్జా కంటే రూ.2.50 లక్షల తక్కువకే కారు!

రెనాల్ట్ (Renault) కంపెనీకి చెందిన కైగర్ (Kiger) భారతీయ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. ప్రస్తుతం భారతదేశంలో సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ వేగంగా పెరుగుతున్న విభాగంగా మారింది. మధ్యతరగతి కుటుంబాలకు సరిపడే ధర, మంచి మైలేజ్, ఆకర్షణీయమైన డిజైన్ వంటి అంశాల కారణంగా ఈ విభాగంలోని కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టాయి. ఈ పోటీ మధ్య కూడా రెనాల్ట్ కైగర్ తన స్థానం నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. 2026 ఫిబ్రవరి నెలలో రెనాల్ట్ కైగర్ అమ్మకాలు గణనీయంగా పెరగడం గమనించదగ్గ విషయం.

బండికి ఇది ఉంటే ప్రాణాలకు ఫుల్ గ్యారెంటీ

భారతదేశంలోని రద్దీగా ఉండే రోడ్లపై టూ వీలర్ ప్రయాణం ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదే. ముఖ్యంగా అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి వచ్చినప్పుడు చక్రాలు లాక్ అయిపోయి వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ప్రాణరక్షక కవచంలా పనిచేసేదే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS). సాధారణంగా ఖరీదైన బైక్‌లకే పరిమితమైన ఈ ఫీచర్, ఇప్పుడు స్కూటర్లలోనూ అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 అత్యంత సరసమైన ఏబీఎస్ స్కూటర్ల వివరాలు తెలుసుకుందాం.

ఈ కారును అస్సలు వదలొద్దు బ్రో

టాటా మోటార్స్ ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని వేగంతో దూసుకుపోతోంది. ముఖ్యంగా నెక్సాన్, పంచ్ వంటి మోడళ్లతో ఇప్పటికే రికార్డులు సృష్టిస్తున్న ఈ స్వదేశీ దిగ్గజం, ఇప్పుడు తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ (Tata Altroz) ద్వారా మరోసారి వార్తల్లో నిలిచింది. కారు కొనేటప్పుడు మైలేజీతో పాటు సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే భారతీయులకు ఆల్ట్రోజ్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ఫిబ్రవరి 2026 నాటి అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, ఈ కారుపై కస్టమర్ల నమ్మకం మరింత పెరిగిందని స్పష్టమవుతోంది. గత నెలలో ఈ కారు అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయి.

పేదవాడి కారును కొనే నాథుడే లేదు..షోరూమ్‌లు వెలవెల

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు చిన్న కార్ల విభాగంలో సంచలనం సృష్టించిన రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) ఇప్పుడు షోరూంలలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. మధ్యతరగతి ప్రజల కలల కారుగా, బడ్జెట్ ధరలో లభించే స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్‌గా పేరు తెచ్చుకున్న ఈ కారు అమ్మకాలు ఊహించని విధంగా పడిపోయాయి. గత నెల అంటే ఫిబ్రవరి 2026 నాటి అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, కేవలం 375 మంది మాత్రమే ఈ కారును కొనుగోలు చేశారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అమ్మకాల్లో సుమారు 46.28 శాతం క్షీణత కనిపించడం వాహన రంగ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Advertisement

ఇక టోల్ గేట్ దాటాలంటే జేబు లూటీ కావాల్సిందే

జాతీయ రహదారులపై నిత్యం ప్రయాణించే వాహనదారులకు భారీ షాక్ తగిలింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆగస్టు 15న సామాన్యుడిపై టోల్ భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఈ వార్షిక పాస్ విధానం, ఇప్పుడు ప్రియం కాబోతోంది. మార్చి 12న వెలువడిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వాహనదారులపై అదనపు భారం పడనుంది.

150-200cc సెగ్మెంట్‌లో టాప్-5 బైకులు ఇవే

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా అవతరించింది. 2025-26 గణాంకాల ప్రకారం, దేశంలో బైకుల అమ్మకాలు 2 కోట్ల యూనిట్లను దాటేశాయి. గతంలో బైక్ కొనేవారు కేవలం మైలేజీని మాత్రమే చూసేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నేటి యువత స్టైలిష్ లుక్, అదిరిపోయే పర్ఫార్మెన్స్, లేటెస్ట్ టెక్నాలజీని కోరుకుంటున్నారు. అయితే, పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో పర్ఫార్మెన్స్‌తో పాటు మైలేజీ కూడా ఇచ్చే బైక్ దొరకడం కాస్త కష్టమే. ముఖ్యంగా 150cc నుంచి 200cc సెగ్మెంట్‌లో పవర్ ఎక్కువ ఉంటే మైలేజీ తగ్గుతుందనే అపోహ ఉంది. కానీ మార్కెట్‌లో కొన్ని బైకులు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాయి. మీరు కూడా 150-200cc మధ్యలో మంచి మైలేజీ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నట్లయితే, ఈ టాప్-5 ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.

ఫ్యామిలీ ట్రిప్స్ కోసం టాప్ 5 కార్లు ఇవే

కుటుంబంతో కలిసి లాంగ్ ట్రిప్ వెళ్లాలన్నా లేదా పండగలకు ఊరికి వెళ్లాలన్నా మనకు మొదట గుర్తొచ్చేది కారులో ఖాళీ స్థలం (Space). పెళ్లిళ్లు, సెలవుల సీజన్ వచ్చిందంటే చాలు.. ఇంట్లోని సామాన్లన్నీ కారులో పడతాయా లేదా అన్నదే పెద్ద టెన్షన్. ప్రస్తుతం మార్కెట్‌లో ఎస్‌యూవీ (SUV)ల హవా నడుస్తోంది. కానీ, చూడటానికి పెద్దగా ఉన్నా లోపల ఇరుకుగా ఉండే కార్లు చాలానే ఉన్నాయి. మీ బడ్జెట్ 12 లక్షల రూపాయల లోపు ఉండి, మంచి స్పేస్ కావాలని కోరుకుంటే.. మీకోసం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్-5 కార్ల వివరాలు తెలుసుకుందాం.

సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు ఇష్టంగా కొంటున్న కారు

కియా సెల్టోస్ (Kia Seltos) భారత మార్కెట్లో మిడ్-సైజ్ SUV విభాగంలో పెద్ద మార్పులకు కారణమైన ప్రముఖ మోడళ్లలో ఒకటి. ఈ SUV మొదటిసారి మార్కెట్లోకి వచ్చినప్పుడే తన ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అప్పటివరకు ఈ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయించిన Hyundai Cretaకి గట్టి పోటీగా నిలిచి, కొన్ని సందర్భాల్లో అమ్మకాల పరంగా దానిని కూడా అధిగమించింది. అందుకే కొంతకాలం పాటు ఈ కారు మిడ్-సైజ్ SUV మార్కెట్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న మోడల్‌గా గుర్తింపు పొందింది.
Advertisement

రూ.5 లక్షల్లో 35 కి.మీ మైలేజ్ ఇచ్చే CNG కార్లు

భారతదేశంలో కొత్త కారు కొనాలనుకునే చాలా మంది కస్టమర్లు మొదటగా చూసేది రెండు విషయాలనే ధర, మైలేజ్. తక్కువ ధరలో లభిస్తూ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఖర్చును తగ్గించుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా CNG కార్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. CNG కార్లు నడపడానికి ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు మంచి మైలేజ్ కూడా అందిస్తాయి కాబట్టి రోజువారీ ప్రయాణాలకు ఇవి చాలా ఉపయోగకరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత మార్కెట్లో తక్కువ ధరలో లభించే CNG కార్లలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, ఆల్టో కె10, సెలెరియో కార్లు కీలకంగా ఉన్నాయి. వీటి గురించి ఈ కింది కథణంలో చూద్దాం.

ట్రెండింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణానికి మేలు వంటి కారణాల వల్ల చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే దేశంలో EV మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ నెలలో మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్లో కొన్ని మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా టాటా టియాగో (Tata Tiago EV), టాటా పంచ్ ఈవీ (Tata Punch EV), ఎంజీ విండ్సర్ (MG Windsor EV) వంటి మోడళ్లను పరిశీలించవచ్చు. ఈ కార్లు మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, అందుబాటు ధరలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. వీటి గురించి ఈ కింది కథణంలో.

నెల జీతం సరిపోతుంది.. చిన్న బడ్జెట్‌లో స్టైలిష్ కారు

SUVలు మార్కెట్లో ట్రెండ్‌గా మారకముందు, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వినియోగదారుల మనసును గెలుచుకున్న కార్లలో హ్యూందాయ్ ఐ20 (Hyundai i20) ఒకటి. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒకప్పుడు కలల కారుగా భావించబడేది. ఆకర్షణీయమైన డిజైన్, మంచి పనితీరు, ఆధునిక ఫీచర్లు వంటి అంశాలతో ఈ కారు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ముఖ్యంగా రెండవ తరం 'ఎలైట్ i20' యూరోపియన్ కార్లను తలపించే స్టైలిష్ డిజైన్‌తో వచ్చినప్పుడు వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. ఆ సమయంలో ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో ఒకటిగా నిలిచింది. కాలం మారడంతో SUVల ప్రాచుర్యం పెరిగినా కూడా హ్యూందాయ్ ఐ20 తన ప్రత్యేక స్థానాన్ని కోల్పోలేదు.

రూ.6.26 లక్షలకే 33 కిమీ మైలేజ్.. 30 లక్షల మంది ఇదే కారు కొన్నారు!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో సెడాన్ కార్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ వర్గంలో ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్న కార్లలో ఒకటి మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire). మధ్యతరగతి కుటుంబాలకు సరిపోయే ధర, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు వంటి లక్షణాల వల్ల ఈ కారు ప్రారంభం నుంచే మంచి ఆదరణ పొందింది. అందుకే దేశవ్యాప్తంగా చాలా మంది కొనుగోలుదారులు తమ మొదటి కారుగా డిజైర్‌ను ఎంచుకుంటున్నారు. కాలక్రమేణా ఈ కారుకు ఉన్న డిమాండ్ మరింత పెరిగింది. మారుతి సుజుకి ఈ కారును మొదటిసారి భారత మార్కెట్లో మార్చి 2008లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి డిజైర్ ప్రయాణం నిరంతరం విజయవంతంగా కొనసాగుతోంది.
Advertisement

తక్కువ ధరలో రెండు ఆటోమేటిక్ ఆప్షన్లు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) భారత మార్కెట్లో తన ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ SUV అయిన కియా సోనెట్ (Kia Sonet)ను మోడల్ ఇయర్ 2026 (MY26) కోసం కొత్తగా ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మరింత ఎంపికలు, మెరుగైన విలువ అందించాలనే లక్ష్యంతో ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న సోనెట్‌కు ఇప్పుడు మరిన్ని వేరియంట్ ఎంపికలను జోడించడం ద్వారా కంపెనీ వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త MY26 సోనెట్‌లో ప్రధానంగా ఇంజిన్,ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో మార్పులు చేశారు. ముఖ్యంగా డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌ను మరింత అందుబాటులోకి తీసుకువచ్చారు.

సర్వీస్ లో కింగ్ అనిపించుకుంటున్న టాప్ 5 కార్లు ఇవే!

కొత్త కారు కొనాలనుకున్నప్పుడు చాలామంది కేవలం దాని మైలేజీ, బాహ్య రూపం లేదా ఫీచర్లను మాత్రమే చూసి మురిసిపోతుంటారు. కానీ, అసలైన పరీక్ష కారు కొన్న తర్వాతే మొదలవుతుంది. మధ్యలో ఎక్కడైనా కారు చెడిపోతేనో లేదా సర్వీస్ చేయించాలన్నా ఆ కంపెనీకి తగినన్ని సర్వీస్ సెంటర్లు ఉన్నాయా? స్పేర్ పార్ట్స్ తక్కువ ధరలో దొరుకుతున్నాయా? అన్నది చాలా ముఖ్యం. కారు ఆగిపోతే మీ ప్రయాణం నరకం కాకుండా ఉండాలంటే, సర్వీస్ నెట్‌వర్క్ బలంగా ఉన్న బ్రాండ్‌ను ఎంచుకోవాలి. 2026 నాటి తాజా మార్కెట్ విశ్లేషణల ప్రకారం సర్వీస్ విషయంలో భారతీయులు కళ్లు మూసుకుని నమ్మే ఐదు బెస్ట్ కార్ల వివరాలు తెలుసుకుందాం.

సై అంటే సై.. నువ్వా-నేనా అంటున్న రెండు కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో మంచి పనితీరు, సరిపడే ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చు కావాలనుకునే వినియోగదారులు ఈ సెగ్మెంట్ కార్లను ఎక్కువగా ఎంచుకుంటారు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన ఈ చిన్న కార్లు మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి కూడా మంచి ఎంపికగా నిలుస్తాయి. ఈ విభాగంలో ప్రముఖంగా చెప్పుకునే రెండు కార్లు టాటా టియాగో (Tata Tiago), హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios). భారత మార్కెట్లో సరసమైన ధరతో పాటు విశ్వసనీయత కలిగిన ఈ రెండు మోడళ్లు వినియోగదారుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. ఈ రెండు కార్ల మధ్య తేడాల గురించి ఈ కింది కథణంలో చూద్దాం.

కొత్త కలర్‌‌తో బర్గ్‌మాన్ స్ట్రీట్ EX ఆకట్టుకుంటోంది!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ (Suzuki Motor Corporation)కు అనుబంధంగా పనిచేస్తున్న సుజుకి మోటార్ సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) భారత మార్కెట్లో మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. కంపెనీ తన ప్రీమియం స్కూటర్ సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ ఈఎక్స్ (Suzuki Burgman Street EX) కోసం పెర్ల్ గ్రే వైట్ అనే కొత్త కలర్ ఆప్షన్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ఈ కొత్త రంగు స్కూటర్‌కు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వడంతో పాటు స్పోర్టీ లుక్‌ను కూడా పెంచుతుంది. యువతను ఆకట్టుకునేలా ఈ కలర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త కలర్ ఎంట్రీతో ఇప్పుడు బర్గ్‌మాన్ స్ట్రీట్ EX స్కూటర్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.
Advertisement

ఐ ఫోన్ కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్

పెట్రోల్ ధరలు రోజురోజుకూ మండిపోతున్న నేపథ్యంలో, సామాన్యుడి చూపు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు, ప్రతిరోజూ ఆఫీసులకు లేదా పనులకు వెళ్లేవారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక వరంగా మారాయి. ఈ విభాగంలో టీవీఎస్ మోటార్ కంపెనీ తన అద్భుతమైన సృష్టి టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)తో మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. 2026 కొత్త మోడల్స్ మరింత రేంజ్, స్మార్ట్ ఫీచర్లు, అత్యంత తక్కువ ధరతో వినియోగదారుల ముందుకు వచ్చాయి. కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, కారులో ఉండేలాంటి పెద్ద డిస్‌ప్లే, అదిరిపోయే వేగంతో ఈ స్కూటర్ ఇప్పుడు మార్కెట్ లీడర్‌గా ఎదిగింది.

ఏనుగు సైజున్న మారుతి కారుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది

భారత మార్కెట్లో కుటుంబ అవసరాలకు సరిపోయే కార్లకు ఎప్పటినుంచో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎక్కువ సీటింగ్ సామర్థ్యం, సౌకర్యవంతమైన కేబిన్, నమ్మకమైన పనితీరు కలిగిన MPV కార్లను చాలా మంది వినియోగదారులు ఇష్టపడుతున్నారు. ఈ విభాగంలో ప్రముఖంగా నిలిచిన మోడళ్లలో ఒకటి మారుతి సుజుకి ఎక్స్‌‌ఎల్6 (Maruti Suzuki XL6). స్టైలిష్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్, ఫ్యామిలీ ప్రయాణాలకు అనువైన ఫీచర్ల కారణంగా ఈ కారు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఇటీవల కాలంలో ఈ MPVకు వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన మరింత పెరిగింది. నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా ఈ కారుకు మంచి డిమాండ్ కనిపిస్తోంది.

చూపు తిప్పుకోనివ్వని అందం..ఆడి ఫ్యామిలీలోకి కొత్త అతిథి

జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి (Audi) తన క్యూ8 (Q8) లైనప్‌ను భారత్‌లో మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైంది. వేగాన్ని, విలాసాన్ని కోరుకునే వారి కోసం సరికొత్త ఆడి ఎస్‌క్యూ8 (Audi SQ8) పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీని మార్చి 17న మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ కారు కోసం బుకింగ్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు రూ.5 లక్షల టోకెన్ అమౌంట్‌తో ఆడి అధికారిక వెబ్‌సైట్ లేదా myAudi Connect యాప్ ద్వారా తమ కలల కారును రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ కొత్త మోడల్ సాధారణ క్యూ8 వెర్షన్‌కు, అత్యంత శక్తివంతమైన ఆర్‌ఎస్ క్యూ8 (RS Q8)కు మధ్యలో ఉంటుంది. దీని ధరలను లాంచ్ రోజైన మార్చి 17న అధికారికంగా వెల్లడించనున్నారు.

జపాన్ కంపెనీ కార్లకు బ్రహ్మరథం పడుతున్న జనాలు

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా (Toyota Motor Corporation) భారత మార్కెట్లో కూడా తన స్థాయిని క్రమంగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా దేశీయ మార్కెట్లో బలమైన ఉనికి కలిగిన మారుతి సుజుకితో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న తర్వాత, టయోటా కార్ల విక్రయాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా పలు మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టి, వినియోగదారుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. దీనికి తాజా ఉదాహరణగా ఫిబ్రవరి 2026 నెలలో నమోదైన అమ్మకాల గణాంకాలను చెప్పుకోవచ్చు. గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 2026లో భారత మార్కెట్లో టయోటా మొత్తం 30,737 కార్లను విక్రయించింది. ఈ సంఖ్య కంపెనీకి మంచి వృద్ధిని సూచిస్తోంది.
Advertisement

ఆకాశాన్ని తాకుతున్న ఈ కారు క్రేజ్

మిడిల్ క్లాస్ వాళ్లకు కారు కొనడం అనేది ఒక తీరని కల. ముఖ్యంగా పెద్ద కుటుంబం ఉన్నప్పుడు అందరూ కలిసి ప్రయాణించాలంటే ఏడు సీట్ల కారు తప్పనిసరి. అయితే మార్కెట్లో ఉన్న ఎంపీవీలు (MPVs), ఎస్‌యూవీల (SUVs) ధరలు చూస్తే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ రంగుల ప్రపంచానికి దూరంగా ఒక కారు మాత్రం సైలెంటుగా రికార్డులు సృష్టిస్తోంది. అదే మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco). ఎలాంటి ఆర్భాటాలు లేకపోయినా, ప్రతి నెలా వేల సంఖ్యలో అమ్ముడవుతూ భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని రారాజుగా నిలుస్తోంది. కేవలం రూ.5.18 లక్షల ప్రారంభ ధరకే లభిస్తున్న ఈ 7-సీటర్ కారును కొనేందుకు జనం ఎందుకు ఎగబడుతున్నారో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.