చూసినవాళ్లంతా బుక్ చేసుకుంటున్నారు.. వెన్యూ హవా!

కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) SUV భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి కొనుగోలుదారుల నుంచి అసాధారణమైన స్పందనను పొందుతోంది. నవంబర్ 4, 2025న అధికారికంగా ప్రారంభించబడిన ఈ రెండవ తరం వెన్యూ, లాంచ్ రోజే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీతో ఇది పూర్తిగా ఫ్రెష్ అవతార్‌లో కనిపిస్తూ యువతతో పాటు ఫ్యామిలీ కార్ కొనుగోలుదారులను కూడా ఆకట్టుకుంటోంది. లుక్ పరంగా చూస్తే, కొత్త వెన్యూ మరింత స్టైలిష్‌గా, ప్రీమియం ఫీల్ ఇచ్చేలా డిజైన్ చేయబడింది. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే కొత్త వెన్యూ భారీ డిమాండ్‌ను నమోదు చేసింది. డీలర్‌షిప్‌ల వద్ద విచారణలు పెరగడమే కాకుండా, బుకింగ్‌ల పరంగా కూడా ఈ కారు కొత్త రికార్డును సృష్టించింది.

టయోటా ఎబెల్లా చరిత్ర తిరగరాస్తుందా ?

టయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లా సమీక్షను చూడండి. దీని 543 కిమీ రేంజ్, లెవల్ 2 ADAS మరియు ప్రీమియం ఇంటీరియర్స్ గురించి తెలుసుకోండి. ఆశించిన ధర INR 18.00 లక్షల నుండి ఉంటుంది.

పవర్‌ఫుల్ కార్ కమింగ్ ఫ్రమ్ పవర్‌ఫుల్ కంపెనీ

రేపు (ఫిబ్రవరి 12) ఆటోమొబైల్ ప్రేమికుల కోసం ఒక పెద్ద రోజు. JSW MG మోటార్ ఇండియా తమ కొత్త కారును ఘనంగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన పెద్ద-సైజు ఫ్యామిలీ SUV మెజెస్టర్ (Majestor) ఇప్పుడు అధికారికంగా అమ్మకానికి రానుంది. MG మెజెస్టర్‌ను చూసిన వెంటనే ఇది ఒక ప్రీమియం, రాయల్ ఫీల్ కలిగిన SUV అనే భావన కలుగుతుంది. ఈ SUVను ముఖ్యంగా ఇండియన్ ఫ్యామిలీలను టార్గెట్ చేసి అభివృద్ధి చేశారు. రోజువారీ ప్రయాణాల నుంచి హైవే ట్రిప్స్ వరకు అన్ని పరిస్థితుల్లోనూ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో మెజెస్టర్‌ను రూపొందించారు. ఈ కారు వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

ప్రతి ఇల్లు ఈ కంపెనీ కారే కావాలని అంటోంది

టాటా మోటార్స్ సంస్థ భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 2026 జనవరి నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, టాటా మోటార్స్ గతంలో ఎన్నడూ లేనంత భారీ వృద్ధిని నమోదు చేసి, తన ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిచ్చింది. కేవలం ఒకే నెలలో సుమారు 70,222 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి, గత ఏడాది జనవరితో పోలిస్తే ఏకంగా 46 శాతం వృద్ధిని సాధించింది. ఇది టాటా మోటార్స్ చరిత్రలోనే ఒక నెలలో నమోదైన అత్యధిక విక్రయాలు కావడం విశేషం. ముఖ్యంగా ఎస్‌యూవీ విభాగంలో టాటా మోటార్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
Advertisement

ఈ ఆటో డ్రైవర్ల కడుపు నింపుతుంది

భారతీయ రోడ్లపై ఆటో రిక్షా అంటే కేవలం ఒక వాహనం కాదు, అది లక్షలాది మంది సామాన్యుల జీవనాధారం. అలాంటి త్రీ వీలర్ వాహన రంగంలో పెను సంచలనం సృష్టిస్తూ, దేశీయ దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) తన అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా WEGO P9018ను మార్కెట్లోకి విసిరింది. ఫిబ్రవరి 09, 2026న పుణె వేదికగా జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో రేంజ్ విషయంలో ఉన్న అన్ని అపోహలను పటాపంచలు చేస్తూ, ఏకంగా 296 కిలోమీటర్ల రేంజ్‎తో ఇది రేంజ్ రాజాగా కీర్తించబడుతోంది. బజాజ్ WEGO P9018ను ఒక సాధారణ ఆటోగా చూడలేము. దీని వెనుక అత్యంత శక్తివంతమైన ఇంజనీరింగ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లోనూ లేని విధంగా, ఇందులో 17.7 kWh సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ బ్యాటరీ సాయంతో ఐడియల్ కండిషన్స్‌లో 296 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. రియల్ వరల్డ్ కండిషన్స్‌లో కూడా ఇది 240-250 కి.మీ. వరకు సునాయాసంగా ఇస్తుందని అంచనా.

నెల రోజుల్లో 2521 మంది ఇదే కారును ఎంచుకున్నారు

భారతీయ SUV మార్కెట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రారంభం నుంచే ఈ కారు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తూ, ప్రతి నెలా స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది. స్టైలిష్ డిజైన్, టయోటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, ఆధునిక ఫీచర్ల కలయికతో, టైజర్‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారు జనవరి 2026లో కూడా అదే ఊపును కొనసాగించింది. తాజా గణాంకాల ప్రకారం, ఆ నెలలో మొత్తం 2,521 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్వల్పమైనప్పటికీ గమనించదగిన వృద్ధి.

దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUVలు

మార్కెట్లో కాంపాక్ట్ SUVల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారికి ఈ సెగ్మెంట్ కార్లు మంచి ఎంపికగా మారాయి. సెడాన్‌ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే విశాలమైన క్యాబిన్, అలాగే బూట్ స్పేస్ ఉండటం వల్ల కాంపాక్ట్ SUVలు భారతీయ వినియోగదారుల అవసరాలకు బాగా సరిపోతున్నాయి. నగరాల్లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మెరుగుపడాల్సిన రోడ్ల పరిస్థితులు కూడా ఈ వాహనాల పాపులారిటీకి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. కాంపాక్ట్ SUVలు అన్ని రకాల రోడ్లపై సులభంగా నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో పాటు, డ్రైవర్‌కు మంచి విజిబిలిటీని కూడా అందిస్తాయి. ఈ కథణంలో గత నెలలో టాప్ 3 కాంపాక్ట్ SUVల గురించి చూద్దాం.

రూ.లక్షకే డిజిటల్ డిస్‌ప్లే, మంచి మైలేజీ ఇచ్చే బైక్

నేటి యువతకు బైక్ అంటే కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదు, అది ఒక స్టైల్ స్టేట్‌మెంట్. ముఖ్యంగా 160cc సెగ్మెంట్‌లో పవర్‌ఫుల్ ఇంజన్, అదిరిపోయే లుక్స్ కోసం చాలా మంది కుర్రాళ్లు ఆరాటపడుతుంటారు. అయితే బజాజ్ పల్సర్ లేదా టీవీఎస్ అపాచీ వంటి బైక్‌ల ధరలు ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో దేశీ దిగ్గజం హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన హీరో ఎక్స్‌ట్రీమ్ 160R (Hero Xtreme 160R) ఒక సంచలనంగా మారింది. 160cc సెగ్మెంట్‌లో అత్యంత తక్కువ ధరకే లభిస్తూ, అదిరిపోయే మైలేజీని ఇస్తున్న ఈ బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హీరో ఎక్స్‌ట్రీమ్ 160R ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత చౌకైన 160cc మోటార్‌సైకిల్. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.1,04,749 నుంచి ప్రారంభమవుతుంది. ఇతర బ్రాండ్లను గమనిస్తే.. బజాజ్ పల్సర్ NS160 లేదా టీవీఎస్ అపాచీ RTR 160 4V వంటి బైక్‌ల ధరలు దీనికంటే కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీ లేదా హైదరాబాద్ వంటి నగరాల్లో దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.1.25 లక్షల నుంచి రూ.1.35 లక్షల మధ్యలో ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో స్పోర్ట్స్ బైక్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది ఒక వరం లాంటిది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160R లో 163.2 cc ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఇది 8,500 rpm వద్ద 15 bhp పవర్, 6,500 rpm వద్ద 14 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బరువు. ఇది కేవలం 139.5 కిలోల బరువు మాత్రమే ఉంటుంది, దీనివల్ల సిటీ ట్రాఫిక్‌లో బైక్‌ను తిప్పడం చాలా సులభం. స్పీడు విషయానికి వస్తే.. ఇది కేవలం 4.7 సెకన్లలోనే 0 నుంచి 60 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు అందరికంటే ముందు దూసుకుపోవచ్చు. చాలా మంది స్పోర్ట్స్ బైక్ అంటే మైలేజీ తక్కువ ఇస్తుందని భయపడతారు. కానీ హీరో ఎక్స్‌ట్రీమ్ విషయంలో అది తప్పు. ఈ బైక్ లీటరుకు 46 నుంచి 50 కిలోమీటర్ల మైలేజీని సునాయాసంగా ఇస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు. అంటే ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తే మీరు సుమారు 550 నుంచి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. రోజువారీ ఆఫీసు పనులకు వెళ్లే వారికి లేదా కాలేజీ విద్యార్థులకు ఇది చాలా పొదుపైన బైక్ అని చెప్పవచ్చు. తక్కువ ధర అయినప్పటికీ, ఫీచర్ల విషయంలో హీరో ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో మీరు చూడబోయే కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఇవే. హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్, ఇండికేటర్లు అన్నీ ఎల్‌ఈడీ వెర్షన్‌లోనే వస్తాయి. ఇది రాత్రి వేళల్లో ప్రయాణాన్ని సురక్షితం చేస్తుంది. ఇందులో ఇన్వర్టెడ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో గైర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, సమయం వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.
Advertisement

సాధారణ ప్రజలే కాదు.. సెలబ్రిటీలు కూడా ఫిదా అయిన కారు!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) భారత మార్కెట్లో విశ్వసనీయతకు, దీర్ఘకాలిక పనితీరుకు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన అనేక మోడళ్లు ఇప్పటికే భారత వినియోగదారుల మనసుల్లో స్థానం సంపాదించగా, వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన SUV టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్. ఈ కారు 2022లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నిరంతరం మంచి స్పందనను పొందుతూ, టయోటా లైనప్‌లో ఒక కీలక మోడల్‌గా మారింది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం దాని హైబ్రిడ్ టెక్నాలజీ. ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతున్న ఈ రోజుల్లో, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే హైబ్రిడ్ ఇంజిన్ వినియోగదారులకు పెద్ద ఆకర్షణగా మారింది.

భార్య, పిల్లలు, సామాన్లు.. అన్నీ ఒకే కారులో

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra) తన అత్యంత ప్రజాదరణ పొందిన స్కార్పియో-ఎన్(Scorpio-N) ఆధారంగా రూపొందిస్తున్న సరికొత్త పికప్ ట్రక్కును భారత మార్కెట్లోకి తెచ్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ పికప్ కాన్సెప్ట్ పేరుతో ప్రదర్శితమైన ఈ వాహనం, ఇప్పుడు భారత రోడ్లపై మంచు కురుస్తున్న వేళ కఠినమైన పరీక్షలను (Snow Testing) ఎదుర్కొంటోంది. మహీంద్రా తన గ్లోబల్ పికప్ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్పై ఫోటోల ప్రకారం, ఈ పికప్ ట్రక్కును మంచుతో నిండిన రోడ్లపై పరీక్షిస్తున్నారు. ఇది కేవలం కమర్షియల్ వాహనంలా కాకుండా ఒక లైఫ్ స్టైల్ వాహనంగా రూపొందుతోంది.

ఒకప్పుడు టాప్ SUV.. ఇప్పుడు డిమాండ్ తగ్గిందా?

మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Grand Vitara) ఒక సమయంలో భారత మార్కెట్లో అత్యంత చర్చకు వచ్చిన SUVగా నిలిచింది. స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, హైబ్రిడ్ టెక్నాలజీ వంటి అంశాలతో ఈ కారు కొనుగోలుదారుల మనసు గెలుచుకుంది. ఇప్పటికీ చాలా మంది వినియోగదారులు ఈ SUVని నమ్మకంగా ఎంచుకుంటున్నారు. అయినప్పటికీ, ఇటీవల నెలల్లో గ్రాండ్ విటారా అమ్మకాల గణాంకాలు ఒక భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. గత నెల అయిన జనవరి 2026లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఆ నెలలో మొత్తం 7,030 యూనిట్లు మాత్రమే డెలివరీ అయ్యాయి. ఇదే కారు జనవరి 2025లో చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అప్పట్లో 15,784 యూనిట్లు అమ్ముడయ్యాయి.

రైలెక్కిన 5.85 లక్షల కార్లు

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేవలం కార్ల అమ్మకాల్లోనే కాదు, వాటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసే విధానంలో కూడా మారుతి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఏడాదిలో ఏకంగా 5.85 లక్షల కార్లను కేవలం రైళ్ల ద్వారా రవాణా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కంపెనీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీనివల్ల పర్యావరణానికి కలిగిన మేలు, ఆదా అయిన ఇంధనం, రవాణాలో మారుతి వేసిన మాస్టర్ ప్లాన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మారుతి సుజుకి సంస్థ దేశవ్యాప్తంగా తన కార్లను డీలర్‌షిప్‌లకు చేరవేసేందుకు గత కొన్నేళ్లుగా రైల్వే మార్గాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తోంది. 2016వ సంవత్సరంలో మారుతి కేవలం 77 వేల కార్లను మాత్రమే రైళ్ల ద్వారా పంపించేది. కానీ, గడిచిన పదేళ్లలో ఈ సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. 2017లో లక్ష కార్లు, 2018లో 1.46 లక్షలు, 2019లో 1.72 లక్షలు ఇలా క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020లో కరోనా కారణంగా కొంచెం తగ్గుదల కనిపించినా, 2021 నుంచి మారుతి స్పీడు పెంచింది.
Advertisement

రూ.6 లక్షల లోపు SUV కొనాలా? టాటా పంచ్ vs హ్యుందాయ్ ఎక్స్‌టర్

ఒకప్పుడు ఇంట్లో బైక్ ఉంటే చాలు అనుకునే రోజులు పోయి ఇప్పుడు కారు ఉండాలనే రోజులు వచ్చాయి. ప్రజల ఆర్థిక పరిస్థితి గతంలో కంటే కాస్త మెరుగ్గా ఉండటంతో తమ కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి బస్సులు, రైళ్లు, ఆటోల కంటే కారు ఉంటే బెటర్ అని కారు కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో తక్కువ ధరలో దొరుకుతూ, మంచి పనితీరు, మైలేజ్, సేఫ్టీ అందించే కార్లను బాగా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా రూ. 6 లక్షల లోపు బడ్జెట్‌లో ఒక కొత్త కారు కొనాలనుకునే వారికి టాటా పంచ్ (tata punch), హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) ప్రస్తుతం హాట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. ఈ రెండు కార్ల బేస్ వేరియంట్లను పోలికలను ఈ కథనంలో చూద్దాం.

ఈ కారు కావాలంటే తపస్సు చేయాల్సిందే

భారతీయ రోడ్లపై మహీంద్రా కార్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు ఆ క్రేజ్ కాస్తా కస్టమర్ల ఓపికకు పరీక్షగా మారుతోంది. "డబ్బులు మూటలు కట్టుకుని వెళ్లి షోరూం ముందు కుమ్మరించినా సరే.. కారు ఇంటికి రావాలంటే నెలల తరబడి కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూడాల్సిందే" అనే రేంజ్‌లో మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు వెయిటింగ్ పీరియడ్ ఉంది.

యువతకు పిచ్చెక్కిస్తున్న కారు

హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో తన విజయకేతనాన్ని ఎగురవేస్తోంది. ముఖ్యంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) విభాగంలో హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) ఒక తిరుగులేని శక్తిగా అవతరించింది. 2026 ప్రారంభంలో ఈ కారు సాధించిన అమ్మకాల గణాంకాలు చూస్తుంటే, భారతీయ వినియోగదారులు దీనికి ఎంతలా బానిసయ్యారో ఇట్టే అర్థమవుతుంది. టాటా నెక్సాన్ వంటి బలమైన ప్రత్యర్థులు మార్కెట్లో ఉన్నప్పటికీ, వెన్యూ తనదైన శైలిలో దూసుకుపోతూ రికార్డులను తిరగరాస్తోంది. 2026 జనవరి నెల హ్యుందాయ్ కంపెనీకి ఒక అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చింది. ఈ ఒక్క నెలలోనే హ్యుందాయ్ వెన్యూ ఏకంగా 12,413 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి తన సత్తా చాటింది. గత ఏడాది (2025) ఇదే సమయంలో 11,106 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది అమ్మకాల్లో 12 శాతం వృద్ధిని సాధించింది. హ్యుందాయ్ ఇండియా తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ దేశీయ విక్రయాలను (59,107 యూనిట్లు) ఈ ఏడాది జనవరిలో నమోదు చేసింది. ఈ భారీ విజయంలో వెన్యూ కీలక పాత్ర పోషించిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. హ్యుందాయ్ వెన్యూ కేవలం అమ్మకాల్లోనే కాదు, అత్యాధునిక ఫీచర్ల విషయంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. దీని బేస్ మోడల్ ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 15.69 లక్షల వరకు అందుబాటులో ఉంది. ఎల్‌ఈడీ హెడ్-ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు రోడ్లపై చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

ఉబెక్స్ రాకతో మార్కెట్ షేక్ అవ్వాల్సిందే

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తన ఎలక్ట్రిక్ విభాగం విడా (Vida) ద్వారా భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో గట్టి పోటీనిస్తున్న హీరో, ఇప్పుడు తన దృష్టిని ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లపై మళ్లించింది. ఇందులో భాగంగా అత్యంత పవర్ఫుల్, స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్ విడా ఉబెక్స్ (Vida UBEX) డిజైన్ పెటెంట్‌ను భారత్‌లో పొందింది. ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఆధిపత్యానికి గండి కొట్టేలా సిద్ధమవుతున్న ఈ బైక్, 2026లో ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లో ఒక పెను మార్పుగా నిలవబోతోంది.
Advertisement

ఈ కారుకు ఏ దిష్టి తగిలింది భయ్యా?

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R) దశాబ్దాలుగా భారతీయ మధ్యతరగతికి చిరునామాగా నిలిచింది. కానీ, 2026 సంవత్సరం ప్రారంభం ఈ కారుకు అనుకున్నంత ఆశాజనకంగా లేదు. 34 కిలోమీటర్ల మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ వంటి బలమైన అంశాలు ఉన్నప్పటికీ, జనవరి నెలలో అమ్మకాలు ఊహించని రీతిలో పతనం కావడం ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యపరిచింది.

మధ్యతరగతి యువతకి సరైన స్పోర్టీ బైక్!

TVS Apache RTR 160 భారత మార్కెట్లో ఒక ప్రముఖమైన స్పోర్టీ మోటార్‌సైకిల్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. స్టైల్, పనితీరు, ధర ఈ మూడు విషయాల్లోనూ సమతుల్యత ఉండటంతో ఇది ముఖ్యంగా మధ్యతరగతి యువతకు సరైన ఎంపికగా నిలుస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, రోజువారీ ప్రయాణాలకు సరిపడే మైలేజ్ అందించడం ఈ బైక్‌కు ప్లస్ పాయింట్. మీరు ఇప్పుడు కొత్త బైక్ కొనాలనే ఆలోచనలో ఉంటే, పవర్‌ఫుల్ ఇంజిన్, స్పోర్టీ లుక్, నమ్మకమైన బ్రాండ్ విలువ కావాలంటే Apache RTR 160 ఖచ్చితంగా పరిశీలించాల్సిన మోడల్. నగరంలో డైలీ కమ్యూట్ అయినా, హైవే రైడింగ్ అయినా అన్ని అవసరాలకు ఇది సరిపోతుంది. ఈ బైక్ గురించిన వివరాలను ఈ కింది కథనంలో అందిస్తున్నాము.

ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా మొత్తం ఒకే కారులో

భారతదేశంలో ఇప్పుడు పెద్ద కుటుంబాల ట్రెండ్ మళ్లీ మొదలైంది. వీకెండ్ వస్తే చాలు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లడానికి అనువైన కార్ల కోసం జనం ఎగబడుతున్నారు. అందుకే ఇప్పుడు కార్ల కంపెనీలన్నీ ఎమ్‌పీవీ (MPV - Multi Purpose Vehicle)ల మీద దృష్టి పెట్టాయి. వచ్చే కొన్ని నెలల్లో భారత రోడ్ల మీదకు రాబోతున్న టాప్-6 ఫ్యామిలీ కార్ల వివరాలు తెలుసుకుందాం.

రోడ్డుపై జారకుండా కాపాడే టెక్నాలజీ

ఇటీవల భారత మార్కెట్‌లోకి వచ్చిన కొత్త సుజుకి యాక్సెస్ 125 ఏబీఎస్ (Suzuki Access 125 abs) స్కూటర్ వినియోగదారుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తోంది. ఇప్పటికే యాక్సెస్ 125కు ఉన్న మంచి పేరు, నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ కొత్త ABS వెర్షన్‌ను సుజుకి లాంచ్ చేసింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు ఆధునిక టెక్నాలజీ, భద్రతకు పెద్దపీట వేయడం వల్ల ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఈ స్కూటర్‌లో ఇచ్చిన ముఖ్యమైన అప్‌డేట్ సింగిల్-ఛానల్ ABS (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్). అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు వీల్ లాక్ కాకుండా ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా నగర ట్రాఫిక్‌లో లేదా జారి పడే రోడ్లపై ప్రయాణిస్తున్న సమయంలో ABS సిస్టమ్ ప్రమాదాల అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుంది.
Advertisement

దెబ్బకు రూ.37,000 ఆదా..ఇక షోరూమ్‌ల దగ్గర క్యూలే

కొత్త కారు కొనాలని కలలు కంటున్నారా? అది కూడా తక్కువ ధరలో ఎస్‌యూవీ (SUV) లాంటి లుక్ ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే శుభవార్త. మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ ఎస్-ప్రెస్సో(Maruti S-Presso) పై ఫిబ్రవరి 2026లో కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. కేవలం రూ.3.49 లక్షల ప్రారంభ ధరతో పాటు, లీటరుకు 33 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ కారు ఇప్పుడు సామాన్యుడికి మరింత చేరువయ్యింది. ఫిబ్రవరి 2026 నెలలో మారుతి సుజుకి తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన ఎస్-ప్రెస్సోపై భారీ ఆఫర్లను అందిస్తోంది. మీరు ఈ నెలలో గనుక కారు కొంటే ఏకంగా రూ.37,500 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో వేర్వేరు రకాల తగ్గింపులు ఉన్నాయి.

రూ.6.85 లక్షలు.. అయినా కంపెనీకి పెద్ద ట్విస్ట్!

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (maruti suzuki fronx) భారత మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందిన కాంపాక్ట్ SUV. స్టైలిష్ డిజైన్, మారుతి బ్రాండ్ నమ్మకం, మంచి మైలేజ్ వంటి కారణాలతో లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారుకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రతీ నెలా గౌరవప్రదమైన అమ్మకాల సంఖ్యను నమోదు చేస్తూ మార్కెట్‌లో తన స్థానం నిలబెట్టుకుంది. అయితే, జనవరి 2026 నెలలో మాత్రం ఈ SUV అమ్మకాలు స్వల్పంగా తగ్గినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. జనవరి 2026లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ మొత్తం 13,353 యూనిట్లు మాత్రమే డెలివరీ చేయగలిగింది. గత సంవత్సరం ఇదే కాలం అయిన జనవరి 2025లో ఈ సంఖ్య 15,192 యూనిట్లుగా ఉండడం గమనార్హం.

మైలేజ్ పెరగాలంటే ఎంత స్పీడుగా వెళ్లాలో తెలుసా ?

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో కారు ఉన్న ప్రతి ఒక్కరినీ వేధించే మెయిన్ ప్రాబ్లమ్ మైలేజ్. షోరూమ్ వాడు చెప్పినప్పుడు లీటరుకు 20 కిలోమీటర్లు వస్తుందన్న కారు, రోడ్డు మీదకు వచ్చేసరికి 12 లేదా 13 దగ్గరే ఆగిపోతుంటుంది. అసలు కారు ఎంత స్పీడ్‌లో వెళ్తే మంచి మైలేజ్ వస్తుంది? నెమ్మదిగా వెళ్తే ఇంధనం ఆదా అవుతుందా? లేక టాప్ గేర్‌లో దూసుకుపోతే కలిసి వస్తుందా? ఇలాంటి సందేహాలకు సమాధానంతో పాటు, మీ జేబుకు చిల్లు పడకుండా ఉండటానికి పాటించాల్సిన రూల్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్ ట్రాఫిక్‌కు బెస్ట్ కార్లు

భారతదేశంలోని మెట్రో నగరాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా, రోజువారీ వాహనాల వినియోగం ప్రజలకు పెద్ద సవాల్‌గా మారుతోంది. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో నివసించే వారు ప్రతిరోజూ గంటల తరబడి ట్రాఫిక్‌లోనే గడపాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆఫీస్‌కు వెళ్లడం, తిరిగి ఇంటికి రావడం అన్నీ ఓ పెద్ద పరీక్షలా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన కొన్ని ప్రముఖ కార్ తయారీ సంస్థలు, నగరాల్లో డ్రైవింగ్‌ను మరింత సులభంగా, సౌకర్యంగా మార్చే దిశగా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. తక్కువ పరిమాణం, సులభమైన మలుపులు, మంచి మైలేజ్, ట్రాఫిక్‌లో ఇబ్బంది లేకుండా నడిచే లక్షణాలతో ఈ కార్లు నగర ప్రయాణాలకు సరైన పరిష్కారంగా మారుతున్నాయి. ఈ కథణంలో ఆ కార్లను చూద్దాం.
Advertisement

ఇప్పుడు బుక్‌ చేస్తే డెలివరీకి ఒక ఏడాది టైం

మహీంద్రా (Mahindra) భారత మార్కెట్లో తన పాపులర్ SUV 700ను తాజాగా అప్‌డేట్ చేసి XUV7XO అనే కొత్త పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత జనవరిలో లాంచ్ అయిన ఈ SUVకు కొత్త పేరు మాత్రమే కాకుండా, ఆకర్షణీయమైన డిజైన్ మార్పులు, ఆధునిక ఫీచర్లు కూడా జోడించడంతో మార్కెట్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన వెయిటింగ్ పీరియడ్ వివరాలు చాలా మంది కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ SUV బుకింగ్‌లు డిసెంబర్ 15, 2025 నుంచి ప్రారంభం కాగా, డెలివరీలు జనవరి 14 నుంచి మొదలయ్యాయి. అయితే డిమాండ్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో, వేరియంట్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, మిడ్ వేరియంట్‌లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.