రూ.6 లక్షలకే 7 సీట్ల కారు..ఫిబ్రవరి 17న లాంచ్

భారతీయ రోడ్లపై మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇష్టమైన వాహనం ఏదైనా ఉందంటే అది ఎంపీవీ(MPV - Multi Purpose Vehicle). తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించే వీలుండటమే దీనికి ప్రధాన కారణం. ఈ విభాగంలో ఇప్పటికే మారుతి ఎర్టిగా, రెనో ట్రైబర్ రాజ్యమేలుతుండగా, ఇప్పుడు వీరికి గట్టి పోటీ ఇచ్చేందుకు జపనీస్ కార్ల దిగ్గజం నిస్సాన్ సిద్ధమైంది.

ఇదే లక్కీ ఛాన్స్..ఇది మిస్సయితే చాలా నష్టపోతారు

కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా ? మరీ ముఖ్యంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ (SUV) కోరుకునే వారికి మారుతి సుజుకి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. హ్యుందాయ్ క్రెటా వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తున్న మారుతి సుజుకి తన ఫ్లాగ్‌షిప్ మోడల్ విక్టోరిస్ (Maruti Suzuki Victoris) పై లాంచ్ అయిన తర్వాత మొదటిసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఫిబ్రవరి నెలలో ఈ కారుపై ఏకంగా రూ.78,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. కేవలం నాలుగు నెలల్లోనే 50 వేల యూనిట్ల అమ్మకాల మార్కును దాటిన ఈ కారుపై ఆఫర్లు ప్రకటించడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్ గా మారింది.

టాటా ఎలక్ట్రిక్ కారుపై అదిరిపోయే డిస్కౌంట్

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు (EV) ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ముఖ్యంగా భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) పై కనీవినీ ఎరుగని ఆఫర్లను ప్రకటించింది. మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ పాత బైక్ లేదా మెట్రో ప్రయాణం కంటే తక్కువ ఖర్చుతో కారులో షికారు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. ఈ ఫిబ్రవరి 2026లో టాటా అందిస్తున్న ఈ భారీ తగ్గింపులు, కారు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. టాటా మోటార్స్ తన స్టాక్ క్లియరెన్స్ లో భాగంగా పాత, కొత్త మోడళ్లపై వైవిధ్యమైన ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా MY24, MY25 (2024, 2025 తయారీ) మోడల్ టియాగో ఈవీలపై ఏకంగా రూ.1.50 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

మిడిల్ క్లాస్ వాళ్ల కోసమే తెచ్చిన లగ్జరీ కారు మావ

టాటా కర్వ్ (Tata Curvv) వంటి ఖరీదైన కూపే ఎస్‌యూవీని కొనాలని ఉందా? కానీ బడ్జెట్ తక్కువగా ఉందని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం మార్కెట్లోకి ఒక అదిరిపోయే ఆప్షన్ వచ్చేసింది. అదే సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్(Citroen Basalt X). చూడటానికి ఎంతో స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తున్న ఈ కారు.. ధర విషయంలో మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉంది. కేవలం రూ.8.15 లక్షల ప్రారంభ ధరతో, అదిరిపోయే మైలేజీని ఇస్తూ ఇప్పుడు కార్ల ప్రేమికుల హాట్ ఫేవరెట్ గా మారింది. అసలు ఈ కారులో ఏముంది? ఇది టాటా కర్వ్‌కు గట్టి పోటీ ఇస్తుందా? అనే వివరాలు తెలుసుకుందాం.
Advertisement

ధర పెరిగినా కూడా ఈ బైక్ క్రేజ్ తగ్గదు

యూత్ ఫేవరెట్ స్పోర్టీ స్కూటర్ టీవీఎస్ ఎన్ టార్క్ (TVS Ntorq 125) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే షోరూమ్‌కు వెళ్లే ముందు ఈ వార్త చదవాల్సిందే. ప్రస్తుత కాలంలో కాలేజీ కుర్రాళ్ల నుంచి ఆఫీసు వెళ్లే యువత వరకు అందరినీ ఆకట్టుకుంటున్న ఈ స్కూటర్ ధరలపై కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఉత్పాదక ఖర్చుల దృష్ట్యా ధరలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. స్పోర్టీ స్కూటర్ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు టీవీఎస్ ఎన్ టార్క్.

టాటా-మారుతిలకు గట్టి పోటీ ఇస్తున్న కియా కారు

కియా సోనెట్ (Kia Sonet) దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా నుంచి వచ్చిన ఒక కాంపాక్ట్ SUVగా భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, ఆధునిక డిజైన్, ఆకర్షణీయమైన స్టైలింగ్‌తో ఇది మొదటి చూపులోనే వినియోగదారులను ఆకట్టుకుంటుంది. సెల్టోస్ ద్వారా భారీ విజయం అందుకున్న తర్వాత, భారత మార్కెట్‌లో కియా బ్రాండ్‌పై నమ్మకం మరింత పెరిగింది. ఆ విశ్వాసానికి కొనసాగింపుగా, కియా ప్రవేశపెట్టిన తొలి మేడ్ ఇన్ ఇండియా SUVగా సోనెట్‌కు ప్రత్యేక స్థానం లభించింది. ఈ కారు కేవలం ఒక కొత్త మోడల్‌గా మాత్రమే కాకుండా, కియా ఇండియా వ్యూహంలో కీలక పాత్ర పోషించింది. నేడు చూస్తే, కియా లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనం కూడా ఇదే కావడం విశేషం.

కార్ కొనాలంటే దేశం మొత్తం చెప్పేది ఒక్క పేరే

మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10) భారత ఆటోమొబైల్ మార్కెట్లో నిజంగా ఒక ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. కాలం మారినా, కస్టమర్ల అవసరాలు మారినా, అతి తక్కువ ధరకే నమ్మకమైన కారు అనే గుర్తింపును ఈ కారు ఇప్పటికీ కోల్పోలేదు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల కలను నిజం చేసే వాహనంగా ఆల్టో K10 పేరు నిలిచిపోయింది. తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలని కలగనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారింది. మొదటి కారు కొనుగోలు చేసే వారు, రోజువారీ పనుల కోసం సరళమైన వాహనం కావాలనుకునే కుటుంబాలు, చిన్న వ్యాపార అవసరాలకు ఉపయోగించే వారు అందరికీ ఆల్టో K10 సరైన ఎంపికగా కనిపిస్తోంది.

రూ.60 పెట్రోల్‌తో 45 కి.మీ మైలేజ్ బైక్, ధర రూ.65 వేలు

బజాజ్ ప్లాటినా 110 (bajaj platina 110) భారత ద్విచక్ర వాహన మార్కెట్లో సంవత్సరాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మోటార్‌సైకిల్‌గా నిలుస్తోంది. ఈ బైక్ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. ముఖ్యంగా రోజువారీ ఆఫీసు ప్రయాణాలు, చిన్న వ్యాపార అవసరాలు, రోజంతా బైక్ మీదే ఆధారపడే వినియోగదారుల కోసం ప్లాటినా ఒక నమ్మకమైన భాగస్వామిగా మారింది. ఈ బైక్‌కు ఉన్న ప్రధాన బలం దాని తక్కువ నిర్వహణ ఖర్చులు. సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండడంలోనూ ప్లాటినా వినియోగదారులకు ఎలాంటి భారాన్ని మోపదు. సాధారణంగా నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువగా ఉండటం వల్ల, దీర్ఘకాలంలో ఈ బైక్‌ను ఉపయోగించడం చాలా లాభదాయకంగా మారుతుంది.
Advertisement

మహిళల టీ20 విజేతలకు మరపురాని బహుమతి

ఈ ఏడాది మహిళల టీ20 లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఛాంపియన్లుగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను ఆకట్టుకుంది. సీజన్ మొత్తం వారి ఆటలో కనిపించిన ఆత్మవిశ్వాసం, పోరాట స్ఫూర్తి, జట్టు సమన్వయం చివరకు వారికి కిరీటాన్ని అందించింది. ఈ చారిత్రక విజయానికి గుర్తింపుగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ ముందుకు రావడం విశేషంగా మారింది. ఆర్‌సీబీ మహిళా జట్టు సాధించిన ఈ ఘనతను గౌరవిస్తూ, జట్టులోని ప్రతి క్రీడాకారిణికి కొత్త చేతక్ C25 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా అందిస్తామని బజాజ్ ఆటో అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం ఒక బహుమతి మాత్రమే కాకుండా, మహిళా క్రీడాకారుల కష్టానికి, అంకితభావానికి, పట్టుదలకి ఇచ్చిన గౌరవంగా భావించవచ్చు.

కేవలం నాలుగున్నర లక్షలకే కొత్త టాటా కారు!

టాటా టియాగో (tata tiago) భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా ఎప్పటి నుంచో మంచి పేరు సంపాదించుకుంది. ధర, భద్రత, నమ్మకమైన పనితీరు ఈ మూడు అంశాలను సమానంగా అందించగల కారుగా టియాగోను చాలా మంది వినియోగదారులు చూస్తున్నారు. ఇటీవల కాలంలో ఆటోమొబైల్ మార్కెట్లో పోటీ తీవ్రంగా పెరిగినప్పటికీ, టాటా టియాగో మాత్రం అమ్మకాల విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. నిజానికి, తాజా అమ్మకాల గణాంకాలే దీనికి బలమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి. జనవరి 2026 నెలలో భారత మార్కెట్లో మొత్తం 8,349 టాటా టియాగో కార్లు అమ్ముడయ్యాయి. ఇది చిన్న సంఖ్య కాదు, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పోటీ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ స్థాయి అమ్మకాలు సాధించడం నిజంగా విశేషమే.

రూ.90 వేలకే 322 కి.మీ.రేంజ్ స్కూటర్!

నెలకు పెరుగుతున్న ఇంధన ఖర్చులు, పర్యావరణంపై అవగాహన, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు కలిసివచ్చి భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్‌ను రోజురోజుకీ పెంచుతున్నాయి. ఒకప్పుడు ఎలక్ట్రిక్ అంటే రేంజ్ తక్కువ అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తూ కొత్త తరం ఈవీ స్కూటర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం TVS iQube, Bajaj Chetak, Ola S1 వంటి మోడళ్లకు మంచి ఆదరణ ఉన్నప్పటికీ, రేంజ్ విషయంలో వినియోగదారులను నిజంగా ఆశ్చర్యపరుస్తున్న స్కూటర్ మాత్రం కోమాకి తీసుకొచ్చిన XR7 అని చెప్పాలి. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకునే ప్రతి వినియోగదారుడి మనసులో మొదట వచ్చే ప్రశ్న ఒక్కటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది? దీనినే రేంజ్ ఆందోళన అంటారు.

కొండలను పిండి చేసిన ఆంపియర్ నెక్సస్

భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఒక సరికొత్త చరిత్ర నమోదైంది. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఆంపియర్ నెక్సస్ (Ampere Nexus) ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రతిష్టాత్మకమైన ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‎లో చోటు సంపాదించుకుంది. తమిళనాడులోని అత్యంత ప్రమాదకరమైన, క్లిష్టమైన కొల్లి కొండలను (Kolli Hills) విజయవంతంగా అధిరోహించిన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా ఇది రికార్డు సృష్టించింది. సాధారణంగా పెట్రోల్ బండ్లకే సవాలు విసిరే ఈ దారిని, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ చిటికెలో దాటేయడం ఇప్పుడు ఆటోమొబైల్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది.
Advertisement

షోరూమ్‌లకు వచ్చిన ప్రతిఒక్కరూ ఈ కారే కావాలంటున్నారు

దేశీయ దిగ్గజ ఆటో తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) నుంచి వచ్చిన కొత్త సియెర్రా SUV ఇటీవల కాలంలో భారత ఆటో మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు లెజెండరీ మోడల్‌గా గుర్తింపు పొందిన సియెర్రా పేరును తిరిగి తీసుకురావడంతోనే ఈ కారు జనాల్లో భారీ ఆసక్తిని రేపింది. రెట్రో టచ్‌తో కూడిన ఆధునిక డిజైన్, బోల్డ్ SUV లుక్, టాటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కలిసి ఈ కారును చూసిన ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా చేశాయి. కొత్త టాటా సియెర్రా SUVను కంపెనీ అధికారికంగా నవంబర్ 2025లో విడుదల చేయగా, లాంచ్ అయిన వెంటనే దీనికి అద్భుతమైన స్పందన లభించింది. షోరూమ్‌ల వద్ద విచారణలు, బుకింగ్స్ భారీగా పెరిగాయి.

సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఇష్టంగా కొంటున్న కారు

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) భారత మార్కెట్‌లో ఒక ప్రజాదరణ పొందిన SUVగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన పనితీరు, అలాగే టయోటా బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కారణంగా ఈ కారుకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతూనే ఉంది. వినియోగదారులు కూడా ఈ SUVను ఆసక్తిగా కొనుగోలు చేస్తుండటంతో, హైరైడర్ అమ్మకాలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత నెల అయిన జనవరి 2026లో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ భారీ అమ్మకాలను నమోదు చేసింది. ఈ ఒక్క నెలలోనే మొత్తం 9,156 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయబడ్డాయి. ఇది టయోటాకు మాత్రమే కాకుండా, మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌కు కూడా ఒక మంచి సంకేతంగా భావించవచ్చు.

పేదలపాలిటి పెన్నిది ఈ స్కూటర్

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ ఓమేగా సెకి మొబిలిటీ (Omega Seiki Mobility) సామాన్యుడి బడ్జెట్‌లో అదిరిపోయే రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీని పేరు వెక్‌స్ట్రా (Vextra). ఇప్పటి వరకు కమర్షియల్ వాహన రంగంలో తన ముద్ర వేసిన ఈ కంపెనీ, ఇప్పుడు ప్రయాణికుల కోసం అదిరిపోయే ఫీచర్లతో ఈ ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

20వ తేదీన టాటా నుంచి మరో ఎలక్ట్రిక్ సర్ప్రైజ్

టాటా పంచ్ (tata punch) భారత ఆటో మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, కాంపాక్ట్ సైజ్‌లో SUV ఫీల్, మంచి సేఫ్టీ రేటింగ్ వంటి కారణాలతో ఈ కారు తక్కువ కాలంలోనే పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకట్టుకుంది. టాటా మోటార్స్ ఈ మోడల్‌ను అంతర్గత దహన ఇంజిన్ (IC ఇంజిన్), పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చి, విభిన్న అవసరాలున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇటీవలే టాటా పంచ్ IC ఇంజిన్ వెర్షన్‌కు నవీకరించబడిన ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో డిజైన్, ఫీచర్లు మరింత మెరుగుపడటంతో పాటు, వినియోగదారుల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది.
Advertisement

నెంబర్ ప్లేట్ రంగును చూసి వెహికల్ జాతకం చెప్పొచ్చు

రోడ్డుపై వెళ్తున్నప్పుడు మనం రకరకాల రంగుల నంబర్ ప్లేట్లను చూస్తుంటాం. చాలామందికి వైట్, ఎల్లో కలర్ ప్లేట్ల గురించి మాత్రమే తెలుసు. కానీ భారతదేశంలో వాహనాల నంబర్ ప్లేట్లు కేవలం నంబర్లను ప్రదర్శించడానికి మాత్రమే కాదు, ఆ వాహనం దేనికి సంబంధించింది? దాని యజమాని ఎవరు? ఆ వెహికల్ చట్టపరమైన హోదా ఏంటి? అనే విషయాలను ఇట్టే చెప్పేస్తాయి. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఈ రంగులను కేటాయించారు. ఒకవేళ మీరు తప్పుడు నంబర్ ప్లేట్‌తో దొరికిపోతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే నంబర్ ప్లేట్ల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.

కారు ఉండాలనే కోరికను నెరవేర్చిన కార్ ఇదే!

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (maruti suzuki wagonr) భారత ఆటో మార్కెట్‌లో ఎన్నో సంవత్సరాలుగా ఒక నమ్మకమైన, ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌గా గుర్తింపు పొందింది. విశాలమైన క్యాబిన్, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాలతో కుటుంబ వినియోగదారుల నుంచి ఈ కారుకు ఎప్పటికీ మంచి స్పందన లభించింది. అందుకే చాలా మంది వినియోగదారులు వ్యాగన్ఆర్‌ను ఆనందంగా కొనుగోలు చేస్తూ వచ్చారు. అయితే తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం, 2026 జనవరి నెలలో ఈ కారు అమ్మకాలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. జనవరి 2026లో మొత్తం 15,118 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లు మాత్రమే డెలివరీ అయ్యాయి. గత సంవత్సరం అదే కాలంతో పోలిస్తే ఈ సంఖ్య స్పష్టంగా తగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2025 జనవరిలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 24,078 యూనిట్లు అమ్ముడయ్యాయి.

లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ ఈ కారు

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీల హవా కొనసాగుతోంది.ప్రస్తుతం కొత్త కారు కొనే వాళ్ల ఫస్ట్ ఛాయిస్ ఎస్యూవీనే. ముఖ్యంగా సెవెన్ సీటర్ లగ్జరీ ఎస్యూవీ విభాగంలో ఇప్పటి వరకూ టయోటా ఫార్చ్యూనర్ తిరుగులేని కింగ్ లా వెలుగొందుతుంది. అయితే ఇప్పుడు ఈ సామ్రాజ్యానికి సవాల్ విసిరేందుకు జర్మన్ దిగ్గజం ఫోక్స్ వ్యాగన్(Volkswagen) తన అస్త్రాన్ని రెడీ చేసింది. సరికొత్త టైరాన్ ఆర్ లైన్ (Tayron R-Line) ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేసేందుకు ముహూర్తం పెట్టేసింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభం కావడంతో కార్ లవర్లలో ఉత్సాహం నెలకొంది.

జూపిటర్ కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్

టీవీఎస్ జూపిటర్ 110 (Tvs Jupiter 110) భారత మార్కెట్‌లో చాలా కాలంగా ఒక నమ్మకమైన, ప్రజాదరణ పొందిన స్కూటర్‌గా నిలిచింది. రోజువారీ ప్రయాణాలకు ఇది ఎంతగానో అనుకూలంగా ఉండటం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, అలాగే మంచి మైలేజ్ అందించడం వల్ల అన్ని వర్గాల వినియోగదారుల నుంచి దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే ప్రతి నెలా ఈ స్కూటర్ మంచి అమ్మకాలు నమోదు చేస్తూ మార్కెట్‌లో తన స్థానం మరింత బలపరుచుకుంటోంది. ఇప్పటికే జూపిటర్‌ను వినియోగిస్తున్న కస్టమర్లు కూడా దీని పనితీరు, సౌకర్యాలపై సంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా టీవీఎస్ కంపెనీ జూపిటర్ 110 స్కూటర్ ధరలను సవరించింది. ప్రస్తుతం ఈ స్కూటర్ పలు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, ప్రతి వేరియంట్‌పై కొంత ధర పెంపు జరిగింది.
Advertisement

ఒక్క ప్రకటనతో దేశాన్నే ఆశ్చర్యపరిచిన రివోల్ట్

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తోంది. పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రేసులో ఎలక్ట్రికల్ బైక్ తయారీలో అగ్రగామిగా ఉన్న రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తమ బ్రాండ్‌ను మరింత జనాల్లోకి తీసుకెళ్లేందుకు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ వార్త ఇప్పుడు అటు క్రికెట్ సర్కిల్స్‌లోనూ, ఇటు ఆటోమొబైల్ రంగంలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

రూ.లక్ష దాకా తగ్గిన ఐ20 ధర.. కొత్త ధర ఎంతంటే ?

భారతదేశంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగొందుతున్న హ్యుందాయ్ ఐ20 (Hyundai i20) ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువకానుంది. తన మార్కెట్ వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా హ్యుందాయ్ మోటార్స్ ఐ20 ధరలను భారీగా తగ్గించడమే కాకుండా, ఒక సరికొత్త బడ్జెట్ వేరియంట్‌ను కూడా రంగంలోకి దించింది. ఈ నిర్ణయంతో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.

ఈ కారు కోసం నెలల తరబడి వెయిట్!

కొత్త టాటా సియెర్రా (Tata Sierra) SUV భారత ఆటోమొబైల్ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి భారీ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత సంవత్సరం నవంబర్ నెలలో గ్రాండ్ లాంచ్‌తో పరిచయమైన ఈ SUV, లాంచ్ అయిన క్షణాల నుంచే తన స్టైలిష్ డిజైన్, ఆధునిక లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకప్పటి ఐకానిక్ పేరైన 'సియెర్రా'ను ఆధునిక టచ్‌తో తిరిగి తీసుకురావడం టాటా మోటార్స్‌కు పెద్ద ప్లస్‌గా మారింది. డిజైన్ పరంగానే కాదు, మార్కెట్ రెస్పాన్స్ విషయంలో కూడా టాటా సియెర్రా అంచనాలను మించి విజయాన్ని సాధించింది. డిసెంబర్ 16 నుంచి అధికారికంగా బుకింగ్‌లు ప్రారంభం కావడంతో, వినియోగదారుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది.

31 రోజుల్లోనే 17 వేల మందికి పైగా కొనేశారు

మారుతి సుజుకి 2026 సంవత్సరాన్ని కూడా బలమైన అమ్మకాలతోనే ప్రారంభించింది. జనవరి 2026 నెలలో కంపెనీ మొత్తం 2.37 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది, ఇది భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. ప్రయాణికుల కార్ల విభాగంలో వినియోగదారుల నమ్మకం పొందిన బ్రాండ్‌గా మారుతి కొనసాగుతుండటానికి ఈ గణాంకాలే సాక్ష్యం. ఈ భారీ అమ్మకాలలో స్విఫ్ట్, బ్రెజ్జా, డిజైర్, బాలెనో వంటి పాపులర్ మోడళ్లే ప్రధానంగా కీలక పాత్ర పోషించాయి. ఈ కార్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతుండటం వల్ల, జనవరి నెలలో ఇవి రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. స్టైల్, మైలేజ్, నమ్మకమైన పనితీరు, సరసమైన ధరల కలయికే ఈ మోడళ్లను వినియోగదారుల మొదటి ఎంపికగా మార్చిందని చెప్పవచ్చు.
Advertisement

మారుతి, టాటాలకు వెన్నులో వణుకు మొదలైంది

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ (Nissan) భారత మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి భారీ స్కెచ్ వేసింది. మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి కంపెనీలకు సవాల్ విసురుతూ, మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌లో ఒక పవర్‌ఫుల్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. అదే నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton). ఫిబ్రవరి 4న ఈ కారును అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయాల్సి ఉన్నప్పటికీ, ఒక చిన్న వ్యూహాత్మక మార్పు కారణంగా ఇది కొద్దిగా ఆలస్యమైంది. నిస్సాన్ సంస్థ తన సరికొత్త ఎస్‌యూవీ టెక్టాన్‌ను ఫిబ్రవరి 4న ఆవిష్కరిస్తుందని అందరూ భావించారు. కానీ, అంతకంటే ముందే తన 7-సీటర్ ఎంవీవీ నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite)ను మార్కెట్లోకి పంపాలని నిస్సాన్ నిర్ణయించుకుంది. నిస్సాన్ గ్రావైట్ ఫిబ్రవరి 17న గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. గ్రావైట్ లాంచ్ పూర్తయిన వెంటనే, టెక్టాన్ ఆవిష్కరణ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. అంటే ఈ ఫిబ్రవరి నెలలోనే నిస్సాన్ రెండు పెద్ద అస్త్రాలను వదలబోతోందన్నమాట. నిస్సాన్ టెక్టాన్ కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఇది రోడ్డుపై ఒక రాజసాన్ని ప్రదర్శిస్తుంది. ఈ కారు డిజైన్ నిస్సాన్ ప్రసిద్ధ గ్లోబల్ మోడల్ నిస్సాన్ పెట్రోల్ నుంచి స్ఫూర్తి పొందింది. దీనికి పవర్‌ఫుల్ గ్రిల్, C-షేప్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటాయి. 17 లేదా 18 ఇంచుల అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ , మజిల్ లాంటి బాడీ లైన్స్ కారుకు ఒక అడ్వెంచరస్ లుక్ ఇస్తాయి. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, టెక్టాన్ బ్యాడ్జింగ్‌తో కారు ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. లోపల అడుగుపెడితే, మీరు ఒక లగ్జరీ కారులో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. టెక్టాన్‌లో నిస్సాన్ ఎలాంటి ఫీచర్లను కూడా వదల్లేదు. 10.1 ఇంచ్ లార్జ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, గూగుల్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు (ముందు భాగంలో), డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, 10.25 ఇంచ్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్‌కు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా అందిస్తుంది. సేఫ్టీ విషయంలో నిస్సాన్ రాజీ పడలేదు. ఈ కారులో లెవల్ 2 అడాస్ (ADAS - Advanced Driver Assistance Systems) ను అమర్చారు. ఇది ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో ప్రమాదాలను అరికడుతుంది. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు స్టాండర్డ్ గా రానున్నాయి. నిస్సాన్ టెక్టాన్ కొత్త తరం రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఇందులో మూడు రకాల ఇంజిన్లు ఉండే అవకాశం ఉంది:1.0 లీటర్ టర్బో పెట్రోల్: సిటీలో ప్రయాణించడానికి, మంచి మైలేజ్ ఇచ్చే ఇంజిన్ ఇది.1.3 లీటర్ టర్బో పెట్రోల్: హైవేలపై వేగంగా వెళ్లాలనుకునే వారికి, ఎక్కువ హార్స్ పవర్ ఇచ్చే ఇంజిన్ ఇది.1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్: ఈ ఇంజిన్ అద్భుతమైన ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది, ఇది పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. నిస్సాన్ టెక్టాన్ ప్రారంభ ధర సుమారు రూ.10 లక్షల నుంచి రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండవచ్చని అంచనా. ఒకవేళ ఇదే ధరలో కారు విడుదలైతే, మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా సియెర్రా వంటి దిగ్గజ కార్లకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే కంపెనీగా నిస్సాన్ తన గుర్తింపును మళ్ళీ దక్కించుకోనుంది.