ఎన్ని కార్లున్నా జనాలు మాత్రం ఆ కారే కావాలంటున్నారు

2026 ప్రారంభంలోనే భారత ఆటోమొబైల్ రంగం అనూహ్య మలుపులతో వేడెక్కింది. ఇన్నాళ్లూ విపణిలో రారాజుగా వెలిగిన మారుతి సుజుకికి గట్టి పోటీనిస్తూ టాటా మోటార్స్ సంచలనం సృష్టించింది. జనవరి 2026 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, మారుతి తన ఆధిపత్యాన్ని చాటుకున్నప్పటికీ, మొదటి స్థానాన్ని మాత్రం టాటా నెక్సాన్‌కు కోల్పోయింది. సరికొత్త కార్ల ఎంట్రీ, పెరిగిన ఎస్‌యూవీ పిచ్చి వెరసి టాప్ 10 జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

సామాన్యుల కోసం దేశంలోనే మొట్టమొదటి యమహా ఎలక్ట్రిక్ స్కూటర్

యమహా మోటార్ ఇండియా (Yamaha Motorcycle India) దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటివరకు పెట్రోల్ బైక్స్, స్కూటర్లతో మార్కెట్‌ను ఆకట్టుకున్న యమహా, ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహన (EV) విభాగంలోకి కూడా అధికారికంగా అడుగుపెట్టింది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Yamaha EC-06 (ఈసీ 06)ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కొత్త EC-06 ఈ-స్కూటర్ మొదటి చూపులోనే ఆకట్టుకునే డిజైన్‌తో వస్తుంది. ఆధునిక స్టైలింగ్, ప్రీమియం లుక్‌తో యువతతో పాటు కుటుంబ వినియోగదారులను కూడా ఆకర్షించేలా దీన్ని రూపొందించారు. ముఖ్యంగా, ఈ స్కూటర్‌ను బెంగళూరు సమీపంలోని హోస్కోట్‌లో ఉన్న రివర్ మొబిలిటీ తయారీ యూనిట్‌లో తయారు చేయడం విశేషం.

రూ.25 వేల జీతంతో ఈ కారు కొనచ్చు!

మారుతి సుజుకి (maruti suzuki) భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రగామి తయారీదారుగా తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. నమ్మకం, సరసమైన ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలు మారుతి సుజుకిని కోట్లాది భారతీయ కుటుంబాల మొదటి ఎంపికగా నిలబెట్టాయి. ఈ బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం జనవరి 2026 అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. జనవరి 2026లో మారుతి సుజుకి మొత్తం 2,36,963 యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేసి మరో బలమైన నెలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో, అంటే జనవరి 2025లో కంపెనీ 2,12,251 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ రెండు గణాంకాలను పోల్చితే, మారుతి సుజుకి అమ్మకాలు సంవత్సరానికి 11.6 శాతం (YoY) వృద్ధిని నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది.

ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి మూడు జిల్లాలు తిరగొచ్చు

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ సందర్భంలో సామాన్యుల చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిపి ప్రయాణించే వారికి సరిగ్గా సరిపోయేలా ఎంజీ విండ్సర్ ఈవీ(MG Windsor EV) మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Advertisement

ఎక్కడ చూసినా ఈ కంపెనీ కార్లే కొనాలని పట్టుబడుతున్న జనాలు

టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన, పేరుగాంచిన కార్ల తయారీదారుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నాణ్యత, మన్నిక, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అధిక రీ-సేల్ విలువ వంటి అంశాలు టయోటా కార్లకు దేశవ్యాప్తంగా బలమైన అభిమానాన్ని తెచ్చిపెట్టాయి. అందుకే దేశీయ మార్కెట్‌లో టయోటా వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వినియోగదారులు కూడా ఈ బ్రాండ్‌పై ఉన్న నమ్మకంతో వరుసగా టయోటా కార్లను ఎంచుకుంటున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌కు తాజా ఉదాహరణగా జనవరి 2026 నెల నిలిచింది. గత నెలలో టయోటా కిర్లోస్కర్ మోటార్ మొత్తం 33,880 యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేసి, బలమైన అమ్మకాల ప్రదర్శనను నమోదు చేసింది.

మారుతి సుజుకి దెబ్బకు రికార్డులన్నీ బద్ధలు

భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2026 ఏడాదిని విజయకేతనంతో ప్రారంభించిన ఈ కంపెనీ, జనవరి నెలలో కళ్లు చెదిరే అమ్మకాలతో రికార్డులను తిరగరాసింది. కేవలం 31 రోజుల్లోనే ఏకంగా 2.36 లక్షల కార్లను విక్రయించి, ఇతర కంపెనీలకు అందనంత ఎత్తులో నిలిచింది. దేశీయ మార్కెట్లోనే కాకుండా, విదేశీ ఎగుమతుల్లో కూడా మారుతి సుజుకి తన సత్తా చాటింది. అసలు మారుతి ఇంతటి ఘనతను ఎలా సాధించింది? ఏయే కార్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి? అనే వివరాలు చూద్దాం.

సామాన్యులకు ఎలక్ట్రిక్ కార్లు చవకవుతాయా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను విజయవంతంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకోగా, ముఖ్యంగా వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహన (EV) పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతున్న ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో బడ్జెట్ రూపకల్పన చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, ఈ బడ్జెట్‌లో పర్యావరణ అనుకూల రవాణాకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది.

ప్రతిరోజూ 890 కార్లు అమ్ముతున్న కంపెనీ

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా (Kia) భారత మార్కెట్‌లో రోజురోజుకీ తన పట్టును మరింత బలపరుచుకుంటోంది. స్టైలిష్ డిజైన్, ఆధునిక టెక్నాలజీ, భద్రతా ఫీచర్లు, విశ్వసనీయ పనితీరుతో కియా కార్లు వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. అందుకే కంపెనీ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతూ ఉండగా, కస్టమర్లు కూడా ఉత్సాహంగా ఈ బ్రాండ్‌ను ఎంచుకుంటున్నారు. ఈ పెరుగుతున్న ఆదరణకు తాజా ఉదాహరణగా జనవరి 2026 నెల నిలిచింది. గత నెలలో కియా మొత్తం 27,603 యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేయగా, ఇది కంపెనీకి బలమైన అమ్మకాల నెలగా మారింది. ఈ గణాంకాలను సగటుగా లెక్కిస్తే, రోజుకు దాదాపు 890 కార్లు విక్రయమైనట్లుగా కనిపిస్తోంది.
Advertisement

ఒక్క నెంబర్ ప్లేట్ ధర రూ.2.08 కోట్లు

భారతదేశంలో వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు ఉండటం ఒక స్టేటస్ సింబల్. తమకు ఇష్టమైన నంబర్ కోసం లక్షలు ఖర్చు చేయడం మనం చూస్తుంటాం. కానీ, ఇప్పుడు ఒక వ్యక్తి కేవలం ఒక నంబర్ ప్లేట్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు.

జనవరి అమ్మకాల్లో చరిత్ర సృష్టించిన కంపెనీ

హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన, బలమైన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. దేశీయ మార్కెట్‌లోనే కాదు, అంతర్జాతీయ ఎగుమతుల పరంగానూ హ్యుందాయ్ కార్లకు మంచి గుర్తింపు ఉంది. నాణ్యత, ఫీచర్లు, భద్రత, డిజైన్ అన్ని ప్యాకేజీగా ఉండటమే ఈ కంపెనీ విజయానికి ప్రధాన కారణం. ఇటీవల హ్యుందాయ్ విడుదల చేసిన జనవరి నెల అమ్మకాల గణాంకాలు కంపెనీ శక్తిని మరోసారి చాటిచెప్పాయి. ఇప్పటివరకు కంపెనీ చరిత్రలో ఒకే నెలలో సాధించిన అత్యధిక అమ్మకాలుగా జనవరి 2026 నిలిచింది. ఈ నెలలో హ్యుందాయ్ మొత్తం 73,123 వాహనాలను విక్రయించి ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది. ఇందులో 59,107 వాహనాలు భారతదేశంలోనే అమ్ముడుపోగా, 14,030 వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది.

ఓర్నీ బడవా.. ఈ బాదుడేంటి ?

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ (Citroen) అంతర్జాతీయ మార్కెట్లో ఎంతటి సంచలనాలు సృష్టించినా, భారత మార్కెట్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయినప్పటికీ, పట్టువదలని విక్రమార్కుడిలా తన మోడళ్లలోని లోపాలను సరిదిద్దుకుంటూ భారత్‌లో పాగా వేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే, ఈ క్రమంలోనే సంస్థ తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సిట్రోయెన్ C3(Citroen C3) ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం కస్టమర్లను కాస్త నిరాశకు గురిచేస్తోంది. బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు కోరుకునే వారికి ఈ ధరల పెంపు ఒక షాక్ అనే చెప్పాలి.

బడ్జెట్ ఏదైనా..బండి మాత్రం టాటానే కావాలి

టాటా మోటార్స్ సరికొత్త రికార్డులతో 2026 ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. జనవరి 2026 నెలలో కంపెనీ ఏకంగా 71,066 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి, ఆటోమొబైల్ మార్కెట్‌లో తన పట్టును చాటుకుంది. గతేడాది ఇదే నెలలో (జనవరి 2025) జరిగిన 48,316 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 47.1 శాతం భారీ వృద్ధి కావడం విశేషం. ముఖ్యంగా టాటా నెక్సాన్, టాటా పంచ్ వంటి మోడళ్లు ఆల్-టైమ్ రికార్డులను సృష్టించాయి.
Advertisement

చైనాకు చుక్కలే...ఇక దిగుమతులకు గుడ్ బై

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పారిశ్రామికంగా పెను మార్పులు రాబోతున్నాయని స్పష్టమవుతోంది. "భారతదేశాన్ని చైనా తరహాలో తయారీ రంగంలో అగ్రగామిగా మార్చడమే" లక్ష్యంగా ఈసారి బడ్జెట్‌లో అదిరిపోయే ప్లాన్ వేశారు. ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విదేశాలపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించేందుకు భారీ నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్ వల్ల మన ప్రాంతం ఎలా మారబోతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి మొండిచూపు

కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన వేళ, దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఆటోమొబైల్ రంగం ఈ సారి ప్రభుత్వం నుంచి భారీ తాయిలాలు అందుతాయని ఆశించింది. కానీ బడ్జెట్ ప్రసంగం ముగిశాక పరిశ్రమ వర్గాల నుంచి ఆశించినంతగా ఏమీ లేదు అన్న నిట్టూర్పులే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లే వాళ్లకు పర్ఫెక్ట్ బైక్

ప్రస్తుత రోజుల్లో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. మరోవైపు ఆఫీసులకు వెళ్లేవారికి స్టైలిష్‌గా కనిపించడంతో పాటు జేబుకు చిల్లు పడకుండా మైలేజీ ఇచ్చే బైక్ కావాలి. ఈ రెండు అవసరాలను తీరుస్తూ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125). 125cc సెగ్మెంట్లో స్పోర్టీ లుక్, అధునాతన ఫీచర్లు, అద్భుతమైన మైలేజీని కలగలిపి వచ్చిన ఈ బైక్ యువతను, ముఖ్యంగా ఉద్యోగులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం రూ.82,000 ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ స్మార్ట్ బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

34కిమీ మైలేజీతో పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ కారు

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు, ముఖ్యంగా పల్లెటూళ్లలో నివసించే వారికి కారు కొనడం అనేది ఒక తీరని కల. అయితే ఆ కారు కేవలం అందంగా ఉంటే సరిపోదు.. అది మన జేబుకు తూట్లు పెట్టకూడదు. గుంతల రోడ్ల మీద కూడా రాజీ పడకుండా సాగిపోవాలి. ఇలాంటి అన్ని అవసరాలను తీరుస్తూ, దశాబ్దాలుగా భారతీయ రోడ్ల మీద రారాజులా వెలుగుతున్న కారు మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R). తాజాగా ఈ కారు సరికొత్త హంగులతో, అదిరిపోయే మైలేజీతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం రూ.4.99లక్షల ప్రారంభ ధరలో వస్తున్న ఈ కారు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Advertisement

వెండి ధరలు పెరగడం వెనుక అసలు నిజం ఇదే

వెండి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మెరిసే ఆభరణాలు, పూజా సామాగ్రి లేదా వెండి నాణేలు. సాధారణంగా మనం వెండిని ఒక పెట్టుబడి సాధనంగానో లేదా శుభకార్యాల్లో బహుమతులుగా ఇచ్చే వస్తువుగానో చూస్తాం. కానీ పారిశ్రామిక రంగంలో వెండికి ఉన్న విలువ అమూల్యమైనది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండిని ఎక్కువగా వాడుతుంటారు.

జాతర్లకు వెళ్లాలంటే పర్ఫెక్ట్ కారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కుటుంబ అవసరాలను కేంద్రంగా చేసుకుని కొనుగోళ్లు చేసే వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా 7-సీటర్ MPV కార్లకు ఇటీవల కాలంలో కనిపిస్తున్న డిమాండ్ దీనికి స్పష్టమైన నిదర్శనం. పెద్ద కుటుంబాలకు సరిపడే స్థలం, ప్రయాణాల్లో సౌకర్యం, రోజువారీ వినియోగానికి అవసరమైన ప్రాక్టికాలిటీ వంటి అంశాలతో పాటు బడ్జెట్‌కు అందుబాటులో ఉండే ధరలు ఈ సెగ్మెంట్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఒకే కారులో కుటుంబమంతా సౌకర్యంగా ప్రయాణించాలన్న కోరిక ఉన్న వినియోగదారులు ఎక్కువగా ఈ విభాగం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెనాల్ట్ ట్రైబర్ భారత మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

చిన్న కారు నుంచి 7-సీటర్ వరకూ.. విన్‌ఫాస్ట్ EV దండయాత్ర

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) ఇటీవల భారత మార్కెట్లో తన అడుగులు బలంగా వేస్తోంది. ఈ కంపెనీ సెప్టెంబర్ 2025లో అధికారికంగా దేశీయ మార్కెట్లోకి ప్రవేశించి, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త ఊపుని తీసుకొచ్చింది. వినియోగదారులను ఆకట్టుకునేలా VF6, VF7 అనే రెండు ఆధునిక ఎలక్ట్రిక్ SUVలును కూడా విడుదల చేసింది. ఈ మోడళ్ల ద్వారా విన్ ఫాస్ట్ భారత EV మార్కెట్లో తన సీరియస్ ఉద్దేశాలను స్పష్టంగా చూపించింది. రాబోయే రోజుల్లో మరింత విస్తృతమైన పోర్ట్‌ఫోలియోను అందించేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా, త్వరలోనే లిమో గ్రీన్, VF3, VF5 వంటి కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురావడానికి విన్ ఫాస్ట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాటి గురించి ఈ కింది కథణంలో చూద్దాం.

ఫార్చ్యూనర్‌కు పోటీగా కొత్త 7-సీటర్!

గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజమైన ఫోక్స్‌వ్యాగన్ ఇండియా భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలపరుస్తూ, తాజాగా తన కొత్త 7-సీటర్ SUV - ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ R-లైన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది 2026 సంవత్సరంలో ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ నుంచి భారతదేశంలో లాంచ్ అవుతున్న మొదటి మోడల్ కావడం విశేషం. ప్రీమియం డిజైన్, ఆధునిక టెక్నాలజీ, కుటుంబ అవసరాలకు సరిపోయే స్పేస్‌తో ఈ SUV భారతీయ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఇది బ్రాండ్ అందించే SUVలలో అత్యంత ప్రీమియం, ఫీచర్-రిచ్ మోడల్‌గా నిలవనుంది. ముఖ్యంగా 7 మంది ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండే ఈ SUV, లగ్జరీతో పాటు పనికివచ్చే ప్రాక్టికాలిటీని కూడా అందించనుంది. R-లైన్ బ్యాడ్జ్ ఉండటం వల్ల స్పోర్టీ లుక్, ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్స్, మరింత డైనమిక్ డిజైన్ ఇందులో కనిపించనున్నాయి.
Advertisement

పేదింటి మహలక్ష్మి ఈ బైక్

హీరో గ్లామర్ (hero glamour) మోటార్‌సైకిల్, తన సరసమైన ధర, ప్రీమియం ఫీచర్లతో ఇండియన్ బైక్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. వినియోగదారుల డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ, బైక్ ప్రజాదరణను కొత్త ఎత్తుకు తీసుకువెళ్ళింది. డిసెంబర్ 2025లో మాత్రమే, మొత్తం 17,166 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి, ఇది 2024 డిసెంబర్‌లోని 6,022 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే అద్భుతమైన 185.05% వృద్ధిని సూచిస్తోంది. ఈ అద్భుతమైన అమ్మకాల వృద్ధికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట, హీరో గ్లామర్ తన స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లతో ప్రతి తరానికి ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ఫ్యూయల్ ఎఫీషియెన్సీ కూడా గొప్పగా ఉంది, కాబట్టి రోజువారీ ప్రయాణాల్లో వినియోగదారులు ఖర్చులను తగ్గించుకోగలుగుతున్నారు.

చిన్న ఫ్యామిలీకి సరైన కారు! కేవలం రూ. 4.95 లక్షలు.. 28 కి.మీ మైలేజ్

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్ సిట్రోయెన్ (Citroen) రూపొందించిన C3 ఇప్పుడు భారతీయ మధ్యతరగతి వినియోగదారుల కోసం ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన ఎంపికగా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు కేవలం డిజైన్ అందం కోసం మాత్రమే కాదు, ప్రతి రోజు వాడకం, నగరాల్లో సులభమైన డ్రైవ్, కుటుంబ యాత్రలు అన్నీ సక్రమంగా నిర్వహించడానికి దృష్టి పెట్టి రూపొందించబడింది. చిన్న వీధులు, ట్రాఫిక్ జామ్‌లతో నిండిన సిటీల్లో కూడా C3 సౌకర్యవంతంగా, నమ్మకంగా నడుస్తుంది. కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్న వినియోగదారులకు C3 ఒక సమగ్ర ప్యాకేజ్‌ను అందిస్తుంది. ఈ కార్ వాడకం, ధర, సర్వీసులు అన్నీ భారతీయ లైఫ్‌స్టైల్‌ను బాగా పరిగణలోకి తీసుకుని రూపొందించబడ్డాయి. అందువల్ల, రోజువారీ ప్రయాణంలో ఆర్థికంగా, సౌకర్యపూర్వకంగా, విశ్వసనీయంగా ఉండేలా కేర్ తీసుకోవడం ఈ కారు ప్రత్యేకత.

బంగారానికే షాక్ ఇస్తోన్న కారు ఇదే

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ఇప్పుడు కేవలం ఒక కాంపాక్ట్ SUV మాత్రమే కాదు... భారత ఆటో పరిశ్రమ ఎగుమతుల మ్యాప్‌ను మార్చేస్తున్న పేరు. విదేశీ మార్కెట్లలో ఈ కారు సాధించిన విజయం చూసి, భారత మార్కెట్లో నంబర్ వన్ అమ్మకందారులైన మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఆశ్చర్యపోయే స్థాయికి నిస్సాన్ మాగ్నైట్ ఎదిగింది. డిసెంబర్ 2025 నెలకు సంబంధించిన కార్ల ఎగుమతి గణాంకాలు విడుదలైనప్పుడు, అందరి దృష్టి ఒక్కసారిగా నిస్సాన్ మాగ్నైట్ SUV పైనే నిలిచింది. ఎందుకంటే ఆ నెలలో భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి చేయబడిన వాహనంగా మాగ్నైట్ నిలిచింది. ఒక్క డిసెంబర్ 2025 లోనే మొత్తం 9,268 యూనిట్ల మాగ్నైట్ SUVలను విదేశీ మార్కెట్లకు నిస్సాన్ పంపింది.

మారుతి షోరూమ్‌ల ముందు క్యూ కట్టిన జనం!

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన ప్రస్థానంలో మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (Q3) కంపెనీ కలలో కూడా ఊహించని రీతిలో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండే చిన్న కార్ల విభాగంలో డిమాండ్ ఒక్కసారిగా పెరగడం విశేషం. ఈ అద్భుతమైన వృద్ధికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'GST 2.0' సంస్కరణలు అని విశ్లేషకులు చెబుతున్నారు.
Advertisement

దేశంలో జనాలు ఎక్కువగా బుక్ చేసుకుంటున్న కారు ఇదే

భారత మార్కెట్లో మహీంద్రా (Mahindra) మరోసారి తన క్రేజ్‌ను నిరూపించింది. XUV 700కి కొనసాగింపుగా అప్‌డేట్ చేసిన ఫేస్‌లిఫ్ట్ మోడల్ మహీంద్రా XUV 7XOను కంపెనీ ఇటీవల అధికారికంగా విడుదల చేసింది. లాంచ్ అయినప్పటి నుంచే ఈ SUVకి మార్కెట్లో అసాధారణమైన స్పందన లభిస్తోంది. కొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీతో వచ్చిన XUV 7XOపై కస్టమర్ల ఆసక్తి ఎంత స్థాయిలో ఉందో బుకింగ్ గణాంకాలే చెబుతున్నాయి. మహీంద్రా XUV 7XOను రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.11 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరల శ్రేణిలో ప్రవేశపెట్టింది. ఈ ధరలు ప్రారంభ ధరలు మాత్రమే కాగా, మొదటి 40,000 మంది కస్టమర్ల డెలివరీలకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ స్పష్టంచేసింది.