మారుతి బ్రాండ్‌కే షాక్ ఇచ్చిన సెలెరియో

భారత మార్కెట్లో సాధారణంగా బలమైన స్థానం కలిగిన మారుతి సుజుకి (Maruti Suzuki) కార్లు ఎక్కువగా మంచి అమ్మకాలను నమోదు చేస్తుంటాయి. కానీ ప్రతి మోడల్ ఒకే విధంగా రాణించదు అనే విషయాన్ని తాజాగా సెలెరియో (Celerio) పరిస్థితి స్పష్టంగా చూపిస్తోంది. ఒకప్పుడు తన కేటగిరీలో మంచి డిమాండ్‌ను అందుకున్న ఈ హ్యాచ్‌బ్యాక్, ఇప్పుడు మాత్రం మార్కెట్‌లో కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. 2026 మార్చి నెలలో సెలెరియో కేవలం 1,353 యూనిట్లు మాత్రమే అమ్ముడవడం గమనార్హం. అదే సమయంలో, గత ఏడాది మార్చి 2025లో ఈ కారు 2,268 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

జస్ట్ రూ.92 వేలకే కారు లాంటి స్కూటర్

ప్రస్తుత రోజుల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాగే యుద్ధ భయంలో బంకుల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. దీంతో సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే చాలామందికి టూ వీలర్ నడపాలంటే బ్యాలెన్స్ చేయలేమన్న భయం ఉంటుంది.. అలాగని కారు కొనాలంటే బడ్జెట్ సరిపోదు.

పెద్ద ఫ్యామిలీకి పండగే, రూ.5.81 లక్షలకే 7 సీటర్

రెనాల్ట్ ఇండియా (Renault India) మరోసారి ఫ్యామిలీ కార్ సెగ్మెంట్‌లో తన సత్తా చూపించేందుకు ముందుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్పేస్, మంచి ప్రాక్టికాలిటీ కావాలనుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని 2026 ట్రైబర్‌ (Triber)ను మరింత ఆకర్షణీయంగా తీసుకొచ్చింది. ఇప్పటికే భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందిన రెనాల్ట్ ట్రైబర్ ఇప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో మరింత ఉపయోగకరంగా మారింది. ఈ కొత్త మోడల్‌లో ఫ్యామిలీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ నుంచి ఫీచర్ల వరకు చిన్నచిన్న మార్పులు చేశారు. బయట నుంచి చూస్తే స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా, లోపలికి వెళ్తే విశాలమైన క్యాబిన్ అనుభూతి ఇస్తుంది. ముఖ్యంగా సీటింగ్ అరేంజ్‌మెంట్ విషయంలో ట్రైబర్ ప్రత్యేకత అలాగే కొనసాగింది.

పెట్రోల్ బాధ లేదు.. మైలేజ్ చింత లేదు

భారతీయ రోడ్ల మీద మారుతీ సుజుకి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. సాధారణంగా పెట్రోల్ కార్ల అమ్మకాల్లో మారుతీకి తిరుగులేదన్న సంగతి మనకు తెలుసు, కానీ ఇప్పుడు సీఎన్‌జీ (CNG) కార్ల సెగ్మెంట్లో కూడా ఈ కంపెనీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారతీయులు మారుతీ సీఎన్‌జీ కార్ల మీద మనసు పారేసుకున్నారు.
Advertisement

ఇక దారి మర్చిపోతామన్న భయం లేదు

ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంటి ముందు హమారా బజాజ్ అంటే ఒక ఎమోషన్. ఆ పాత చేతక్ స్కూటర్ శబ్దం వినబడితే చాలు, నాన్న ఆఫీసు నుంచి వచ్చారో లేక చుట్టాలు దిగారో అని పిల్లలందరూ రోడ్డు మీదకు పరుగెత్తే వారు.. కానీ కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది.. కానీ ఆ చేతక్ బ్రాండ్ మీద ఉన్న మమకారం మాత్రం మారలేదు.

కారు కొనేందుకు ఇదే కరెక్ట్ టైం

కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కస్టమర్ల కోసం ఏప్రిల్ నెలలో బంపర్ ఆఫర్లను ప్రకటించింది. స్టైల్, సేఫ్టీకి మారుపేరైన టాటా కార్లపై ఇప్పుడు ఏకంగా రూ.3.50 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. కేవలం ఎలక్ట్రిక్ కార్లే కాదు, పెట్రోల్, డీజిల్ కార్లపై కూడా కంపెనీ భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. ఏ కారుపై ఎంత తగ్గింపు ఉంది? ఏ ఆఫర్లు వర్తిస్తాయి? అనే పూర్తి వివరాలు ఈ వార్తలో చూద్దాం.

పెట్రోల్ డబ్బులు భారీగా ఆదా చేసే స్కూటర్

ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఏథర్ ఎనర్జీ, ఇప్పుడు సామాన్యుల బడ్జెట్‌లోకి చేరిపోయేందుకు రెడీ అవుతుంది. ఇప్పటివరకు ప్రీమియం స్కూటర్లకే పరిమితమైన ఏథర్, ఇప్పుడు మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ఒక సరికొత్త అఫార్డబుల్ స్కూటర్‌ను తీసుకురాబోతోంది.

ఈ చిన్న కార్ల కోసం లక్షల మంది వెయిటింగ్

దేశీయ రోడ్ల మీద మారుతి సుజుకి కార్ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్య తరగతి కుటుంబాలకు కార్లంటే మారుతి కార్లే. అయితే ఇప్పుడు మధ్య తరగతి ప్రజల కారు కల సాకారం చేసుకోవాలంటే కాస్త ఓపిక పట్టక తప్పదు. ఎందుకంటే మారుతి సుజుకి కార్లకు డిమాండ్ ఏం రేంజులో ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Advertisement

రోజుకు 4009 స్కూటర్లు అమ్ముడుపోతున్న స్కూటర్

భారతదేశంలో టూ వీలర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు హోండా యాక్టీవా. దశాబ్దాలుగా తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న యాక్టివా కోటను ఇప్పుడు ఒక స్వదేశీ స్కూటర్ బ్రేక్ చేస్తోంది. అదే టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter). మధ్యతరగతి భారతీయుడికి నమ్మకమైన నేస్తంలా మారిన ఈ స్కూటర్, అమ్మకాల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

మార్కెట్ షేక్ చేస్తున్న ఎన్‌టార్క్! 49% సేల్స్ పెరుగుదల

దేశీయ టూవీలర్ మార్కెట్‌లో కీలక స్థానాన్ని సంపాదించుకున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) నుంచి వచ్చిన టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS NTorq) యువతలో ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. స్పోర్టీ డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లు, మంచి పనితీరు కలిపి ఈ స్కూటర్‌ను కాలేజీ విద్యార్థుల నుంచి ఆఫీస్‌కు వెళ్లే యువత వరకు అందరికీ ఇష్టమైన మోడల్‌గా మార్చాయి. నగరాల్లో వేగంగా మారుతున్న లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా, స్టైల్‌తో పాటు పనితీరును కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు ఈ స్కూటర్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. మార్చి 2026లో TVS NTorq మొత్తం 32,598 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకూ నాన్‌స్టాప్

భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హ్యుందాయ్ అయానిక్ 5 (Hyundai IONIQ 5)ను ఇప్పుడు మరింత పవర్ఫుల్‎గా, అడ్వాన్సుడ్ ఫీచర్లతో అప్‌డేట్ చేసి మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 28, 2026న గురుగ్రామ్‌లో జరిగిన ఈ లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ కొత్త వెర్షన్‌కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది.

బేస్ వేరియంట్ లోనే ప్రీమియం ఫీచర్లను ఎంజాయ్ చేయండి

మధ్యతరగతి భారతీయుడికి కారు అనేది ఒక వాహనం మాత్రమే కాదు.. వారికి అదో భావోద్వేగం. అందులోనూ ఎస్‌యూవీ(SUV) అంటే ఉండే క్రేజే వేరు. దర్జాగా రోడ్డుపై వెళ్తుంటే వచ్చే ఆ రాజసం కోసం చాలామంది తమ బడ్జెట్‌ను దాటి మరీ అప్పులు చేసి టాప్ ఎండ్ మోడల్స్ కొంటుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి.. కేవలం కొన్ని అదనపు హంగుల కోసం లక్షల రూపాయలు ఎందుకు తగలేయాలి? ఒకప్పుడు బేస్ మోడల్ అంటే స్టీరింగ్, టైర్లు తప్ప లోపల ఏమీ ఉండేవి కావు.
Advertisement

BYD లియోపార్డ్ 8 హైబ్రిడ్ SUV డీటైల్స్

చైనా ఆటోమొబైల్ దిగ్గజం బీవైడీ(బిల్డ్ యువర్ డ్రీమ్స్-BYD) భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలపరచుకునే దిశగా కీలకమైన అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించిన ఈ సంస్థ, ఇప్పుడు కొత్త దిశగా అడుగుపెడుతోంది. అదే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ. ఈ మార్పుకు ప్రతీకగా బీవైడీ లియోపార్డ్ 8 (Leopard 8) అనే సరికొత్త SUVను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది సాధారణంగా ఒక కొత్త మోడల్ లాంచ్ మాత్రమే కాదు, BYD వ్యూహంలో పెద్ద మార్పుకు సంకేతం. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల నుండి హైబ్రిడ్ విభాగంలోకి ప్రవేశించడం ద్వారా, కంపెనీ మరింత విస్తృతమైన వినియోగదారులను ఆకర్షించాలనుకుంటోంది.

పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు పెద్ద కుటుంబాలు వెళ్లేందుకు పర్ఫెక్ట్ కారు

భారతదేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఇవి కాలక్రమేణా చిన్న కుటుంబాలు పెరిగినా, పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఫ్యామిలీ ట్రిప్స్ అనగానే అందరూ కలిసి వెళ్లడానికే మొగ్గు చూపుతారు. ఇలాంటి పెద్ద కుటుంబాల కలల కారుగా మధ్యతరగతి ప్రజల ఆశాకిరణంగా నిలించింది మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga).

రూ.61.50 లక్షలతో మినీ కన్వర్టిబుల్! JCW ప్యాక్‌తో కొత్త లాంచ్

ప్రీమియం కార్ల విభాగంలో తన స్థానాన్ని మరింత బలపరచుకునే దిశగా మినీ (Mini) ఇండియా మరో ప్రత్యేక మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే మినీ కన్వర్టిబుల్ జెసిడబ్ల్యు ప్యాక్ (Mini Convertible JCW Pack). ఈ కారును రూ. 61.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు భారతదేశంలో విడుదల చేయగా, ఇది పూర్తిగా దిగుమతిగా (CBU) దేశానికి వస్తోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకతను మరింత పెంచుతోంది. స్టాండర్డ్ కూపర్ ఎస్ కన్వర్టిబుల్ ఆధారంగా రూపొందించిన ఈ జెసిడబ్ల్యూ (John Cooper Works) ప్యాక్, ముఖ్యంగా డిజైన్ పరంగా మరింత స్పోర్టీగా, ఆకర్షణీయంగా కనిపించేలా కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లను అందిస్తుంది.

యమహా స్కూటర్ మార్కెట్లో సెన్సేషన్!

భారతదేశంలో ప్రీమియం స్కూటర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, యమహా మోటార్ కంపెనీ (Yamaha Motor Company) కు చెందిన యమహా ఏరోక్స్ (Yamaha Aerox 155) ఇటీవలి కాలంలో మంచి ఊపును అందుకుంటోంది. సాధారణ స్కూటర్ల కంటే స్పోర్టీ లుక్, పవర్‌ఫుల్ పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ మోడల్, యువతలో ప్రత్యేకంగా ఆదరణ పొందుతోంది. మార్చి 2026 అమ్మకాల గణాంకాలు ఈ స్కూటర్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి నెలలో యమహా ఏరోక్స్ 155 మొత్తం 2,557 యూనిట్ల అమ్మకాలతో మంచి ఫినిష్ ఇచ్చింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, గత ఏడాదితో పోలిస్తే వచ్చిన వృద్ధిని కూడా ప్రతిబింబిస్తుంది.
Advertisement

ప్రీమియం మార్కెట్లో జెండా పాతేందుకు హోండా మాస్టర్ ప్లాన్

హోండా కార్ లవక్స్ ఇది నిజంగా పండగ లాంటి వార్తే. భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును మరింత బిగించేందుకు హోండా సంస్థ భారీ ప్లాన్ రెడీ చేసింది. వచ్చే నెలలోనే (మే 2026) అటు సెడాన్ ప్రియుల కోసం, ఇటు ఎస్‌యూవీ (SUV) పిచ్చోళ్ల కోసం అదిరిపోయే ఆప్షన్లను తీసుకువస్తోంది. తన ఐకానిక్ మోడల్ హోండా సిటీకి కొత్త మెరుగులు అద్దడమే కాకుండా, ప్రీమియం విభాగంలో ZR-V అనే సరికొత్త ఎస్‌యూవీని కూడా లాంచ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. హోండా తన ZR-V ఎస్‌యూవీని మే 22, 2026న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయబోతోంది. ఇది హోండా నుంచి రాబోతున్న ఒక మేజర్ ఎస్‌యూవీ. దీనిని విదేశాల నుంచి నేరుగా దిగుమతి (CBU Import) చేసుకుని ఇక్కడ విక్రయించనున్నారు.

మార్కెట్‌లో నెంబర్ 1 ఫ్యామిలీ స్కూటర్! జూపిటర్ కొత్త రికార్డు

భారతదేశంలో స్కూటర్ల మార్కెట్‌లో విశేషమైన పోటీ ఉన్నప్పటికీ, కొన్ని మోడళ్లకు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అలాంటి మోడళ్లలో టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter) ఒకటి. టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తయారు చేసిన ఈ స్కూటర్, విడుదలైనప్పటి నుంచి నిరంతరం వినియోగదారుల ఆదరణను పొందుతూ ముందుకు సాగుతోంది. 2013లో మార్కెట్లోకి వచ్చిన జూపిటర్, అప్పటి నుంచి ఇప్పటివరకు తన స్థిరమైన పనితీరు, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం, కుటుంబానికి అనుకూలమైన డిజైన్‌తో ప్రత్యేకంగా నిలిచింది. నగరాల్లో రోజువారీ ప్రయాణాల కోసం సరిపోయేలా రూపొందించబడిన ఈ స్కూటర్, అన్ని వయసుల వారిని ఆకర్షించేలా ఉంటుంది.

పెళ్లి కూతురిలా ముస్తాబై రాబోతున్న థార్ ఎలక్ట్రిక్

ఇప్పుడు భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాల(EV) హవానే కొనసాగుతోంది. ఈ రేసులో దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆఫ్‌రోడ్ లవర్స్ కలల కారుగా పేరుగాంచిన మహీంద్రా థార్ ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో అలరించడానికి సిద్ధం అవుతుంది. Thar.e పేరుతో రానున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మహీంద్రా థార్ అంటేనే కార్ ప్రేమికులకు ఒక ఎమోషన్. ఈ మోడల్‌కు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకురావడం ద్వారా మహీంద్రా ఒక పెద్ద సాహసమే చేస్తోంది. 2023లో సౌతాఫ్రికాలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ కారు కాన్సెప్ట్‌ను మహీంద్రా తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పట్లో దీనిని చూసిన వారంతా దీని డిజైన్ చూసి ఫిదా అయిపోయారు. సాంప్రదాయ థార్ కంటే ఇది చాలా భిన్నంగా, చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉండబోతోంది. థార్ ఎలక్ట్రిక్ (Thar.e) ప్రస్తుత మోడల్ లాగా కేవలం లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై ఆధారపడి ఉండదు. ఇది మహీంద్రా మోడ్రన్ INGLO-P1 స్కేట్‌బోర్డ్ ఈవీ ప్లాట్‌ఫారం పై రూపొందుతోంది. దీనివల్ల కారు లోపల క్యాబిన్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కారు ముందు భాగంలో స్క్వేర్ షేప్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, సిగ్నేచర్ ఈవీ గ్రిల్ ఆకట్టుకుంటాయి. వెనుక వైపు వర్టికల్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, స్ట్రాంగ్ స్కిడ్ ప్లేట్లు దీనికి ఒక రగ్గడ్ లుక్ ఇస్తాయి. ముఖ్యంగా ఇది ఐదు డోర్ల లేఅవుట్‌తో రాబోతోంది. అంటే ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ పవర్ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు. నివేదికల ప్రకారం.. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సదుపాయం ఉంటుంది. అంటే బురదలో, కొండల్లో ఎక్కడైనా ఇది ఈజీగా దూసుకెళ్లిపోతుంది. ఇందులో డ్యూయల్ మోటార్ సెటప్‌ను ఉపయోగించనున్నారు.

రూ.4 లక్షలలోనే సోలార్ కారు!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ మోటార్ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే తమదైన ముద్ర వేసుకున్నాయి. అయితే ఈ రంగంలో పెద్ద సంస్థలకే కాకుండా చిన్న స్టార్టప్‌లకు కూడా అవకాశాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. అలాంటి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్‌లలో పూణేకు చెందిన వేవ్ మొబిలిటీ (Vayve Mobility) ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ కంపెనీ తీసుకొచ్చిన వేవ్ ఈవా (Vayve Eva) ఎలక్ట్రిక్ కారు సాధారణ కార్ల కంటే భిన్నంగా, వినూత్నతకు ప్రతీకగా నిలుస్తోంది. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని దీన్ని చాలా కాంపాక్ట్ డిజైన్‌తో రూపొందించారు. రద్దీగా ఉండే రోడ్లలో సులభంగా నడపడం, ఇరుకైన పార్కింగ్ స్థలాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిలపడం ఈ కారుతో సాధ్యమవుతుంది.
Advertisement

500 కిమీ రేంజ్‌తో రోడ్లపైకి రానున్న 'పవర్' ఫుల్ కార్లు

భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో టాటా మోటార్స్ పేరు వినపడగానే ఒక నమ్మకం, ఒక బ్రాండ్ వాల్యూ కనిపిస్తాయి. ఇప్పటికే నెక్సాన్ EV, పంచ్ EV వంటి మోడళ్లతో మార్కెట్‌ను ఏలుతున్న టాటా, ఇప్పుడు తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమైంది.

ఈ బైక్ సౌండ్ వింటే ఆ కిక్కే వేరప్పా..

స్పీడ్ అంటే ఇష్టమా? గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్లే పవర్ ఫుల్ మెషీన్ల సౌండ్ వింటే మీకు పూనకాలు వస్తాయా? అయితే ఈ సూపర్ బైక్స్ మీ కోసమే. సాధారణ కార్ల కంటే ఎక్కువ శక్తిని (200 HP+) ఇచ్చే ఈ బైకులు ఇప్పుడు భారత మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. డుకాటి నుంచి బీఎండబ్ల్యూ వరకు.. రోడ్లపై రారాజుల్లా వెలిగిపోయే టాప్ 5 సూపర్ బైక్స్, వాటి ధరలు, ప్రత్యేకతల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

రిజ్టా డిమాండ్‌తో ఏథర్ సేల్స్ జోరు.. కొత్త రికార్డ్!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం రోజురోజుకీ వేగం పెంచుకుంటున్న ఈ సమయంలో, వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్న బ్రాండ్‌లలో ఏథర్ ఎనర్జీ (Ather Energy) ఒకటి. ప్రారంభం నుంచే నాణ్యత, ఆధునిక టెక్నాలజీ, పనితీరుపై దృష్టి పెట్టిన ఈ సంస్థ, ఇతర కంపెనీలతో పోలిస్తే కొంచెం భిన్నమైన దారిని ఎంచుకుంది. సాదాసీదా కమ్యూటర్ వాహనంగా కాకుండా, స్మార్ట్ ఫీచర్లు, ప్రీమియం అనుభవం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగింది. ఈ దృక్పథానికి ఫలితంగా వచ్చిన Ather 450, 450 సిరీస్ మోడళ్లు, భారత మార్కెట్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. వేగం, రేంజ్ మాత్రమే కాకుండా, కనెక్టెడ్ ఫీచర్లు, రెగ్యులర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వంటి అంశాలు ఈ బ్రాండ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

మార్కెట్లో అమేజ్ మ్యాజిక్.. మార్చిలో భారీ సేల్స్ నమోదు!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు సెడాన్ కార్లదే రాజ్యం. కానీ కాలక్రమేణా SUVల ప్రభావం పెరుగుతూ రావడంతో, సెడాన్‌ల యుగం ముగిసింది అనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది. అయితే తాజా మార్కెట్ ట్రెండ్స్ చూస్తే, ఆ అంచనాలు పూర్తిగా నిజం కాలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మళ్లీ సెడాన్ మోడళ్లు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా మారుతి సుజుకి డిజైర్ వంటి మోడల్, తన సెగ్మెంట్‌లోనే కాదు, మొత్తం మార్కెట్‌లో కూడా మంచి సేల్స్ నమోదు చేస్తూ తిరిగి ఫోకస్‌లోకి వచ్చింది. ఇది కేవలం ఒక మోడల్ విజయమే కాకుండా, సెడాన్‌లపై వినియోగదారుల ఆసక్తి ఇంకా కొనసాగుతుందనే సంకేతాన్ని ఇస్తోంది.
Advertisement

అమ్మకాల్లో పంచ్, నెక్సాన్ సరికొత్త రికార్డు

భారతీయ వాహన రంగంలో ఎస్‌యూవీ (SUV)ల హవా కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే సబ్ 4 మీటర్ల ఎస్‌యూవీ విభాగంలో పోటీ ఆకాశాన్ని తాకుతోంది. మార్చి 2026 నెల సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే, దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.