గంటకు 778 యూనిట్లు అమ్ముడవుతున్న పేదవాడి బండి

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరుగుతున్నా... ఒక కంపెనీ మాత్రం తగ్గడం లేదు. ఒక్క గంటలోనే వందల బైక్‌లు అమ్ముతూ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఏప్రిల్ 2026లో Honda Motorcycle and Scooter India చేసిన రికార్డ్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి భారతీయ రోడ్ల మీద టూ వీలర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో హోండా (Honda Motorcycle & Scooter India) ఒకటి.

రోడ్ టాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు

భారత ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఒక నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. పెట్రోల్ కొట్టించాలంటే బంకుల దగ్గర క్యూ కట్టడం, పెరుగుతున్న ధరలతో జేబులు గుల్ల చేసుకోవడం ఇష్టం లేని సామాన్యుడు ఇప్పుడు ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తున్నాడు. కేవలం పర్యావరణం మీద ప్రేమతో మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న అదిరిపోయే ఆఫర్లు, సబ్సిడీల దెబ్బకు ఈవీ (EV) మార్కెట్ ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఉత్తరప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు, మహారాష్ట్ర నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా బ్యాటరీ వాహనాల సందడి కనిపిస్తోంది.

కారు ఓవర్‌హీట్ అవుతోందా?

సమ్మర్ వచ్చిందంటే చాలు.. భానుడు భగభగమంటూ నిప్పులు కురిపిస్తాడు. 40 నుంచి 45 డిగ్రీల ఎండలో మనం బయట అడుగుపెట్టడానికే భయపడుతుంటాం. మరి అలాంటి ఎండలో గంటల కొద్దీ రోడ్లపై తిరిగే మన కారు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించారా? వేడి తాకిడికి మనుషులకే కాదు, యంత్రాలకు కూడా ముచ్చెమటలు పడతాయి.

పేద మధ్యతరగతి కోసం బెస్ట్ 5 కార్లు ఇవే

కారు కొనాలి అనిపిస్తుంది... కానీ బడ్జెట్ అడ్డంకి. ఇదే పరిస్థితి చాలా మందిది. కానీ ఇప్పుడు సీన్ మారింది. బైక్ ధరలోనే కారు కొనొచ్చు... సొంత కారు అనేది ప్రతి సామాన్యుడి కల. కానీ ఆ కారు కొన్న తర్వాత పెట్రోల్ ధరల సెగ తట్టుకోవాలి అనే భయంతో చాలా మంది ఆ అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. అయితే, ఇప్పుడు రోజులు మారాయి.
Advertisement

ఇండియాలో చీపెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాపై అనిశ్చితిని తీసుకొచ్చాయి. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటాయా లేదా అన్న సందేహం ప్రజల్లో పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చాలామంది వినియోగదారులు సంప్రదాయ ఇంధన వాహనాల నుంచి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఒక ఆకర్షణీయమైన ఎంపికగా ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు కొనడం ఇప్పుడు కేవలం అవసరం మాత్రమే కాకుండా ఒక కొత్త ట్రెండ్‌గా మారుతోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తూ, రోజురోజుకీ మరింత బలపడుతోంది. ఇప్పుడు ఈ కథణంలో ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న కొన్ని ఈవీ కార్లను చూద్దాం.

రాత్రి డ్రైవింగ్‌లో జరిగే ప్రమాదాలకి ఇదే కారణం

Night Driving Tips: రాత్రిపూట డ్రైవింగ్ అంటే చాలా మందికి భయం. కానీ నిజం ఏంటంటే... చిన్న చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా తక్కువ విజిబిలిటీ, ఎదురుగా వచ్చే లైట్ల గ్లేర్, అంచనా తప్పడం.. ఇవి అన్నీ కలిసి రిస్క్‌ను పెంచేస్తాయి.

కఠిన పరిస్థితుల్లో కూడా ఎంజీ సేల్స్ పెరిగాయి!

ప్రతి నెల ముగిసిన వెంటనే వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను వెల్లడించడం ఆటోమొబైల్ రంగంలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇదే తరహాలో ప్రముఖ కార్ల తయారీదారు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) కూడా ఏప్రిల్ 2026 నెలకు సంబంధించిన తన సేల్స్ వివరాలను విడుదల చేసింది. ఈ గణాంకాలు చూస్తే, కంపెనీ భారత మార్కెట్లో స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏప్రిల్ 2026లో ఎంజీ మొత్తం 6,018 వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్యలో పెట్రోల్, డీజిల్ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు కూడా ఉన్నాయి. అంటే, అన్ని సెగ్మెంట్లలో కంపెనీ సమతుల్యంగా ప్రదర్శన కనబరుస్తోందని చెప్పవచ్చు.

మార్కెట్‌ను షేక్ చేసిన మారుతి.. ఏప్రిల్‌లో సేల్స్ బూస్ట్!

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానంలో నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. చాలా కాలంగా ప్రతి నెల అమ్మకాలలో ముందంజలో ఉండే ఈ సంస్థ, వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2026లో మారుతి సుజుకి మొత్తం 2,39,646 (దేశీయ+ఎగుమతులు) వాహనాలను విక్రయించింది. ఇది కేవలం ఒక మంచి సంఖ్య మాత్రమే కాదు కంపెనీ నెలవారీ అమ్మకాల చరిత్రలో కొత్త గరిష్ట స్థాయిని కూడా నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 1,79,791 యూనిట్లను మాత్రమే విక్రయించగా, ఈసారి దాదాపు 33.29 శాతం వృద్ధిని సాధించడం విశేషం.
Advertisement

ఈ బ్రాండ్‌ను ఆపడం కష్టం.. 56,331 యూనిట్లతో మహీంద్రా జోరు!

దేశీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) మరోసారి తన దూకుడును స్పష్టంగా చూపించింది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) నాయకత్వంలో ముందుకు సాగుతున్న ఈ సంస్థ, FY2026-27 ఆర్థిక సంవత్సరాన్ని శుభారంభంతో ప్రారంభించింది. తాజాగా విడుదలైన గణాంకాలు చూస్తే, కంపెనీ ప్రదర్శన ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఏప్రిల్ 2026లో మహీంద్రా మొత్తం 94,627 యూనిట్ల వాహన విక్రయాలను నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే దాదాపు 14 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ సంఖ్య కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, మార్కెట్లో మహీంద్రా బ్రాండ్‌కు ఉన్న డిమాండ్, వినియోగదారుల విశ్వాసం, కంపెనీ వ్యూహాల విజయాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ SUV డ్రైవ్ చేస్తే షాక్ అవుతారు.. 2026 టైగన్ పూర్తి రివ్యూ!

2020 సంవత్సరం. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి ప్రభావంతో ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక గందరగోళంలో ఉండగా, అదే సమయంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2020లో ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) "టైగన్ (Taigun)" అనే కాంపాక్ట్ SUV ప్రోటోటైప్‌ను పరిచయం చేసింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే ఫోక్స్‌వ్యాగన్ T-Roc ఆధారంగా రూపొందించినప్పటికీ, భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా మార్చిన MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. 2021 సెప్టెంబర్‌లో భారతదేశంలో విక్రయాలకు వచ్చిన టైగన్, కరోనా ప్రభావం తర్వాత దేశం మళ్లీ ముందుకు కదులుతున్న సమయంలో మార్కెట్లోకి ప్రవేశించింది. ఇదే మోడల్ మెక్సికోలో అదే పేరుతో, ఇండోనేషియాలో T-Roc పేరుతో ఎగుమతి చేయబడింది.

ఎగుమతులు తగ్గినా.. ఇండియాలో టయోటా ఫుల్ స్పీడ్

దేశీయ ఆటోమొబైల్ రంగంలో టయోటా (Toyota) ప్రస్తుతం బలమైన దూకుడుతో ముందుకు సాగుతోంది. గత కొన్నేళ్లుగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న ఈ జపాన్ బ్రాండ్, ఇప్పుడు భారత మార్కెట్లో మరింత గట్టి స్థానం సంపాదించుకుంటోంది. ముఖ్యంగా కుటుంబ వినియోగానికి అనువైన కార్లను అందిస్తూ, వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో కంపెనీ సక్సెస్ అవుతోంది. ఈ విజయానికి ప్రధాన కారణం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న పాపులర్ మోడళ్లే. ఇన్నోవా, ఫార్చ్యునర్ వంటి కార్లు మార్కెట్లో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాయి. ఈ కంపెనీ అందించే కార్ల డిజైన్‌లో కనిపించే ప్రాక్టికాలిటీ, డ్రైవింగ్‌లో ఇచ్చే సౌకర్యం, దీర్ఘకాలిక నమ్మకం కలిగించే ఇంజిన్ పనితీరు ఇవన్నీ కలిపి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ బండి మీద వెళ్తుంటే రాజులా ఫీలవుతారు.. అందరి చూపు మీ మీదే

బుల్లెట్ బండి చేసే డుగ్ డుగ్ సౌండ్ వింటే చాలు, కుర్రాళ్ల నుంచి ముసలి వాళ్ల దాకా అందరిలోనూ ఒక తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ భారీ శబ్దం, రాజసం ఉట్టిపడే లుక్ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) దశాబ్దాలుగా భారతీయ రోడ్ల మీద రారాజుగా వెలుగొందుతోంది.
Advertisement

69,000 మందిని ఫిదా చేసిన ఆ కారు సీక్రెట్ ఇదే

కారు కొనాలి అనుకుంటున్నారా? మైలేజ్ కావాలి, బడ్జెట్ లో ఉండాలి, ఫ్యామిలీకి సేఫ్ కావాలి... ఇవన్నీ ఒక్క కారులో దొరికితే ఎలా ఉంటుంది? అదే కారణంతో ఇప్పుడు భారతదేశంలో వేల మంది ఒకే కారుపై పడిపోతున్నారు. అది మరేదో కాదు టాటా కంపెనీ ఉత్పత్తి చేసిన టాటా నెక్సాన్ CNG.

రోజుకు 2000మందికి పైగా కొంటున్నారు

ఆటోమొబైల్ రంగంలో హ్యుందాయ్ మోటార్స్ వెన్యూ(Hyundai Venue) సంచలనం సృష్టించింది. ఇండియాలో SUV కొనాలనుకునే వాళ్ల ఫస్ట్ ఛాయిస్ ఇప్పుడు ఇదే. 2026-27 ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే అద్భుతమైన అమ్మకాలతో హ్యుందాయ్ వెన్యూ పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. ఈ కారులో అంతలా ఏముందో వివరంగా తెలుసుకుందాం.

రోజూ ఆఫీసుకు వెళ్లేందుకు తక్కువ బడ్జెట్లో బెస్ట్ కార్లు ఇవే

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఆఫీసుకు వెళ్లాలనే హడావుడి, ఇటు రోడ్డు మీదకు రాగానే కిలోమీటర్ల కొద్ది సాగే ట్రాఫిక్ జామ్..ఈ రెండింటి మధ్య నలిగిపోయే సాధారణ ఉద్యోగికి ఒక మంచి కారు ఉంటే ఎంత ఊరటగా ఉంటుందో కదా.. బైకు మీద ఎండకు ఎండి.. వానకు తడిసి ఆఫీసుకు వెళ్లే వారికి సగం ఓపిక నశిస్తుంది.

దేశమంతా మెచ్చిన బెస్ట్ స్కూటర్లు.. కళ్లు మూసుకుని కొనచ్చు

రోజువారీ జీవితంలో ఆఫీసుకు వెళ్లడం నుంచి షాపింగ్ వరకు, చిన్న చిన్న పనులు పూర్తి చేయడానికి ఒక సరైన స్కూటర్ ఉంటే ఎంత సౌకర్యంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్‌లో ఈజీగా నడిపించగలగడం, పార్కింగ్ సమస్యలు తక్కువగా ఉండటం, అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణం పూర్తి చేయగలగడం, ఈ అన్ని కారణాల వల్ల స్కూటర్లు నగర జీవనంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అయితే, మార్కెట్లో ఎన్నో ఆప్షన్లు ఉన్నప్పుడు సరైన స్కూటర్‌ను ఎంచుకోవడం కొంచెం కష్టంగా అనిపించొచ్చు. ముఖ్యంగా మైలేజ్, కంఫర్ట్, ధర మూడు అంశాల్లో సమతుల్యత ఉండే మోడల్‌ను ఎంచుకోవాలని ఎక్కువ మంది భావిస్తారు. ఇలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే, TVS జూపిటర్, హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్ స్కూటర్లు మంచి ఎంపికలుగా నిలుస్తాయి. వాటి గురించి ఈ కింది కథణంలో.
Advertisement

మోపెడ్ మార్కెట్‌లో దుమ్మురేపుతున్న XL100

భారతీయ రోడ్లపై ఎన్నో సంవత్సరాలుగా కనిపిస్తున్న నమ్మకమైన మోపెడ్‌గా టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 (TVS XL100)కు ప్రత్యేక స్థానం ఉంది. సరళమైన డిజైన్, తక్కువ నిర్వహణ ఖర్చులు, గట్టి పనితీరు ఈ మూడు లక్షణాలే దీన్ని ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లో ఒక అనివార్య వాహనంగా నిలబెట్టాయి. రోజువారీ అవసరాలకు, చిన్న వ్యాపారాల కోసం సరుకులు తీసుకెళ్లడానికి, అలాగే కష్టమైన రోడ్లపై కూడా సులభంగా నడిచే సామర్థ్యం వల్ల ఈ మోపెడ్ వినియోగదారులలో విశ్వాసాన్ని సంపాదించింది. ఈ స్థిరమైన ప్రజాదరణకు మరోసారి బలమైన నిర్ధారణగా 2026 మార్చి నెల సేల్స్ గణాంకాలు నిలిచాయి. అదే సమయంలో గత ఏడాదితో పోలిస్తే, ఈ మోడల్ అమ్మకాలు గణనీయంగా పెరిగి దాదాపు 31 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయడం విశేషం.

బంగారం లాంటి బైక్.. ఇప్పుడు రేటు కూడా రూ.24 వేలు తగ్గింది

భారతీయ టూ వీలర్ మార్కెట్లో మళ్లీ పెద్ద సంచలనం రేపింది బజాజ్ ఆటో(Bajaj Auto). ముఖ్యంగా యూత్‎లో భారీ క్రేజ్ ఉన్న బజాజ్ పల్సర్ NS400Z(Bajaj Pulsar NS400Z)ను ఇప్పుడు కొత్త రూపంలో, ఇంకా ముఖ్యంగా తక్కువ ధరలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్ ధరలు, బైక్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో... "పవర్ ఉన్న బైక్ కావాలి కానీ బడ్జెట్ లో ఉండాలి" అనుకునే వారికి శుభవార్త అనే చెప్పాలి.

ఇంత మంచి కార్లను ఇస్తున్నందుకు కంపెనీకి దండం పెట్టాలేమో

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి(Maruti Suzuki) మరోసారి తన అప్రతిహత జైత్రయాత్రను చాటుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి విక్రయాలతో దేశంలోనే నంబర్ వన్ కార్ల తయారీ సంస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా, విదేశాలకు కార్లను ఎగుమతి చేయడంలోనూ అగ్రగామిగా నిలిచింది.

బడ్జెట్‌లో స్పోర్టీ EV బైక్.. రోర్ ఎవో లాంచ్.. ఈ ఫీచర్లు మిస్ అవ్వకండి

భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో మరో కొత్త ఆకర్షణగా ఓబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) తన తాజా మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఓబెన్ రోర్ ఇవో (Oben Rorr Evo) పేరుతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్, స్టైలిష్ డిజైన్‌తో పాటు అందుబాటు ధరలో అందించడం ద్వారా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బైక్‌ను కంపెనీ రూ.1.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు మార్కెట్లో విడుదల చేసినప్పటికీ, ప్రారంభ ఆఫర్‌గా మొదటి 10,000 మంది కస్టమర్లకు కేవలం రూ.1 లక్షకే అందించనున్నట్లు ప్రకటించడం మరింత ఆసక్తిని పెంచింది. ఈ ధరలో ఒక స్పోర్టీ లుక్‌తో కూడిన ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి రావడం, ముఖ్యంగా యువత మరియు రోజువారీ ప్రయాణం కోసం తక్కువ ఖర్చుతో మంచి ఆప్షన్ కోరుకునే వారికి పెద్ద ప్లస్‌గా మారుతోంది.
Advertisement

మూడున్నర నెలల్లో 30 వేల డెలివరీలు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త తరహా SUVలపై పెరుగుతున్న ఆసక్తిని బలంగా అందిపుచ్చుకున్న మోడల్‌గా టాటా సియోర్రా (Tata Sierra) వేగంగా ముందుకు దూసుకుపోతోంది. ఒకప్పుడు క్లాసిక్‌గా పేరొందిన సియెర్రా పేరును ఆధునిక రూపంలో తిరిగి తీసుకొచ్చిన టాటా మోటార్స్ (Tata Motors), ఈసారి వినియోగదారుల అంచనాలను దాటేలా ప్రోడక్ట్‌ను రూపొందించినట్టు కనిపిస్తోంది. 2025 నవంబర్‌లో భారీ అంచనాల మధ్య మార్కెట్లోకి వచ్చిన ఈ SUV, విడుదలైనప్పటి నుంచే మంచి స్పందనను అందుకుంది. ఆ తర్వాత 2026 జనవరి మధ్యలో డెలివరీలు ప్రారంభం కావడంతో, కస్టమర్ల నుంచి వచ్చిన డిమాండ్ మరింత స్పష్టంగా కనిపించింది. ఇంకా దీనికోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.

హోండా నుంచి టాటా వరకు మార్కెట్లో వస్తున్న 5 అదిరిపోయే కార్లు ఇవే

కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే వచ్చే నెల మీ కోసం అదిరిపోయే ఆప్షన్లను ఆటో కంపెనీలు తీసుకు వస్తున్నాయి. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ మే 2026లో సరికొత్త కళను సంతరించుకోనుంది.

మార్కెట్లో దూసుకుపోతున్న రూమియన్

ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన టయోటా (Toyota) బ్రాండ్‌కు భారత మార్కెట్లో కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. నమ్మకమైన నాణ్యత, దీర్ఘకాలిక పనితీరు కారణంగా టయోటా కార్లు వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్యామిలీ కార్ సెగ్మెంట్‌లో కంపెనీ తీసుకొచ్చిన టయోటా రూమియన్ (Toyota Rumion) తక్కువ కాలంలోనే విశేషమైన స్పందనను అందుకుంది. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటికే మంచి డిమాండ్ ఉన్న Maruti Suzuki Ertiga ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ రూమియన్, రీబ్యాడ్జ్ మోడల్ అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఫ్యామిలీ అవసరాలకు సరిపోయే విస్తారమైన సీటింగ్, సౌకర్యవంతమైన క్యాబిన్, నమ్మకమైన పనితీరు కలిసి ఈ MPVను విస్తృతంగా ఆదరణ పొందేలా చేశాయి.

22కిమీ మైలేజ్ ఇచ్చే కారు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్లో ఎంట్రీ ఇచ్చింది

ఫోక్స్‌వ్యాగన్ పోలో.. ఈ పేరు వినగానే కారు లవర్స్‎కు ఒక రకమైన జోష్ వస్తుంది. స్టైలిష్ లుక్, అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో రారాజుగా వెలిగిన పోలో, ఇప్పుడు తన పాత వైభవాన్ని కొత్త రూపంలోకి మార్చుకుంది.
Advertisement

మారుతి బ్రాండ్‌కే షాక్ ఇచ్చిన సెలెరియో

భారత మార్కెట్లో సాధారణంగా బలమైన స్థానం కలిగిన మారుతి సుజుకి (Maruti Suzuki) కార్లు ఎక్కువగా మంచి అమ్మకాలను నమోదు చేస్తుంటాయి. కానీ ప్రతి మోడల్ ఒకే విధంగా రాణించదు అనే విషయాన్ని తాజాగా సెలెరియో (Celerio) పరిస్థితి స్పష్టంగా చూపిస్తోంది. ఒకప్పుడు తన కేటగిరీలో మంచి డిమాండ్‌ను అందుకున్న ఈ హ్యాచ్‌బ్యాక్, ఇప్పుడు మాత్రం మార్కెట్‌లో కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. 2026 మార్చి నెలలో సెలెరియో కేవలం 1,353 యూనిట్లు మాత్రమే అమ్ముడవడం గమనార్హం. అదే సమయంలో, గత ఏడాది మార్చి 2025లో ఈ కారు 2,268 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.