ఆటో రంగంలో సుజుకి సక్సెస్ స్టోరీ.. 20 ఏళ్ల ప్రయాణం పూర్తి

భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన సుజుకి (Suzuki), గత రెండు దశాబ్దాలుగా వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటూ తన స్థానాన్ని బలపరచుకుంది. జపాన్‌కు చెందిన ఈ బ్రాండ్ 2006లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి, నాణ్యత, పనితీరు, ఇంధన సామర్థ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజాగా ఈ కంపెనీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రారంభ దశలోనే కంపెనీ Suzuki Heat 125, Suzuki GS 125 వంటి మోడళ్లను ప్రవేశపెట్టి, భారత వినియోగదారులకు తన ఉత్పత్తులను పరిచయం చేసింది. అయితే, నిజమైన మలుపు ఒక్క సంవత్సరానికే వచ్చింది. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) విడుదలతో సుజుకి భారత మార్కెట్లో మరింత బలంగా స్థిరపడింది. ఈ స్కూటర్ తక్కువ మెయింటెనెన్స్, మంచి మైలేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవంతో త్వరగా ప్రజాదరణ పొందింది.

ఏడాదిలో 37 లక్షల బైక్‌లు అమ్మిందంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు

భారతీయ రోడ్లపై ఏ బైక్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే చిన్న పిల్లాడైనా చెప్పే పేరు హీరో స్ప్లెండర్. దశాబ్దాలు గడుస్తున్నా, కొత్త మోడళ్లు ఎన్ని వస్తున్నా స్ప్లెండర్ హవా మాత్రం తగ్గడం లేదు. తాజాగా ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో (FY2026) ఈ బైక్ మరోసారి తన సత్తా చాటింది. కేవలం గతేడాది కాలంలోనే ఏకంగా 37 లక్షల మందికి పైగా ఈ బైక్‌ను కొనుగోలు చేశారంటే, సామాన్యుడికి ఈ బైక్ మీద ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. హోండా షైన్, బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ వంటి ఉద్ధండులను వెనక్కి నెట్టి స్ప్లెండర్ అగ్రస్థానంలో నిలిచింది.

కేవలం కొద్దిమందికే.. వెస్పా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ త్వరలో రాబోతోంది

దేశీయ ప్రీమియం స్కూటర్ మార్కెట్‌లో ఇటాలియన్ స్టైల్‌కు ప్రతీకగా నిలిచిన వెస్పా (Vespa) ప్రస్తుతం మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. ప్రత్యేకమైన డిజైన్, క్లాసిక్ లుక్, బ్రాండ్ ఇమేజ్ కారణంగా వెస్పా స్కూటర్లకు నగరాల్లో మంచి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, తన 80వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వెస్పా, భారత మార్కెట్ కోసం ఒక ప్రత్యేక గిఫ్ట్‌లా కొత్త మోడల్‌ను తీసుకురాబోతోంది. ఈ వేడుకల్లో భాగంగా, వెస్పా టెక్ 80వ ఎడిషన్ (Vespa Tech 80th Edition) అనే స్పెషల్ ఎడిషన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇది సాధారణ మోడళ్లకు భిన్నంగా, డిజైన్, ఫీచర్ల పరంగా అనేక ప్రత్యేక మార్పులతో రూపొందించబడుతోంది.

మార్కెట్ రూపురేఖలు మార్చే విధంగా మారుతి మాస్టర్ ప్లాన్

భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) దేశీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసింది. రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మూడు సరికొత్త కార్లను లాంచ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన పాపులర్ మోడల్స్ అయిన బలెనో, బ్రెజా కార్లను కొత్త హంగులతో (Facelift) తీసుకురావడంతో పాటు, మోస్ట్ అవేటెడ్ 7-సీటర్ గ్రాండ్ విటారాను కూడా రంగంలోకి దించుతోంది. ఈ మూడు కార్లు కూడా అత్యాధునిక ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో రానున్నాయి.
Advertisement

రికార్డు సృష్టించిన మారుతి సుజుకి.. ఒక్క ఏడాదిలో 23.4 లక్షల కార్ల ఉత్పత్తి

భారత ఆటోమొబైల్ రంగంలో తన అగ్రస్థానాన్ని మరింత బలపరుస్తూ మారుతి సుజుకి (Maruti Suzuki) మరోసారి రికార్డు స్థాయి ప్రదర్శన చేసింది. గత ఒక్క సంవత్సరంలోనే కంపెనీ సుమారు 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని చాటుకుంది. ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 వరకు సాగిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఈ ఫలితం, మారుతి సుజుకి చరిత్రలోనే అత్యధిక ఉత్పత్తిగా నిలవడం విశేషం. ఇంతకు ముందు ఏ ఒక్క ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ స్థాయి ఉత్పత్తి నమోదు కాలేదు. గత ఆర్థిక సంవత్సరమైన 2024-25లో కంపెనీ సుమారు 21 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఆ సంఖ్యతో పోలిస్తే, తాజా గణాంకాలు దాదాపు 11.66 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి.

ఇక ప్రతి నెల అద్దె చెల్లించి నచ్చిన కారు తీసుకెళ్లొచ్చు

కారు కొనాలనేది మధ్యతరగతి భారతీయుల అతిపెద్ద కల. కానీ మారుతున్న కాలంతో పాటు కార్ల వినియోగంలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు కారు కొనాల్సిన పనిలేదు, నెలనెలా అద్దె చెల్లించి మీకు నచ్చిన మోడల్‌ను యజమానిలా వాడుకోవచ్చు. ఈ సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) భారత్‌లో అడుగుపెట్టింది. నిస్సాన్ తన పాపులర్ మోడల్స్ అయిన మ్యాగ్నైట్ (Magnite), గ్రావైట్ (Gravite) కార్లను లీజుకు ఇచ్చేందుకు సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

అందుబాటులో లగ్జరీ SUV.. మినీ నుంచి కొత్త అవకాశం

బ్రిటిష్ మూలాలు కలిగిన లగ్జరీ కార్ల బ్రాండ్ మినీ(Mini)కు భారతదేశంలో ఒక ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. క్లాసిక్ డిజైన్, కాంపాక్ట్ సైజ్, అలాగే ప్రీమియం ఫీలింగ్ కలగలిపిన ఈ బ్రాండ్, నగర జీవనశైలికి సరిగ్గా సరిపోయే కార్లను అందిస్తూ ఎప్పటికప్పుడు ట్రెండ్‌లో నిలుస్తోంది. ప్రస్తుతం జర్మన్ ఆటో దిగ్గజం BMW Group ఆధ్వర్యంలో కొనసాగుతున్న మినీ, తన గ్లోబల్ స్టాండర్డ్స్‌ను భారత మార్కెట్‌కు అనుగుణంగా మార్చుకుంటూ, ప్రతి కొత్త మోడల్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో, లగ్జరీ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో తన స్థాయిని మరింత బలపరచడానికి మినీ మరో కీలక అడుగు వేసింది. ఈ ప్రయత్నంలో భాగంగా, కొత్త మినీ కంట్రీమ్యాన్ సి (Mini Countryman C) కోసం ప్రీ-లాంచ్ బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభించింది.

దీన్ని చూస్తే కోట్లు విలువ చేస్తుందేమో అనుకుంటాం.. కానీ ధర మాత్రం లక్షల్లోనే

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌యూవీల (SUV) హవా నడుస్తోంది. మునుపటిలా కాకుండా, ఇప్పుడు కస్టమర్లు కేవలం కారు సౌకర్యాలనే కాకుండా, దాని లుక్, రోడ్ ప్రెజెన్స్‎కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender) వంటి గంభీరమైన, బాక్సీ డిజైన్ ఉన్న కార్లంటే మనవాళ్లకు క్రేజ్ ఎక్కువ.
Advertisement

యూత్ క్రేజ్ పెంచే బైక్స్.. ఇప్పుడు మార్కెట్‌లో హాట్ టాపిక్

ప్రీమియం స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్ల విభాగం భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, క్లాసిక్ లెజెండ్స్ ఆధ్వర్యంలో ఉన్న యెజ్డీ (Yezdi), బీఎస్ఏ (BSA) ఒకేసారి రెండు కొత్త మోడళ్లతో మార్కెట్‌లో బలమైన అడుగు పెట్టాయి. గురువారం జరిగిన ఈ లాంచ్ ద్వారా ఈ రెండు బ్రాండ్‌లు తమ దృష్టిని స్పష్టంగా తెలియజేశాయి. పట్టణ రోడ్ల నుంచి హైవేలు, అక్కడి నుంచి తేలికపాటి ఆఫ్‌-రోడింగ్ వరకు అన్ని పరిస్థితుల్లోనూ సరిపడే బైక్‌లను భారతీయ రైడర్లకు అందించడం. ఈ సందర్భంగా పరిచయం చేసిన యెజ్డీ స్క్రాంబ్లర్ 350 (Yezdi Scrambler 350) ప్రారంభ ధర రూ.1,99,950గా ఉండగా, మరింత శక్తివంతమైన బీఎస్ఏ స్క్రాంబ్లర్ (BSA Scrambler 650) రూ.3,24,950 నుంచి అందుబాటులోకి వచ్చింది.

పెద్ద కుటుంబానికి ఏది సరైనది? ఇన్విక్టో vs హైక్రాస్

పెద్ద కుటుంబాలతో ప్రయాణం చేయడం అంటే కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడమే కాదు, అందరూ కలిసి కంఫర్ట్‌గా, ఇబ్బంది లేకుండా ప్రయాణించడం కూడా అంతే ముఖ్యమైన విషయం. అలాంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన వాహనాలే ఎంవీపీలు (MPVs). ఇవి సాధారణ కార్లతో పోలిస్తే ఎక్కువ స్పేస్, మెరుగైన సీటింగ్ అమరిక, ఫ్యామిలీ అవసరాలకు సరిపోయే విధంగా ప్రాక్టికల్ డిజైన్‌ను అందిస్తాయి. ప్రత్యేకంగా పెద్ద కుటుంబాల కోసం చూస్తే, ఎంవీపీలు ఒక పూర్తి ప్యాకేజ్‌లా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎంపీవీ విభాగంలో టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross), మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) వంటి రెండు ప్రసిద్ధి చెందాయి. వీటి గురించిన వివరాలను ఈ కింది కథనంలో ఇవ్వడం జరిగింది.

టాప్-15 ఎస్‌యూవీల లిస్టులో మహీంద్రాదే పైచేయి

భారత ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీల (SUV) హవా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా 4.5 మీటర్ల నుంచి 4.8 మీటర్ల పొడవు ఉండే భారీ ఎస్‌యూవీల విభాగంలో పోటీ మామూలుగా లేదు. అయితే, మార్చి 2026 సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే ఒకే ఒక్క పేరు మార్కెట్‌ను శాసిస్తోంది. టయోటా ఫార్చ్యూనర్, టాటా హారియర్, సఫారీ వంటి దిగ్గజ కార్లు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ వెనక్కి నెట్టి మహీంద్రా స్కార్పియో తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. విచిత్రమేమిటంటే, కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ మోడల్స్ మహీంద్రా XEV 9e లేదా XUV7X0 కూడా స్కార్పియో దరిదాపుల్లోకి రాలేకపోయాయి.

ఈ స్కూటర్‌కు డిమాండ్ పెరుగుతోంది.. iQube అమ్మకాల్లో భారీ గ్రోత్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) తనదైన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. విశ్వసనీయ బ్రాండ్ ఇమేజ్, ప్రాక్టికల్ డిజైన్, నగర ప్రయాణాలకు అనువైన పనితీరు కలిపి ఈ స్కూటర్‌ను వినియోగదారుల మధ్య మంచి ఎంపికగా మార్చాయి. ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలు చూస్తే, ఈ స్కూటర్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. 2026 మార్చి నెలలో మాత్రమే 38,757 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. ఇదే సమయంలో గత సంవత్సరం మార్చిలో 26,499 యూనిట్లు మాత్రమే విక్రయించబడగా, ఈసారి భారీగా పెరుగుదల నమోదైంది.
Advertisement

20 ఏళ్ల ప్రస్థానానికి స్వస్తి పలికిన హోండా.. ఇక కార్లు దొరకవు

జపాన్ కార్ల దిగ్గజం హోండా (Honda) ఆసియా మార్కెట్లలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా దక్షిణ కొరియా (South Korea) ఆటోమొబైల్ మార్కెట్ నుంచి పూర్తిగా వైదొలగాలని హోండా సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 చివరి నాటికి అక్కడ కార్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఒకప్పుడు కొరియాలో అత్యధిక కార్లు అమ్మిన విదేశీ బ్రాండ్‌గా వెలిగిన హోండా, ఇప్పుడు ఇలా ఖాళీ చేయడం ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. హోండా కంపెనీ సౌత్ కొరియాలో తన ప్రయాణాన్ని 2001లో ప్రారంభించింది. అయితే 2004లో అధికారికంగా కార్ల అమ్మకాలను మొదలుపెట్టింది. అప్పట్లో హోండా అకార్డ్ (Accord), సీఆర్-వీ (CR-V) మోడళ్లకు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎంతలా అంటే, 2008 సంవత్సరంలో దక్షిణ కొరియాలో ఏడాదికి 10,000 కంటే ఎక్కువ కార్లు అమ్మిన మొట్టమొదటి విదేశీ కార్ల బ్రాండ్‌గా హోండా చరిత్ర సృష్టించింది. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. స్థానిక బ్రాండ్లు అయిన హ్యుందాయ్, కియా వంటి కంపెనీలు బలంగా ఎదగడం, మరోవైపు చైనా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ కార్లు రావడంతో హోండా బేరాలు దెబ్బతిన్నాయి. దక్షిణ కొరియా ఆటో మార్కెట్ గత కొన్నేళ్లుగా భారీ మార్పులకు లోనవుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్ పెరిగింది. టెస్లా (Tesla), చైనాకు చెందిన బివైడి (BYD) వంటి కంపెనీలు కొరియా మార్కెట్లోకి చొచ్చుకుపోతున్నాయి. హోండా తన ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహంలో కొంచెం వెనకబడి ఉండటం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది హోండా కార్ల విక్రయాలు కొరియాలో ఏకంగా 22 శాతం పడిపోయి కేవలం 1,951 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇంత తక్కువ సేల్స్ తో వ్యాపారాన్ని కొనసాగించడం భారంగా మారడంతో, వనరులను ఆప్టిమైజ్ చేయడానికి, దీర్ఘకాలిక పోటీతత్వాన్ని పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోండా స్పష్టం చేసింది. కేవలం దక్షిణ కొరియాలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన చైనాలో కూడా హోండా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. 2025లో చైనాలో హోండా విక్రయాలు 6,46,000 వాహనాలకు పడిపోయాయి. ఇది ఐదేళ్ల క్రితం నాటి అమ్మకాలతో పోలిస్తే 60 శాతం తక్కువ. చైనాలో ఉన్న కనీసం ఒక జాయింట్ వెంచర్ ప్లాంట్‌ను కూడా హోండా మూసివేయబోతున్నట్లు సమాచారం. అక్కడ చైనాకు చెందిన లోకల్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు ఇచ్చే ధరల యుద్ధాన్ని తట్టుకోలేక హోండా సతమతమవుతోంది. థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల్లో కూడా హోండా సేల్స్ గతేడాది తగ్గుముఖం పట్టాయి. దక్షిణ కొరియాలో కార్ల అమ్మకాలు నిలిపివేసినప్పటికీ, హోండా తన మోటార్ సైకిల్ (Motorcycle) వ్యాపారాన్ని మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అక్కడ హోండా బైకులకు ఇంకా మంచి డిమాండ్ ఉంది. అలాగే, అప్పటికే హోండా కార్లు కొన్న కస్టమర్ల కోసం ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ (After-sales service) అందుబాటులో ఉంటుంది. అంటే కారు రిపేర్లు, స్పేర్ పార్ట్స్ సరఫరా, వారంటీ సపోర్ట్ వంటి సేవలను హోండా కొరియా అందిస్తూనే ఉంటుంది. ఇది పాత కస్టమర్లకు కొంత ఊరటనిచ్చే విషయమే. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి హోండా తన ఎలక్ట్రిక్ వాహనాల (EV) వ్యూహాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. ఇందుకోసం సుమారు 16 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.33 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. గతంలో సోనీతో కలిసి చేయాలనుకున్న ఈవీ ప్రాజెక్టును నిలిపివేసిన హోండా, ఇప్పుడు సొంతంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి పెడుతోంది. గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం పెట్రోల్ కార్లపైనే ఆధారపడితే సరిపోదని, భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని హోండా గుర్తించింది. ఈ క్రమంలోనే తక్కువ లాభాలు ఉన్న కొరియా వంటి మార్కెట్ల నుంచి తప్పుకుని, వనరులను ఈవీ రంగం వైపు మళ్లిస్తోంది.

నెక్స్ట్ లెవెల్ లుక్‌తో మరింత అందంగా ముస్తాబై వచ్చిన రైడర్‌

భారతీయ రెండు చక్రాల వాహన మార్కెట్లో 125cc సెగ్మెంట్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. మంచి మైలేజ్, సరైన పనితీరు, అలాగే యువతను ఆకట్టుకునే డిజైన్ కలిపి ఈ విభాగాన్ని అత్యంత పోటీగా మార్చాయి. ఈ సెగ్మెంట్‌లో స్థిరమైన స్థానం సంపాదించుకున్న బైక్‌లలో టీవీఎస్ రైడర్ (TVS Raider 125) ఒకటి. స్టైలిష్ లుక్, ఆధునిక ఫీచర్లు, అందుబాటు ధరతో ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్‌ను సంపాదించింది. ఇప్పుడీ క్రేజ్‌ను మరింత పెంచేలా కంపెనీ ఒక చిన్న కానీ ఆకర్షణీయమైన అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. రైడర్ 125కు 'నైట్రో గ్రీన్' అనే కొత్త రంగును పరిచయం చేసింది. ఈ కొత్త కలర్ ఆప్షన్ బైక్‌కు మరింత స్పోర్టీ, ఫ్రెష్ లుక్‌ను అందిస్తూ, ముఖ్యంగా యువతను ఆకర్షించేలా డిజైన్ చేయబడింది.

తక్కువ ధరలో ఒకే ఛార్జ్‌తో 400 కి.మీ పైగా వెళ్లే ఎలక్ట్రిక్ కార్లు

ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారుల దృష్టి వేగంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూ ఉండటంతో పాటు, పర్యావరణంపై అవగాహన పెరగడం కూడా ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. గతంలో ఈవీలు పరిమిత ఎంపికలతో ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విభిన్న ధరల పరిధిలో, విభిన్న అవసరాలకు సరిపోయేలా అనేక మోడళ్లు అందుబాటులోకి రావడంతో కొనుగోలుదారులకు ఎంపికలు విస్తరించాయి. ప్రత్యేకంగా మధ్యతరగతి వినియోగదారులు ఇప్పుడు ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి పెడుతున్నారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న వాహనాలు రోజువారీ ప్రయాణాలకే కాకుండా, పొడవైన ట్రిప్‌లకూ అనుకూలంగా మారుతున్నాయి.

స్కూటర్ అంటే ఇదేరా బాబూ.. ఏకంగా 90కిమీ మైలేజ్

భారతీయ టూ వీలర్ మార్కెట్లో, జపాన్ తయారీ సంస్థ సుజుకి హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీని ఇస్తోంది, వాస్తవానికి చెప్పాలంటే.. వాటికి వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఈ సంస్థకు చెందిన సుజుకి యాక్సెస్(Suzuki Access) స్కూటర్ ప్రస్తుతం అమ్మకాల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తన ఆకర్షణీయమైన రూపం, అద్భుతమైన పనితీరుతో, ఈ స్కూటర్ యువతను, ఫ్యామిలీలను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా, సమీప భవిష్యత్తులో ఇది CNG వేరియంట్‌లో విడుదల కానుందని, తన ఇంధన సామర్థ్యంతో అద్భుతాలు సృష్టించనుందని నివేదికలు సూచిస్తున్నాయి. తాజా అమ్మకాల నివేదిక ప్రకారం.. సుజుకి యాక్సెస్ స్కూటర్ అమ్మకాల గణాంకాలలో విశేషమైన వృద్ధిని ప్రదర్శించింది. మార్చి 2026 నాటికి, ఈ సంస్థ ఏకంగా 72,658 స్కూటర్లను విక్రయించింది. గత సంవత్సరం (2025) ఇదే నెలలో (మార్చి) విక్రయించిన 66,362 యూనిట్లతో పోలిస్తే, ఇది 9.49 శాతం పెరుగుదలను సూచిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఏడాది వ్యవధిలో సుమారు 6,296 అదనపు స్కూటర్లను విక్రయించడం ద్వారా, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 స్కూటర్ల జాబితాలో సుజుకి యాక్సెస్ విజయవంతంగా మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్‌లో, 259,670 యూనిట్ల అమ్మకాలతో హోండా యాక్టివా(Honda Activa) అగ్రస్థానంలో నిలవగా, 124,771 యూనిట్ల అమ్మకాలతో టీవీఎస్ జూపిటర్(TVS Jupiter) రెండవ స్థానాన్ని ఆక్రమించింది. అయితే, కేవలం 125cc విభాగంలోనే పోటీపడుతూ సుజుకి యాక్సెస్ ఇంతటి భారీ అమ్మకాల పరిమాణాన్ని సాధించడాన్ని మార్కెట్ నిపుణులు ఒక గణనీయమైన విజయంగా పరిగణిస్తున్నారు. యువత, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని వారు, యాక్సెస్ స్కూటర్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సుజుకి యాక్సెస్ స్కూటర్ 124cc, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 6.2 kW శక్తిని, 10.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరల ఆధారంగా చూస్తే, సుజుకి యాక్సెస్ పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర కేవలం రూ.82,906 మాత్రమే. ఫీచర్ల విషయానికి వస్తే, ఇది మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ మీటర్, LED హెడ్‌ల్యాంప్ వంటి అత్యాధునిక సదుపాయాలతో వస్తుంది. ప్రస్తుత EV (ఎలక్ట్రిక్ వాహనాల) పోకడలకు అనుగుణంగా, సుజుకి కూడా E-Access పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ మోడల్‌లో 3.072 kWh సామర్థ్యం కలిగిన పవర్ఫుల్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఈ స్కూటర్ 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని (రైడింగ్ రేంజ్) కంపెనీ పేర్కొంది. దీని ప్రారంభ ధరను రూ.1,91,962 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. పెట్రోల్ ధరల సంబంధిత ఇబ్బందులను తప్పించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ప్రస్తుతం ఆటోమోటివ్ రంగంలో అత్యంత ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, సుజుకి యాక్సెస్ స్కూటర్ ఇప్పుడు CNG వేరియంట్‌లో విడుదల కాబోతోందని వచ్చిన ప్రకటన. ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌ను విడుదల చేసి బజాజ్ సంచలనం సృష్టించిన నేపథ్యంలో, ఇప్పుడు సుజుకి కూడా అదే బాటలో పయనిస్తోంది.
Advertisement

మార్కెట్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్.. గ్లాంజా 8% సేల్స్ గ్రోత్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ ఎప్పుడూ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. స్టైలిష్ లుక్, మంచి ఫీచర్లు, కంఫర్ట్‌తో పాటు విశ్వసనీయతను కోరుకునే వినియోగదారులు ఎక్కువగా ఈ సెగ్మెంట్ వైపు మొగ్గు చూపుతారు. ఈ క్రమంలో టయోటా గ్లాంజా (Toyota Glanza) తనదైన గుర్తింపును సృష్టించుకుని, స్థిరంగా డిమాండ్‌ను కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండే కాంపాక్ట్ సైజ్, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు కలిపి ఈ కారును మధ్యతరగతి కుటుంబాలకు ఒక మంచి ఎంపికగా నిలబెడుతున్నాయి. ఈ కారుకు ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలు చూస్తే, మార్కెట్లో దీని స్థిరమైన స్థానం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది.

త్వరలో మార్కెట్లో సంచలనం సృష్టించనున్న మూడు కార్లు

మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మరీ ముఖ్యంగా, పెట్రోల్ ఖర్చులను తగ్గించేలా అద్భుతమైన మైలేజీని అందించే, కానీ కంప్లీట్ ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగా పదే పదే రీఛార్జ్ చేయాలనే ఆందోళన లేని ఒక కారు కోసం మీరు వెతుకుతున్నారా? అయితే, మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల కోసం వేచి ఉండాల్సిందే. రాబోయే రోజుల్లో, మూడు స్పెషల్ హైబ్రిడ్ కార్లు భారతీయ రోడ్లపైకి రాబోతున్నాయి. Honda, JSW, MG వంటి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు ఈ పోటీలో ముందంజలో ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలయికతో పనిచేసే ఈ కార్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ బైక్ కావాలంటే ఎంతో అదృష్టం చేసుకుని పుట్టాలి

ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్ బైక్ తయారీ సంస్థ KTM, తన చరిత్రలోనే అత్యంత పవర్ఫుల్, అత్యంత వేగవంతమైన మోటార్ సైకిల్‌ను ప్రపంచ వేదికపై ఆవిష్కరించింది. అదే 2026 KTM 1390 సూపర్ డ్యూక్ RR ట్రాక్. పేరులోనే ఉన్నట్లుగా, ఇది కేవలం రేస్ ట్రాక్‌ల కోసం మాత్రమే ప్రత్యేకంగా రూపొందించబడిన ట్రాక్-ఓన్లీ మోడల్. అంటే ఈ బైక్‌ను మీరు సాధారణ రోడ్ల మీద నడపలేరు. కానీ, రేస్ ట్రాక్ మీద మాత్రం ఇది తిరుగులేని రారాజుగా నిలుస్తుంది. ఈ బైక్ అతిపెద్ద ప్రత్యేకత దాని లభ్యత. KTM సంస్థ ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లను మాత్రమే తయారు చేస్తోంది. మే 2026 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. పరిమిత సంఖ్యలో ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ కలెక్టర్లు, రేసింగ్ లవర్స్ దీని కోసం పోటీ పడుతున్నారు. దీని ధర ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇందులో ఉపయోగించిన హార్డ్‌వేర్, దీని ఎక్స్‌క్లూజివిటీని బట్టి చూస్తే, ఇది భారీ ధరకే విక్రయించబడే అవకాశం ఉంది. ఈ బైక్ గుండెకాయ వంటి ఇంజిన్ గురించి చెప్పుకుంటే.. ఇందులో 1350cc, 75-డిగ్రీ V-ట్విన్ ఇంజిన్ అమర్చారు. ఇది అక్షరాలా 198 bhp గరిష్ట శక్తిని, 151 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. KTM ఇప్పటివరకు విడుదల చేసిన ఏ ప్రొడక్షన్ మోడల్‌లోనూ ఇంతటి పవర్ చూడలేదు. దీనికి తోడు Akrapovic ఎవల్యూషన్ లైన్ టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను జోడించారు. ఇది బైక్ పనితీరును పెంచడమే కాకుండా, బరువును గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణ రోడ్-లీగల్ బైక్‌లతో పోలిస్తే, ఈ RR ట్రాక్ ఎడిషన్ చాలా తేలికైనది.ఇది స్టాండర్డ్ 1390 సూపర్ డ్యూక్ R కంటే 20 కేజీలు తక్కువ బరువు ఉంటుంది. రోడ్-లీగల్ RR వెర్షన్ కంటే 9 కేజీలు తక్కువ బరువు ఉంటుంది. ఈ బరువు తగ్గింపు కోసం కార్బన్ ఫైబర్ బాడీ వర్క్, ఫోర్జడ్ మెగ్నీషియం వీల్స్, టైటానియం స్క్రూలను ఉపయోగించారు. రోడ్డు మీద నడిపేందుకు అవసరమైన హెడ్ లైట్లు, ఇండికేటర్లు, మిర్రర్లు వంటి వస్తువులను తొలగించడం వల్ల కూడా బరువు తగ్గింది. రేస్ ట్రాక్ మీద బైక్ కంట్రోలింగ్ అత్యంత ముఖ్యం. అందుకే ఇందులో MotoGPలో ఉపయోగించే WP ప్రో కాంపోనెంట్స్ సస్పెన్షన్‌ను వాడారు. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, అల్ట్రా-ప్రీమియం బ్రెంబో (Brembo GP4 MS) మోనోబ్లాక్ ఫోర్-పిస్టన్ కాలిపర్లను అమర్చారు. వీటికి T-Drive ఫ్రంట్ బ్రేక్ డిస్క్‌లు జతచేశారు. అలాగే, సర్క్యూట్ మీద అత్యుత్తమ గ్రిప్ కోసం మిచెలిన్ పవర్ పెర్ఫార్మెన్స్ స్లిక్స్ టైర్లను అందించారు. రేసర్లకు గరిష్ట సౌకర్యం అందించేలా దీని బాడీ డిజైన్ ఉంది. బైక్ ట్యాంక్ కొంచెం బయటికి వంగి ఉంటుంది, ఇది రైడర్ పూర్తిగా బైక్‌పై పడుకున్నప్పుడు మంచి సపోర్ట్ ఇస్తుంది. హ్యాండిల్ బార్ కొంచెం కిందకు ఉంటుంది, దీనివల్ల హై-స్పీడ్ వద్ద బైక్ కంట్రోల్ చేయడం సులభం అవుతుంది. కార్బన్ ఫైబర్ అండర్ ట్రేపై అమర్చిన సింగిల్ రేస్ సీటు ఈ బైక్ కు మరింత అగ్రెసివ్ లుక్ ఇస్తుంది. KTM 1390 సూపర్ డ్యూక్ RR ట్రాక్ అనేది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, అది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. FIM రేస్ ట్రాక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన ఈ బైక్, రేసింగ్ ప్రపంచంలో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. భారతీయ సంపన్న రేసింగ్ లవర్స్ కూడా ఈ 100 యూనిట్లలో ఒక దానిని దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఒక్క ఏడాదిలోనే 68వేల యూనిట్లు.. ఆరా సక్సెస్ ఫుల్ రన్

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ సెడాన్ విభాగం ఎప్పుడూ స్థిరమైన డిమాండ్‌ను కలిగి ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో హ్యూందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా కంపెనీకి చెందిన హ్యూందాయ్ ఆరా (Hyundai Aura) ఇటీవలి కాలంలో సాధించిన వృద్ధి గమనించదగ్గది. గత ఆర్థిక సంవత్సరంలో ఆరా అమ్మకాల ప్రదర్శన కంపెనీకి విశేష ఉత్సాహాన్ని ఇచ్చింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు మొత్తం 68,066 యూనిట్లు విక్రయించబడింది. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు, మార్కెట్‌లో ఈ మోడల్‌కు పెరుగుతున్న ఆదరణను స్పష్టంగా చూపించే సూచికగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంపాక్ట్ సెడాన్ కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పుడు ధర, మైలేజ్, ఫీచర్లు అంశాలను సమతుల్యం చేసే కార్లను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
Advertisement

రూ.17 వేల తగ్గింపుతో ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ వాహనాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతున్న ఈ సమయంలో, ఏథర్ ఎనర్జీ (Ather Energy) వినియోగదారులను మరింతగా ఆకర్షించే ప్రయత్నంలో ముందుకు వచ్చింది. ముఖ్యంగా కుటుంబ వినియోగానికి అనువైన స్కూటర్ కోసం చూస్తున్న వారిని దృష్టిలో పెట్టుకుని, కంపెనీ తన ప్రాచుర్యం పొందుతున్ ఏథర్ రిజ్టాపై (Ather Rizta)పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచడమే లక్ష్యంగా ఈ ప్రయోజనాలను పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంచడం గమనార్హం. ఈ ఆఫర్లు కేవలం డిస్కౌంట్‌లకే పరిమితం కాకుండా, వినియోగదారులకు నిజమైన విలువను అందించే విధంగా రూపొందించబడ్డాయి. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే సమయంలో ధర ఒక ముఖ్యమైన అంశం అవుతుంది.

ఇన్-బిల్ట్ నేవిగేషన్ ఉన్న టాప్ 5 ఈవీలు ఇవే

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో గమ్యాన్ని చేరుకోవడానికి దారి తెలియక ఇబ్బంది పడటం మామూలే. అందుకే స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టి, నేరుగా స్కూటర్ డిస్‌ప్లేలోనే మ్యాప్స్ చూపిస్తే ఎంత బాగుంటుందో కదా. భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామి కంపెనీలు ఇప్పుడు ఇదే ఫీచర్‌ను ప్రధానంగా అందిస్తున్నాయి. 2026 నాటికి భారత మార్కెట్లో ఇన్-బిల్ట్ నేవిగేషన్ ఫీచర్‌తో దూసుకుపోతున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

NS400Zకు మేజర్ అప్డేట్.. కానీ ధరలో మార్పే లేదు

భారతీయ ద్విచక్ర వాహన రంగంలో తన ప్రత్యేక స్టైల్, పనితీరుతో గుర్తింపు పొందిన బజాజ్ ఆటో (Bajaj Auto) మరోసారి తన ప్రాచుర్యం పొందిన మోడల్‌లో కీలక మార్పు చేసి మార్కెట్ దృష్టిని ఆకర్షించింది. కంపెనీకి చెందిన బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్ (Bajaj Pulsar NS400Z) మోటార్‌సైకిల్ ఇప్పుడు కొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఈసారి చేసిన మార్పు సాధారణ అప్డేట్ కాదని చెప్పాలి, ఇది నేరుగా ఇంజన్ సెగ్మెంట్‌కే సంబంధించినది. ఇప్పటివరకు ఈ బైక్‌లో ఉపయోగించిన 373 సిసి ఇంజన్‌కు బదులుగా, ఇప్పుడు 349 సిసి సామర్థ్యం గల కొత్త లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. సాధారణంగా ఇంజన్ సామర్థ్యాన్ని తగ్గించడం అంటే పనితీరుపై ప్రభావం ఉంటుందనే భావన వినియోగదారుల్లో ఉంటుంది.

టెస్లా కొత్త కారు ఫీచర్లు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla), భారతీయ వాహనదారులకు ఒక భారీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన పుట్టినిల్లు అయిన అమెరికాలో కూడా ఇంకా లాంచ్ చేయని ఒక సరికొత్త వేరియంట్‌ను, ఇండియాలో ముందుగా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలోన్ మస్క్ నేతృత్వంలోని ఈ కంపెనీ, భారతీయ మార్కెట్‌పై తనకు ఎంతటి మక్కువ ఉందో ఈ చర్యతో నిరూపించుకుంది. అదే టెస్లా మోడల్ వై ఎల్ (Tesla Model Y L). టెస్లా కంపెనీ 2025 జూలైలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి మోడల్ వై (Model Y) అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మాత్రమే ఇక్కడ విక్రయిస్తోంది. మొదట్లో ఇందులో రెండు వేరియంట్లు ఉండగా, ఇప్పుడు మూడవ వేరియంట్ మోడల్ వై ఎల్ (Model Y L)ను ఈ రోజే (ఏప్రిల్ 22) అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ రాకతో టెస్లా లైనప్ మరింత పటిష్టమైంది. దీని ధరను రూ.61.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. సాధారణంగా ఏదైనా అంతర్జాతీయ కంపెనీ తన కొత్త ఉత్పత్తులను ముందుగా తన స్వదేశంలో లాంచ్ చేస్తుంది. కానీ టెస్లా ఈ విషయంలో సంప్రదాయానికి భిన్నంగా వెళ్ళింది. ఈ ఎల్ వేరియంట్ టెస్లా పుట్టినగడ్డ అయిన అమెరికాలో కూడా ఇంకా అమ్మకానికి రాలేదు. భారతీయ మార్కెట్లో ఉన్న పోటీని, ఇక్కడి కస్టమర్ల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఎలోన్ మస్క్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Advertisement

హీరో ముఖంలో చిరునవ్వు.. డెస్టినీ సేల్స్ భారీగా జంప్

భారతదేశ ద్విచక్ర వాహన రంగంలో హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఒక అగ్రగామి సంస్థగా నిలుస్తోంది. ముఖ్యంగా స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి బలమైన పోటీదారులతో గట్టిగా పోటీ పడుతోంది. ఈ రెండు మోడళ్లు మార్కెట్‌లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో, హీరో కూడా పలు స్కూటర్ మోడళ్లను ప్రవేశపెట్టి తన స్థానాన్ని బలపరచడానికి ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాల్లో ఎక్కువగా నిలబడలేకపోయినా, హీరో డెస్టినీ (Hero Destini) మాత్రం తెలివిగా ముందుకు సాగుతూ మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ తన స్కూటర్ వ్యూహాన్ని మరింత స్పష్టంగా మార్చుకుంది.