హీరో ముఖంలో చిరునవ్వు.. డెస్టినీ సేల్స్ భారీగా జంప్

భారతదేశ ద్విచక్ర వాహన రంగంలో హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఒక అగ్రగామి సంస్థగా నిలుస్తోంది. ముఖ్యంగా స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి బలమైన పోటీదారులతో గట్టిగా పోటీ పడుతోంది. ఈ రెండు మోడళ్లు మార్కెట్‌లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో, హీరో కూడా పలు స్కూటర్ మోడళ్లను ప్రవేశపెట్టి తన స్థానాన్ని బలపరచడానికి ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాల్లో ఎక్కువగా నిలబడలేకపోయినా, హీరో డెస్టినీ (Hero Destini) మాత్రం తెలివిగా ముందుకు సాగుతూ మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ తన స్కూటర్ వ్యూహాన్ని మరింత స్పష్టంగా మార్చుకుంది.

విదేశాల్లో దీనిదే హవా.. రూ.3.50 లక్షల మారుతి కారు కొత్త రికార్డు

భారత ఆటోమొబైల్ రంగంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మన దేశంలో జనం పెద్దగా పట్టించుకోని ఒక కారు, విదేశీయులకు మాత్రం విపరీతంగా నచ్చేస్తోంది. కేవలం రూ.3.50 లక్షలకే లభించే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (S-Presso) ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. మార్చి 2026 గణాంకాలను పరిశీలిస్తే, ఈ కారు ఎగుమతుల్లో ఏకంగా 216 శాతం వృద్ధిని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

బడ్జెట్‌లోనే స్టైలిష్ అప్‌డేట్.. అవెనిస్‌కు ఫ్రెష్ లుక్

భారతదేశ టూవీలర్ మార్కెట్‌లో సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కంపెనీ తన వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విభిన్న కేటగిరీలలో స్కూటర్లను అందిస్తోంది. ఈ క్రమంలో యువతను ఆకట్టుకునే స్పోర్టీ డిజైన్‌తో వచ్చిన సుజుకి అవెనిస్ (Suzuki Avenis) ఒక కీలక మోడల్‌గా నిలిచింది. ఇదే సమయంలో, రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా, విశ్వసనీయతకు పేరుగాంచిన Suzuki Access 125, ప్రీమియం స్టైల్, కంఫర్ట్ కోరుకునే వారికి సరిపోయే Suzuki Burgman Street వంటి మోడళ్లతో సుజుకి విభిన్న వినియోగదారులను చేరుకుంటోంది. అయితే కాలం మారుతున్న కొద్దీ వినియోగదారుల అభిరుచులు కూడా వేగంగా మారుతున్నాయి.

నం.1 కారు అమ్మకాల్లో ఎందుకీ తేడా ?

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక కారు పరిస్థితి ప్రస్తుతం విచిత్రంగా ఉంది. దేశీయంగా ఎస్‌యూవీ (SUV) విభాగంలో రారాజుగా వెలుగొందుతుంది హ్యుందాయ్ క్రెటా. మన దేశంలో ఈ కారును కొనడానికి జనం ఎగబడుతుంటే, విదేశీయులు మాత్రం దీని వైపు చూడటానికే ఆసక్తి చూపడం లేదు. గత నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఆసక్తికరమైన, కాస్త షాకింగ్ అనిపించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హ్యుందాయ్ క్రెటా భారతీయ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గడిచిన మార్చి నెలలో భారతదేశంలో ఏకంగా 17,838 యూనిట్ల క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. టాప్-10 కార్ల జాబితాలో ఇది ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. కానీ, ఇదే కారును విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో మాత్రం గణంకాలు నిరాశపరిచాయి. మార్చి నెలలో కేవలం 904 యూనిట్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి. అంటే మన దేశంలో అమ్ముడైన దాంట్లో ఇది కేవలం 5 శాతం కూడా లేదు. ఎగుమతి అయ్యే టాప్-30 కార్ల జాబితాలో క్రెటా 21వ స్థానానికి పడిపోయింది. హ్యుందాయ్ క్రెటా మార్కెట్లో తనదైన ముద్ర వేయడానికి ప్రధాన కారణం దాని ధర, ఫీచర్లు. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.72 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ వరకు వివిధ ధరల్లో అందుబాటులో ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా హ్యుందాయ్ఈ కారును మొత్తం 7 వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి: E, EX, S, S(O), SX, SX Tech, SX (O). ముఖ్యంగా బేస్ వేరియంట్ E కూడా చూడటానికి ప్రీమియం లుక్‌తో ఉండటం వల్ల మధ్యతరగతి ప్రజలు ఈ కారు వైపు మొగ్గు చూపుతున్నారు. క్రెటా కొత్త మోడల్‌లో లెవల్-2 ADAS (Advanced Driver Assistance Systems) టెక్నాలజీని జోడించారు. ఇందులో మొత్తం 70కి పైగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు దీని సొంతం. బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు హ్యుందాయ్ డిజైన్‌లో పెద్దగా తేడాలు కనిపించకుండా జాగ్రత్త పడింది. దీనివల్ల కారు లుక్ అన్ని వేరియంట్లలోనూ అద్భుతంగా ఉంటుంది. ఇన్వర్టెడ్ L-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (LED DRLs) కారుకు కొత్త ఆకర్షణను తెచ్చాయి. కారు లోపలి భాగం (ఇంటీరియర్) చాలా విలాసవంతంగా ఉంటుంది. బేస్ మోడల్ E వేరియంట్‌లో కూడా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అయితే ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉండవు. మాన్యువల్ ఏసీ, ఫ్రంట్ అండ్ రియర్ యూఎస్‌బీ పోర్ట్స్, రియర్ ఏసీ వెంట్స్ వంటి కనీస సౌకర్యాలన్నీ ఉన్నాయి. అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్ ఇవ్వడం ద్వారా సేఫ్టీకి పెద్ద పీట వేశారు. టాప్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్ వంటి లగ్జరీ ఫీచర్లు భక్తులను కట్టిపడేస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా ప్రధానంగా రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. దీనికి తోడు పర్ఫామెన్స్ ప్రియుల కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. మాన్యువల్, ఐవీటీ (IVT), డిసిటి (DCT) వంటి వివిధ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండటం వల్ల కస్టమర్లకు తమకు నచ్చిన ఛాయిస్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంది. ముఖ్యంగా డీజిల్ ఇంజన్ ఇచ్చే మైలేజ్, పవర్ క్రెటాను ఈ విభాగంలో రారాజుగా నిలబెట్టాయి. భారతదేశంలో క్రెటాకు ఉన్న క్రేజ్ విదేశాల్లో ఎందుకు లేదన్న దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో క్రెటా స్థానంలో హ్యుందాయ్ టక్సాన్ (Tucson) లేదా ఇతర అంతర్జాతీయ మోడళ్లను ఎక్కువగా ప్రమోట్ చేస్తోంది. అలాగే విదేశాల్లో భద్రతా ప్రమాణాలు (Crash Test Ratings), ఎమిషన్ నార్మ్స్ విషయంలో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో క్రెటాకు ఉన్న ప్రధాన పోటీదారులు కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్. దేశీయంగా ఈ పోటీని తట్టుకుని నిలబడుతున్నా, అంతర్జాతీయంగా మాత్రం ఇతర గ్లోబల్ బ్రాండ్ల నుంచి క్రెటా గట్టి సవాలును ఎదుర్కొంటోంది. ఏదేమైనా, హ్యుందాయ్ క్రెటా భారతీయ వాహనదారుల పాలిట ఒక సెంటిమెంట్‌గా మారిపోయింది. లుక్, ఫీచర్లు, రీసేల్ వాల్యూ పరంగా క్రెటాకు తిరుగులేదు. ఎగుమతులు తక్కువగా ఉన్నప్పటికీ, దేశీయంగా నెలకు 17 వేల యూనిట్లకు పైగా అమ్ముడవుతుండటం హ్యుందాయ్ బలాన్ని చాటుతోంది. భవిష్యత్తులో హ్యుందాయ్ క్రెటా ఈవీ (EV) వెర్షన్‌ను కూడా తీసుకువచ్చే ప్లాన్‌లో ఉంది, ఇది జరిగితే ఎగుమతుల గణాంకాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
Advertisement

కొత్త ప్లాన్‎తో మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న అడ్వెంచర్ బైక్

బైక్ ప్రియులకు, ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ఇది ఒక అదిరిపోయే గుడ్‎న్యూస్. పాత హిమాలయన్ 411 డిజైన్ అంటే పడిచచ్చే కుర్రాళ్ల కోసం కంపెనీ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440 మార్కెట్లోకి రాబోతోంది. పాత కాలపు రఫ్ అండ్ టఫ్ లుక్, మోడ్రన్ టెక్నాలజీతో కూడిన కొత్త ఇంజన్.. ఈ కాంబినేషన్ వింటేనే అడ్వెంచర్ లవర్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2026 చివరి నాటికి ఈ బైక్ రోడ్లపై గర్జించబోతోంది.

హ్యుందాయ్ నుంచి అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు లాంచ్

ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో హ్యుందాయ్ (Hyundai) మరో సంచలనానికి తెరలేపింది. లగ్జరీ ఫీచర్లు, అదిరిపోయే రేంజ్, అందరికీ అందుబాటులో ఉండే ధర.. ఇవే లక్ష్యంగా సరికొత్త హ్యుందాయ్ అయానిక్ 3 (Hyundai Ioniq 3)ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. మిలన్ డిజైన్ వీక్ 2026 వేదికగా పరిచయం చేసిన ఈ కారు, అయానిక్ సిరీస్‌లోనే అత్యంత చౌకైన మోడల్‌గా నిలవబోతోంది. దీని లుక్ చూస్తుంటే భవిష్యత్తులో కార్లు ఇలాగే ఉంటాయేమో అన్నంత ఫ్యూచరిస్టిక్‌గా ఉంది. హ్యుందాయ్ అయానిక్ 3ని ఆర్ట్ ఆఫ్ స్టీల్(Art of Steel) అనే సరికొత్త డిజైన్ ఫిలాసఫీతో రూపొందించారు. దీనిని చూస్తుంటే చాలా సింపుల్‌గా అనిపించినా, లోతుగా గమనిస్తే అత్యంత అడ్వాన్సుడ్ ఫీచర్లు కనిపిస్తాయి. దీని ముందరి భాగంలో ఉండే సన్నని లైట్లు, పిక్సెల్-ఇన్‌స్పైర్డ్ లైటింగ్ కారుకు ఒక డిఫరెంట్ లుక్ ఇస్తాయి. దీనిని కంపెనీ ఏరో హ్యాచ్ అని పిలుస్తోంది. అంటే గాలి ఒత్తిడిని తట్టుకుని వేగంగా దూసుకెళ్లేలా దీని బాడీని డిజైన్ చేశారు. కారు సైజ్ చిన్నదైనా, దీని ఫ్లాట్ ఫ్లోర్, పొడవైన రూఫ్ వల్ల లోపల కూర్చునే ప్రయాణికులకు చాలా విశాలమైన స్థలం లభిస్తుంది. హ్యుందాయ్ అయానిక్ 3లో కస్టమర్ల అవసరాల కోసం రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లను అందిస్తున్నారు:* స్టాండర్డ్ మోడల్: ఇందులో 42.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై సుమారు 344 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. లోకల్ ప్రయాణాలకు ఇది సరైన ఎంపిక.* లాంగ్ రేంజ్ మోడల్: ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసం 61 kWh భారీ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 496 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్ ఇస్తుంది.

పల్లె పట్టణం ఈ బైకే కావాలంటున్నాయి

భారతీయ రోడ్లపై టూ-వీలర్ల హవా మామూలుగా లేదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఆరాధ్య దైవమైన హీరో మోటోకార్ప్ మరోసారి తన సత్తా చాటింది. గడిచిన 12 నెలల్లో అంటే 2026 ఆర్థిక సంవత్సరంలో, ఏకంగా 65 లక్షల ఇళ్లలోకి తన బైకులను చేర్చి దేశంలోనే నంబర్-1 టూ-వీలర్ కంపెనీగా రికార్డు సృష్టించింది. కేవలం హీరో మాత్రమే కాదు, హోండా, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు కూడా ఈ ఏడాది అదిరిపోయే అమ్మకాలతో పోటీని రసవత్తరంగా మార్చాయి.

పండగ రోజు రికార్డ్.. ఒక్క రోజులో 610 ఎలక్ట్రిక్ కార్లు ఇచ్చిన మహీంద్రా

భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయ (Akshaya Tritiya)కు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ శుభదినాన బంగారం కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో, అదే విధంగా కొత్త వాహనాలను సొంతం చేసుకోవడం కూడా చాలా మందికి ఒక ఆనవాయితీగా మారింది. ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహం కనిపించింది. దేశవ్యాప్తంగా మహీంద్రా షోరూమ్‌ల వద్ద వినియోగదారుల రద్దీ కనిపించగా, ఆ ఉత్సాహాన్ని కంపెనీ అద్భుతంగా వినియోగించుకుంది. ప్రముఖ వాహన తయారీదారు మహీంద్రా ఈ ప్రత్యేక రోజున తన ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలను భారీ స్థాయిలో పూర్తి చేసింది. ఏప్రిల్ 19న జరిగిన ఈ పండుగ సందర్భంగా, ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 610కి పైగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను వినియోగదారులకు అందించడం ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది.
Advertisement

వచ్చే నెలలో కొత్త కార్ల జాతర.. బడ్జెట్ రెడీ చేస్కోండి

భారతీయ ఆటోమొబైల్ రంగంలో మే 2026 నెల సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. కార్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5 అద్భుతమైన కార్లు వచ్చే నెలలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి నుంచి బ్రెజా ఫేస్‌లిఫ్ట్, టాటా మోటార్స్ నుంచి ఐకానిక్ సియెర్రా ఈవీ (Sierra EV), ఇంకా సెడాన్ విభాగంలో స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ నుంచి సరికొత్త మోడల్స్ మెరవబోతున్నాయి. పెట్రోల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల (EV) జాతర కూడా వచ్చే నెలలో భారీగా ఉండబోతోంది.

గ్రామాల నుంచి నగరాల వరకు ప్లాటినా హవా

నగరాల రద్దీ రోడ్లలోనూ, చిన్న పట్టణాల వీధుల్లోనూ, గ్రామీణ ప్రాంతాల దూళి దారుల్లోనూ ఒకేలా కనిపించే బైక్ గురించి మాట్లాడితే చాలా మందికి వెంటనే గుర్తుకు వచ్చేది బజాజ్ ప్లాటినా (Bajaj Platina). సంవత్సరాలుగా సాధారణ ప్రజల అవసరాలను అర్థం చేసుకుని రూపొందించబడిన ఈ బైక్, "తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం" అనే మాటకు నిజమైన ఉదాహరణగా నిలిచింది. ఉద్యోగాలకు వెళ్లే వారు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, రోజూ దూర ప్రయాణాలు చేసే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇలా విభిన్న వర్గాల జీవితాల్లో ఈ బైక్ ఒక భాగంగా మారిపోయింది. ఈ బైక్‌పై ప్రజలు చూపుతున్న నమ్మకం ఇప్పటికీ తగ్గలేదని తాజా అమ్మకాల గణాంకాలు చెబుతున్నాయి. 2026 మార్చి నెలలో బజాజ్ ప్లాటినా మొత్తం 32,822 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం.

5 లక్షల మంది కొన్నారంటే రేంజ్ ఏంటో అర్థం అవుతుంది

టూ వీలర్ వెహికల్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company), ఈ ఏడాది సరికొత్త రికార్డులతో చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా ఆ కంపెనీకి చెందిన గంభీరమైన స్పోర్ట్స్ బైక్ 'టీవీఎస్ అపాచీ' (TVS Apache) అప్రతిహతమైన అమ్మకాలతో దూసుకుపోతోంది. 21 ఏళ్ల తన ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా, ఒకే ఏడాదిలో 5 లక్షలకు పైగా అమ్మకాలను నమోదు చేసి మార్కెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీకి ఫైనాన్షియల్ ఇయర్ 2026 (FY2026) ఒక చిరస్మరణీయమైన ఏడాదిగా నిలిచిపోతుంది. ఒకవైపు జూపిటర్ స్కూటర్లు రికార్డు స్థాయిలో 2.30 మిలియన్ల విక్రయాలతో దూసుకెళ్లగా, మరోవైపు అపాచీ సిరీస్ బైకులు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. మొత్తం మీద టీవీఎస్ కంపెనీ 4.24 మిలియన్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి, గత ఏడాదితో పోలిస్తే 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో అపాచీ వాటా అత్యంత కీలకంగా మారింది. సియామ్ (SIAM) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అపాచీ సిరీస్ ఈ ఏడాది 5,71,376 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది (FY2025) విక్రయించిన 4,46,218 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 28 శాతం పెరుగుదల. అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే 1.44 లక్షల అదనపు బైకులను కంపెనీ విక్రయించగలిగింది. టీవీఎస్ మొత్తం బైకుల అమ్మకాల్లో అపాచీ వాటా ఇప్పుడు 40 శాతానికి చేరింది. యువతలో ఉన్న క్రేజ్ కారణంగానే ఈ స్థాయి అమ్మకాలు సాధ్యమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. టీవీఎస్ అపాచీ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చి 21 ఏళ్లు అవుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడూ లేని విధంగా, ఒకే ఫైనాన్షియల్ ఇయర్ లో 5 లక్షల మార్కును దాటడం విశేషం. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అపాచీ బ్రాండ్ మొత్తం 7 మిలియన్ల (70 లక్షలు) యూనిట్ల విక్రయాలను పూర్తి చేసుకుంది. గత 12 ఏళ్ల కాలంలోనే 4.38 మిలియన్ల బైకులు అమ్ముడయ్యాయంటే, ఈ బ్రాండ్ మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అపాచీ ప్రయాణాన్ని గమనిస్తే.. 2015లో కేవలం 1.98 లక్షల యూనిట్లు అమ్ముడవ్వగా, 2018 నాటికి అది 3.99 లక్షలకు చేరింది. 2020 నుంచి 2022 వరకు కరోనా, చిప్ కొరత కారణంగా అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల (డిగ్రోత్) కనిపించినప్పటికీ, ఆ తర్వాత మళ్ళీ పుంజుకుంది. 2023లో 3.49 లక్షలు, 2024లో 3.78 లక్షలు, 2025లో 4.46 లక్షల యూనిట్ల సేల్స్ జరిగాయి. ఇప్పుడు 2026లో ఏకంగా 5.71 లక్షల విక్రయాలతో ఆల్ టైమ్ హై రికార్డును సెట్ చేసింది. అపాచీ విజయంలో దాని వైవిధ్యభరితమైన మోడల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో RTR 160 2V, RTR 160 4V, RTR 165, RTR 180, RTR 200 4V వంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధర రూ.1,11,400 నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ మోడల్ రూ. 1,48,600 వరకు ఉంటుంది. విభిన్న బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా మోడల్స్ ఉండటంతో అన్ని వర్గాల యువత అపాచీ వైపు మొగ్గు చూపుతున్నారు. భారత మార్కెట్లో అపాచీకి ప్రధానంగా బజాజ్ పల్సర్, యమహా MT-15, కేటీఎం డ్యూక్ 200, సుజుకి జెిక్సర్ మరియు హీరో ఎక్స్‌ట్రీమ్ వంటి బైకుల నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. అయినప్పటికీ, టీవీఎస్ అందిస్తున్న రేసింగ్ టెక్నాలజీ, మైలేజీ, స్టైలిష్ లుక్స్ అపాచీని రేసులో ముందుంచుతున్నాయి. అపాచీతో పాటు టీవీఎస్ రైడర్ (4.26 లక్షల యూనిట్లు), రోనిన్ (80 వేల యూనిట్లు) కూడా మంచి అమ్మకాలతో కంపెనీకి లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని టీవీఎస్ తన అపాచీ బ్రేడ్ లో మరిన్ని అప్‌డేటెడ్ ఫీచర్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. రేసింగ్ డీఎన్‌ఏను మరింత బలోపేతం చేస్తూ, కొత్త కలర్ ఆప్షన్లు, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లను జోడించనుంది. డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నా, స్పోర్ట్స్ బైక్ ల పట్ల క్రేజ్ తగ్గకపోవడం అపాచీ వంటి బ్రాండ్లకు వరంగా మారింది.

పెద్దగా పెరగకపోయినా.. యమహా సేల్స్‌లో ప్లస్ కనిపించింది

యమహా(Yamaha) అనేది ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత, పనితీరు, స్టైలిష్ డిజైన్‌లకు పేరుగాంచిన ప్రముఖ ఆటోమొబైల్, టూ-వీలర్ తయారీ సంస్థ. జపాన్‌కు చెందిన ఈ కంపెనీ, ముఖ్యంగా బైక్‌ల రంగంలో తన ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. యమహా తయారు చేసే బైక్‌లు స్పోర్టీ లుక్, స్మూత్ ఇంజన్ పనితీరు, అలాగే ఆధునిక టెక్నాలజీకి ప్రసిద్ధి చెందాయి. ఇండియాలో ఈ కంపెనీ మంచి మార్కెట్ కలిగి ఉంది. యమహా కంపెనీ కేవలం కమ్యూటర్ బైక్‌లకే పరిమితం కాకుండా, స్పోర్ట్స్ బైక్‌లు, స్కూటర్లు, అలాగే ప్రీమియం సెగ్మెంట్ వాహనాల్లో కూడా తన స్థాయిని నిరూపించింది. నూతన టెక్నాలజీలను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ, రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఈ సంస్థ ముందంజలో ఉంది. యువతను ఆకర్షించే డిజైన్, మంచి మైలేజ్, అలాగే రేసింగ్ డీఎన్ఏ కలిగిన ఇంజన్లతో యమహా బైక్‌లు ప్రత్యేక గుర్తింపు పొందాయి.
Advertisement

ట్యాక్సీ డ్రైవర్లకు పండగే.. ఎంజీ విండ్సర్ కమ్యూట్ వచ్చేసింది

దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ మోటార్ (JSW-MG Motor) తన పాపులర్ ఎలక్ట్రిక్ కార్ విండ్సర్ ఈవీలో సరికొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ముఖ్యంగా ట్యాక్సీ ఆపరేటర్లు, ఫ్లీట్ ఓనర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విండ్సర్ కమ్యూట్ (MG Windsor Commute) అనే వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణ మోడల్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న ఈ వేరియంట్ ఇప్పుడు వాహన రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు ధర, ఫీచర్లు, రేంజ్, ఇతర పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

డీజిల్ SUV కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ కార్లు ఇవే!

కొత్తగా డీజిల్ కార్ కొనాలంటే ఇప్పుడు వినియోగదారులకు అంత సులభం కాదు. మార్కెట్‌లో డీజిల్ వేరియంట్లు అందించే కంపెనీల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం ఇందుకు ప్రధాన కారణం. దేశంలో అగ్రగామి ఆటోమొబైల్ తయారీదారైన మారుతి సుజుకి డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేసిన తర్వాత, రోడ్లపై కూడా ఈ వాహనాల ఉనికి తగ్గుతూ వచ్చింది. మిగతా కంపెనీలు కూడా క్రమంగా తమ డీజిల్ కార్ల విడుదలను చాలా వరకు తగ్గించాయి. ఇందుకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఉద్గార నిబంధనలు. అదే సమయంలో, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతూ ఉండటం కూడా డీజిల్ కార్ల డిమాండ్ తగ్గడానికి దోహదపడుతోంది. ఇదిలా ఉంటే డీజిల్ కార్లను కొనుగోలు చేయాలని అనుకునే వారికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆ కార్లను ఈ కింది కథణంలో చూద్దాం.

కుటుంబ భద్రత కోసం బెస్ట్ SUV.. 5 స్టార్ సాధించిన డస్టర్

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్(Renault) భారత మార్కెట్‌లో చాలా కాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. భారీ పోటీ ఉన్నప్పటికీ, స్థిరమైన ప్రదర్శనతో వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించడంలో ఈ సంస్థ విజయవంతమైంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster) మళ్లీ కొత్త అవతారంలో మార్కెట్లోకి రావడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. 2026 మోడల్ రూపంలో తిరిగి వచ్చిన ఈ లెజెండరీ SUV, కేవలం డిజైన్ లేదా ఫీచర్ల పరంగా మాత్రమే కాకుండా, భద్రత విషయంలో కూడా కొత్త ప్రమాణాలను సెట్ చేస్తోంది. తాజా Bharat NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కొత్త డస్టర్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించడం, దీనిపై కంపెనీ పెట్టిన ఫోకస్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది.

పూర్తి బ్లాక్ లుక్‌తో హ్యుందాయ్ వెన్యూ అదిరిపోతుంది!

కాంపాక్ట్ SUV సెగ్మెంట్ అంటే ఇప్పటికీ ప్రధానంగా టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి మోడళ్లే ముందుంటాయి. ఈ రెండింటి మధ్య తీవ్ర పోటీ కొనసాగుతున్నప్పటికీ, హ్యూందాయ్ వెన్యూ (Hyundai Venue) మాత్రం నెమ్మదిగా, కానీ స్థిరంగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రారంభం నుంచి పెద్దగా ఫిర్యాదులు లేకుండా, మంచి పనితీరు, ప్రాక్టికాలిటీతో వినియోగదారులను ఆకట్టుకుంటూ ముందుకు సాగింది. ఇటీవల ఈ మోడల్‌ను కొత్త తరానికి అప్‌గ్రేడ్ చేయడంతో, మార్కెట్‌లో దీనికి మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఈ SUVని కొనాలనుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ వేగాన్ని మరింత పెంచేందుకు, దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యూందాయ్ మరో కొత్త స్టైల్‌ను జోడించింది. అదే హ్యూందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ (Hyundai Venue Night Edition).
Advertisement

2026 కియా సైరోస్ ఎంట్రీ.. డిజైన్, ఫీచర్లలో పెద్ద మార్పులు

భారతీయ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరచుకునేందుకు కియా ఇండియా (Kia India) మరో కీలక అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. కంపెనీ తన ప్రాచుర్యం పొందుతున్న మోడల్ కియా సైరోస్ (Kia Syros)కు MY26 వెర్షన్‌ను పరిచయం చేస్తూ, డిజైన్, వేరియంట్ ఎంపికలు, ఫీచర్ల పరంగా గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, ఈ మోడల్‌ను మరింత మంది వినియోగదారులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ అప్‌డేట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ధరల పరంగా చూస్తే, ఈ అప్‌డేటెడ్ మోడల్ ప్రారంభ ధర రూ. 8.39 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. అయితే అసలు ఆకర్షణ మాత్రం ఇందులో తీసుకొచ్చిన కొత్త ట్రిమ్ నిర్మాణంలోనే ఉంది.

ఎగుమతుల్లో మారుతి సుజుకి సత్తా.. టాప్ 10 కంపెనీల జాబితా

అంచనాలు నిజం అవుతున్నట్లుగానే, భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల (PV) ఎగుమతుల రంగం FY2026లో గణనీయమైన ఊపును నమోదు చేసింది. గ్లోబల్ మార్కెట్లలో భారతీయ కార్లకు పెరుగుతున్న డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 7,70,296 యూనిట్ల ఎగుమతులతో పోలిస్తే, ఈసారి మొత్తం ఎగుమతులు 9,05,137 యూనిట్లకు చేరుకోవడం విశేషం. అంటే ఏకంగా 17.5 శాతం వృద్ధి నమోదవడం ఈ రంగం బలంగా ఎదుగుతోందని స్పష్టంగా చెబుతోంది. ఈ పెరుగుదల వెనుక భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల వ్యూహాత్మక ప్రణాళికలు, కొత్త మార్కెట్లలో ప్రవేశం, అలాగే నాణ్యత పరంగా పెరిగిన నమ్మకం కీలక పాత్ర పోషించాయి.

లీటరుకు 71.33 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ కంపెనీ (Yamaha Motor Company) భారతదేశంలోని స్కూటర్ మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే మార్కెట్‌ను బలంగా పట్టుకున్న కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ, యమహా తన వ్యూహాలను క్రమంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన స్కూటర్లను ప్రవేశపెట్టి, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఈ నేపథ్యంలో కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సౌకర్యం, సింపుల్ డిజైన్ కోరుకునే వారికి Yamaha Fascino 125 ను అందించగా, యువతకు స్పోర్టీ లుక్, స్టైలిష్ డిజైన్ కావాలనుకునే వారికి Yamaha Ray ZR 125 ను రూపొందించింది.

చిన్న ఫ్యామిలీ కోసం బుల్లి ఎలక్ట్రిక్ కారు

వియత్నాం‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. మొదటగా ప్రీమియం సెగ్మెంట్‌పై దృష్టి పెట్టిన ఈ కంపెనీ, VinFast VF 6, VinFast VF 7 వంటి ఆధునిక ఎలక్ట్రిక్ SUVలను పరిచయం చేసింది. ఆ తరువాత కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని VinFast VF MPV 7 అనే కొత్త మోడల్‌ను కూడా తన లైన్‌ప్‌లో చేర్చి, భారతదేశంలో తన ఉనికిని మరింత బలపరిచింది. ఈ మూడు మోడళ్లు ఫీచర్లు, డిజైన్, టెక్నాలజీ పరంగా ఆకట్టుకున్నప్పటికీ, వీటి ధరలు రూ.10 లక్షలకు పైగా ఉండటం వల్ల ఇవి ప్రధానంగా ప్రీమియం వినియోగదారులకే పరిమితమయ్యాయి.
Advertisement

యువత ఫేవరెట్ బైక్ సేల్స్ బూస్ట్.. తాజా రిపోర్ట్ ఇదే!

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో బడ్జెట్ రేంజ్‌లో మంచి మైలేజ్, శక్తివంతమైన పనితీరు, అలాగే స్టైలిష్ లుక్ బైక్ కావాలని ప్రతి వినియోగదారు కోరుకుంటారు. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125) ను మార్కెట్లోకి తీసుకొచ్చింది టీవీఎస్. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ బైక్, తన స్పోర్టీ డిజైన్, కంఫర్టబుల్ రైడింగ్ అనుభవం, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. నగర ప్రయాణాలకు సరిపోయేలా స్మూత్ పనితీరు, అలాగే ఆకర్షణీయమైన స్టైలింగ్ కలగలిపి ఈ బైక్‌ను ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్‌గా మార్చాయి. అందుకే ఇది యువ రైడర్స్‌కు మాత్రమే కాకుండా, రోజువారీ ఉపయోగానికి కూడా అనువైన బైక్‌గా గుర్తింపు పొందుతోంది.

స్కూటర్ కొనేవాళ్ల ఫేవరెట్ ఇదే.. జూపిటర్ సేల్స్ మళ్లీ పెరిగాయి!

భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో స్కూటర్లకు ఉన్న డిమాండ్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter) ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది. సింపుల్ డిజైన్, నమ్మకమైన పనితీరు, అలాగే రోజువారీ వినియోగానికి సరిపోయే సౌకర్యాలతో ఈ స్కూటర్ ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారుల మనసులు గెలుచుకుంది. అందుకే ఇది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. ప్రతి నెలా మంచి అమ్మకాలు నమోదు చేస్తూ వస్తున్న జూపిటర్, 2026 మార్చి నెలలో కూడా అదే జోరును కొనసాగించింది. తాజా అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, మార్చి 2026లో మొత్తం 1,24,771 యూనిట్ల జూపిటర్ స్కూటర్లు అమ్ముడవడం గమనార్హం.

డిజైర్ తర్వాత ఈ కారునే అందరూ కొంటున్నారు

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా (Honda) భారత మార్కెట్లో చాలా కాలంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, నాణ్యత, నమ్మకం, డ్రైవింగ్ అనుభవం వంటి అంశాలతో ఈ బ్రాండ్ నిరంతరం వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా సెడాన్ విభాగంలో హోండా స్థానం ఎంతో బలంగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో హోండా అమేజ్ (Honda Amaze) ఒక కీలక మోడల్‌గా నిలిచింది. సింపుల్ డిజైన్, సౌకర్యవంతమైన క్యాబిన్, మంచి మైలేజ్ ఈ మూడు అంశాల సమ్మిళితంతో అమేజ్ భారత కుటుంబాలకి దగ్గరైంది. సాధారణంగా సెడాన్ మార్కెట్‌లో అమ్మకాల పరంగా మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానంలో ఉండగా, దానికి సమీపంగా నిలిచి పోటీ ఇస్తున్న మోడల్‌గా అమేజ్ గుర్తింపు పొందింది.

ఏనుగు సైజు కారు.. ఒక్కసారిగా కుప్పకూలిన అమ్మకాలు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రీమియం ఎంపీవీ విభాగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన మోడళ్లలో మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) ఒకటి. మారుతి సుజుకి లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ స్థానం దక్కించుకున్న ఈ వాహనం, అధునాతన ఫీచర్లు, విశాలమైన క్యాబిన్ స్పేస్, అలాగే హైబ్రిడ్ టెక్నాలజీతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని కోరుకునే కస్టమర్ల కోసం ఇది ఒక మంచి ఎంపికగా నిలిచింది. అయితే, ఈ ఆకర్షణీయ లక్షణాలున్నప్పటికీ మార్కెట్‌లో ఇన్విక్టో అమ్మకాల ట్రెండ్ మాత్రం కాస్త ఆందోళన కలిగించేలా మారింది. తాజాగా విడుదలైన గణాంకాలను పరిశీలిస్తే, అమ్మకాల పరంగా ఈ కారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది.
Advertisement

ఈ స్కూటర్ ఒక్కసారి కొంటే పదేళ్లు టెన్షన్ ఉండదు

భారత టూవీలర్ మార్కెట్‌లో గత కొన్ని నెలలుగా ఒక స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తోంది, స్కూటర్లకు మళ్లీ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు బైక్‌లే ప్రధానంగా అమ్ముడయ్యే ఈ మార్కెట్‌లో, ఇప్పుడు నగర జీవనశైలి మార్పులు, ట్రాఫిక్ పరిస్థితులు, అలాగే సౌకర్యవంతమైన రైడింగ్ అవసరం వంటి కారణాలతో స్కూటర్లు మళ్లీ వినియోగదారుల మొదటి ఎంపికగా మారుతున్నాయి. ముఖ్యంగా యువత, మహిళలు, అలాగే రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు స్కూటర్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ సెగ్మెంట్‌లో ఎప్పటిలాగే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది హోండా యాక్టివా (Honda Activa). సంవత్సరాలుగా నమ్మకానికి ప్రతీకగా నిలిచిన యాక్టివా, తన సరళమైన డిజైన్, మెరుగైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులతో భారత వినియోగదారుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.