రూ.79వేలకే ఫుల్ ట్యాంక్ పై 600కిమీ మైలేజ్ బైక్

బడ్జెట్ ధరలో స్టైలిష్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బజాజ్ పల్సర్ సిరీస్‌లో ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. పల్సర్ అంటేనే కుర్రాళ్ల క్రేజ్.. ఆ బ్రాండ్ వాల్యూనే వేరు. అయితే పల్సర్ అనగానే లక్షన్నర దాటుతుందని చాలామంది భయపడతారు. కానీ బజాజ్ కంపెనీ సామాన్యుల కోసం, ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లు, ఆఫీసుకి వెళ్లేవారి కోసం అత్యంత చౌకైన మోడల్‌ను మార్కెట్లో ఉంచింది. అదే బజాజ్ పల్సర్ 125 నియాన్ సింగిల్ సీట్ (Bajaj Pulsar 125 Neon Single Seat). తక్కువ ధర, భారీ మైలేజ్ ఇచ్చే ఈ బైక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

త్వరలో కొత్త కిరాక్ మోడల్స్ ఎంట్రీ

2026 ప్రారంభం భారత ఆటోమొబైల్ రంగానికి ఒక పండగలా మారింది. జనవరి మొదటి పదిహేను రోజుల్లోనే మహీంద్రా, టాటా వంటి దిగ్గజాలు తమ కొత్త మోడళ్లను రోడ్ల మీదకు తెచ్చాయి. మహీంద్రా XUV 7XO, XUV 3XO EVలు ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తుండగా, టాటా మోటార్స్ సఫారి, హారియర్ పెట్రోల్ వెర్షన్లతో పాటు పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా విడుదల చేసింది. అయితే అసలు సిసలైన పోటీ ఈ నెల చివరలో ఉండబోతోంది. మారుతి సుజుకి, టయోటా, రెనాల్ట్ కంపెనీలు తమ పవర్‌ఫుల్ SUVలను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి.

ఫ్యామిలీ కార్ కావాలా? టాటా కొత్త సియెర్రా ఎలక్ట్రిక్ రాబోతోంది

2026 టాటా మోటార్స్‌కు నిజంగానే ఒక కీలకమైన సంవత్సరంగా మారింది. ఇప్పటికే కంపెనీ వరుసగా కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చి తన ప్రొడక్ట్ లైనప్‌ను బలంగా మార్చుకుంటోంది. ఇటీవలే టాటా సఫారీ పెట్రోల్, హారియర్ పెట్రోల్ వేరియంట్లు అలాగే పంచ్ ఫేస్‌లిఫ్ట్ SUVలను విడుదల చేసి, భారత SUV మార్కెట్‌లో తన ఉనికిని మరింత పటిష్టం చేసింది. ఈ లాంచ్‌లతో టాటా అన్ని సెగ్మెంట్లలో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ మరో కొత్త కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అన్నీ ప్లాన్ చేసినట్లే జరిగితే, కొత్త టాటా సియెర్రా EV అతి త్వరలోనే మార్కెట్‌లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

పెద్ద ఫ్యామిలీ అయినా ఒకే కారులో వెళ్లొచ్చు

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో కొన్నేళ్లుగా రారాజుగా వెలుగొందుతుంది మారుతి సుజుకి. సామాన్యుల బడ్జెట్ కు సరిపోయే విధంగా కార్లను తయారు చేస్తూ మార్కెట్లో నంబర్ 1గా నిలబడింది.ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి భారీ ప్లానింగుతో అడుగుపెడుతోంది.
Advertisement

Mahindra XEV 9Sలో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు

మహీంద్రా భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో మరో కీలక మైలురాయిని అధిగమిస్తూ XEV 9S అనే సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVని ఇటీవల విడుదల చేసింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ మూడు-వరుస SUV, అంటే సాధారణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన పూర్తి స్థాయి ఫ్యామిలీ EV అన్నమాట. పెద్ద కుటుంబంతో ప్రయాణించే వారికి అవసరమైన స్థలం, సౌకర్యం, ఆధునిక టెక్నాలజీ - ఈ మూడింటినీ సమతుల్యంగా కలిపి మహీంద్రా ఈ వాహనాన్ని రూపొందించింది. XEV 9S లోని మూడు వరుసల సీటింగ్ అమరిక ఏడుగురు ప్రయాణీకులు సౌకర్యంగా కూర్చునేలా రూపొందించబడింది. మొదటి రెండు వరుసల్లో లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ ఉండటంతో పాటు, మూడో వరుస చిన్నపిల్లలకే పరిమితం కాకుండా పెద్దలు కూర్చునేంత స్పేస్‌ను అందిస్తుంది.

ఒక్క ఛార్జ్ చాలు.. ఆఫీస్ నుంచి షాపింగ్ వరకూ ఫుల్ పనికొస్తుంది

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని మరింత బలోపేతం చేస్తూ తాజాగా బజాజ్ చేతక్ C25 (Bajaj Chetak C25) ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్కూటర్, రోజువారీ ప్రయాణాలకు సరిపోయేలా సింపుల్‌గా, ఉపయోగకరంగా డిజైన్ చేయబడింది. ప్రస్తుతం ఇది రూ. 91,399 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి వచ్చింది. ఆఫీస్‌కు ప్రతిరోజూ వెళ్లే ఉద్యోగులు, కాలేజ్‌కు ప్రయాణించే విద్యార్థులు, ఇంటి చుట్టుపక్కల చిన్న షాపింగ్ పనులు లేదా రోజువారీ అవసరాల కోసం ఒక నమ్మకమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి చేతక్ C25 మంచి ఎంపికగా నిలుస్తుంది.

డిమాండ్ ఎక్కువ ఉన్న ఆ ఈవీపై ధర పెంపు!

ఎంజీ కామెట్ EV (MG Comet EV) భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత చిన్న, నగరానికి సరిపోయే ఎలక్ట్రిక్ కారుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రోజూ ఆఫీస్‌కు వెళ్లడం, షాపింగ్, చిన్న దూర ప్రయాణాలు చేసే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కారును MG మోటార్ రూపొందించింది. కామెట్ EV డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బయట నుంచి చూసినప్పుడు ఇది ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ కార్‌లా కనిపిస్తుంది. చిన్న పొడవు, బాక్స్ టైప్ ఆకారం, LED లైటింగ్‌తో ఇది రోడ్డుపై వెంటనే గుర్తుపడేలా ఉంటుంది. నగరాల్లో పార్కింగ్ పెద్ద సమస్యగా మారుతున్న ఈ రోజుల్లో, చిన్న సైజ్ కారణంగా కామెట్ EVను ఎక్కడైనా సులభంగా పార్క్ చేయొచ్చు. తాజాగా కంపెనీ ఈ కారు ధరను పెంచింది. ఆ వివరాలను ఒకసారి చూద్దాం.

మిడిల్ క్లాస్ ఫేవరెట్ తిరిగి ఫామ్‌లోకి.. ఎస్-ప్రెస్సో సూపర్ గ్రోత్

భారతీయ కార్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కార్లలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso) ఒకటి. బడ్జెట్ ధర, ఎత్తైన స్టాన్స్, మారుతి బ్రాండ్ నమ్మకం వంటి కారణాలతో ఈ కారు ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే వారిలో మంచి ఆదరణ పొందింది. అయితే ఇటీవలి కాలంలో ఈ మోడల్ అమ్మకాలు కొంత మందగించిన మాట వాస్తవమే. అయినప్పటికీ, డిసెంబర్ 2025లో మాత్రం ఎస్-ప్రెస్సో అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గణాంకాలను గమనిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. డిసెంబర్ 2025లో భారత మార్కెట్లో మొత్తం 3,396 మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కార్లు అమ్ముడయ్యాయి. అదే దీనికి ముందు నెల అయిన నవంబర్ 2025లో కేవలం 1,747 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి.
Advertisement

బైక్ ఖర్చుతో కారు కావాలంటే ఇదే బెస్ట్.. ఆల్టో K10 అమ్మకాల రికార్డు

మారుతి సుజుకి ఆల్టో కె10 (maruti suzuki alto k10) అంటే భారతీయ కార్ మార్కెట్‌లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సంవత్సరాలుగా ఈ కారు లక్షలాది కుటుంబాల మొదటి కారు కలగా నిలిచింది. చిన్న సైజ్, నమ్మకమైన ఇంజిన్, తక్కువ ఖర్చుతో నిర్వహణ వంటి లక్షణాల వల్ల ఇంటి కార్‌గా ఆల్టోకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. తాజాగా విడుదలైన ఆల్టో K10 వేరియంట్ కూడా అదే విశ్వాసాన్ని మరింత బలపరుస్తూ, వినియోగదారుల నుంచి భారీ స్పందనను పొందుతోంది. మార్కెట్లో ఈ కారుకు ఉన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. గత నెల డిసెంబర్ 2025లో ఆల్టో K10 అమ్మకాల గణాంకాలు ఈ క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి.

మొదటి రోజే 93689 బుకింగ్స్.. రూ.20 వేల కోట్లు వసూలు చేసిన కార్లు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా మరోసారి తన సత్తాను చాటుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన మహీంద్రా XEV 9S మరియు XUV 7XO SUVలు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందనను పొందాయి. ఈ రెండు వాహనాల కోసం బుకింగ్‌లను ప్రారంభించిన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయిలో ఆర్డర్లు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. జనవరి 14, 2026 మధ్యాహ్నం 2 గంటల వరకు గణాంకాల ప్రకారం, ఈ రెండు SUVలకు కలిపి మొత్తం 93,689 బుకింగ్‌లు నమోదయ్యాయని మహీంద్రా అధికారికంగా వెల్లడించింది. ఎక్స్-షోరూమ్ ధరలను ఆధారంగా తీసుకుంటే, ఈ బుకింగ్‌ల విలువ రూ. 20,500 కోట్లకు పైగా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

సింగిల్ ఛార్జ్‌తో 113 కి.మీలు.. బజాజ్ చేతక్ కొత్త స్కూటర్ లాంచ్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, తన ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించుతూ కొత్తగా బజాజ్ చేతక్ సీ25 (bajaj chetak c25)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. పట్టణ ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ స్కూటర్, సింపుల్‌గానూ ప్రాక్టికల్‌గానూ ఉండేలా రూపొందించబడింది. ముఖ్యంగా ఆఫీస్‌కు వెళ్లేవారు, కాలేజ్ విద్యార్థులు, చిన్న షాపింగ్ పనులు లేదా ఇంటి అవసరాల కోసం తేలికగా ఉపయోగించుకునేలా ఇది అనువుగా ఉంటుంది. చేతక్ C25 డిజైన్ విషయానికి వస్తే, ఇది బ్రాండ్‌కు చెందిన ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే కొంచెం కాంపాక్ట్‌గా కనిపిస్తుంది. చిన్న సైజ్ ఉన్నప్పటికీ, బజాజ్ ప్రత్యేకతగా నిలిచే దృఢమైన మెటల్ బాడీని ఇందులో కూడా ఉపయోగించారు.

ఓలా స్కూటర్ పై లక్ష రూపాయల తగ్గింపు!

ఓలా ఎలక్ట్రిక్ సంస్థ మధ్యతరగతి ప్రజలకు, ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు ఊహించని బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2026 నూతన సంవత్సర కానుకగా తన పాపులర్ ఎలక్ట్రిక్ వాహనాలపై ముహూర్త మహోత్సవం(Muhurat Mahotsav) పేరుతో భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా దాదాపు లక్ష రూపాయల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
Advertisement

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో వెళ్లొచ్చు

భారతదేశంలో ఎస్‌యూవీలంటే గుర్తొచ్చే పేరు మహీంద్రా. 2020లో థార్‌తో మొదలైన వీరి విజయయాత్ర.. స్కార్పియో-ఎన్, XUV700 వరకు అప్రతిహతంగా సాగుతోంది. తాజాగా XUV700 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను XUV 7XO పేరుతో కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ సరికొత్త ఎస్‌యూవీ కోసం కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నేటి నుంచి అంటే జనవరి 14, 2026 నుంచి దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కేవలం రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ అద్భుతమైన కారును ముందే రిజర్వ్ చేసుకోవచ్చు.

కొత్త సుజుకి e-యాక్సెస్ ధర, రేంజ్ వివరాలు ఇవే

టూవీలర్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సుజుకి (Suzuki) సంస్థ, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడే వినియోగదారులకు ఒక గొప్ప శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సుజుకి ఇ-యాక్సెస్ (Suzuki e-Access) ఎలక్ట్రిక్ స్కూటర్ అధికారికంగా మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. పెట్రోల్ స్కూటర్ల విభాగంలో యాక్సెస్ 125 సాధించిన అపూర్వ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, అదే నమ్మకం, అదే స్టైల్, అదే కంఫర్ట్‌ను కొనసాగిస్తూ ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో ఈ స్కూటర్‌ను సుజుకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే యాక్సెస్ బ్రాండ్‌కు ఉన్న విశ్వసనీయత కారణంగా, ఈ ఎలక్ట్రిక్ మోడల్‌పై లాంచ్‌కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టుగానే, సుజుకి ఇ-యాక్సెస్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్ పరంగా కస్టమర్లను ఆకట్టుకునేలా రూపొందించారు.

మధ్య తరగతి కారు పై లక్ష వరకు డిస్కౌంట్

భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలు కారు కొనాలనుకుంటే ముందుగా చూసేది బడ్జెట్, భద్రత, మైలేజీ. ఈ మూడింటి కలయికతో వచ్చిన హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేకులా మారుతోంది. గత కొంతకాలంగా మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్లో టాటా పంచ్ తన అప్రతిహత రాజ్యాన్ని కొనసాగిస్తోంది.

నిన్న మార్కెట్లోకి వచ్చిన టాటా పంచ్ ఫుల్ డీటెయిల్స్

ఎంతో కాలంగా ఆటోమొబైల్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ చివరకు భారత మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న పాత పంచ్‌కు ఇది ఒక అప్డేటెడ్ వెర్షన్‌గా రావడం వల్ల, లాంచ్‌కు ముందే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా, టాటా ఈ మైక్రో SUVను కొత్త మార్పులు, ఆకర్షణీయమైన ధరలతో అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత మోడల్‌తో పోలిస్తే, పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా కొన్ని కీలకమైన మార్పులు చేశారు. దీంతో ఇది మరింత ఫ్రెష్‌గా, ఆధునికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువతతో పాటు కుటుంబ వినియోగదారులను కూడా ఆకట్టుకునేలా టాటా ఈ కారును రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు గురించిన ఇతర వివరాలను ఒకసారి చూద్దాం.
Advertisement

ఈ కారులో ఎక్కితే విమానంలో వెళ్లినట్లే

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన ఎంజీ విండ్సర్ EV, 2025 క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా అమ్ముడైన ఈవీగా రికార్డు సృష్టించింది. అయితే గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో విక్రయాలు స్వల్పంగా తగ్గడంతో, కొత్త ఏడాదిలో మళ్ళీ జోరు పెంచేందుకు ఎంజీ మోటార్స్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే విండ్సర్ EV చరిత్రలో మొదటిసారిగా ఏకంగా రూ.65,000 వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్ వల్ల కారు ధర లాంచ్ సమయంలో ఉన్న రేటు కంటే కూడా తక్కువకు లభించడం విశేషం.

నెలలోనే డబుల్ గ్రోత్..కియా కార్ల సునామీ

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా (Kia India) 2025 ఏడాదిని ఘనంగా ముగించింది. గత ఏడాది డిసెంబర్ నెలలో కంపెనీ తన చరిత్రలోనే అత్యుత్తమ డిసెంబర్ అమ్మకాలను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కియా సోనెట్, సెల్టోస్ వంటి పాపులర్ మోడళ్లతో పాటు కొత్తగా వచ్చిన సైరోస్ (Syros) కూడా మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

హ్యుందాయ్ అమ్మకాలలో మళ్లీ నంబర్ వన్ క్రెటా

హ్యుందాయ్ (Hyundai) మోటార్ ఇండియా డిసెంబర్ 2025లో మొత్తం 42,416 కార్లను విక్రయించింది. ఈ సంఖ్య చూసినప్పుడు అమ్మకాలు బాగానే ఉన్నట్లు అనిపించినప్పటికీ, మార్కెట్ పరంగా హ్యుందాయ్‌కు ఇది అంత సానుకూలమైన నెలగా మారలేదు. కారణం ఏమిటంటే, భారతదేశ కార్ల అమ్మకాల ర్యాంకింగ్‌లో సాధారణంగా రెండో స్థానంలో ఉండే హ్యుందాయ్, ఈసారి అనూహ్యంగా నాల్గవ స్థానానికి పడిపోయింది. ఇది ఆటోమొబైల్ రంగంలో చర్చకు దారితీసిన అంశంగా మారింది. మార్కెట్ వాటా విషయానికి వస్తే, డిసెంబర్ 2025లో హ్యుందాయ్ 10.5 శాతం మార్కెట్ షేర్‌ను మాత్రమే సాధించగలిగింది. గతంలో రెండో స్థానంలో నిలిచి భారీ వాటాను దక్కించుకునే కంపెనీకి, ఈసారి పోటీ మరింత తీవ్రమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ కారులో యాక్సిడెంట్ అయినా ఏమీ కాదు

టాటా మోటార్స్ అంటేనే భద్రతకు మారుపేరు. ఈ విషయాన్ని కంపెనీ మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్(Tata Punch) కొత్త వెర్షన్‌ను లాంచ్ చేస్తూ, దాని దృఢత్వాన్ని నిరూపించడానికి ఏకంగా ఒక లారీతోనే ఢీకొట్టించింది. సాధారణంగా కార్లను ల్యాబ్‌లలో టెస్ట్ చేస్తారు, కానీ టాటా ఏకంగా రియల్ లైఫ్ యాక్సిడెంట్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించింది.
Advertisement

అందరూ కొంటున్న కారు ధర పెరిగింది

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం SUVల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఆ ట్రెండ్‌కు భిన్నంగా సెడాన్ విభాగంలో ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును నిలుపుకుంటున్న కార్లలో హోండా అమేజ్ (Honda Amaze) ఒకటి. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు సెడాన్ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలవడం ద్వారా, అమేజ్‌కు ఉన్న విశ్వసనీయతను ఇది మరోసారి నిరూపించింది. కుటుంబ వినియోగానికి అనుకూలమైన డిజైన్, హోండా బ్రాండ్ నమ్మకం, మెరుగైన మైలేజ్ వంటి అంశాలు ఈ కారును కొనుగోలుదారులకు ఎప్పటికీ ఆకర్షణీయంగా మార్చాయి. అయితే, తాజాగా హోండా తీసుకున్న ఒక నిర్ణయం మార్కెట్‌లో చర్చకు దారితీసింది. అకస్మాత్తుగా రూ.6,990 ధర పెంపు ప్రకటన రావడంతో, అమేజ్‌ను కొనాలని భావిస్తున్న వారికి ఇది కొంత షాక్‌లా మారింది.

రూ.5.49 లక్షల నుంచి స్టార్ట్ అయ్యే సెడాన్ కార్లపై ఓ లుక్కేయండి

భారతీయ కార్ల మార్కెట్లో గత కొన్నేళ్లుగా SUVలకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. రోడ్ ప్రెజెన్స్, ఎత్తైన సీటింగ్ పొజిషన్ వంటి కారణాలతో SUVల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అందుకే చిన్న SUVల నుంచి పెద్ద SUVల వరకు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చాలా మంది కారు కొనాలంటే ముందుగా SUVనే ఎంపికగా చూసే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ SUV ట్రెండ్ మధ్య సెడాన్లకు ఫ్యాన్‌బేస్ మాత్రం తగ్గలేదు. సెడాన్ కార్లు అందించే సౌకర్యం, డ్రైవింగ్ స్టెబిలిటీ, మైలేజ్ వంటి అంశాలు చాలామందికి ఇష్టంగా ఉన్నాయి. మీరు ప్రస్తుతం కొత్త సెడాన్ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్లో కొన్ని మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా, హోండా సిటీ బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. వాటి గురించి కింది కథణంలో.

ఇక పెట్రోల్ బంకుల్లోనే కారు సర్వీసింగ్

భారతదేశంలో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఎందుకు రారాజుగా వెలుగుతుందో చెప్పడానికి మరో బలమైన కారణం దొరికింది. కేవలం కార్లను అమ్మడమే కాదు, అమ్మిన తర్వాత కస్టమర్లకు అందించే సర్వీస్ విషయంలో కూడా తమకు సాటి ఎవరూ లేరని మారుతి మరోసారి నిరూపించుకుంది. ఇందుకోసం మారుతి సుజుకి సంస్థ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL)తో చేతులు కలిపి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

మీ దగ్గరు తులం బంగారం ఉందా.. మీ కారు లగ్జరీగా మారిపోద్ది

ప్రస్తుతం బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. సరిగ్గా ఇప్పుడే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒక తులం బంగారం కొనే డబ్బుతో మీ దగ్గర ఉన్న పాత కారును సరికొత్త లగ్జరీ కారులా మార్చుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో 8 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.04 లక్షల వరకు ఉంది. కొత్త కారు కొనాలంటే కనీసం రూ.10 లక్షలైనా ఖర్చు చేయాలి. దానికి బదులు, ఒక తులం బంగారం ధరతో మీ పాత కారుకు అదిరిపోయే మేకోవర్ ఇవ్వొచ్చు. ఆ 5 సింపుల్ ట్రిక్స్ ఏంటో చూద్దాం.
Advertisement

కొత్తగా ముస్తాబై వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) భారత మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును కలిగిన గోవాన్ క్లాసిక్ 350ను 2026 మోడల్ సంవత్సరానికి స్వల్పంగా నవీకరించి విడుదల చేసింది. ఈ బైక్‌కి భారీ మార్పులు కాకపోయినా, రోజువారీ రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే చిన్న కానీ కీలకమైన అప్‌డేట్స్‌ను కంపెనీ అందించింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ కొత్త వెర్షన్‌కు ధర పరంగా పెద్ద మార్పులు చేయకుండా, ఇప్పటికే ఉన్న ధర స్థాయిలోనే రాయల్ ఎన్ఫీల్డ్ కొనసాగింది. ధరల విషయానికి వస్తే, 2026 గోవాన్ క్లాసిక్ 350 సింగిల్-టోన్ కలర్ ఆప్షన్లైన షాక్ బ్లాక్, పర్పుల్ హేజ్ రంగుల్లో రూ. 2,19,787(ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. ఇక డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లైన ట్రిప్ టీల్ గ్రీన్, రేవ్ రెడ్ కోసం రూ. 2,22,593(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.