కోట్ల రూపాయల మేబ్యాక్ GLS 600లో కృతి సనన్ దర్శనం

తన సొగసైన నటనతో, అందమైన వ్యక్తిత్వంతో, స్టైలిష్ లుక్‌లతో భారతీయ సినీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కృతి సనన్‌ (krtit Sanon) గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఈ అందగత్తె 2014లో తెలుగు ప్రేక్షకుల ముందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన నేనొక్కడినే చిత్రంతో అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఆమె నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి వరుస విజయాలతో ముందుకు సాగింది. ప్రస్తుతం ఆమెకు 11 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణం ఉంది. నటనతో పాటు ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, కార్లపై ఆమెకు ఉన్న ఆసక్తి కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది

రిలీజైన నెలలోపే రేటు పెంచారు

ఎస్‌యూవీ మార్కెట్‌లో ఇటీవల ప్రకంపనలు సృష్టించిన మోడల్‌లలో ఒకటి మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris). అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతున్న ఈ ఎస్‌యూవీ రిలీజ్ అయిన అతి తక్కువ రోజుల్లోనే 25,000 బుకింగ్‌లను దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి నెలలోనే 4,261 యూనిట్ల డెలివరీతో మారుతికి విజయాన్ని అందించింది.

ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ సూపర్ హిట్‌

జాతీయ రహదారులపై ప్రయాణించే వాళ్లకు గుడ్ న్యూస్. ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) ద్వారా టోల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తీసుకువచ్చిన ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‎కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. 2025 ఆగస్టు 15న ప్రవేశపెట్టబడిన ఈ పాస్‌ను కేవలం రెండు నెలల్లోనే ఉపయోగించిన వారి సంఖ్య 25 లక్షలు దాటింది.

దీపావళికి రూ.1 లక్ష లోపల లభించే బెస్ట్ బైక్‌లు

దేశీయ వాహన రంగానికి భారీ ప్రోత్సాహం ఇచ్చేలా గత నెలలో GST పన్ను రేటులో మార్పులు చేశారు. 28 శాతంగా ఉన్న పన్నులను 18 శాతానికి తగ్గించారు. ఇది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని వాహనాల ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా టూవీలర్స్ ధరలు ఇప్పుడు కాస్త అందుబాటులోకి వచ్చాయి. 350 సిసి కంటే తక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలపై ఇప్పుడు 28 శాతానికి బదులుగా 18 శాతం పన్ను విధించబడుతుంది. ధరలు తగ్గడం అనేది వాహన కొనుగోలుదారులకు మంచి లాభం చేకూర్చే అంశం. ఈ దీపావళికి కొత్త టూవీలర్ కొనే వారు గతంలో కంటే తక్కువ ధరలో వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఒక లక్ష కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని టూవీలర్స్‌ను ఒకసారి ఈ కథనంలో చూద్దాం.
Advertisement

పేదోళ్లకు సరైన కారు.. 33 కి.మీ మైలేజ్, కేవలం 3.50 లక్షలు

భారతీయ చిన్న కార్ల విభాగంలో మారుతి సుజుకీ ఎస్-ప్రెస్సో (maruti Suzuki S presso) తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్ పేద, మధ్యతరగతి వినియోగదారులకు చాలా ఆకర్షణీయంగా నిలిచింది. దీని ఆకట్టుకునే డిజైన్, డజన్లకొద్దీ ఫీచర్లు, అత్యంత తక్కువ ధర ఈ కారును విభిన్న మార్కెట్ సెగ్మెంట్లలో అందుబాటులో ఉంచాయి. సెప్టెంబర్ 2025లో ఎస్-ప్రెస్సో మంచి అమ్మకాల సంఖ్యను సాధించింది. ఈ నెలలో 1,774 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. గత సంవత్సరం (సెప్టెంబర్ 2024) ఇదే కాలంలో అమ్ముడైన 1,708 యూనిట్లతో పోలిస్తే, ఇది సుమారు 4% YoY వృద్ధిని సూచిస్తుంది. చిన్న వృద్ధి అయినప్పటికీ, ఈ స్థిరమైన అమ్మకాలు ఎస్-ప్రెస్సోను చిన్న హచ్‌బ్యాక్ విభాగంలో విశ్వసనీయ, ప్రస్తుతానికి ప్రజాదరణ పొందిన మోడల్‌గా నిలబెట్టాయి.

సరికొత్తగా హ్యుందాయ్ ఎక్స్‌టర్

భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ కార్లలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) ఒకటి. తక్కువ ధరకే లభిస్తున్న ఎస్‌యూవీ కావడంతో, దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హ్యుందాయ్ కంపెనీ ఎక్స్‌టర్ కారు అప్‌డేట్ చేయబడిన ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

దేశంలో ప్రతి ఒక్కరు కోరుకునే బడ్జెట్ కారు.. 27 కి.మీ మైలేజీ

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తున్న ఒక పెద్ద మార్పు ఏమిటంటే, కస్టమర్లు క్రమంగా మారుతి కంటే టాటా కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీనికి వెనుక ఉన్న కారణాలు ఒక్కటి కాదు, అనేకం. నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, ఆధునిక ఫీచర్లు, అందుబాటులో ఉండే ధర.. ఈ నాలుగు అంశాలను ఒకే వేదికపై అందించగల ఆటోమేకర్‌గా టాటా మోటార్స్ సాధారణ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. టాటా కంపెనీకి చెందిన టాటా టియాగో (Tata Tiago) మోడల్ గత నెలలో అద్భుతమైన అమ్మకాలతో మార్కెట్‌లో తిరుగులేని ఫలితాలను సాధించింది. సెప్టెంబర్ 2025లో ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ మొత్తం 8,322 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 4,225 యూనిట్లతో పోలిస్తే, ఇది దాదాపు రెట్టింపు వృద్ధి (97% పెరుగుదల).

2030కి హ్యుందాయ్ మాస్టర్ ప్లాన్

సాధారణ ఐసీ ఇంజిన్ కార్లతో పోలిస్తే హైబ్రిడ్ కార్లు ఎక్కువ మైలేజీని అందిస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకే కంప్లీట్ ఎలక్ట్రిక్ కార్ల వైపు వెళ్లడానికి బదులు, మైలేజీని కోరుకునే కస్టమర్లు ఇప్పుడు హైబ్రిడ్ కార్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి మారుతి సుజుకి, టాటా వంటి అగ్రగామి సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
Advertisement

క్రాష్ టెస్ట్‌లో అసలు నిజం బయటపడింది

లాటిన్ అమెరికన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇటీవల సిట్రోయెన్ (Citroen) బ్రాండ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కారణం బ్రెజిల్‌లో ఉత్పత్తి చేయబడిన సిట్రోయెన్ బసాల్ట్ (Citroen Basalt) మోడల్‌కి లాటిన్ NCAP (Latin New Car Assessment Programme) నుండి సున్నా (0) స్టార్ సేఫ్టీ రేటింగ్ రావడం. ఈ రేటింగ్ ప్రకటనతో ఆటోమొబైల్ రంగం మొత్తంలోనే కాకుండా, వినియోగదారుల్లో కూడా ఆశ్చర్యం, ఆందోళన నెలకొంది. సిట్రోయెన్ బసాల్ట్‌కి లాటిన్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో, ప్రమాదం సంభవించిన సందర్భంలో ప్రయాణికులకు తగిన భద్రత లభించడం లేదని తేలింది. డ్రైవర్, ముందు సీటులో కూర్చున్న ప్రయాణికుల తల, ఛాతీ, కాళ్ల భాగాలకు ప్రమాద సమయంలో తీవ్రమైన గాయాలు వచ్చే అవకాశం ఉన్నట్టు పరీక్షల్లో నిర్ధారించారు.

ఇది రోడ్డు మీద కదిలే ప్యాలెస్

టీమిండియా క్రికెట్‌లో ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉండే సమర్థవంతమైన ఆటగాడు కేఎల్ రాహుల్. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా, ఓపెనర్‌గా, వన్‌డౌన్‌గా తన టాలెంట్‎ను చాటుకున్న రాహుల్.. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. రెండు టెస్టుల్లోనూ సులువుగా విజయం సాధించిన ఈ తరుణంలో, క్రికెటర్ తన జీవితంలో కొత్త సంతోషాన్ని పంచుకున్నాడు.

రతన్ టాటా కంపెనీ నుంచి కొత్త బ్రహ్మాస్త్రం

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా మోటార్స్ (tata motors) మరోసారి సంచలనం సృష్టించబోతోంది. రెండు దశాబ్దాల తర్వాత, కంపెనీ తన అత్యంత ఐకానిక్ SUVలలో ఒకటైన టాటా సియెర్రా (Tata Sierra)ను తిరిగి ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా SUV ప్రేమికుల కలల కారు అయిన సియెర్రా, ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలో, ఆధునిక ఫీచర్లతో, అత్యాధునిక టెక్నాలజీతో రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త సియెర్రా నవంబర్ 2025లో అధికారికంగా భారత మార్కెట్లో విడుదల కానుంది. కొత్త సియెర్రా టాటా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ భాషను ప్రతిబింబించబోతోంది. పాత సియెర్రా క్లాసిక్ సిల్హౌట్, పనోరమిక్ రియర్ గ్లాస్ విండో వంటి ప్రత్యేకతలను కొనసాగిస్తూ, కొత్త మోడల్ మరింత సొగసైన, ఆధునిక SUVగా రూపుదిద్దుకుంది.

లగ్జరీ సెగ్మెంట్‌ను ఏలడానికి హ్యుందాయ్ రెడీ

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో లగ్జరీ విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి దిగ్గజ బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి తమ హై-ఎండ్ లగ్జరీ బ్రాండ్ అయిన జెనెసిస్‎ను 2027 లో భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.
Advertisement

అపాచీ సిరీస్‌లో తొలి అడ్వెంచర్ టూరర్

భారతదేశంలో టూ వీలర్ల తయారీలో టీవీఎస్ కంపెనీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కమ్యూటర్ బైక్‌లు, స్కూటర్లు, మోపెడ్లు, ప్రీమియం స్పోర్ట్స్ బైక్‌లు... ఇలా అనేక మోడళ్లను ఈ సంస్థ అందిస్తోంది. అయితే ఇటీవల కాలంలో యువత ఎక్కువగా అడ్వెంచర్ టూరర్ (ADV) బైక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.

అమ్మకాలలో గట్టి దెబ్బ తిన్న మారుతి ఇన్విక్టో..!

మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) భారత మార్కెట్లో ఒక పెద్ద, ప్రీమియం MPVగా నిలుస్తోంది. ఇది అసలు టయోటా ఇన్నోవా హైక్రాస్ రీ-బ్యాడ్జ్ చేయబడిన వెర్షన్ అయినప్పటికీ, సుజుకి తమదైన టచ్‌తో ఈ కారును మరింత ఫ్యామిలీ ఫ్రెండ్లీ, కంఫర్ట్-ఒరియెంటెడ్ కారుగా తీర్చిదిద్దింది. బలమైన రోడ్ ప్రెజెన్స్, సొగసైన డిజైన్, ఆధునిక టెక్నాలజీ, అలాగే హై-ఎండ్ ఫీచర్లతో ఇన్విక్టో మొదట మార్కెట్లో మంచి దృష్టిని ఆకర్షించింది. అయితే, కాలక్రమేణా ఈ మోడల్ అమ్మకాల పరంగా కొంత మందగించింది. ప్రత్యేకంగా 2025 సెప్టెంబర్ నెలలో అమ్మకాల గణాంకాలు చూస్తే, కేవలం 215 యూనిట్లు మాత్రమే డెలివరీ చేయబడ్డాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 312 యూనిట్లుగా ఉండగా, ప్రస్తుతం అమ్మకాలు దాదాపు 31% తగ్గుదలను నమోదు చేశాయి.

కారు రీసేల్ వ్యాల్యూ పెంచేందుకు కియా మాస్టర్ ప్లాన్

కారు కొనేవారికి ఇది నిజంగా శుభవార్తే. ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తమ కస్టమర్ల కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కారు కొంటే 3 లేదా 5 సంవత్సరాల వారంటీ మాత్రమే ఉంటుంది. కానీ, కియా తన నాలుగు ప్రముఖ మోడళ్లు - సెల్టోస్ (Seltos), సోనెట్ (Sonet), సైరోస్ (Syros), కారెన్స్ క్లావిస్ (Carens Clavis) పై వారంటీ కవరేజీని ఏకంగా 7 సంవత్సరాల వరకు పొడిగిస్తూ కొత్త ప్లాన్‌ను ప్రకటించింది.

రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్‌పై రూ.1 లక్ష వరకు ఆఫర్!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా ముందుకు సాగుతోంది. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విభాగంలో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇంధన ధరలు పెరగడం, పర్యావరణంపై అవగాహన పెరగడం, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు ఈ మార్పుకు ప్రధాన కారణాలు. ఈ నేపథ్యంలో అనేక తయారీదారులు తమ సొంత ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. వాటిల్లో ప్రముఖ బ్రాండ్‌గా నిలిచినది రివోల్ట్ మోటార్స్ (Revolt Motors). ఈ సంస్థ ఇప్పటికే తన విభిన్నమైన డిజైన్, మెరుగైన పనితీరు, ఆధునిక టెక్నాలజీతో యువతలో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడీ కంపెనీ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించేలా ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
Advertisement

టాయిలెట్‌ ఫోటో తీయండి..1000గెలవండి

హైవేల మీద ప్రయాణించేటప్పుడు చాలా మంది ప్రజలు మురికిగా ఉండే పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించడానికి వెనుకాడుతుంటారు. ఈ సమస్యను అధిగమించి స్వచ్ఛ భారత్ అభియాన్‎ను ప్రోత్సహించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైవేపై ప్రయాణించేటప్పుడు ఏదైనా పబ్లిక్ టాయిలెట్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి, ఆ సమాచారాన్ని NHAI కి అందిస్తే, ఆ వ్యక్తికి రూ.1000 బహుమతి ఇవ్వనుంది. ఈ మొత్తం ఫాస్టాగ్ రీఛార్జ్ రూపంలో లభిస్తుంది.

మొదటి సారి కారు కొనేవారికి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

భారత మార్కెట్‌లో తక్కువ ధరలో, మంచి మైలేజ్ కలిగిన కార్లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రూ.5 లక్షల కంటే తక్కువ ధర గల హ్యాచ్‌బ్యాక్ మోడల్స్ అత్యంత ప్రజాదరణ పొందినవిగా ఉంటాయి. సరసమైన ధరతోనే నమ్మకమైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు అందించడంతో వీటికి వినియోగదారుల ఆకర్షణ ఉంది. మొదటి సారి కారు కొనుగోలు చేసేవారికి లేదా రోజువారీ నగర ప్రయాణానికి కారును అవసరపడే వారికి ఈ మోడల్స్ ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి. GST తగ్గింపులు, పోటీ ధరలు, మైలేజ్ వీటికి మరింత ఆకర్షణీయతను ఇస్తాయి. నగరాలలోని ట్రాఫిక్, చిన్న రోడ్లు, లిమిటెడ్ పార్కింగ్ పరిస్థితులను కూడా ఈ హ్యాచ్‌బ్యాక్‌లు సులభంగా ఎదుర్కోంటాయి. ఈ కథణంలో తక్కువ ధర, మైలేజ్ పరంగా బెస్ట్ కార్లను అందించడం జరిగింది.

డిస్కౌంట్లు ఇచ్చినా కొనేవారు లేరు

సాధారణంగా ఆటోమొబైల్ రంగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే మార్కెట్లో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించలేక అతి తక్కువ అమ్మకాలతో నిరాశపరిచిన మోడళ్లు కూడా కొన్ని ఉన్నాయి. భారీ డిస్కౌంట్‌లు ఆఫర్ చేసినా కూడా ఈ కార్లను కొనేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదు. సెప్టెంబర్ 2025 నెలలో భారతదేశంలో అతి తక్కువగా అమ్ముడైన 10 కార్ల వివరాలను గాడివాడి నివేదిక విడుదల చేసింది.

కస్టమర్ల ఫేవరెట్‌గా 28 కి.మీ మైలేజ్, 5-సీటర్ కారు

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇది టయోటా నుంచి వచ్చిన కాంపాక్ట్ SUV అయినప్పటికీ, దాని స్టైల్‌, డిజైన్‌, పనితీరు, నమ్మకం కారణంగా వినియోగదారుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. టైజర్ ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో పాటు, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన ఇంటీరియర్ లేఅవుట్‌ను కలిగి ఉంది. ఇదే కారణంగా ఇది యువత, కుటుంబ వినియోగదారుల రెండింటికీ అనువైన SUVగా పేరు తెచ్చుకుంది. ఈ కారు ప్రధానంగా మారుతి సుజుకి ఫ్రాంక్స్‌పై ఆధారపడి, టయోటా ప్రత్యేక శైలిలో రీ-బ్యాడ్జ్ చేయబడింది. అయితే డిజైన్‌లో, ఫినిషింగ్‌లో టయోటా తన సొంత ముద్రను చూపించింది. కానీ టయోటా బ్రాండ్ ఇమేజ్‌ను స్పష్టంగా చూపిస్తుంది.
Advertisement

అన్ని ఈవీలు సౌండ్ చేయాల్సిందే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వాటి భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ కార్లు సైలెంటుగా వెళ్లడం వల్ల రోడ్డు మీద నడిచేవారు, సైకిల్ తొక్కే వారు, దృష్టి లోపం ఉన్న పాదచారులకు ప్రమాదాలు ఎదురవుతున్నాయి.

సెప్టెంబర్‌లో మారుతి స్విఫ్ట్ అమ్మకాలు 4 శాతం తగ్గాయి

భారత మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) అనే పేరు చెప్పగానే చాలామందికి విశ్వసనీయత, పనితీరు, స్టైల్ గుర్తుకు వస్తాయి. దశాబ్దాలుగా ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కాలానికి అనుగుణంగా అప్‌డేట్ అవుతూ, కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా మారుతూ వస్తోంది. తక్కువ ధరలో లభించే ప్రీమియం ఫీచర్లు, అందమైన డిజైన్, మైలేజ్ పరంగా మెరుగైన ఫలితాలను అందించడం వల్లే ఇది ప్రతి తరానికి ఇష్టమైన మోడల్‌గా మారింది. 2025 సెప్టెంబర్ నెలలో కూడా ఈ కారుకు మంచి డిమాండ్ కనిపించింది. ఈ కాలంలో మొత్తం 15,547 యూనిట్ల స్విఫ్ట్ కార్లు దేశవ్యాప్తంగా కస్టమర్లకు డెలివరీ చేయబడ్డాయి. ఇది స్విఫ్ట్‌కు ఉన్న స్థిరమైన మార్కెట్ పాపులారిటీని స్పష్టంగా చూపిస్తుంది.

రేసింగ్ లవర్స్‎కు గుడ్‎న్యూస్

ఒక కొత్త ఎస్‌యూవీ కొనాలని చూస్తున్నారా? అయితే భారత మార్కెట్‌లోకి లేటెస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఒక కొత్త మోడల్ గురించి తెలుసుకోవాల్సిందే. బ్రిటీష్ బ్రాండ్ అయిన మిని, 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన కార్లలో ఒకటైన మిని కంట్రీమ్యాన్ JCW ఆల్-4 (MINI Countryman JCW All-4) ని విడుదల చేసింది. అద్భుతమైన పవర్‌తో పాటు, ఆకర్షణీయమైన డిజైన్, అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త ఎస్యూవీ ధర, పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కార్లపై రూ.1.6 లక్షల తగ్గింపు ఇస్తోన్న కంపెనీ

భారతదేశంలో దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం లేదా పండుగ జరుపుకోవడం మాత్రమే కాదు, కొత్త ఆరంభాలకు సంకేతం కూడా. ప్రతి సంవత్సరం ఈ సమయంలో వాహనాల మార్కెట్‌లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే భారతీయులు దీపావళి రోజున కొత్త వాహనం కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈ నేపధ్యంలో కార్ల షోరూమ్‌లు కొత్త కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. అలాంటి శుభ సమయాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు, కియా ఇండియా ఈసారి తన పాపులర్ ICE కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. దీపావళి స్పెషల్ సీజన్ ఆఫర్‌గా కియా సంస్థ రూ.1.6 లక్షల వరకు డిస్కౌంట్‌లు ఇస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అత్యధిక బెనిఫిట్‌లలో ఒకటిగా చెప్పవచ్చు.
Advertisement

సెప్టెంబర్ 2025లో ఒక్క యూనిట్ కూడా అమ్ముడవని కార్లు ఇవే!

భారత వాహన మార్కెట్ ప్రతి నెలా పోటీని చూపిస్తుంది. ప్రతి బ్రాండ్, ప్రతి మోడల్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి, వారి డిమాండ్‌ను గెలుచుకోవడానికి కృషి చేస్తున్నాయి. ఈ సీన్‌లో, మారుతి సుజుకి తన స్థిరమైన విశ్వసనీయత, సులభమైన సర్వీస్ నెట్‌వర్క్ కారణంగా సరైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అయితే, దీని తర్వాత, హ్యుందాయ్, టాటా, మహీంద్రా వంటి ఇతర తయారీదారులు రెండవ స్థానానికి ఒకదానితో ఒకటి తలపడుతూ పోరాడుతున్నాయి. ఈ కంపెనీలు కొత్త టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్, వినియోగదారులకు ప్రత్యేకమైన ఫీచర్లతో ప్రాధాన్యతను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ కంపెనీలకు చెందిన చాలా కార్లు మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. అయితే కొన్ని మోడళ్లు మాత్రం సక్సెస్ కావడం లేదు. గత నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోని కొన్ని కార్లను ఈ కథనంలో చూద్దాం.