సరికొత్తగా ముస్తాబైన బైక్

భారతదేశంలో ప్రీమియం స్ట్రీట్ బైక్ సెగ్మెంట్‌లో యువత హృదయాలను గెలుచుకున్న బ్రాండ్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది KTM. స్పోర్టీ డిజైన్, అగ్రెసివ్ స్టైలింగ్, శక్తివంతమైన పనితీరు ఈ మూడు లక్షణాల కలయికే KTM బైక్‌ల ప్రత్యేకత. భారత మార్కెట్లో ఈ బ్రాండ్‌ను మరింత బలంగా నిలబెట్టింది బజాజ్ (Bajaj Auto)తో ఉన్న భాగస్వామ్యం. ఆ భాగస్వామ్యంతోనే యువతలో భారీ క్రేజ్ సంపాదించిన మోడళ్లలో ఒకటి కెటీఎం 250 డ్యూక్ (KTM 250 Duke). 250cc నేకెడ్-స్ట్రీట్‌ఫైటర్ సెగ్మెంట్‌లో డ్యూక్ 250 ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నగర రోడ్లపై అగ్రెసివ్ లుక్‌తో మెరిసే ఈ బైక్, పనితీరులోనూ అదే దూకుడు చూపిస్తుంది. అందుకే KTM ఈ మోడల్‌ను తరచుగా అప్‌డేట్ చేస్తూ, యువ రైడర్ల అంచనాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతోంది.

మధ్యతరగతి మనసు దోచుకుంటున్న రిజ్తా

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా నడుస్తోంది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవాలనుకునే సామాన్యులకు ఇప్పుడు ఈవీలే ఏకైక మార్గంగా కనిపిస్తున్నాయి. ఈ రేసులో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన మార్కును చూపిస్తోంది. ముఖ్యంగా ఆ కంపెనీ నుంచి వచ్చిన ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్తా(Ather Rizta) ఇప్పుడు మార్కెట్‌లో దుమ్మురేపుతోంది. 2026 ప్రారంభంలో ఈ స్కూటర్ అమ్మకాలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. రోజుకు సగటున 650 స్కూటర్లు అమ్ముడవుతున్నాయంటే దీనికి ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏథర్ ఎనర్జీ తాజాగా విడుదల చేసిన 2026 జనవరి విక్రయాల గణాంకాలు ఈవీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఒక్క నెలలోనే కంపెనీ ఏకంగా 20,155 యూనిట్ల రిజ్తా స్కూటర్లను కస్టమర్లకు డెలివరీ చేసింది. గతేడాది అంటే 2025 జనవరిలో ఇదే స్కూటర్ కేవలం 11,978 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. అంటే ఏడాది కాలంలోనే అమ్మకాల్లో 68.27 శాతం భారీ వృద్ధి నమోదైంది. కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ అవసరాలకు తగ్గట్టుగా ఉండటం వల్లే రిజ్తాఇంతటి విజయాన్ని సాధించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏథర్ రిజ్తా ఇంతటి సంచలనం సృష్టించడానికి ప్రధాన కారణం దాని ధర. ప్రస్తుతం ఇది రూ. 1.05 లక్షల నుంచి రూ. 1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల శ్రేణిలో లభిస్తోంది. ఇందులో రిజ్తా ఎస్ (Rizta S), రిజ్తా జెడ్ (Rizta Z) అనే రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది మరింత విశాలంగా ఉండటమే కాకుండా, మెయింటెనెన్స్ ఖర్చు (Maintenance Cost) కూడా చాలా తక్కువ. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలు ఈ స్కూటర్ పై ఎక్కువగా మక్కువ చూపుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారు ముందుగా చూసేది రేంజ్. రిజ్తా ఇందులో ఎక్కడా తగ్గదు. ఇది రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో వస్తుంది. 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ 123 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ ఏకంగా 160 కిలోమీటర్ల (IDC) మౌలేజీని అందిస్తుంది. ఇందులో వాడిన ఎలక్ట్రిక్ మోటార్ 4.3 kW పవర్, 22 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 4.7 సెకన్లలోనే సున్నా నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఏథర్ అంటేనే టెక్నాలజీకి మారుపేరు. రిజ్తాలో 7-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుంది, ఇది నావిగేషన్ నుంచి కాల్ అలర్ట్స్ వరకు అన్నీ చూపిస్తుంది. ఇందులో స్మార్ట్ (Smart), ఈకో (Eco), జిప్ (Zip) అనే మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. 34 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉండటం వల్ల హెల్మెట్ లేదా ఇతర సామాగ్రిని సులభంగా ఉంచుకోవచ్చు. డెక్కన్ గ్రే, సియాచిన్ వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది. సేఫ్టీ కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు రైడర్ కు మంచి కంఫర్ట్ ను ఇస్తాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఏథర్ రిజ్లాకు ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1 X), బజాజ్ చేతక్ (Bajaj Chetak), టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) వంటి స్కూటర్లు గట్టి పోటీనిస్తున్నాయి. అయినప్పటికీ, ఏథర్ అందించే బిల్డ్ క్వాలిటీ, నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్ దీనిని రేసులో ముందు ఉంచుతోంది. తక్కువ ధరలో మంచి మైలేజీ ఇచ్చే ఫ్యామిలీ స్కూటర్ కావాలనుకునే వారికి ఇప్పుడు రిజ్లానే బెస్ట్ ఆప్షన్ గా మారింది.

ఆఫీస్ వెళ్లే వారికి బెస్ట్ బడ్జెట్ కార్లు

హైదరాబాద్, బెంగళూరు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరాల్లో ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లే ఉద్యోగుల కోసం ఒక సొంత కారు ఇప్పుడు అవసరంగా మారింది. ఉదయం ట్రాఫిక్ హడావిడి, సాయంత్రం రద్దీ, అనూహ్యంగా పడే వర్షాలు, మండే ఎండ ఇలాంటి పరిస్థితుల్లో టూవీలర్ వాహనంతో ప్రయాణించడం కష్టసాధ్యం. అలాంటి సమయంలో ఒక చిన్న, నమ్మకమైన, ఇంధన పొదుపు కలిగిన కారు రోజువారీ ప్రయాణాన్ని ఎంతో సౌకర్యవంతంగా మార్చగలదు. మీరు డైలీ యూజ్ కోసం కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, బడ్జెట్‌కు సరిపోయే, మెయింటెనెన్స్ తక్కువగా ఉండే మోడల్స్‌ను ఎంపిక చేయడం ఉత్తమం. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్, టాటా పంచ్, మారుతి సుజుకి సెలెరియో కార్లు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ కార్ల గురించి ఈ కింది కథనంలో చూద్దాం.

పేదవాడి కడుపు నింపే బైక్ ఇదే

మధ్యతరగతి భారతీయులకు బైక్ అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది ఒక పొదుపు మార్గం కూడా. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలని కోరుకునే సామాన్యులకు ఇప్పుడు హీరో మోటోకార్ప్ ఒక అద్భుతమైన వరాన్ని అందిస్తోంది. అదే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe). హోండా షైన్, బజాజ్ ప్లాటినా వంటి దిగ్గజ బైక్‌ల కంటే దాదాపు 10 వేల రూపాయల తక్కువ ధరకే లభిస్తూ, లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ ఈ బైక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. 2026 ప్రారంభంలో ఈ బైక్ సాధించిన విక్రయాల గణాంకాలు చూస్తుంటే ఆటోమొబైల్ దిగ్గజాలే విస్తుపోతున్నాయి. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కేవలం ధరలో మాత్రమే కాదు, అమ్మకాల్లోనూ తన సత్తా చాటుతోంది. తాజాగా వెలువడిన 2026 జనవరి సేల్స్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్క నెలలోనే ఏకంగా 71,690 బైక్‌లు అమ్ముడయ్యాయి. గత ఏడాది (2025 జనవరి) తో పోలిస్తే ఇది 15.21 శాతం వృద్ధి. అంటే గతేడాది కంటే సుమారు 9,467 బైక్‌లు అదనంగా విక్రయించబడ్డాయి. ఈ ఘనతతో 2026 జనవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 బైక్‌ల జాబితాలో హెచ్ఎఫ్ డీలక్స్ 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ పల్సర్ తర్వాత స్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
Advertisement

రాబోయే చైనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ఫీచర్లు వింటే మైండ్ బ్లాకే!

భారతదేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఒకవైపు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు మరోవైపు వినియోగదారులను ఈవీ (EV)ల వైపు నడిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ విభాగంలో దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయి.

మరోసారి ఛాన్స్! డిమాండ్ కారణంగా మళ్లీ విడుదల!

అంతర్జాతీయంగా లగ్జరీ ఆఫ్-రోడ్ వాహనాల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ జీప్ (Jeep) మరోసారి తన ఐకానిక్ మోడల్‌తో భారత మార్కెట్‌లో సందడి చేసింది. అడ్వెంచర్‌ను ఇష్టపడే కార్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జీప్ రాంగ్లర్ విల్లీస్ 41 లిమిటెడ్ ఎడిషన్‌ (Jeep Wrangler Willys 41 Limited Edition)ను కంపెనీ మళ్లీ విడుదల చేసింది. ఇది సాధారణ ఎడిషన్ కాదు, చరిత్రను గుర్తు చేసే ఒక ప్రత్యేక అవతారం. 2025లో మొదటిసారి లాంచ్ చేసినప్పుడు, ఈ లిమిటెడ్ ఎడిషన్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. పరిమిత యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచగా, అవన్నీ కూడా విడుదలైన 7 రోజుల్లోనే పూర్తిగా అమ్ముడయ్యాయి.

ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సియెర్రా EV

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో వేగంగా దూసుకెళ్తున్న టాటా మోటార్స్ (Tata Motors), పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ విజయంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే EV సెగ్మెంట్‌లో బలమైన స్థానం సంపాదించిన టాటా, ఇప్పుడు మరో ఐకానిక్ పేరును తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అదే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియోర్రా ఈవీ (Tata Sierra EV). సమాచారం ప్రకారం, 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ కొత్త సియెర్రా EV అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశముంది. అంటే 2026 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఇది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ స్కూటర్‎ను జనవరిలో 19 వేల మంది కొన్నారు

భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా సిటీ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండే స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ జపనీస్ వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) తన రేజెడ్‎ఆర్(RayZR) హైబ్రిడ్ స్కూటర్‌తో భారత విపణిలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. 2026 జనవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 స్కూటర్ల జాబితా బయటకు రాగా, యమహా రేజెడ్‎ఆర్ తనదైన శైలిలో దూసుకుపోయి పదో స్థానాన్ని కైవసం చేసుకుంది. యువతను ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన మైలేజీ, లేటెస్ట్ ఫీచర్ల కలయికే ఈ స్కూటర్ విజయానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Advertisement

లీటర్‌కు 90 కి.మీ మైలేజ్ బైక్

భారతదేశంలో మైలేజ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటి బజాజ్ ప్లాటినా (Bajaj Platina). నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతీ ఇంటికి సుపరిచితమైన ఈ కమ్యూటర్ బైక్ చాలా కాలంగా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇవ్వడం, మెరుగైన ఇంధన పొదుపు, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం వంటి లక్షణాలు ప్లాటినాను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. 2026 జనవరిలో ఈ బైక్ మరోసారి తన మార్కెట్ శక్తిని నిరూపించింది. ఒక్క నెలలోనే 33,520 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ కావడం చిన్న విషయం కాదు. ఇది కేవలం ఒక అమ్మకాల సంఖ్య కాదు, వినియోగదారుల విశ్వాసానికి ప్రతీక.

రూ.10 లక్షల్లో టాప్ 5 టర్బో కార్లు ఇవే

సాధారణంగా కారు అనగానే ప్రతి ఒక్కరూ మైలేజ్ గురించి ఆలోచిస్తారు. కానీ కొంచెం స్పీడ్, అదిరిపోయే పికప్ కోరుకునే కుర్రాళ్లకు మాత్రం టర్బో పెట్రోల్(Turbo Petrol) ఇంజన్లే అసలైన కిక్కునిస్తాయి. తక్కువ కెపాసిటీ ఉన్నప్పటికీ సాధారణ ఇంజన్ల కంటే ఎక్కువ పవర్, వేగం అందించడం వీటి స్పెషాలిటీనే వేరు. గతంలో టర్బో ఇంజన్ కార్లు అంటే చాలా ఖరీదైనవి అనే ముద్ర ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేవలం రూ.10 లక్షల బడ్జెట్లోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే టర్బో కార్లు ప్రస్తుతం భారత కార్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మైలేజ్, పవర్ కలబోసిన టాప్-5 టర్బో కార్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue Turbo)హ్యుందాయ్ వెన్యూ ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యంత పాపులారిటీ పొందిన మోడల్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తక్కువ ధరలోనే బెస్ట్ పవర్ ఆశించే వారికి ఇది ఒక సరైన ఎంపిక అని చెప్పవచ్చు. టెక్నికల్ పరంగా చూస్తే, ఇందులో 1.0 లీటర్ కాప్పా టర్బో GDi ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 120 hp పవర్, 172 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ రోడ్లపై అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.

ఇలా కూడా కారు ఉంటుందా?

భారత ఆటోమొబైల్ రంగంలో ఇటీవలి కాలంలో వేగంగా వినిపిస్తున్న పేరు జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ (JSW Group). ఇప్పటికే ఎంజీ మోటార్ (MG Motor)తో కలిసి ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మంచి ప్రస్థానం సాగిస్తున్న ఈ గ్రూప్, ఇప్పుడు మరింత పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. కేవలం భాగస్వామ్యాలకే పరిమితం కాకుండా, భారతదేశంలో స్వతంత్ర ప్రయాణీకుల మొబిలిటీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి JSW సన్నాహాలు ప్రారంభించడం గమనార్హం. ఇది భవిష్యత్ EV మార్కెట్‌పై వారి గంభీర దృష్టిని చూపిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా, చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం Chery తో కూడా భాగస్వామ్యాన్ని ప్రకటించడం కీలక మలుపు. ఈ రెండు బ్రాండ్లు కలిసి భారత మార్కెట్‌లో పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు అంగీకరించాయి.

ఈ కారు అంటేనే జంకుతున్న జనం

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఫుల్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ అంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్. ఒకప్పుడు ఫోర్డ్ ఎండీవర్ ఈ విభాగంలో రారాజుగా వెలుగొందేది. ఎండీవర్ నిష్క్రమణ తర్వాత ఆ ఖాళీని భర్తీ చేసేందుకు, టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎంజీ మోటార్స్ గ్లోస్టర్‎ను ఎంతో ఆశతో ప్రవేశపెట్టింది. అద్భుతమైన ఫీచర్లు, అదిరిపోయే రోడ్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు గ్లోస్టర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎంజీ గ్లోస్టర్ ప్రస్థానం ముగియనుంది. గత రెండు నెలలుగా ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోకపోవడంతో, ఈ మోడల్‌ను పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది.
Advertisement

ప్రతిరోజూ 1,200 ఇదే స్కూటర్‌ను కొంటున్నారు

భారత ఎలక్ట్రిక్ రెండు చక్రాల మార్కెట్లో టీవీఎస్ మోటార్ (TVS Motor) కంపెనీకి చెందిన టీవీఎస్ ఐక్యూబ్ (iQube) స్కూటర్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగదారులు పెట్రోల్ ధరల భారాన్ని తగ్గించుకోవాలనే ఆలోచనతో పాటు, పర్యావరణ హిత వాహనాలపై ఆసక్తి పెరగడం కూడా ఐక్యూబ్ అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి. 2026 జనవరి నెలలో iQube విక్రయాలు గణనీయమైన స్థాయికి చేరుకున్నాయి. ఒక్క నెలలోనే మొత్తం 37,560 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయబడటం ఈ స్కూటర్‌పై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

రూ.100తో 450 కిమీ ప్రయాణం

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కలలను నిజం చేస్తూ, అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తూ టాటా మోటార్స్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాటా పంచ్ ఇవి (Tata Punch EV) ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మరిన్ని హంగులతో సిద్ధమైంది. కేవలం 100 రూపాయల ఖర్చుతోనే హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా చెన్నై నుంచి మదురై వరకు ప్రయాణించే అద్భుతమైన అవకాశం ఈ కారుతో సాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ చూస్తే కళ్లు తిరగాల్సిందే!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్లు అంటే కేవలం చిన్నవి, నలుగురు మాత్రమే కూర్చునేలా ఉంటాయనే అభిప్రాయం జనాల్లో ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పెద్ద ఫ్యామిలీల కోసం, లగ్జరీ ప్రయాణం కోరుకునే వారి కోసం మార్కెట్లోకి అద్భుతమైన 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే సత్తా ఉన్న ఈ కార్లు, పెట్రోల్, డీజిల్ ఖర్చుల నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. 2026 ప్రారంభం నాటికి భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-5 సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ కార్ల వివరాలు, వాటి ధరలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

షోరూమ్ లో ఈ కార్లను చూస్తే భయపడుతున్న జనం

భారతదేశ ఆటోమొబైల్ రంగం 2025లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. టాప్-10 కార్ల అమ్మకాలు సగటున 1.9 లక్షల యూనిట్లకు పైగా నమోదయ్యాయి. అయితే నాణేనికి మరో వైపు ఉన్నట్లుగా.. కొన్ని కార్లు కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. కొన్ని మోడళ్లను కొనడానికి జనం ఎంతగా వెనుకాడుతున్నారంటే, ఏడాది మొత్తం మీద వాటి అమ్మకాలు రెండంకెల సంఖ్యను కూడా దాటలేదు. ముఖ్యంగా ఒక కారునైతే దేశం మొత్తం మీద కేవలం ఐదుగురు మాత్రమే కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2025 సేల్స్ చార్ట్‌లో అత్యంత దిగువన నిలిచిన ఆ మూడు కార్ల కథాకమీమామిషు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
Advertisement

త్వరలో మూడు పవర్‌ ఫుల్ కార్లు రాబోతున్నాయ్

భారతదేశం ఇప్పుడు ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఒక శక్తివంతమైన మార్కెట్‌గా ఎదిగింది. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో వాహనాలు అమ్ముడవుతుండటంతో, గ్లోబల్ తయారీదారుల దృష్టి మొత్తం భారతదేశంపైనే కేంద్రీకృతమవుతోంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరం వాహన తయారీదారులకు ఎంతో కీలకంగా మారింది. కొత్త మోడళ్లను ప్రవేశపెట్టి మార్కెట్‌లో తమ స్థానం మరింత బలపరచుకోవాలని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే దేశీయ మార్కెట్లో మూడు సరికొత్త మిడ్-సైజ్ SUVలు రాబోతున్నాయన్న వార్తలు వినియోగదారుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

కొత్త కారు కొనేవారు కాస్త ఆగండి

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తన స్థానాన్ని మళ్లీ బలపరచుకోవాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన బ్రాండ్ అంటే స్కోడా (Skoda Auto). ఒకప్పుడు ప్రీమియం సెడాన్‌లతో గుర్తింపు పొందిన ఈ చెక్ కంపెనీ, SUV సెగ్మెంట్‌లో అడుగుపెట్టిన తర్వాతే తన బ్రాండ్ ఇమేజ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఆ మార్పుకు ప్రధాన కారణం స్కోడా కుషాక్ (Skoda Kushaq). మిడ్-సైజ్ SUV విభాగంలో అప్పటికే Hyundai Creta, Kia Seltos ఆధిపత్యం కొనసాగిస్తున్న సమయంలో కుషాక్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఆ సమయంలో ఈ సెగ్మెంట్‌లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, యూరోపియన్ ఇంజినీరింగ్ ప్రమాణాలతో భారతదేశంలో తయారైన SUVగా కుషాక్ ప్రత్యేక గుర్తింపు పొందింది.

రూ. 8 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కార్లు ఇవే

ప్రస్తుత రోజుల్లో సొంత కారు అనేది ఒక విలాసం మాత్రమే కాదు, అవసరం కూడా. అయితే మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం అనేది ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. ముఖ్యంగా పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ కాలంలో, తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజీ ఇచ్చే కారు కోసం అందరూ వెతుకుతుంటారు. మీ బడ్జెట్ రూ. 8 లక్షల లోపు ఉండి, స్టైల్, మైలేజీ, సౌకర్యం కలగలిసిన కారును చూస్తున్నట్లయితే ఈ సమాచారం మీకోసమే. మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 5 పెట్రోల్ కార్ల వివరాలు తెలుసుకుందాం.

ప్రతి రూపాయి విలువ తెలిసిన వారి ఎంపిక ఇదే

భారతీయ కమ్యూటర్ సెగ్మెంట్‌లో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన బైక్‌లలో హోండా షైన్ 125 (Honda Shine 125) ఒకటి. సరైన ధర, నమ్మకమైన ఇంజిన్ పనితీరు, మెరుగైన మైలేజ్ ఈ మూడు అంశాల కలయికతో ఈ మోటార్‌సైకిల్ అనేక సంవత్సరాలుగా వినియోగదారుల ఆదరణ పొందుతోంది. నగరాల్లో ఆఫీస్ ప్రయాణాలకైనా, పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ అవసరాలకైనా ఇది సరైన ఎంపికగా నిలిచింది. ఇటీవల కాలంలో ఈ బైక్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నట్లు మార్కెట్ ట్రెండ్ సూచిస్తోంది. వినియోగదారులు దీన్ని విశ్వసనీయ ప్రయాణ భాగస్వామిగా భావిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా 125 సీసీ సెగ్మెంట్‌లో సౌకర్యం, పనితీరు మధ్య సమతుల్యత కోరుకునే వారికి ఇది ఆకర్షణీయమైన ఆప్షన్.
Advertisement

హార్దిక్ పాండ్యా పెద్ద మనసు

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మైదానంలోనే కాదు, నిజ జీవితంలో కూడా తన ఉదారతను చాటుకున్నాడు. హార్దిక్, అతని మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయినప్పటికీ, తమ కుమారుడు అగస్త్య బాధ్యతలను మాత్రం ఇద్దరూ ఎంతో హుందాగా నిర్వర్తిస్తున్నారు. తాజాగా హార్దిక్ తన కుమారుడు, మాజీ భార్య కోసం అత్యంత విలాసవంతమైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender) కారును కానుకగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబైలో జరిగిన ఈ కారు డెలివరీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారు డెలివరీ తీసుకుంటున్న సమయంలో చిన్నారి అగస్త్య ఉత్సాహం చూసి తీరాల్సిందే. ఆ నలుపు రంగు భారీ కారును చూసి మురిసిపోతూ, కారు లోపలికి తొంగి చూడటం, దానిని తాకడం వంటివి చేస్తున్న వీడియోలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి. నటాషా కూడా చిరునవ్వుతో షోరూమ్ సిబ్బంది అందించిన గిఫ్ట్ హ్యాంపర్‌ను అందుకుంది. భార్యాభర్తలుగా విడిపోయినా, ఒక తండ్రిగా తన కొడుకు సేఫ్టీ, సౌకర్యం కోసం హార్దిక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. హార్దిక్ రియల్ బాహుబలి.. మనసు గెలిచాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ కారు విశేషాల విషయానికి వస్తే, ల్యాండ్ రోవర్ డిఫెండర్ కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అదొక పవర్‌ఫుల్ స్టేటస్ సింబల్. దీనిని 'రోడ్డు మీద నడిచే కోట' అని పిలుస్తారు. హార్దిక్ గిఫ్ట్ ఇచ్చిన ఈ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన ఆక్టా(OCTA) వేరియంట్ లేదా హై-ఎండ్ కస్టమైజ్డ్ వెర్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర, ఫీచర్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి..

జాతరైనా, పెళ్లైనా.. ఈ కారు ఒక్కటుంటే చాలు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎంపీవీ సెగ్మెంట్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross). సంవత్సరాలుగా ఇన్నోవా బ్రాండ్ సంపాదించిన విశ్వాసాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన మోడల్ ఇదే. పెద్ద కుటుంబాల నుంచి కార్పొరేట్ ట్రావెల్ అవసరాల వరకు ప్రతి వర్గానికీ సరిపోయే మల్టీ పర్పస్ వెహికల్‌గా ఇది వేగంగా గుర్తింపు పొందింది. ప్రతి నెలా భారీ సంఖ్యలో అమ్ముడవుతూ, మార్కెట్‌లో తన స్థిరమైన డిమాండ్‌ను నిరూపిస్తోంది. డిజైన్ పరంగా చూస్తే, సంప్రదాయ ఎంపీవీ లుక్‌కు మోడర్న్ టచ్ జోడించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రీమియం ఫ్రంట్ గ్రిల్, స్లీక్ హెడ్‌ల్యాంప్స్, బలమైన బాడీ లైన్స్ ఇవన్నీ కలిసి దీనికి SUV తరహా స్టాన్స్‌ను ఇస్తాయి. లోపలికి వెళ్లిన వెంటనే విశాలమైన కేబిన్, సౌకర్యవంతమైన సీట్లు, అధునాతన ఫీచర్లు ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని కలిగిస్తాయి.

బజాజ్ టాప్ 5 చౌక బైక్స్ ఇవే

మధ్యతరగతి భారతీయులకు బైక్ అనేది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అది వారి కుటుంబంలో ఒక సభ్యునితో సమానం. పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో, సామాన్యుడు కోరుకునేది తక్కువ ధర, ఎక్కువ మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్. ఈ మూడు అంశాల్లోనూ బజాజ్ ఆటో (Bajaj Auto) ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. తాజాగా బజాజ్ నుంచి వస్తున్న ఐదు అత్యంత చవకైన బైకుల గురించి తెలుసుకుంటే, అవి కేవలం రూ.65,897 నుంచే ప్రారంభమవుతున్నాయి. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సత్తా ఈ బైకులకు ఉంది. వాటి వివరాలు మీకోసం..

ఇండియాలో దీన్ని మించిన బైకును చూపించలేరు

భారతీయ టూవీలర్ మార్కెట్‌లో ఎప్పటికీ అగ్రస్థానంలో నిలిచే పేరు అంటే అది హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus). సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఈ బైక్‌ ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలిచింది. తక్కువ ధర, మెరుగైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ కలిపి స్ప్లెండర్ ప్లస్‌ను ఇంటింటి బైక్‌గా మార్చాయి. దశాబ్దాలుగా మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకున్న ఈ మోటార్‌సైకిల్‌పై వినియోగదారుల విశ్వాసం రోజురోజుకు మరింత బలపడుతోంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2026 జనవరి నెలలో ఈ బైక్ ఏకంగా 3,10,802 యూనిట్లు అమ్ముడై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
Advertisement

కంపెనీల మాస్టర్ ప్లాన్..సగం ధరకే ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కార్లు కొనాలంటే సామాన్యులకు ఇప్పటికీ ఒక పెద్ద అడ్డంకి వాటికి ఉన్న భారీ ధర. పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈవీల ధరలు చుక్కలను తాకడానికి ప్రధాన కారణం వాటిలో వాడే భారీ బ్యాటరీ ప్యాక్‌లే. అయితే ఇప్పుడు కార్ల కంపెనీలు ఈ ధరల భారాన్ని తగ్గించేందుకు ఒక కొత్త మంత్రాన్ని కనిపెట్టాయి. అదే BaaS (Battery-as-a-Service). అంటే కారును తక్కువ ధరకే కొనుగోలు చేసి, బ్యాటరీని అద్దెకు వాడుకోవడం అన్నమాట. దీనివల్ల కారు ప్రారంభ ధర లక్షల్లో తగ్గుతుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ అద్భుతమైన సదుపాయంతో అందుబాటులో ఉన్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.