జనాల మనసు గెలిచిన టయోటా కారు

భారతీయ మార్కెట్లో MPV సెగ్మెంట్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టయోటా రూమియన్ (Toyota Rumion) ఇప్పుడు మరింత బలంగా ముందుకు దూసుకెళ్తోంది. కుటుంబాలకు అనువైన విస్తృతమైన స్థలం, విశ్వసనీయమైన పనితీరు, టయోటా బ్రాండ్ నమ్మకం కలిపి ఈ మోడల్‌ను ప్రజల్లో మరింత ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన జనవరి 2026 అమ్మకాల గణాంకాలు చూస్తే, రూమియన్‌కు మార్కెట్లో ఎంతటి డిమాండ్ ఉందో స్పష్టంగా తెలుస్తోంది. గత నెలలో మాత్రమే మొత్తం 2,829 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. ఇదే 2025 జనవరి నెలలో 1,944 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ రెండు గణాంకాలను పోల్చితే, ఏడాదిలో 46 శాతం వృద్ధి నమోదైనట్లు తెలుస్తోంది.

మిడిల్ క్లాస్ కోసం టాటా కొత్త కారు! ధర, బ్యాటరీ, రేంజ్, ఫీచర్స్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి నేతృత్వం వహిస్తున్న టాటా మోటార్స్ (Tata Motors) మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో బలమైన స్థానం సంపాదించిన ఈ సంస్థ, ఫిబ్రవరి 20న తన ప్రజాదరణ పొందిన Tata Punch EV ను కొత్త అవతారంలో పరిచయం చేసింది. నగర ప్రయాణాలకు సరైన పరిమాణం, ఆకట్టుకునే డిజైన్, వినియోగదారుల బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ప్యాకేజీగా మారింది. కొత్త పంచ్ EV విడుదలతో టాటా మోటార్స్ ప్రధానంగా మొదటి ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 9.69 లక్షలుగా నిర్ణయించింది.

పంచ్ ఎలక్ట్రిక్ లేదా పెట్రోల్? మీకు ఏది బెస్ట్ ఆప్షన్?

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టిస్తూ టాటా మోటార్స్ (Tata Motors) తన కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ (Tata Punch EV)ను అధికారికంగా విడుదల చేసింది. అదే సమయంలో ఫ్యూయల్‌తో నడిచే పంచ్ (Tata Punch) ఫేస్‌లిఫ్ట్ కూడా జనవరి 2026 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చింది. ఈ రెండు మోడళ్ల విడుదలతో మైక్రో SUV సెగ్మెంట్‌లో మళ్లీ పోటీ వేడెక్కింది. కొత్త డిజైన్ విషయంలో చూస్తే, ఈ రెండు కార్లు ఆధునికతను ప్రతిబింబించే విధంగా రూపొందించబడ్డాయి. ఫ్రంట్ ఫాస్షియా, ఎల్ఈడి లైటింగ్ సెటప్, రీడిజైన్ చేసిన గ్రిల్, ఆకర్షణీయమైన అలాయ్ వీల్స్ వంటివి వాటికి మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. ఈ రెండు కార్ల గురించిన తేడాలను ఈ కింది కథణంలో చూద్దాం.

లైట్ తీసుకున్న వాళ్లే ఇప్పుడు ఎగబడి కొంటున్నారు

భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పుల్లో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థల్లో ఒకటి MG Motor India. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ, ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో తనదైన ముద్ర వేస్తోంది. ముఖ్యంగా నగర వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని రూపొందించిన మోడళ్లతో కంపెనీ ముందుకు దూసుకుపోతోంది. ఆ సంస్థకు చెందిన ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV) భారతీయుల కారు అంటే పెద్దదిగా ఉండాలి అనే సాంప్రదాయ భావనను పూర్తిగా మార్చేసింది. చిన్న పరిమాణం ఉన్నప్పటికీ, లోపలి భాగంలో సమర్థవంతమైన వినియోగాన్ని కలిగి ఉండటం దీని ప్రత్యేకత.
Advertisement

మార్కెట్‌లో సునామీ సృష్టించిన జూపిటర్

భారతదేశంలో విశ్వసనీయమైన కుటుంబ స్కూటర్‌గా గుర్తింపు పొందిన టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter) మరోసారి తన సత్తాను చాటుకుంది. సాధారణంగా పట్టణాలు, చిన్న పట్టణాలు మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ స్కూటర్‌కు ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జనవరి 2026లో నమోదైన అమ్మకాల గణాంకాలు చూస్తే, జూపిటర్‌కు మార్కెట్లో ఎంత బలమైన స్థానం ఉందో స్పష్టంగా తెలుస్తోంది. గత నెలలో మొత్తం 1,29,744 యూనిట్లు వినియోగదారులకు పంపిణీ చేయడం గమనార్హం. ఇదే కాలంలో 2025 జనవరిలో 1,07,847 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఈసారి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. సంవత్సరం వారీగా చూస్తే 16.89 శాతం వృద్ధి నమోదవడం కంపెనీకి పెద్ద ఊతంగా మారింది.

31 రోజులు.. 2,72,000 కొత్త కస్టమర్లు

భారతదేశంలో టూ-వీలర్ మార్కెట్ అంటే హోండా, హోండా అంటే యాక్టివా.. ఇదొక విడదీయలేని బంధం. దశాబ్దాలు మారుతున్నా, కొత్త మోడల్స్ పుట్టుకొస్తున్నా, ఎలక్ట్రిక్ విప్లవం ముంచుకొస్తున్నా సరే, హోండా యాక్టివా క్రేజ్ మాత్రం అంగుళం కూడా తగ్గడం లేదు. తాజా గణాంకాల ప్రకారం.. జనవరి 2026 నెలలో హోండా యాక్టివా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఈ ఒక్క నెలలోనే లక్షలాది ఇళ్లలోకి చేరి, తన నంబర్-1 స్థానాన్ని ఎవరూ టచ్ చేయలేరని నిరూపించింది. కేవలం 31 రోజుల్లోనే 2,72,000 యూనిట్ల విక్రయాలను సాధించి, తన సమీప ప్రత్యర్థులను ఆమడ దూరంలో నిలబెట్టింది. గతేడాది జనవరితో పోలిస్తే హోండా యాక్టివా అమ్మకాలు ఆశ్చర్యకరమైన రీతిలో పెరిగాయి. జనవరి 2025లో 1,66,739 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది జనవరిలో ఆ సంఖ్య ఏకంగా 2,71,924 యూనిట్లకు చేరుకుంది. అంటే వార్షిక ప్రాతిపదికన 63 శాతం వృద్ధి నమోదైంది.

ఏసీ ఆన్ చేస్తే మైలేజీ పడిపోతుందా?

ఫిబ్రవరి నెల ముగుస్తోంది.. మార్చి నెల దగ్గరపడుతోంది. అంటే భానుడి భగభగలు మొదలైనట్టే. ఇప్పటికే మధ్యాహ్నం పూట ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలం రాకముందే ఏసీల వాడకం మెల్లగా పెరుగుతోంది. ముఖ్యంగా కారులో ప్రయాణించే వారికి ఏసీ లేనిదే క్షణం కూడా గడవదు. అయితే కారు ఏసీ విషయంలో వాహనదారుల మనసులో ఎప్పుడూ ఒకటే సందేహం ఉంటుంది. కారు ఆపి ఉంచినప్పుడు ఏసీ వేస్తే పెట్రోల్ ఎక్కువగా ఖర్చవుతుందా? లేక కారు నడుస్తున్నప్పుడు ఏసీ వేస్తే ఎక్కువ ఆయిల్ ఖర్చవుతుందా? ఈ విషయంలో ఉన్న అసలు నిజానిజాలను, నిపుణుల అభిప్రాయాలను వివరంగా తెలుసుకుందాం.

పాత పంచ్ వర్సెస్ కొత్త పంచ్ ఈవీ

టాటా మోటార్స్ ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో ఎస్‌యూవీ పంచ్ ఇప్పుడు కొత్త హంగులతో, అదిరిపోయే ఫీచర్లతో 2026 టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch EV Facelift) రూపంలో మన ముందుకు వచ్చింది. కేవలం లుక్ మాత్రమే కాదు, ఈసారి రేంజ్ విషయంలోనూ టాటా గట్టి దెబ్బే కొట్టింది. పాత మోడల్ కంటే ఏకంగా 103 కిలోమీటర్ల అదనపు రేంజ్ ఇస్తూనే, ధరను భారీగా తగ్గించి సామాన్యుడి ఎలక్ట్రిక్ కారు కలని నిజం చేస్తోంది. అసలు ఈ కొత్త పంచ్ ఈవీ పాత దానికంటే ఎందుకు మెరుగైనది? ఇందులో మారిన ఫీచర్లు ఏంటి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Advertisement

రూ. 10 లక్షల లోపే 5-స్టార్ భద్రతతో వచ్చిన టాటా అద్భుతం

టాటా మోటార్స్ ఇండియన్ రోడ్లపై మరోసారి తన సేఫ్టీ సత్తాను చాటుతోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో ఎస్‌యూవీ పంచ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో కొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చింది. టాటా పంచ్ ఈవీఫేస్‌లిఫ్ట్ లాంచ్ అవ్వడమే కాదు, తన ధరతోనూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

స్టైల్, మైలేజీలో కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయ్

ప్రస్తుతం భారతీయ రహదారులపై యువత కింగ్స్‎లా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ లుక్ ఉన్న 125సీసీ స్కూటర్లకు కాలేజీ కుర్రాళ్ల నుంచి ఆఫీసు వెళ్లే యువతీ యువకుల వరకు ఫిదా అయిపోతున్నారు. ఒకప్పుడు స్కూటర్ అంటే కేవలం సౌకర్యం కోసం మాత్రమే చూసేవారు, కానీ ఇప్పుడు స్టైల్, పర్ఫార్మెన్స్, టెక్నాలజీ కూడా ముఖ్యమే.

టాప్ 5 సీఎన్జీ ఫ్యామిలీ కార్లు ఇవే

భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు 7-సీటర్ కార్లు ఎప్పుడూ హాట్ ఫేవరెట్. పెట్రోల్ ధరలు సెంచరీ దాటిన వేళ, మైలేజీతో పాటు మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గించుకోవాలని చూసేవారికి సిఎన్‌జీ (CNG) ఎంపీవీలు వరంగా మారాయి. ఫిబ్రవరి 2026 నాటి తాజా మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం.. మీ జేబుకు చిల్లు పడకుండా, ఫ్యామిలీ అంతా హాయిగా ప్రయాణించే టాప్ 5 సిఎన్‌జీ కార్ల వివరాలు తెలుసుకుందాం.

ఈ స్కూటర్‌ను కళ్లుమూసుకుని కొనచ్చు!

భారతీయ టూవీలర్ వాహన మార్కెట్లో దశాబ్దాలుగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటున్న హోండా యాక్టివా (Honda Activa) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సాధారణ కుటుంబాల నుంచి ఉద్యోగులు, విద్యార్థుల వరకు అందరికీ సరిపోయే స్కూటర్‌గా ఇది ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. సులభమైన రైడింగ్ అనుభవం, నమ్మకమైన ఇంజిన్ పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చు కలిసి యాక్టివాను దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్‌గా నిలబెట్టాయి. డిమాండ్ విషయానికి వస్తే, యాక్టివా రోజురోజుకూ మరింత బలంగా ముందుకు సాగుతోంది. గత నెల, అంటే జనవరి 2026లో మొత్తం 2,71,924 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయబడ్డాయి. ఈ భారీ సంఖ్య మార్కెట్లో దీనికి ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
Advertisement

ఎర్టిగా కంటే రూ.3లక్షలు తక్కువకే 7 సీటర్ కారు

ఫ్యామిలీ అంతా కలిసి ఒకే కారులో వెళ్లాలనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. ఆ కలను నిజం చేసేలా 7-సీటర్ కార్ల (MPV) విభాగంలో ఇప్పటివరకు మారుతి సుజుకి ఎర్టిగా రారాజుగా ఏలుతోంది. అయితే ఇప్పుడు ఆ రాజ్యానికి సవాల్ విసురుతూ జపనీస్ దిగ్గజం నిస్సాన్ తన సరికొత్త అస్త్రం నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite)ను రంగంలోకి దింపింది. ఫిబ్రవరి 2026లో విడుదలైన ఈ కారు, ఎర్టిగా కంటే దాదాపు రూ.3.15 లక్షలకు పైగా తక్కువ ధరకే లభిస్తుండటంతో వాహన మార్కెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి.ఎంపీవీ సెగ్మెంట్‌లో దిగ్గజమైన ఎర్టిగాను ఈ గ్రావైట్ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. ధరలో భారీ వ్యత్యాసం నిస్సాన్ గ్రావైట్ అందరినీ ఆశ్చర్యపరిచే ధరతో మార్కెట్లోకి వచ్చింది. దీని ప్రారంభ ధర కేవలం రూ.5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మాత్రమే. అంటే ఒక చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు కొనే బడ్జెట్‌లోనే మీకు 7-సీటర్ కారు వచ్చేస్తుంది. మరోవైపు మారుతి ఎర్టిగా ధర రూ.8.80 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఎర్టిగా బేస్ మోడల్ ధరతో పోలిస్తే గ్రేవైట్ ఏకంగా రూ.3.15 లక్షలు తక్కువ. గ్రావైట్ టాప్ ఎండ్ మోడల్ (రూ. 8.93 లక్షలు) కొన్నా కూడా ఎర్టిగా ఎంట్రీ లెవల్ వేరియంట్ ధరకే సమానంగా ఉండటం నిస్సాన్‌కు పెద్ద ప్లస్ పాయింట్.

కేవలం రూ. 7 లక్షలకే మినీ స్కార్పియో

భారతదేశపు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అంటేనే మనకు గుర్తొచ్చేవి భారీ ఎస్‌యూవీలు. అందులోనూ స్కార్పియో (Scorpio) బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, స్కార్పియో కారు కొనాలని చాలా మందికి కోరిక ఉన్నా, దాని భారీ సైజు, దాదాపు రూ. 20 లక్షలకు పైగా ఉండే ధర చూసి వెనకడుగు వేస్తుంటారు.

9 వేల మందికి పైగా ఇదే కారును ఎంచుకున్నారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన టయోటా ఇన్నోవా (Toyota Innova) మరోసారి తన స్థిరమైన స్థాయిని నిరూపించుకుంది. కుటుంబాల నుంచి టూరిజం రంగం వరకు విస్తృతంగా ఆదరణ పొందిన ఈ ప్రముఖ MPV, సౌకర్యం, స్థలం, నమ్మకమైన పనితీరు వల్ల ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. గత నెల (2026)లో ఇన్నోవా మంచి సంఖ్యలో విక్రయాలు నమోదు చేసింది. మొత్తం 9,455 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయబడ్డాయి. ఈ సంఖ్య వాహనానికి ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, కమర్షియల్ వినియోగదారులు ఈ MPVను ఎక్కువగా ఎంపిక చేస్తున్నట్లు మార్కెట్ ట్రెండ్ సూచిస్తోంది.

125cc సెగ్మెంట్లో టాప్ 5 బెస్ట్ స్కూటర్లు ఇవే

ప్రస్తుతం మన దేశంలో 125cc స్కూటర్ల హవా నడుస్తోంది. ఒకప్పుడు కేవలం 100cc లేదా 110cc స్కూటర్లకే పరిమితమైన జనం, ఇప్పుడు కాస్త ఎక్కువ పవర్, స్టైల్, ప్రీమియం ఫీచర్లు కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా లక్ష రూపాయల బడ్జెట్‌లో (Best 125cc scooters under 1 Lakh) అదిరిపోయే మైలేజీతో పాటు స్మార్ట్ ఫీచర్లు ఇచ్చే స్కూటర్ల కోసం మధ్యతరగతి జనం క్యూ కడుతున్నారు. మీరు కూడా పాత స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేయాలన్నా లేదా కొత్తగా ఒక ప్రీమియం స్కూటర్ కొనాలన్నా.. మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-5 బెస్ట్ ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.
Advertisement

రూ. 6.49 లక్షలకే కొత్త టాటా ఈవీ కారు లాంచ్

దేశీయ ఈవీ మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ మరింత వేగంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వైపు వినియోగదారులు మళ్లుతున్న నేపథ్యంలో, ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వరుసగా కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. ఈ క్రమంలోనే Tata Motors మరో కీలక అడుగు వేసింది. కంపెనీ తన ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ SUVకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేస్తూ టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch EV Facelift) 2026 మోడల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ప్రముఖత సాధించిన ఈ మోడల్‌కు ఇది మొదటి ప్రధాన నవీకరణ కావడం విశేషం. ప్రారంభ అరంగేట్రం తర్వాత వినియోగదారుల అభిప్రాయాలను, మార్కెట్ ట్రెండ్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

టీవీఎస్ చీపెస్ట్ బైక్స్ ఇవే

మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా పల్లెటూళ్లలో నివసించే రైతులకు, పట్టణాల్లో రోజువారీ పనుల కోసం తిరిగే సామాన్యులకు టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఎప్పుడూ ఒక భరోసా. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, తక్కువ ధరలో ఉండి.. లీటరుకు అదిరిపోయే మైలేజీ ఇచ్చే బైకుల కోసం అందరూ వెతుకుతుంటారు. అచ్చం అలాంటి వారి కోసమే టీవీఎస్ తన ఎంట్రీ-లెవల్ విభాగంలో మూడు అద్భుతమైన వాహనాలను అందుబాటులో ఉంచింది.

గ్రామాలు, నగరాల్లో బెస్ట్, 9 మంది కూర్చోవచ్చు

భారతీయ SUV మార్కెట్లో దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మహీంద్రా స్పార్కియో క్లాసిక్ (Mahindra Scorpio Classic) ఇప్పటికీ బలంగా ఉంది. భారీ బాడీ, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, దృఢమైన డిజైన్‌తో రోడ్డుపై కనిపించిన వెంటనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్కార్పియో క్లాసిక్ అనేది కేవలం ఒక కారు కాదు, అది ఒక బలమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. ముందుభాగంలో ఉన్న బోల్డ్ గ్రిల్, స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్, ఎత్తైన బోనెట్ డిజైన్ కలిసి పవర్‌ఫుల్ లుక్‌ను ఇస్తాయి. గ్రామీణ రహదారులైనా, నగర ట్రాఫిక్ అయినా ఎక్కడైనా ఈ SUV తన స్థాయిని చూపిస్తుంది. బలమైన బాడీ నిర్మాణం, విశాలమైన కేబిన్ స్పేస్ వల్ల కుటుంబ ప్రయాణాలకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.

చైనా సూపర్ కార్ సరికొత్త సంచలనం

సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు అంటే మనకు గుర్తొచ్చేది శబ్దం లేని ప్రయాణం, పర్యావరణ హితం, అత్యాధునిక టెక్నాలజీ. కానీ ఒక ఎలక్ట్రిక్ కారు గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తూ, రోడ్డుపై టైర్ల నుంచి పొగలు చిమ్ముతూ డ్రిఫ్టింగ్ చేయడం ఎప్పుడైనా ఊహించారా? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా, చైనాకు చెందిన ఒక సూపర్ ఎలక్ట్రిక్ కారు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది.
Advertisement

ఒక్క SUVతో కుటుంబం మొత్తం కంఫర్ట్

జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారత మార్కెట్లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ SUVగా 'టేరాన్ ఆర్-లైన్'ను ఘనంగా విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 46.99 లక్షలుగా నిర్ణయించిన ఈ ప్రీమియం ఏడు సీట్ల SUV, బ్రాండ్ లైనప్‌లో కీలకమైన మార్పును సూచిస్తోంది. ఇప్పటివరకు మూడు వరుసల సెగ్మెంట్‌లో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పెస్ స్థానాన్ని ఈ కొత్త టేరాన్ ఆర్-లైన్ భర్తీ చేయడం విశేషం. ఈ నెల ప్రారంభంలోనే ఫోక్స్‌వ్యాగన్ ఈ 7-సీటర్ SUV కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌లతో పాటు బ్రాండ్ అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా బుకింగ్ సౌకర్యం కల్పించింది. కేవలం రూ. 51,000 టోకెన్ అమౌంట్‌తో వినియోగదారులు టేరాన్ ఆర్-లైన్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంది.

5 లక్షల బడ్జెట్‌లో ఏ కారు మంచిది? క్విడ్ vs సెలెరియో కంపారిజన్

భారతీయ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) సెలెరియో (Celerio) తన ప్రత్యేకమైన మైలేజ్, సులభమైన డ్రైవింగ్ అనుభవం, నగర జీవనశైలికి సరిపోయే డిజైన్‌తో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధరతో పాటు, తక్కువ నిర్వహణ ఖర్చు ఈ కారును మరింత ప్రజాదరణ పొందేలా చేస్తోంది. ఇదే సమయంలో (Renault) నుంచి వచ్చిన రెనాల్ట్ క్విడ్ (kwid) కూడా యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకమైన SUV-లుక్ డిజైన్‌తో మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు కార్లు కూడా తమ తమ శ్రేణిలో బలమైన పోటీని కొనసాగిస్తున్నాయి. ప్రతి నెలా అమ్మకాల గణాంకాల్లో ఇవి ఒకదానికొకటి గట్టి పోటీ ఇస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నాయి. ఈ రెండు కార్లు గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

మైలేజీలోనూ, లగ్జరీలోనూ ఈ కారు అరాచకం భయ్యా

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault), భారతీయ రోడ్లపై తన పట్టును మరింత పెంచుకునేందుకు భారీ స్కెచ్ వేసింది. ఇప్పటికే తన ఐకానిక్ మోడల్ డస్టర్ (Duster) కొత్త జనరేషన్‌ను సిద్ధం చేసిన కంపెనీ, ఇప్పుడు దానికి ఒక పెద్ద వెర్షన్ అనదగ్గ బిగ్‌స్టర్ (Bigster) 7-సీటర్ ఎస్‌యూవీని భారత్‌లో లాంచ్ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

పెద్ద ఫ్యామిలీలు ఉండి లగ్జరీగా వెళ్లాలని అనుకునే వాళ్లకు పర్ఫెక్ట్

సౌత్ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా (Kia) భారత మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తిరుగులేని బ్రాండ్‌గా అవతరించింది. ముఖ్యంగా ఆ కంపెనీ నుంచి వచ్చిన ఫ్యామిలీ ఎంపీవీ కియా కారెన్స్ (Kia Carens) అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2022 ఫిబ్రవరి 15న లాంచ్ అయిన ఈ కారు, తాజాగా తన నాలుగో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. కేవలం 4 ఏళ్లలోనే దాదాపు 2.77 లక్షల కుటుంబాలకు చేరువైన ఈ కారు, ఇప్పుడు కియా కంపెనీలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న రెండో కారుగా అవతరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కియా కారెన్స్ ప్రయాణం ప్రారంభం నుంచి ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. SIAM గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ కారు మొత్తం 2,77,236 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఇందులో మొదటి లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకోవడానికి 17 నెలల సమయం పట్టగా, తరువాతి లక్ష యూనిట్లను కేవలం 20 నెలల్లోనే విక్రయించింది. 2025 ఫిబ్రవరిలో 2 లక్షల మార్కును దాటిన కారెన్స్, ఇప్పుడు 2026 మే లేదా జూన్ నాటికి 3 లక్షల మైలురాయిని చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Advertisement

ఈ కారును 6 లక్షల మంది ఎంచుకున్నారు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors) భారత మార్కెట్లో అడుగుపెట్టిన సమయం చాలా ఎక్కువ కాలం కాలేదు. అయినప్పటికీ, కొద్ది సంవత్సరాల్లోనే దేశీయ దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగలిగే స్థాయికి ఎదగడం ఈ బ్రాండ్ సాధించిన విశేష విజయంగా చెప్పుకోవాలి. కొత్త డిజైన్ భాష, ఆధునిక టెక్నాలజీ, వినియోగదారుల అభిరుచులను అర్థం చేసుకున్న ఫీచర్ల కలయికతో కియా భారతీయ వినియోగదారుల మనసులు గెలుచుకుంది. ఈ విజయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన మోడల్ అయితే కియా సెల్టోస్ (Kia Seltos). 2019లో భారత మార్కెట్లో తొలిసారిగా విడుదలైన ఈ ఎస్యూవీ, లాంచ్ అయిన నాటి నుంచే మంచి స్పందనను అందుకుంది.