భారత్ లో ప్రతి ఐదు నిమిషాలకు ఒక కార్ సేల్
ఆటోమొబైల్స్
- 5 month, 13 days ago
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్ని కొత్త కార్లు వచ్చినా, హ్యుందాయ్ క్రెటా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లో ఈ కారు ఒక బ్రాండ్గా మారిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరం (FY26) గణాంకాలను పరిశీలిస్తే, క్రెటా తన హవాను మరోసారి చాటుకుంది. గడిచిన 12 నెలల్లో ఏకంగా 1,84,083 యూనిట్లు అమ్ముడై, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో మారుతి డిజైర్ (2.07 లక్షల యూనిట్లు) మొదటి స్థానంలో ఉండగా, టాటా నెక్సాన్ (1.96 లక్షల యూనిట్లు) రెండో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ, తన సొంత సెగ్మెంట్ (Mid-size SUV)లో మాత్రం క్రెటానే నెంబర్ వన్.